English | Telugu

అల్లు అర్జున్ పెళ్ళి తర్వాతే"బద్రీనాథ్"ప్రమోషన్

ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ వివాహం స్నేహా రెడ్డితో హైదరాబాద్ లోని హైటెక్స్ లో మార్చ్ 5 వ తేదీన జరుగనుంది. ఈ పెళ్ళికి ఏర్పాట్లలో అంటే షాపింగ్, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటు చేయించటం, వాటిని పంచటం, పెళ్ళి విందు ఏర్పాట్లు వగైరా వగైరాలతో ఇటు అల్లు అర్జున్ కుటుంబం, అటు స్నేహా రెడ్డి కుటుంబం యమ బిజిగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.అందుకని గీతా ఆర్ట్స్ పతాకంపై, వివివినాయక్‍ దర్శకత్వంలో, తన తండ్రి అల్లు అరవింద్ నిర్మిస్తుండగా,అల్లు అర్జున్ తాను హీరోగా, మిల్కీ వైట్ గర్ల్ తమన్నా భాటియా హీరోయిన్‍ గా నటిస్తున్న "బద్రీనాథ్" చిత్రం పబ్లిసిటీ గురించి, దాని ప్రమోషన్ గురించీ ఆలోచించట్లేదు. ఈ పెళ్ళి కాగానే తన "బద్రీనాథ్" చిత్రం ప్రమోషన్ ప్రయత్నాలు మొదలు పెట్టాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.