English | Telugu

అఖిల్‌తోనే ఆడ‌తాన‌న్న అనుష్క‌

హుద్ హుద్ తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చింది చిత్ర‌సీమ‌. ఈనెల 30న వినోద కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, వాటి ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని తుపాను బాధితుల‌కు అందివ్వాల‌నుకొంటోంది. ఇందుకు సంబంధించి ఓ ప్ర‌ణాళికా సిద్ధం చేసింది. అందులో భాగంగా చిత్ర‌సీమ క్రికెట్ మ్యాచ్ ఆడ‌బోతోంది. నాలుగు టీమ్‌లు పోటీలో పాల్గొన‌బోతున్నాయి. న‌లుగురు హీరోలు కెప్టెన్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఒక్కొక్క జ‌ట్టులో ఇద్ద‌రేసి క‌థానాయిక‌లు కూడా ఉంటారు. ఓ టీమ్‌కి సిసింద్రీ అఖిల్ నాయ‌క‌త్వం వ‌హిస్తాడు. అఖిల్ మంచి ప్లేయర్‌. సీసీఎల్‌లో బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించాడు. అందుకే అఖిల్ జ‌ట్టులో ఉండ‌డానికి క‌థానాయిక‌లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అనుష్క అయితే ''నేను అఖిల్ జ‌ట్టులోనే ఉంటా.. త‌న‌తోనే ఆడ‌తా'' అని ముందే క‌ర్చీఫ్ వేసుకొంద‌ట‌. అనుష్క ఆడ‌డానికి రెడీ అన‌డ‌మే మ‌గ‌ద్భాగ్యం. అందుకే నిర్వాహ‌కులు కూడా అనుష్కని అఖిల్ టీమ్‌లో చేర్చారు. ఈనెల 30న ఈ క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఒక‌ట్రెండు రోజుల్లో తెలిసే అవ‌కాశం ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.