English | Telugu

ఫిబ్రవరి 3 న "నిప్పు" ప్లాటినం డిస్క్ ఫంక్షన్

ఫిబ్రవరి 3 న "నిప్పు" ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, శ్రిమతి యలమంచిలి గీత సమర్పణలో, మాస్ మహరాజా రవితేజ హీరోగా, పొడుగుకాళ్ళ ముంబాయ్ భామ దీక్షా సేథ్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో, దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" నిప్పు". ఈ "నిప్పు" చిత్రానికి తమన్ సాయి చక్కని సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ప్లాటినం దిస్క్ సాధించిన సందర్భంగా, ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఫిబ్రవరి 3 వ తేదీన జరపటానికి ఈ చిత్రం యూనిట్ నిశ్చయించింది.

ఈ "నిప్పు" చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని ఈ చిత్రం యూనిట్ అంటోంది. ఈ చిత్రం నిజానికి అదే రోజున విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి 17 వ తేదీన మహాశివరాత్రి పర్వదినం కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.