English | Telugu

అల్లు అర్జున్, హన్సిక జంటగా చిత్రం

అల్లు అర్జున్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా ఒక చిత్రం రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో అల్లు అర్జున్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా త్వరలో ఒక చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. ఈ చిత్రానికి "ఆర్య" ఫేం సుకుమార్ దర్శకత్వం వహిస్తారట. గతంలో అల్లు అర్జున్ ‍, హన్సిక కలసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "దేశముదురు" అనే చిత్రంలో జంటగా నటించారు.

ఆ చిత్రం హీరోయిన్ గా హన్సిక మోత్వానికి తొలి చిత్రం కాగా ఆ చిత్రం సూపర్ హిట్టయ్యింది. మళ్ళీ అదే జంట కలసి నటిస్తూండటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలుంటాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన "ఆర్య" చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. మరి వీరి ముగ్గురి కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఎన్ని సెన్సేషన్లు సృష్టిస్తుందో కాలమే చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.