English | Telugu

శ్యామల చుట్టూ ఈడీ ఉచ్చు.. ఏ క్షణమైనా అరెస్ట్..?

ప్రముఖ యాంకర్, వైసీపీ నేత శ్యామల(Shyamala)కు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో శ్యామల కూడా ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ ఇప్పటికే శ్యామల కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసులోకి ఈడీ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారట. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి చేతులు మారింది? అనే వివరాలు లాగుతున్నారట. అలాగే, ఈ విషయంలో శ్యామల భర్త పాత్రతో పాటు, శ్యామల ఆస్తుల గురించి, లావాదేవీల గురించి కూడా ఆరా తీస్తున్నారట. అధికారుల దూకుడు చూస్తుంటే.. ఏ క్షణమైనా శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశముందని వార్తలొస్తున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.