English | Telugu

సన్నీలియోన్ కి అమీర్ ట్వీట్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ను అభిమానించని వారుండరనే చెప్పాలి. అందులో భాగంగా ఆయన తాజా చిత్రం 'దంగల్' ఫస్ట్ లుక్ చూసి చాలామంది అభిమానులు పొంగిపోతున్నారు. 'దంగల్'లో పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని పెంచి చాలా కష్ట పడ్డాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. దాంతో 'దంగల్' ఫస్ట్ లుక్ చూడగానే ఆయన అభిమానులు సినిమా రాకముందే ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందులో సన్నీ లియోన్ కూడా ఉండడం విశేషం.

గత కొంతకాలంగా ఇండియాను ఊపుతున్న సన్నీలియోన్, అమీర్ దంగల్ ఫస్ట్ లుక్ కు ఫిదా అయిపోయిందట. అంతేకాదు 'దంగల్'లో అమీర్ లుక్ తో పాటు, అతను నటించిన శ్నాప్ డీల్ యాడ్ లో మరింత మురిపించాడంటూ.. ఆ యాడ్ ను చూసి మురిసిన సన్నీ, అందులో అమీర్ ఇంకా హాట్ గా కనిపిస్తున్నాడని ట్వీట్ చేసింది.

దాంతో అమీర్ సైతం సన్నీ ట్వీట్ కి మరింత మురిసిపోయాడు. అంతటితో ఆగకుండా సన్నీకి తనదైన రీతిలో సమాధానమిచ్చాడు అమీర్. తన యాడ్ చూసి సన్నీ ట్వీట్ చేసినందుకు 'థ్యాంక్స్ 'అంటూనే, 'నువ్వు కూడా చాలా హాట్ గా ఉన్నావ్' అంటూ ట్వీట్ చేశాడు అమీర్. ఇలా సన్నీ- అమీర్ మధ్యన సాగిన ట్వీట్స్ చాలా సరదాగా సాగిపోయిందట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.