English | Telugu
జర్నలిస్ట్ గా పవర్ స్టార్
Updated : Jan 31, 2012
జర్నలిస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నాదని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యూనివ్వర్సల్ మీడియా పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం "మే" లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రం మీడియా మాఫియా నేపథ్యంలో జరిగే కథని తెలిసింది.
దర్శకుడు పూరీ జగన్నాథ్ తన గత చిత్రం"నేనింతే" లోమీడియాపై, ముఖ్యంగా వెబ్ మీడియాపై సెటైర్లు వేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన గత చిత్రం "బంగారం" లో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ గా నటించారు. మరి వీళ్ళిద్దరి కలయికలో రానన్న ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.