English | Telugu

ప్రధానిని కలిసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్


ఎన్నికల ముందు ఓట్ కాంపేన్ తో పాటు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న అనేక సామాజిక అంశాలను తీసుకుని వినూత్నంగా రూపొందిచిన 'సత్యమేవ జయతే' కార్యక్రమం గురించి చర్చించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలుసుకున్నారు. 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి వ్యాఖ్యతగా అమీర్ ఖాన్ వ్యవహరించిన సంగతి విధితమే. ఈ కార్యక్రమంలో చూపించిన అంశాలను తప్పకుండా పరిశీలస్తామని ప్రధాని మోడి మాట ఇచ్చినట్లు అమీర్‌ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రధాని తన విలువైన సమయాన్ని తన కోసం కేటాయించినందుకు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.

సౌత్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశాన్ని కర్టసీ కాల్ గా ప్రధాని కార్యాలయం ఉదహరించింది. ప్రధాని అధికారిక వెబ్‌సైట్ ఈ ఫోటోలను విడుదల చేసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.