English | Telugu

ప్రిన్స్ ఆగడు ఫస్ట్‌లుక్ విడుదల


మహేష్ బాబు నటిస్తున్న ఆగడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమానులకు సూపర్ గిప్ఠ్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ చూడగాని ఇందులో మహేష్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ పోస్టర్స్, ఫస్ట్‌లుక్ చూసిన వారికి ఈ లుక్ బెస్ట్ అనిపిస్తుంటే, మరికొంతమందికి పర్లేదనిపిస్తోంది. ఈ చిత్రంలో మొదటిసారిగా ప్రిన్స్ సరసన తమన్నా హీరోయిన్‌గా కనిపించబోతోంది.
సినిమాల ప్రభావం ఎలా వుందో కాని పంచ్ డైలాగ్‌ల ప్రభావం బాగా వుంది. ప్రతోడు పులులు, సింహాలు, ఎలుకలతో కంపారిజనే అని మహేష్ కొత్త తరహాలో పంచ్ డైలాగ్‌లు చెప్పడం టీజర్‌ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తోంది. సినిమాటాగ్రఫి, కొత్త కొత్త లోకేషన్లు, మహేష్ పవర్ ఫుల్ క్యారెక్టరైజషన్ ఇవన్నీటీజర్‌లో అదిరిపోయాయనిపిస్తోంది. ఇవి సినిమా పై అంచనాలు తప్పకుండా పెంచేస్తాయి అనిచెప్పవచ్చు. మహేష్ ఫిజిక్, మహేష్ లుక్స్ మరో సారి మహేష్ మానియాలో అభిమానులు పడిపోతారనిపిస్తోంది. అక్కడక్కడా గబ్బర్‌సింగ్ గుర్తుకు వస్తున్నా ఆగడు ఫస్ట్‌లుక్ సూపర్... సూపర్ స్టార్ కు ఆగడు సూపర్ హిట్ చిత్రం కాగలదని అభిమానులు అప్పుడే ఆనందపడిపోతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.