Read more!

English | Telugu

అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ హిందీ రీమేక్.. దోస్తానా కాంబో!

మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్.. ప‌లు భాష‌ల్లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.  తెలుగు రీమేక్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి స్టార్ రానా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, హిందీ వెర్ష‌న్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. బాలీవుడ్ వెర్ష‌న్ లో అభిషేక్ బ‌చ్చ‌న్, జాన్ అబ్ర‌హ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.

అదే గనుక నిజ‌మైతే.. ధూమ్, దోస్తానా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో క‌ల‌సి న‌టించిన జాన్, అభిషేక్ కాంబో.. ఈ రీమేక్ కి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రీమేక్ రైట్స్ ని పొంద‌డ‌మే కాకుండా ప్ర‌ధాన పాత్ర‌లో జాన్ అబ్ర‌హ‌మ్ న‌టిస్తుండ‌డం హిందీనాట అంచ‌నాలు పెంచేస్తోంది. మ‌రి.. దోస్తానా త‌రువాత దాదాపు 13 ఏళ్ళ అనంత‌రం క‌ల‌సి న‌టించ‌బోతున్న జాన్, అభిషేక్.. ఈ రీమేక్ తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌మ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.