English | Telugu

అనుష్కతో పాటు త్రిష రొమాన్స్...!

అజిత్ తన 55వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అనుష్క నటించనుంది. అయితే మరో హీరోయిన్ గా త్రిషను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఏమాయ చేసావే"(తమిళం) వర్షన్ లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అందుకే త్రిషను ఈ సినిమాలో మరో హీరోయిన్ గా తీసుకోవడానికి గౌతమ్ ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం నిర్మించనున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతం అందించనున్నాడు. ఇందులో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ విలన్ పాత్రలో నటించనున్నారు. ఏప్రిల్ 9న సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.