English | Telugu

శివాజీ గారు చెప్పింది కరెక్ట్ .. చనిపోవడానికి నేను సిద్దమే!

ఆర్జీవీ బ్యూటీ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆరియానా. అలాంటి ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. "నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు" అని హోస్ట్ అడిగేసరికి "మా అమ్మ నన్ను క్రిస్టియన్ లా పెంచింది కానీ నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. "నీకిష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి నీకేం కావాలి వెంటనే ఇస్తాను అని అడిగితే ఎం కోరుకుంటావ్" అని హోస్ట్ అడిగింది. "నన్ను తీసుకెళ్ళిపోమంటాను అంటూ షాకింగ్ మాటలు చెప్పింది. "నిజం సీరియస్ గా చెప్తున్నా దేవుడే వచ్చిన తర్వాత ఇంకేం కావాలి..నేను ఈ నిమిషం చనిపోయినా పర్లేదు" అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.

రీసెంట్ గా ట్రెండింగ్ టాపిక్ గా మారిన శివాజీ కామెంట్స్ మీద హోస్ట్ అడిగింది. "శివాజీ గారు చెప్పింది కరెక్ట్ కానీ ఆయన వాడిన పదాల వలన అది వైరల్ అవుతున్నట్టుగా ఉంది కానీ..ఎవరి ఇష్టం వారిది. ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు రోగాలొస్తాయో ఎవరికీ తెలీదు టెన్షన్ ఎందుకు" అంటూ కూల్ గా ఒక పాట కూడా పాడింది. "అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని నీకు ఎలా అనిపించింది" అని హోస్ట్ అడిగింది. "లైఫ్ లో పర్టికులర్ గా ఏదన్నా జరగాలి అంటే రాసిపెట్టి ఉంటుంది. అలా నేను మా చెల్లి టీవీ చూస్తుంటే యాంకర్ లు కావలెను అంటూ కనిపించింది అలా వెళ్లాం" అని చెప్పింది. ఇక తన కెరీర్ లో ఎదుర్కున్న కష్టాల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆరియానా.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.