English | Telugu

స్టైలిష్ స్టార్ ని పట్టిన మిర్చి డైరెక్టర్!!

సాధారణంగా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం చాలా కష్టం. కానీ రైటర్ టర్న్ డైరెక్టర్ మారిన కొరటాల శివ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'మిర్చి' సినిమా చేసి ప్రేక్షకులకు తన టాలెంట్ ఘాటును చూపించాడు. ఇండస్ట్రీలో రికార్డ్స్ ని క్రియేట్ చేసిన మిర్చితో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో శివ కూడా చేరాడు. కానీ రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మహేష్ శ్రీమంతుడు సినిమాను చేస్తున్న శివకు మూడో సినిమా మాత్రం వెంటనే ఓకే అయ్యింది. అల్లు అర్జున్ కి ఇటీవలే కథ వినిపించి ప్రాజెక్టు ఓకే చేసుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యక సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాయి. ఈ సినిమా తరువాత కొరటాల శివ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.