English | Telugu

బాల‌య్య 'ముద్దుల మేన‌ల్లుడు'కి 33 ఏళ్ళు!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థ‌ల్లో భార్గ‌వ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ బేన‌ర్ లో బాల‌య్య న‌టించిన ప‌లు చిత్రాలు నంద‌మూరి అభిమానుల‌ను అల‌రించాయి. వాటిలో 'ముద్దుల మేన‌ల్లుడు'ఒక‌టి. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ సినిమాలో బాల‌య్య‌కి జంట‌గా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి సంద‌డి చేశారు. త‌మిళ చిత్రం 'తంగ‌మాన రాసా'ఆధారంగా రూపొందిన ఈ మూవీలో నాజ‌ర్, బ్ర‌హ్మాజీ, జ‌యంతి, సంగీత‌, బాబూ మోహ‌న్, ప్ర‌స‌న్న కుమార్, బాలాజీ, మాడా, వ‌సంత్, కేకే శ‌ర్మ‌, చిడ‌త‌ల అప్పారావు, అనిత‌, ల‌తా శ్రీ‌, క‌ల్ప‌నా రాయ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

కేవీ మ‌హ‌దేవ‌న్ బాణీలు క‌ట్టిన ఈ చిత్రంలోని ''ముత్యాల పందిరిలో'' అంటూ సాగే పాట విశేషాద‌ర‌ణ పొంద‌గా.. ''పండ‌గొచ్చెన‌మ్మో'', ''టాటా చెప్పాలోయ్'', ''నొప్పిగుంది'', ''ప‌రువాల చిల‌క‌'', ''ద్వాప‌ర యుగ‌మున'' అంటూ సాగే గీతాలు కూడా రంజింప‌జేశాయి. కాగా 1990 జూలై 7న విడుద‌లైన 'ముద్దుల మేన‌ల్లుడు' నేటితో 33 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.