English | Telugu

రేసుకు ముందే మరో సినిమా

అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే తన తరువాతీ చిత్రాన్నీ ప్రారంభించబోతున్నాడు. బన్నీ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ముహూర్త కార్యక్రమాలు ఏప్రిల్ 10న లాంచనంగా ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ప్రస్తుతం బన్నీ "రేసుగుర్రం" విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.