English | Telugu

ఫిబ్రవరి 18 రానున్న "పూలరంగడు"

ఫిబ్రవరి 18 రానున్న "పూలరంగడు" చిత్రం విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, "ప్రేమకావాలి" ఫేం ఇషాచావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "పూలరంగడు". ఈ "పూలరంగడు" చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఫిబ్రవరి 10 వ తేదీకి వాయిదాపడింది. మళ్ళీ ఇప్పుడు అది కూడా కాదని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18 వ తేదీన "పూలరంగడు" చిత్రం విడుదల కానుందని ఈచిత్రం యూనిట్ మీడియాకు తెలియజేసింది. ఈ "పూలరంగడు" చిత్రానికి అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తూంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.