English | Telugu

విజయశాంతిని సూపర్ స్టార్ గా నిలబెట్టిన 'ప్రతిఘటన'కు 40 ఏళ్ళు!

తెలుగు సినీ చరిత్రలో 'ప్రతిఘటన' చిత్రానికి ప్రత్యేక స్థానముంది. విజయశాంతి ప్రధాన పాత్రలో టి.కృష్ణ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా.. 1985 అక్టోబర్ 11న విడుదలై సంచలనం సృష్టించింది. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. నటీనటుల గొప్ప నటన, అద్భుతమైన కథాకథనాలు, మాటలు, పాటలు కలిసి ఈ సినిమాని గొప్పగా మలిచాయి. ఇందులోని 'ఈ దుర్యోధన దుశ్శాసన' పాట ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా ఏకంగా ఆరు నంది అవార్డులతో సత్తా చాటింది. ఉత్తమ నటిగా విజయశాంతి, ఉత్తమ విలన్ గా చరణ్ రాజ్, ఉత్తమ గాయనిగా ఎస్.జానకి, ఉత్తమ కథా రచయితగా టి.కృష్ణ, ఉత్తమ మాటల రచయితగా హరనాథ్ రావుతో పాటు కోట శ్రీనివాసరావు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఇలా ఎన్నో సంచనాలు సృష్టించిన 'ప్రతిఘటన' చిత్రం, నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయశాంతి, సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

"1985 అక్టోబర్ 11.....
2025 అక్టోబర్ 11....
నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం.
నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ "ప్రతిఘటన".
దర్శకులు శ్రీ టీ కృష్ణ గారికి, నిర్మాత శ్రీ రామోజీరావు గారికి, అద్భుతమైన "ఈ దుర్యోధన దుశ్శాసన" పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావు గారికి, సహ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు." అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.