English | Telugu
'స్లమ్డాగ్ మిలియనీర్' హీరోయిన్ ఫ్రీదా పింటోకు పండంటి పుత్రుడు!
Updated : Nov 23, 2021
హాలీవుడ్ బ్లాక్బస్టర్ 'స్లమ్డాగ్ మిలియనీర్' మూవీతో వెలుగులోకి వచ్చిన ఇండియన్ యాక్ట్రెస్ ఫ్రీదా పింటో పండంటి పుత్రునికి జన్మనిచ్చింది. అతడికి రుమి-రే అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రెండు ఫొటోలను ఫ్రీదా షేర్ చేసింది. ఒక ఫొటోలో ఆమె భర్త కోరీ ట్రాన్ మంచంపై పడుకొని వుంటే, అతని ఛాతీపై చిన్నారి రుమీ పడుకొని నిద్రపోతూ వున్నాడు. మరో ఫొటోలో ఫ్రీదా ఛాతీపై పడుకొని వున్నాడు రుమీ. అతను ఎప్పుడు పుట్టాడనే విషయాన్ని మాత్రం ఫ్రీదా వెల్లడించలేదు.
సోమవారం కోరీ ట్రాన్ బర్త్డే. ఈ సందర్భంగానే తమ కొడుకు ఫొటోలను షేర్ చేసింది ఫ్రీదా. వాటితో పాటు, "హ్యాపీ బర్త్డే దాదా కోరీ! లైఫ్లో నా హజ్బెండ్, ఫ్రెండ్, పార్టనర్గా నిన్ను సెలబ్రేట్ చేస్తున్నాను. కేవలం నిన్ను డాడ్గా కాకుండా సూపర్-డాడ్గా చూస్తున్నాను. నువ్వు నన్ను చాలా ఎమోషనల్గా మార్చావు. నన్ను సంతోషంలో ముంచేశావు. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. రుమి-రే నువ్వు లక్కీ బాయ్వి" అని ఆమె రాసుకొచ్చింది.
స్లమ్డాగ్ మిలియనీర్, రైజ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్, లవ్ సోనియా, లవ్ వెడ్డింగ్ రిపీట్, ఇంట్రూజన్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన ఫ్రీదా గత ఏడాది లాక్డౌన్ టైమ్లో ఫొటోగ్రాఫర్ కోరీ ట్రాన్ను పెళ్లి చేసుకుంది. తను ప్రెగ్నెంట్ అయినట్లు ఈ ఏడాది జూన్లో అనౌన్స్ చేసింది.