English | Telugu

బన్నీ క‌థ‌లో ర‌వితేజ‌??

కందిరీగ‌తో మాస్ ద‌ర్శ‌కుడు అనిపించుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్. ఆ ఒక్క సినిమాతోనే యంగ్ టైగ‌ర ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ద్వితీయ‌వీఘ్నం గ‌ట్టిగా త‌గిలింది. ర‌భ‌స ఫ్లాప్ అవ్వ‌డంతో సంతోష్‌తో సినిమా చేయ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ర‌భ‌స టైమ్‌లోనే బ‌న్నీ కోసం ఓ క‌థ రాసుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్‌. దానికి తిక్క‌రేగితే.. అనే టైటిల్ కూడా పెట్టేశాడు. ర‌భ‌స హిట్ అయితే బ‌న్నీ అవ‌కాశం ఇచ్చేవాడేమో. కానీ.. ర‌భ‌స ఫ్లాప్ అవ్వ‌డంతో బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ వినిపించే సాహ‌సం చేయ‌లేక‌పోయాడు సంతోష్. ఇప్పుడు అదే క‌థ‌కు ర‌వితేజ‌కు వినిపించి ఓకే చేయించుకోవాల‌నుకొంటున్నాడీ యువ ద‌ర్శ‌కుడు. ఆల్రెడీ ర‌వితేజ నుంచి పిలుపొచ్చింద‌ని, కిక్ 2 హంగామా ముగిశాక‌... ర‌వితేజ‌కు క‌థ వినిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి బ‌న్నీకి రాసుకొన్న క‌థ ఇది. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశాడ‌ట‌. మ‌రి మాస్ మ‌హారాజా క‌నిక‌రిస్తాడో లేదో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.