English | Telugu

ఒక్కడివల్లే సినిమా ఆడదు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం "రేసుగుర్రం". ఇటీవలే విడుదలై మంచి ఘనవిజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాదులో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఇందులో బన్నీ మాట్లాడుతూ... ఈ సినిమా నా అన్ని సినిమాల కంటే బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవటం నా అదృష్టం. ఈ సినిమాను ఇంత ఘనవిజయం చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత విజయం అవడానికి కారణం దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రమే. సినిమాను ఇంత బాగా తీసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ఫైట్ మాస్టర్స్ నన్ను మరో మెట్టు పైకి ఎక్కించారు. ఈ సినిమాలో చివరి 15నిముషాలు బ్రహ్మనందానివే. "నీ సినిమాలో బ్రహ్మానందానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమేంటి?" అని చాలామంది అన్నారు. కానీ సినిమాను హీరో ఒక్కడే మోయకూడదు. అందరూ పంచుకోవాలి. ఈ సినిమా విషయంలో కూడా అందరూ బాగా కృషి చేసారు. ఆ క్రెడిట్ మొత్తం సురేందర్ రెడ్డికే వెళ్తుంది" అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.