English | Telugu

నువ్వంటే ఏంటో మరోసారి నిరూపించుకున్నావు.. పహల్ గామ్ చిన్న విషయం కాదు కదా

2007 నుంచి యూరప్ కంట్రీ 'యుకే'(uk)లో నిర్వహించే 'బాలీవుడ్ బిగ్ వన్ షో'(Bollywood Big One Show)అనే ఈవెంట్ లో బాలీవుడ్ అగ్రతారలు పాల్గొని అక్కడి సినీ అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 4 ,5 తేదీలలో సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్(Varun Dhawan)కృతి సనన్(Kriti Sanon)మాధురి దీక్షిత్, టైగర్ ష్రఫ్, దిశా పటాని లాంటి వారు ఆ వేడుకలో ఆడిపాడనుండటంతో అక్కడి ప్రేక్షకులు భారీ ఎత్తున ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారు.


కాని 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో టూరిస్టులు మరణించడంతో 'బాలీవుడ్ బిగ్ వన్ షో'ని వాయిదా వేశారు. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తు 'యుకే ఈవెంట్ ని వాయిదా వెయ్యడం అంత తేలికైన విషయం కాదు. కానీ కాశ్మీర్ లో జరిగిన విషాద సంఘటన దృష్ట్యా వాయిదా వెయ్యాలని నిర్ణయించుకున్నాం. అందరి క్షేమం మాకు ముఖ్యం. అభిమానులు మా ప్రదర్శన కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసు. అయితే ఇలాంటి సమయంలో విరామం ఇవ్వడం సరైనదని అనుకుంటూ వాయిదా వేస్తున్నాం. అభిమానులు అసౌకర్యానికి గురయితే క్షమించండి. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని తన పోస్ట్ లో తెలిపాడు.



Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.