English | Telugu

సినిమా పేరు:వెంగమాంబ
బ్యానర్:వి.యమ్. సి. ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 17, 2009
బ్యానర్:వి.యమ్. సి. ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 17, 2009
తరిగొండ వేంగమాంబ కథ ఈ చిత్రం యొక్క ఇతివృత్తం. అన్నమయ్య మేలుకొలుపుతో మేలుకొనే శ్రీ వేంకటేశ్వరస్వామి, తరిగొండ వేంగమాంబ ముత్యాల హారతితో దినచర్య ముగిస్తాడు. ఈ ముత్యాల హారతి అనంతరం ఎవరికీ దర్శనముండదు. తరిగొండలో కానాల కృష్ణయ్య, మంగమ్మ (సుధ) దంపతులకు వేంగమాంబ జన్మిస్తుంది. పసితనం నుండే ఆ వేంకటా చలపతిని భర్తగా భావించేది వేంగమాంబ. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఒక చక్కని యువకుణ్ణి చూసి వివాహం జరిపిస్తారు. కానీ శోభనం రోజున అతనికి వేంగమాంబ ఆదిశక్తిలా కనిపిస్తుంది. శోభనం ఆగిపోతుంది. ఆ యువకుడికి వేరే పెళ్ళి చేయాలని ఆలోచిస్తారు. అందుకు వేంగమాంబ అంగీకరించదు. ఆ యువకుడిని పాము కరుస్తుంది. అతను చనిపోయేటప్పుడు వేంగమాంబను విధవగా మార్చ వద్దని తన తండ్రి వద్ద మాట తీసుకుని చనిపోతాడు. అక్కడి అగ్రహారీకులు ఆమెను విధవను చేయాల్సిందేనని పట్టుబడతారు. కానీ వేంగమాంబ అందుకు అంగీకరించదు. ఆమె చదువుకొనేందుకు మదనపల్లికి వేళుతుంది. చదువు పూర్తిచేసుకుని ఊరికి తిరిగి వచ్చిన వేంగమాంబ నృసింహ శతకాన్ని వ్రాయటానికి ఉపక్రమిస్తుంది. ఆ శతకాన్ని కాల్చటానికి ప్రయత్నించిన వేంగమాంబ మేనత్త నారాయణమ్మ కూతురు వళ్ళంతా మంటలు పుట్టటంతో నారాయణమ్మ వేంగమాంబను క్షమించమని వేడుకుంటుంది. తరిగొండకు వచ్చిన ఒక పీఠాధిపతి వేంగమాంబను ప్రశ్నించాలనుకుంటాడు. కానీ ఆమె మహత్తుని కళ్ళారా చూసిన ఆ పిఠాధిపతి ఆమెను క్షమించమని అడుగుతాడు. ఒక ముస్లిమ్ మతస్తుడికి దాహమేస్తే గుళ్ళోని మంచి నీళ్ళను అతనికిచ్చి అతని దాహార్తిని నివారిస్తుంది వేంగమాంబ. దాంతో ఆ ఊరి నుంచి వేమగమాంబను వెలి వేయాలంటారు కొందరు దుర్మార్గులు. అందుకు తానే ఆ ఊరిని వెలి వేస్తున్నానని వేంగమాంబ ఆ ఊరినుండి వెళ్ళి దూర్వాస మహర్షి తపస్సు చేసిన గుహలో తపస్సు చేస్తుంటుంది. ఆమెను అక్కడ సజీవ దహనం చేయటానికి ప్రయత్నిస్తారు దుర్మార్గులు. అందరూ వేంగమాంబ చనిపోయిందనుకుంటారు. కానీ వేంగమాంబ తిరుమలేశుని దర్శించుకునేమదుకు తిరుపతికి వస్తుంది. అక్కడ స్వామి వారికి వేంగమాంబ తులసి మాలను సమర్పిస్తుంది. కానీ అక్కడి పూజారి దీక్షితులు విధవ స్వామి వారికి తులసి మాలను సమర్పిమచటమా అని ఆ మాలను దూరంగా పారేస్తాడు.కానీ స్వామి ఆ తులసి మాలను ధరించి వేంగమాంబకు కనిపిస్తాడు. దాంతో నగలు కాజేసిందన్న నెపంతో వేంగమాంబను స్వామివారి నుంచి దూరం చేస్తారు. కానీ వేంగమాంబ చేసే తులసి మాల ప్రతి రోజూ స్వామివారి మేడలో ఉంటుంది. వేసిన తలుపులు వేసినట్టుండగానే తులసి మాలను ఎవరు స్వామివారి మెడలో వేస్తున్నారని కనిపెట్టటానికి మహంతు కాపలా కాస్తే వేంగమాంబే తులసి మాలను శ్రీవారి మేడలో వేయటం గమనించి ఆమెను తిరుపతికి తిరిగి రప్పిస్తారు. అక్కడ ఆమె శ్రీవారిని స్తుతిస్తూ అన్నమయ్యలా కీర్తనలు రచిస్తుంది. వాటిని శ్రీవారికి అంకితమిచ్చి ఆయనలో ఐక్యమైపోతుంది. ఇది క్లుప్తంగా ఈ చిత్ర కథ.