English | Telugu

మూడు రోజులు ఏడిస్తే గాని నా బాధ తగ్గదు  

యానిమల్(animal)మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించడంతో పాటుగా నేషనల్ క్రష్ గా మారిన నటి త్రిప్తి డిమ్రి(tripti dimri)ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. మొన్నీ ఈ మధ్య బాడ్ న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిప్తి ఇప్పుడు లేటెస్ట్ గా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నెల 11 న విడుదల కాబోతుండగా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో త్రిప్తి మాట్లాడుతు యానిమల్ రిలీజ్ అయ్యాక జోయా క్యారక్టర్ చేసినందుకు చాలా మంది నన్ను తిట్టారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కూడా చాలా దారుణంగా ట్రోల్ల్స్ చేసారు. అప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలో అర్ధం లేదు. అసలు అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడు అనుకోలేదు.ఎంతో బాధపడ్డా, మానసికంగా ఆవేదనకి గురయ్యాను, దాని నుంచి బయటకి రావడం కోసం మూడు రోజుల పాటు ఏడుస్తూ కూర్చున్నా. దాంతో కొంచం బాధ తగ్గి మనసు శాంతించింది, ఆ సమయంలో నా సోదరి నాకు సపోర్ట్ గా నిలవడంతో పాటుగా నువ్వేం చేసావో నీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకని దైర్యం చెప్పింది.

ప్రస్తుతం త్రిప్తి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. ఏడు సంవత్సరాల క్రితం సినీ రంగ ప్రవేశం చేసిన త్రిప్తి కి ఇప్పుడు బాలీవుడ్ లో బడా హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. విక్కీ విద్య కా వో వాలా వీడియో లో రాజ్ కుమార్ రావు తో కలిసి చేస్తుంది. రాజ్ కుమార్ రావు(raj kumar rao)ఇటీవల స్త్రీ 2(stree 2)తో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.