Read more!

English | Telugu

ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చేయడానికి మాత్రం ఒప్పుకోను!

కొందరికి వివాదాలంటే ముద్దు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనే ఆనందాన్ని పొందుతారు. అలా ఎప్పుడూ వార్తల్లో నిలవాలని నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏ చిన్న విషయం జరిగినా దాని గురించి ఏదో ఒక కామెంట్‌ చేయకుండా ఉండలేరు. వారు చేసిన కామెంట్‌కి రచ్చ జరగడం, సోషల్‌ మీడియా అంతా అది వైరల్‌గా మారడం అనేది వారికి నచ్చుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఈమధ్యకాలంలో బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ ఇలాంటి వ్యాఖ్యల ద్వారానే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. 

తాజాగా కంగనా పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారుతోంది. ఆ పోస్ట్‌లో తనని తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకుంది. తనకు ఎంత డబ్బిచ్చినా సెలబ్రిటీల పెళ్లిళ్లలో డాన్సులు చేయనని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో మళ్ళీ అటెన్షన్‌ ఎలా క్రియేట్‌ చెయ్యాలనుకుంటున్న కంగనాకి అవకాశం రానే వచ్చింది. దాంతో ఆ పోస్ట్‌ పెట్టింది. అంతేకాదు, తనకు డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమని నొక్కి మరీ చెప్పింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. గతంలో లతా మంగేష్కర్‌ ఒక విషయాన్ని ప్రస్తావించారు. తనకు ఎంత డబ్బు ఇచ్చినా వివాహాల్లో పాటలు పాడనని అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని తనకు అన్వయించుకొని కంగనా అలాంటి పోస్ట్‌ పెట్టింది. 

కంగనా ఈ పోస్ట్‌ పెట్టడం వెనుక రీజన్‌ ఏమిటంటే.. ఇటీవల అనంత్‌ అంబాని, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో  కొందరు బాలీవుడ్‌ సెలబ్రిటీలు డాన్స్‌ చేస్తూ కనిపించారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అలా వారు డాన్స్‌ చేసినందుకు భారీగానే రెమ్యునరేషన్స్‌ అందుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఒక మంచి కామెంట్‌ పెట్టడానికి కంగనాకి అవకాశం దొరికింది. వెంటనే పై విధంగా పోస్ట్‌ పెట్టేసింది. ఆ ఫంక్షన్‌లో డాన్స్‌ చేసిన వారిని ఉద్దేశించి పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను సపోర్ట్‌ చేస్తుంటే, మరికొందరు కాంట్రవర్సీ చేసేందుకు కంగనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అంటున్నారు.