English | Telugu

జర్నలిస్ట్ గా పవర్ స్టార్

జర్నలిస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నాదని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యూనివ్వర్సల్ మీడియా పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం "మే" లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రం మీడియా మాఫియా నేపథ్యంలో జరిగే కథని తెలిసింది.

దర్శకుడు పూరీ జగన్నాథ్ తన గత చిత్రం"నేనింతే" లోమీడియాపై, ముఖ్యంగా వెబ్ మీడియాపై సెటైర్లు వేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన గత చిత్రం "బంగారం" లో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ గా నటించారు. మరి వీళ్ళిద్దరి కలయికలో రానన్న ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.