English | Telugu

గుఖ‌శేఖ‌ర్‌పై 420 కేసు

రుద్ర‌మ‌దేవి సినిమాతో గుణ‌శేఖ‌ర్ పీక‌ల్లోతు అప్పుల్లో, ఆర్థిక భారంలో కూరుకుపోయాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ మాట నిజ‌మే అని తేలిపోయింది. రూ.5 లక్ష‌ల చెక్ బౌన్స్ విష‌యంలో ఇప్పుడు ఆయ‌న కోర్టు మెట్లు ఎక్క‌బోతున్నారు. కేసు వేసిందెవ‌రో తెలుసా...??? నటుడు సుమ‌న్. వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం రుద్ర‌మదేవి. ఇందులో సుమ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన పారితోషికం రూ.5 ల‌క్ష‌లు గుణ‌శేఖ‌ర్ పారితోషికం రూపంలో అందించారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యింది. ఈ విష‌యం గుణ శేఖ‌ర్ దృష్టికి ఎన్నిసార్లు తీస‌కెళ్లినా ఫ‌లితం లేక‌పోయింద‌ట‌. అందుకే సుమ‌న్‌కి ఇక విసుగొచ్చి.. గుణ‌శేఖ‌ర్‌పై నాంప‌ల్లి కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయించాడు. మ‌రి గుణ‌శేఖ‌ర్ ఎలా స్పందింస్తాడో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.