Read more!

English | Telugu

సినిమా పేరు:కెప్టెన్ మిల్లర్
బ్యానర్:సత్యజ్యోతి ఫిల్మ్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 26, 2024

సినిమా పేరు: కెప్టెన్ మిల్లర్ 
తారాగణం: ధనుష్,ప్రియాంక అరుల్ మోహన్,శివరాజ్‌కుమార్,సందీప్ కిషన్, నివేదిత సతీష్, జేపి తదితరులు
సంగీతం:జీవి ప్రకాశ్ కుమార్
కెమెరా:  సిద్దార్థ్ నూని
రచన,దర్శకత్వం:అరుణ్ మాతేశ్వరన్
నిర్మాత:  సెంథిల్ త్యాగ రాజన్ ,అరుణ్ త్యాగరాజన్
బ్యానర్: సత్య జ్యోతి ఫిలిమ్స్
విడుదల తేదీ: జనవరి 26, 2024 

తమిళ అగ్ర నటుడు ధనుష్ నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా తప్పనిసరిగా మూస పద్దతిలో సాగే సినిమా అవ్వదు అనే నమ్మకం అన్ని భాషలకి సంబంధించిన మూవీ లవర్స్ లోను ఉంది. మరి సంక్రాంతికి తమిళ ప్రేక్షకులని పలకరించిన మిల్లర్  ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరీ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ:-

బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న కాలంలో  కులవివక్ష కారణంగా ఒక గ్రామంలోని  అణగారిన వర్గాల ప్రజలని వాళ్ళ యొక్క కుల దైవమైన గోరాహరుడు గుడిలోకి ఆ ఊరి జమీందారులు అనుమతించరు. అదే వర్గానికి చెందిన అగ్నిశ్వర (ధనుష్ ) సొంత వాళ్ళ కంటే బ్రిటిష్ వాళ్లే నయం అనుకోని  బ్రిటిష్ సైనం లో చేరతాడు. ఈ విషయంలో  బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే తన అన్న శివన్న (శివ రాజ్ కుమార్ ) వద్దన్నా కూడా అగ్ని  బ్రిటిష్ సైన్యం లో చేరతాడు. ఇంకో పక్క జమిందారులకి ఇష్టం లేకుండా  గుడిలో ఉన్న గోరాహరుడి విగ్రహాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారు. అలాగే బ్రిటిష్ సైనం మీద కోపంతో  బయటకి వచ్చిన  అగ్నిశ్వర ఒక దొంగల ముఠాలో చేరి దొంగతనాలు చేస్తుంటాడు. అసలు అగ్ని బ్రిటిష్ సైన్యం నుంచి ఎందుకు బయటకి వచ్చాడు?  గోరాహరుడి విగ్రహం యొక్క  కథ ఏమయ్యింది?శివన్న లక్ష్యం నెరవేరిందా ? తన గ్రామ ప్రజలని అగ్ని గుడి ప్రవేశం చేయించాడా?  అసలు అగ్నిశ్వర కి కెప్టెన్ మిల్లర్ అనే పేరు ఎలా వచ్చిందనేదే మిగతా కథ.


ఎనాలసిస్ :

కొన్ని సినిమాలని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు కూడా సినిమా మంచి కథే కదా ఎందుకు కథనం  రాంగ్ రూట్ లో వెళ్తుందనే  భావన ప్రేక్షకుడికి అనిపిస్తుంటుంది. ఈ కెప్టెన్ మిల్లర్ కూడా అదే కోవకి చెందుతుంది.పైగా ప్రతి సీన్ కూడా వెరైటీ గా ఉండాలనే ఉద్దేశంతో కథనం దారి తప్పింది. పైగా పెద్ద విచిత్రం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని మన వాళ్ళు చంపుతుంటే మనకి జాలి వేస్తు ఉంటుంది. ధనుష్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మారటం అనేది ఇంటర్వెల్ బ్లాక్ కి  తీసుకుంటే బాగుండేది. అసలు ధనుష్ కి సినిమా మొత్తం చంపడం తప్ప ఇంకేం పని ఉండదు. పైగా ఫస్ట్ ఆఫ్ సో సో గా తీసారేమో సెకండ్ ఆఫ్ బాగుంటుందేమో అని అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ నయం అనిపిస్తుంది.అసలు ప్రియాంక మోహన్ క్యారక్టర్ ని దర్శకుడు  ఎందుకు అంతా తేలికగా తీసుకున్నాడో  తెలియదు. మిగతా అన్ని పాత్రలు కూడా ఏం చేశాయో ఎవరికీ తెలియదు.కేవలం ధనుష్ తప్ప సినిమాలో ఏమి లేదు. ఒక  కథకి స్క్రీన్ ప్లే ఎలా ఉండగూడదో ఈ మూవీనే  చాలా చక్కని ఉదాహరణ. పైగా స్వతంత్రం కోసం పోరాడే సన్నివేశాలని కూడా ఎక్కువగా చూపించలేదు. దర్శకుడే కథా రచయితగా వ్యవహరించడంతో అతను అనుకున్నదే కరెక్ట్ అని అనుకున్నాడేమో 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:-

నటినటుల విషయానికి వస్తే ధనుష్ తన గత సినిమాల్లో లాగానే అధ్బుతమైన పెర్ఫార్మ్ ఇచ్చాడు.పైగా పెర్ఫార్మ్  విషయంలో  ధనుష్ సూపర్ గా చేసినా కూడా తన గత సినిమాలతో పోల్చుకుంటే తక్కువే అని చెప్పాలి.కొన్ని సీన్స్ లో బలం లేక పోయినా కూడా తన నటనతో బలాన్ని తీసుకొచ్చాడు. ప్రియాంక మోహన్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఆమె ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి. శివ రాజ్ కుమార్ కి కూడా ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. సందీప్ కిషన్ కి కూడా చెయ్యడానికి ఏమి లేదు. ఇక మిగతా పాత్రల్లో నటించిన వాళ్ళందరు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ చాలా కష్టపడ్డాడు గాని స్క్రిప్ట్ విషయంలో చేసిన పొరపాట్లు వల్ల అతని దర్శకత్వ ప్రతిభ మసకబారింది. పాటల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫైట్స్ బాగున్నాయి. సిద్దార్థ్ నూని కెమెరా పని తనం కూడా బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇక కెప్టెన్ మిల్లర్ గురించి  ఫైనల్ గా చెప్పుకోవాలంటే  ధనుష్ మీద నమ్మకంతో సినిమాకి వెళ్తే  దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్  ధనుష్ తో పాటు ప్రేక్షకులని మోసం చేసాడు. తుపాకుల మోతలు తప్ప సినిమాలో ఏమి లేదు. తెలుగు ప్రేక్షకులకి నచ్చడం కష్టం.