English | Telugu

రామ్‌చ‌ర‌ణ్ క్యార్‌వాన్‌లో దొంగ‌లు ప‌డ్డారు

ఓ హీరో క్యార్ వాన్‌లో దొంగ‌లు ప‌డ్డార‌ని ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు ఎత్తుకెళ్లిపోయార‌నే వార్త ఇండ్ర‌స్ట్రీలో ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ హీరో.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌కి ఓ సొంత క్యార్‌వ్యాన్ ఉంది. కొద్దిరోజుల క్రింద‌ట ఆ క్యార్ వేన్‌లో ఉండాల్సిన న‌గ‌దు మాయ‌మైంద‌ట‌. దాదాపు రూ.30 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ క్యాష్ ఉంద‌ని, అది సడ‌న్‌గా మాయ‌మైంద‌ని చెప్పుకొంటున్నారు. క్యాష్ మాయ‌మైంద‌న్న విష‌యం చ‌ర‌ణ్‌కీ ఆల‌స్యంగా తెలిసింద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ సిబ్బందిలోనే ఎవ‌రో... ఈ డ‌బ్బు కాజేశార‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని తెలిసింది. అస‌లు క్యార్ వేన్‌లో అంత డబ్బు ఎందుకుంది అనేది కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే రామ్‌చ‌ర‌ణ్‌గానీ, స‌న్నిహితులుగానీ ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.