English | Telugu

అందాల న‌టి ఆర్తి అగ‌ర్వాల్ క‌న్నుమూత‌

నువ్వు నాకు న‌చ్చావ్ చిత్రంతో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల న‌టి ఆర్తి అగ‌ర్వాల్ క‌న్నుమూశారు. స్థూల‌కాయ స‌మ‌స్య‌తో ఆమె గ‌త కొంత‌కాలంగా బాధ‌ప‌డుతున్నార‌ని.. లైఫోస‌క్ష‌న్ ఆప‌రేష‌న్ కోసం అమెరికా వెళ్లిన ఆమె.. ఆ ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో మ‌ర‌ణానికి గుర‌య్యార‌ని స‌మాచారం. చిన్న వ‌య‌సులోనే అప్ప‌టి టాప్ హీరోలంద‌రితోనూ జోడీ క‌ట్టి మెప్పించిన ఆర్తి అగ‌ర్వాల్‌.. అంతే చిన్న వ‌య‌సులోనే క‌న్ను మూవ‌య‌డం విచార‌క‌రం. నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వు లేక నేను లేను, ఇంద్ర‌, వ‌సంతం, నేనున్నాను, సంక్రాంతి, అందాల రాముడు, గోరింటాకు వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించి ఆర్తికి న‌టిగా మంచి పేరును తీసుకువ‌చ్చాయి. ఆర్తి ఆక‌స్మిక మృతికి సినీ ప్ర‌ముఖులు షాక్‌కి గుర‌య్యారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.