English | Telugu

AA22: కళ్లుచెదిరే ధరకి అల్లు అర్జున్ మూవీ ఓటీటీ డీల్.. బడ్జెట్ లో 60 శాతం వచ్చేసింది!

'పుష్ప-2'తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఎన్నో సంచలనాలు సృష్టించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి.. హిందీ గడ్డ మీద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, ఓటీటీ డీల్ పరంగానూ రికార్డు సృష్టించింది. 'పుష్ప-2' ఓటీటీ రైట్స్ ని అప్పుడు నెట్ ఫ్లెక్స్ రూ.275 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్.. అంతకుమించిన సంచలనాలకు రెడీ అవుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత బడ్జెట్ అయినప్పటికీ.. సన్ పిక్చర్స్ లో ఎటువంటి ఆందోళన లేదు. దానికి కారణం.. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే 60 శాతం బడ్జెట్ రికవర్ అవుతుందట. (AA22)

అల్లు అర్జున్-అట్లీ ఫిల్మ్ యొక్క అన్ని భాషల ఓటీటీ రైట్స్ కి కలిపి ఏకంగా రూ.600 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లెక్స్ అంగీకారం తెలిపిందట. ఈ మేరకు సన్ పిక్చర్స్, నెట్ ఫ్లెక్స్ మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం.

Also Read: 2025 రౌండప్.. సర్ ప్రైజ్ చేసిన కొత్త దర్శకులు.. మీ ఫేవరెట్ ఎవరు?

'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం రూ.600 కోట్లు చెల్లించడానికి రెడీ అయినట్లు వినికిడి. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఇదే హైయెస్ట్ ఓటీటీ డీల్ కావడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.