English | Telugu

అలాంటివి చెయ్యనని చెప్పేసిన అనుష్క

"అరుంధతి" చిత్రంతో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఎక్కువ అయ్యాయి. అయితే అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "వర్ణ". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో అనుష్క మాట్లాడుతూ... "రుద్రమదేవి", "బాహుబలి","వర్ణ" చిత్రాల్లో కత్తి పట్టే సినిమాలే. కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇలా కత్తి పట్టే సినిమాలు కాకుండా హీరోలతో డాన్స్, లవ్ స్టొరీ చిత్రాలే చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది. అంటే అనుష్క హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు పూర్తిగా మానేసినట్లే ఇక. త్వరలోనే అనుష్క ఓ ప్రేమ కథ చిత్రాలు చేయనున్నది. కానీ ఈ మూడు చిత్రాలు విడుదల కావాలంటే మరో ఒకటిన్నర సంవత్సరమైన పడుతుంది. అంతవరకు అనుష్కను ఇలా యాక్షన్ లేడిగానే చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.