జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’

జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు. దీనికి గురించి మానసిక నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూ వుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్‌కి ఈ వ్యాధి వుందని చెబుతున్నారు.  ఈ నార్సీ మానసిక వ్యాధి వున్న వ్యక్తులు తనకు ఫాలోవర్లను పెంచుకుంటారు. ఇతను పదేపదే చెప్పే అబద్ధాలను అతని ఫాలోవర్లు నిజమని నమ్ముతారు. దాన్ని వ్యాప్తి చేస్తూ విష వలయాన్ని సృష్టిస్తారు. ఆ విషవలయం టార్గెట్ అమాయకమైన మహిళలు, వృద్ధులు... ఇంకా లోకం పోకడ పెద్దగా తెలియని అమాయక యువత. జగన్‌కి వున్న మానసిక వ్యాధిని ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. షార్ట‌కట్‌లో ‘నార్సీ’ అని వ్యవహరిస్తారు. ఇది ఒక భయంకరమైన మానసిక రుగ్మత. ఈ జబ్బు వున్నవాళ్ళు మొత్తం అబద్ధపు బతుకు బతుకుతారు. ఫేక్ బతుకు బతుకుతారు. వాళ్ళ జీవితంలో ‘ప్రేమ’ అనే మాటే వుండదు. వాళ్ళని వాళ్ళు కూడా ప్రేమించుకోరు.. వాళ్ళ ఇగోని మాత్రమే ప్రేమిస్తారు. వాళ్ళ చుట్టూ వున్న మనుషుల్ని కాదు కదా.. కన్న తల్లి, తండ్రితో సహా సొంత రక్త సంబంధీకులను, చివరికి తోబుట్టువులతో సహా ఎవర్నీ ప్రేమించరు. చివరికి కన్న బిడ్డలను కూడా ప్రేమించరు. సాధారణంగా సమాజంలో హత్యలు చేసే తల్లిదండ్రులు ఈ నార్సీ కోవకే చెందుతారు. ఇలాంటి వారు మేకవన్నె పులుల మాదిరిగా ప్రశాంత వదనంతో కనిపిస్తారు.  కానీ వాళ్ళో లోపల ఒక కాష్టం రగులుతూనే వుంటుంది. వైసీపీలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావచ్చు, నాయకురాలు కావచ్చు కచ్చితంగా ‘నార్సీ’ అయి వుండాలి. ఈ ‘నార్సీ’ విధానాన్ని ప్రజల మీద ప్రయోగించడం వల్ల ఒక్కోసారి రాజకీయంగా విపరీతమైన అధికారం వచ్చే అవకాశం వుంది. అందుకే దీన్ని ప్రజల మీద ప్రయోగించి వుంటారు. ఎగ్జాపుల్ చెప్పాలంటే, జర్మనీని సర్వనాశనం చేసిన హిట్లర్ ఒక నార్సీ, వెనిజులాని నాశనం చేసిన హ్యూగో చావెజ్ ఒక నార్సీ, అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ ఒక నార్సీ, తాలిబన్ సమూహాలు నార్సీ, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఒక నార్సీ. నార్త్ కొరియాలో మహిళలకు ఎంతమాత్రం స్వేచ్ఛ లేకుండా చేసిన కిమ్ ఈ మధ్య మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, మీరంతా నాకు కన్న తల్లితో సమానం అనగానే ఆ మహిళలందరూ కన్నీరు పెట్టుకుని కిమ్‌కి ప్రణామాలు చేశారు. ఈ నార్సీ లక్షణాలు వున్నవాళ్ళు అలాంటి వేషాలు వేస్తూ వుంటారు.  సినిమాల్లో చూస్తే, రీసెంట్‌గా వచ్చిన ‘యానిమల్’ సినిమాలో హీరోది నార్సీ బుద్ధి. పాత సినిమాల్లో సూర్యకాంతం చేసే కేరెక్టర్లు నార్సీ బుధ్ధికి నిదర్శనాలు. ఆమే మొగుణ్ణి కొడుతుంది, తిడుతుంది.. కానీ తనను తిట్టినట్టు, కొట్టినట్టు హడావిడి చేస్తుంది. ప్రకాష్ రాజ్ ‘ఒంగోలు గిత్త’ సినిమాలో చేసిన కేరెక్టర్ నార్సీ. మార్కెట్ యార్ట్ ఛైర్మన్ అవడం కోసం సొంత బాబాయినే చంపేస్తాడు.. ఎంతోమంది ప్రాణాలు తీస్తాడు.. సింపతీ క్రియేట్ చేసుకుంటాడు. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ ధరించిన పాత్ర నార్సీ. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ప్రిన్సిపాల్ కేరెక్టర్ కూడా నార్సీయే. ప్రజలందరికీ ఈ నార్సీల మూర్ఖత్వం గురించి, నార్సీల దుర్మార్గం గురించి, వాళ్ళ దాష్టీకం గురించి, వికృతమైన వాళ్ళ మానసిక స్థితి గురించి ప్రజలకు అవగాహన కలిగితే, రాజకీయాల్లో ఈ నార్సీ విధానాన్ని ఎవరు ఫాలో అవుతున్నారో పసిగట్టవచ్చు.  జగన్ రాష్ట్రంలోని కంపెనీలను తరిమేయడంలో మూర్ఖత్వం మాత్రమే లేదు.. ఇసుకను ఆపేయడంలో కేవలం దాన్ని అమ్మేసుకుందామన్న ఆశ మాత్రమే లేదు.. అంతకు మించి వుంటాయి. ఒక్క ఇసుకను ఆపితే భవన నిర్మాణ రంగ కార్మికులు మొత్తం సర్వనాశనం అయిపోయారు కదా.. ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు కదా.. అలాంటి టైమ్‌లో వాళ్ళకి కాస్త డబ్బు ఇస్తే డబ్బు ఇచ్చిన వాడు గ్రేట్ అనుకుంటారు. ప్రజల బ్రతుకులు బాగుంటే, ఓ పదివేలో, పాతికవేలో ఇస్తే ఎందుకు గొప్పగా అనిపిస్తుంది చెప్పండి? అసలు ఉద్యోగాలే లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి యువత ఎగబడతారు. (ఇంకా వుంది)

ఓటమి భయంతో ఈసీని ఆశ్రయించిన ఓవైసీ 

హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల కమిషన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల కమిషన్ కు  బిజెపి మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద  మోడీ, అమిత్ షాలు దృష్టి పెట్టారని వీరిద్దరిని ఓడించాలంటే బిజెపి అభ్యర్థి మాధవిలతకు డిపాజిట్లు రాకుండా చేయాలని ఓవైసీ పిలుపునిస్తున్నారు. ప్రతీ బహిరంగ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 40 ఏళ్ల పాటు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంఐఎం ఏక చత్రాధిపత్యం వహిస్తున్నప్పటికీ మునుపెన్నడూ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించలేదు. ఎంఐఎం చరిత్రలో మొదటి సారి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి బిజెపి మీద ఫిర్యాదు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది.  బోగస్ వోట్లతో మజ్లిస్ గెలుస్తూ వస్తుందని ఇప్పటికే మాధవిలత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ సారి కొంత శాతం బోగస్ వోట్లు తగ్గిపోయే సూచనలు కనిపించడంతో అసదుద్దీన్ ఓవైసీ కి ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఓవైసీ సూచన మేరకు డమ్మీ అభ్యర్థిని నిలబెడుతారని ప్రచారంలో ఉంది. తెలంగాణలో కేవలం హైదరాబాద్ లోని పోలింగ్ బూత్ ల పైనే ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సిటీలోని 420 పోలింగ్ బూత్ లలోనే తనిఖీలు చేస్తూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఎక్కడని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ లపై నిఘా పెట్టాలని సూచించారు.హైదరాబాద్ పై మాత్రమే స్పెషల్ ఫోకస్ ఎందుకని నిలదీస్తూ.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపైనా దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పాతబస్తీలో ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

సొంత కుటుంబాల్లోనే నిరసన కుంపట్లు.. వైసీపీ కొంప మునిగిపోయినట్లేనా?

ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?  ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్వయంగా జనగ్ నుంచి, ఆ పార్టీలో బాగా నోరున్న నేతగా పేరుబడిన అంబటి దాకా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించడానికి తురుఫు ముక్కగా భావించి తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం వరకూ సొంత ఇంటి నుంచే నిరసన సెగలు ఎదుర్కొంటున్నారు. దీంతో జగన్ పార్టీ సొంతింటి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎం చేయాలో, ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్ధం కాక అవస్ధలు పడుతోంది.  పార్టీ అగ్రనేతలు, మంత్రులు ఆఖరికి పార్టీ అధినేత ఇంట్లోనే  వ్యతిరేకత అధికారపార్టీకి వడదెబ్బ తగిలేలా చేస్తోంది. ముందుగా  పార్టీ అధినేత జగన్ విషయమే తీసుకుంటే ఆయనను సొంత కుటుంబ సభ్యులే నమ్మడం లేదు.  సొంత చెల్లి షర్మిల- చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత.. జగనన్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ కూడా జగనన్న పార్టీకి ఓటేయద్దని  కోరుతూ బహిరంగ లేఖ సైతం రాశారు.  చిన్నాన్న హంతకుడు అవినాష్‌రెడ్డికి ఎలా టికెట్ ఇచ్చావు? అసలు నీవు అన్నవేనా? నీకు మైండ్ పనిచేస్తుందా? లేదా? తండ్రిని చంపారన్న రిలయన్స్ కంపెనీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఎలా ఇచ్చావ్? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ షర్మిల ఊరూ వాడా తిరుగుతూ జగన్ పరవు బజారున పడేస్తున్నారు. ఎన్నికల వేళ తన ప్రచారంలో జగన్ పై విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ సంధించని రోజుంటూ లేకుండా ఆమె సాగుతున్నారు.  ఇక జగన్ కూడా షర్మిల తన తండ్రికి వారసురాలు కాదంటూ కరాఖండీగా నిండు సభలో సెలవిచ్చారు.   ఇక స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత  మాజీ మంత్రి మద్రగడ పద్మనాభం ను కాపుల ఓట్లు చీల్చి వైసీపీని ప్రయోజనం చేకూర్చు తురుఫు ముక్కగా భావించి దరికి చేర్చుకున్నా జగన్ కు ఇప్పుడు ఆయన ఒక గుదిబండగా మారిపోయారు. అందుకు కూడా ముద్రగడు కుటుంబ పోరే కారణం అయ్యింది. ముద్రగడ పిలుపునిస్తే కాపు సామాజికవర్గం అంతా కలిసి వస్తుందని జగన్ భావించారు. అందుకే పిఠాపురంలో జగన్ ను ఓడించాలంటే ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే సరిపోతుందని భావించారు. జగన్ పిలుపునందుకుని ముద్రగడ కూడా వైసీపీ గూటికి చేరిపోయారు.  అలా చేరి ఊరుకోలేదు.. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే, తాను పేరు మార్చుకుంటానని  శపథం కూడా చేసేశారు.  అయితే ఆయనకు సొంత ఇంటి నుంచే వ్యతిరేక సెగ తగిలింది. ఆయన కుమార్తె స్వయంగా తన తండ్రిని నమ్మకండి అంటూ జనాలకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. తన తండ్రి జగన్ చేతిలో పావుగా మారి అనవసరంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను తిడుతున్నారు. అది కరెక్టు కాదు అంటే ఆ వీడియోలో పేర్కొన్న ముద్రగత కూతురు తన ఓటు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించారు. దీంతో కూతురిపై ముద్రగడ ప్రాపర్టీ వ్యాఖ్యలు చేసి పరుపు పోగొట్టుకున్నారు.  సొంత కుమార్తే ముద్రగడను నమ్మడం లేదు.. ఇక ప్రజలెందుకు ఆయనను విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి, ఉపముఖ్యమంత్రి  బూడి ముత్యాలరాజు ఇంటి పోరు కూడా రచ్చకెక్కింది.  ఆ కథేంటంటే ఆయనకు ఇద్దరు భార్యలు.  మొదటి భార్య కొడుకు బూడి రవికుమార్. ఆయన  మా నాన్న ముత్యాలనాయుడుకు ఓటేయకండి. సొంత కుటుంబానికే న్యాయం చేయని వాడు ప్రజలకేం చేస్తాడంటూ రోడ్డెక్కారు.  పాపం ఆయనా ఇంటి పోరు కారణంగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసం పొందలేక ఎదురీదుతున్నారు.  ఇక తాజాగా సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు ఇంట్లోనూ ఇంటి పోరు రచ్చకెక్కింది. ఆయన కుమార్తె భర్త తన మామ నీచుడు, నికృష్ణుడు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  ప్రత్యర్థి నేతలపై  నోరు పారేసుకునే అంబటి ఇప్పుడు సొంత అల్లుడు తనపై చేసిన విమర్శలపై నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు.   మొత్తంగా వైసీపీ అధినేత నుంచి ఆ పార్టీ కీలక నేతల వరకూ సొంత ఇంటి నుంచే ఎదురౌతున్న వ్యతిరేకతతో  సతమతమౌతున్నారు. సొంత ఇంటి కుంపట్లే నిరసన నిప్పులు చెరుగుతుంటే ఏం చేయాలో తెలియక సతమతమౌతున్నారు.  

జగన్ ఫొటో చిరిగిపోయింది.. పట్టాదారు పాసుపుస్తకాలు జగన్ కొంప ముంచేస్తాయా?

చంద్రబాబు  చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.  అయితే తాజాగా ఆయన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలేంటంటూ ఫైర్ అయ్యారు. వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో విషయంలో మాత్రం ఆయన పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ భూములను వాళ్ల తాత, తండ్రి ఇచ్చారా? అంటూ నిలదీశారు. మన పెద్దలు మనకు వారసత్వంగాఇచ్చిన పుస్తకాలపై సైకో జగన్ ఫొటోలను సమర్ధిస్తారా అంటూ జగన్ పై చంద్రనిప్పులు చెరిగారు. అంతే కాదు ఆ పట్టాదారు పాసుపుస్తకాలను చించి పారేశారు.  కాకినాడలో ఎన్నికల సభలో ఆయన ఆగ్రహం అంబరాన్ని తాకింది. చంద్రబాబు ఆగ్రహం ధర్మాగ్రహమేనంటూ సభికులు చప్పట్లతో మద్దతు పలికారు.   అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఆ అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా జనంలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆయనకు తోడుగా కూటమి భాగస్వామ్యపక్షాలు కూడా ల్యాండ్ టైలిటింగ్ యాక్ట్ దుర్మార్గమైనదన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరిగేలా ప్రచారంలో ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి భారతిని ఓ వైసీపీ నేతే మా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకంటూ నిలదీశారు. ఆ ప్రశ్నకు సమాధానం లేక భారతి నేల చూపులు చూశారు. సరిగ్గా ఆ అంశాన్నే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. తొలి నుంచీ కూడా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో అదే ప్రధాన అంశంగా తెరమీదకు తీసుకురావడంతో జనంలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతున్నది. మొదట భూమిపట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో, ఇప్పుడేమో  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ చట్టం. ఈ రెంటినీ కలిపి చూస్తే మన భూములు మనవి కాకుండా జగన్ చేస్తున్నారంటూ జనంలో పెద్ద చర్చ ఆరంభమైంది. ఆ విషయాన్నే చంద్రబాబు మరింత స్పష్టంగా ప్రజల గుండెలను నేరుగా తాకేలా లేవనెత్తారు.  జగన్ తీసుకువచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు భాష్యం చెప్పారు.  ఈ చట్టం అమలులోకి వస్తే పట్టాదారుపాసు పుస్తకం ఉండదు. పత్రాలుండవు. మన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. ఇది మీకు సమ్మతమేనా అని ప్రజజలను నేరుగా ప్రశ్నించారు.  ఎంతో మంది సీఎంలుగా పనిచేశారు. ఎవరైనా ఇలాంటి పనికిమాలిన చట్టం తెచ్చారా? ఏ సీఎం అయినా పట్టాదారు పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారా? అని నిలదీశారు.  ఈ ఫొటోల పిచ్చోడిని సాగనంపకపోతే మీ భూములన్నీ కబ్జా చేసేస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.  ఇక జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను చంద్రబాబునాడయుడు చింపేసి, గాల్లో ఎగురవేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.  మాకు పొలాలిచ్చింది మీ తాత రాజారెడ్డీ కాదు, మీ నాయన వైఎస్సూ కాదు..  అంటూ నెటిజన్లు జగన్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. పొద్దున్నే మీ ముఖం చూడాల్సిన ఖర్మ మాకేంటి సామీ అంటూ ఈసడించుకుంటున్నారు.   అసలు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో అన్న థీమ్ ను అమలు చేయడం మొదలైనప్పటి నుంచే జగన్ పై సామాజిక మాధ్యమంలో సెటైర్లే మరో రేంజ్ లో పేలాయి. అదేదో సినిమాలో చెప్పినట్లు... ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అంటూ జగన్ ను నెటిజన్లు ట్రోల్ చేశారు.    ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్  ఏమైనా పెట్టాయా అంటూ అప్పట్లోనే సందేహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో జగన్ ఫొటోల పిచ్చి ఆయన మెడకు చుట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో భూమి ఉన్న ఏ ఒక్కరూ జగన్ ఫొటోను చూడడానికి ఇష్టపడిని విధంగా పరిస్థితి తయారైంది. అదే ఆయనకు ఈ ఎన్నికలలో భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టే అంశంగా మారిపోయిందని అంటున్నారు. 

ఇన్ చార్జి డీజీపీపై ఎన్నికల సంఘం వేటు.. ఇంత ఆలస్యంగానా?

ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ  వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.   ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవథిలో బెంగాల్ డీజీపీపై వేటు వేసిన ఎన్నికల సంఘం, ఏపీలో ఇన్ చార్జ్ డీజీపీని మార్చడంలో చేసిన తాత్సారం విమర్శలకు తావిస్తోంది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఇక చివరి క్షణంలో ఇక తప్పని సరి పరిస్థితుల్లో, అదీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై అధకార పార్టీ మూకలు దాడి చేసిన తర్వాత బదలీ వేటు వేసింది.  కానీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెలన్నర వ్యవధిలో సీఎం రేమేష్ పై దాడికి   ముందు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలూ, దాడులను ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తినా పెడచెవిన పెట్టింది. వాస్తవానికి ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి.  ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా  ట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి ఆయన ఇన్ చార్జ్ డీజీపీయే.  ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని తెలుగుదేశం  ఆరోపణలు చేసింది. వీటి వేటికీ స్పందించని ఎన్నికల సంఘం బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగే సరికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గుర్తించింది. మరీ ముఖ్యంగా సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రావడానికి ఒక రోజు ముందు ఇన్ చార్జి డీజీపీపై వేటు వేసింది. ఇప్పుడు ఇక వారం రోజులలో ఎన్నికలు జరగనుండగా కొత్తగా వచ్చే డీజీపీ పోలీసుల పని తీరును సమూలంగా మార్చేందుకు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో విపక్షాలు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం ఇష్టం లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా పోలీసుల పనితరులో మార్పు వచ్చి.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చక్కబడుతుందేమో చూడాలి.  

గొట్టిపాటి లక్ష్మి వైపే దర్శి.. గెలుపు సునాయాసమే!

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించాలని భావించినప్పటికీ, తరువాత మాజీ మంత్రి సిద్ధారాఘవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానాన్ని ఆయనకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే తరువాత ప్రత్నమ్నాయ అభ్యర్థి కోసం గాలించింది. ఆ గాలింపులో భాగంగా దర్శినియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చారు. దీంతో దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు గొట్టిపాటి లక్మికి అదనపు బలంగా మారింది. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారూ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నారు. కూటమి పట్ల మహిళలు, వృద్ధులు సైతం ఆసక్తి కనబరచడం గమనార్హం. కూటమి సభలకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోటెత్తుతున్న జనం తెలుగుదేశం శ్రేణులలో జోష్ పెంచుతున్నది. అన్నిటికీ మించి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్థులను చేస్తున్నారు.  స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాకుండా, వైసీపీ పాలనా వైఫల్యాలను సూటిగా సుత్తి లేకుండా ఎండగడుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తోంది. కష్టపడి పని చేసే తత్వం, ప్రజలలో మమేకం అవుతున్న తీరు  గొట్టిపాటి లక్ష్మికి సానుకూలాంశాలుగా మారాయి. ప్రజలలో ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. మరో వైపు  ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి దశాబ్దాల రాజకీయ అనుభవం, నియోజకవర్గ పరిధిలో ఆయనకు వివిధ వర్గాల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ తెలుగుదేశం గూటికి చేరేలా చేశాయి. ఇది దర్శిలో తెలుగుదేశం అవకాశాలను మరింతగా పెంచింది. ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం బలం అనూహ్యంగా పెరిగింది. దీంతో పరిశీలకులు సైతం దర్శిలో గొట్టిపాటి లక్ష్మి విజయం నల్లేరుమీద బండినడకలా మారిందని విశ్లేషిస్తున్నారు. 

నా మామ అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దు

నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకమైన అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దని ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ సత్తెనపల్లి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ గౌతమ్ అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ వెంకట మనోజ్ఞకు భర్త. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఒక షాకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన... ‘‘నాపేరు డాక్టర్ గౌత్. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని. అది నా దురదృష్టం. ఎవరూ ఏమీ చేయలేరు. బట్, ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి, ఈ వీడియో చేయడం నా బాధ్యత అనుకునే ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజూ ప్రొద్దున్నే దణ్ణం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుణ్ణి ఇంకోసారి నా లైఫ్‌లో ఇంట్రడ్యూస్ చేయొద్దు స్వామీ ఎప్పుడూ కోరుకుంటూ దణ్ణం పెట్టుకుంటూ వుంటాను. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తాను పోటీ చేయబోయే పోస్టు అలాంటిది. ఏ పోస్టుకైతే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో అవి ఈయనలో లేవు.  వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వుండక్కర్లేదు. 0.00001 పర్సెంట్ కూడా ఈ లక్షణాలు లేని వ్యక్తం అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటివాటిని అంటే, ఎవరైతే నిస్సిగ్గుగా, ఎంత పెద్ద గొంతు వేసుకుని అయినా, ఎంత పెద్ద అబద్ధాన్నయినా నిజం చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్.గా సమాజంలో బతుకుతారో అలాంటి వారికి మనం ఓటు వేసినట్టు. ఎంత లేకి పని అయినా చేసి, చాలా హుందాగా బతకొచ్చు సమాజంలో అని అనుకునేవాళ్ళకి ఓటు వేస్తున్నట్టు. ఏదయినా చేసి, సిగ్గు లేకుండా సిగ్గు లేని తనాన్ని ప్రోత్సహించొచ్చు అనుకునేవాళ్ళకి ఓటు వేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటు వేస్తే, ఇదే సమాజానికి తలరాతలాగా మారి, రేపు సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి, సరైన బాధ్యతతో ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తుస్తూ... నమస్తే’’ అన్నారు.

ముద్రగడ బేటీ... పవన్‌ కళ్యాణ్‌తో భేటీ!

కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే. తన తండ్రి పవన్ కళ్యాణ్‌ని అన్యాయంగా విమర్శిస్తున్నారని, తన మద్దతు పవన్ కళ్యాణ్‌కేనని ప్రకటించి క్రాంతి సంచలనం సృష్టించారు. దీంతో ముద్రగడ షాక్‌కి గురయ్యారు. ఇదిలా వుంటే ముద్రగడ కుమార్తె క్రాంతి ఆదివారం నాడు పవన్‌కళ్యాణ్‌తో తునిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘‘ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు. క్రాంతిని నా సోదరిలా గౌరవిస్తాను. అయితే, క్రాంతి జనసేన పార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడతో మాట్లాడి, ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు ఎన్ని మాటలైనా అంటారు. వాటిని సీరియస్‌గా తీసుకోకూడదు. నేను ముద్రగడను, ఆయన కుమార్తెను కలుపుతాను. ఈసారి ఎన్నికలలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెట్టి గౌరవిస్తాను’’ అన్నారు. 

ఇక జవహర్‌రెడ్డిని పంపించడం మిగిలింది

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది. ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ వేధించడానికి రాజేంద్రనాథ్ ‌రెడ్డి తనవంతు సహకారం అందిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రభావాన్ని చూపే అవకాశం వుందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎన్నికల కమిషన్ సాగనంపాల్సిన మరో అధికారి చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి. ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి కంటే వందరెట్లు డేంజరస్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జవహర్ రెడ్డి కూడా జగన్ రెడ్డికి విధేయుడే. ఇప్పటికే ఆయన విధేయతను అనేక సందర్బాల్లో చూపిస్తూ వస్తున్నారు. పోలింగ్ సందర్భంగా కూడా జవహర్ రెడ్డి తన జగన్ భక్తిని ప్రదర్శించే ప్రమాదం వుంది. అందుకే జవహర్‌రెడ్డిని కూడా విధుల నుంచి తప్పించాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి.

ఏపీ డీజీపీని సాగనంపిన ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌కి వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణం ఎన్నికల విధుల నుంచి వైదొలగాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గారికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ బాధ్యతనూ అప్పగించవద్దని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి డీజీపీ ఎంపిక కోసం సోమవారం ఉదయం 11 గంటల లోగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు పంపాలని ఆదేశించింది. పేర్లను పంపడం మాత్రమే కాకుండా ఈ ముగ్గురికి సంబంధించిన ఐదేళ్ళ కాలానికి సంబంధించిన పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపించాలని సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కి విధేయుడిగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకుంది.

పెమ్మ‌సానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం.. మెజార్టీలో అగ్ర‌స్థానం ఖాయం

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. విజ‌యం ఎప్పుడో ఖాయం కాగా.. ఇప్పుడు పెమ్మసాని మెజారిటీపైనే  రాష్ట్రం వ్యాప్తంగా చ‌ర్చ‌ జరుగుతోంది బుర్రిపాలెం బుల్లోడుగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ముద్ర వేసుకున్న పెమ్మ‌సాని.. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నారు. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా కిలారు రోశ‌య్య బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ.. పెమ్మ‌సాని దూకుడుకు ఫ్యాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.  విద్యాభ్యాసంలోనూ, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ, యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలోనూ, నీతివంత‌మైన పాల‌న అందించే విష‌యంలో.. ఇలా ఏ అంశంలో తీసుకున్నా వైసీపీ అభ్య‌ర్థికి అంద‌నంత ఎత్తులో పెమ్మ‌సాని ఉన్నారన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా  సేవలందించిన పెమ్మసాని.. వ్యాపార రంగంలోనూ అగ్ర‌స్థానాల‌కు చేరుకున్నారు. అమెరికాలో ఉన్న‌ప్ప‌టికీ త‌న సొంత ప్రాంతానికి సేవ చేయాల‌న్న ఉద్దేశంతో  పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి..  పేద ప్రజలకు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. ముక్కుసూటి త‌నం.. ఎలాంటి స‌మ‌స్య‌నైనా ఓపిగ్గా ప‌రిష్క‌రించే త‌త్వం.. ప్ర‌జ‌ల‌కు నిత్యం అండ‌గా నిలిచే స్వ‌భావం.. ఇలా అన్నివిధాల పెమ్మసానే మాకు స‌రైన నేత‌ అంటూ గుంటూరు పార్ల‌మెంట్ నియోజకవర్గ ప్ర‌జ‌లు ఆయనకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.  పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , కిలారు రోశ‌య్య‌ల‌ను ప‌లు అంశాల్లో  పోల్చి చూస్తున్న  జనం అన్ని విధాల పెమ్మ‌సానే  బెట‌ర్ ఛాయిస్.. కాదు కాదు బెస్ట్ చాయిస్ అంటూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు.   విద్యార్హ‌తల విష‌యంలో..  కూటమి మ‌ద్ద‌తుతో గుంటూరు పార్ల‌మెంట్‌  నియోజకవర్గ బ‌రిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జ‌న్మించిన పెమ్మ‌సాని.. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ  ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో మెడిసిన్ పూర్తి  చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవ‌త్స‌రంలో అమెరికాకు వెళ్లిన ఆయన.. పీజీ పూర్తి చేసి అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున్న‌ జాన్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. వ్యాపార రంగంలోనూ రాణించి అమెరికాలో ఒక ఎంటర్ పెన్యూయర్గా ఎదిగారు. మ‌రోవైపు వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య విద్యాభ్యాసం చూస్తే డిగ్రీ బీకాం చదివారు. యువ‌త‌కు విద్యాప‌రంగా ఆయ‌న ఎలాంటి స‌హాయ‌క స‌హ‌కారాలు అందించిన దాఖలాలు లేవు. సేవా కార్య‌క్ర‌మాల్లో..  పెమ్మ‌సాని చంద్రశేఖర్ అమెరికాలోనూ, గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి   ఉచిత వైద్య సేవలు అందించ‌డంతోపాటు.. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. వ్యాపార రంగంలోనూ రాణించిన ఆయన తన పుట్టిన గడ్డకోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వ‌చ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ ను ప్రారంభించారు.  దీనికితోడు పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య  విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు విద్యా పరంగా చేసిన సేవలు లేవు. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు. రాజ‌కీయ రంగంలో..  పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో కొన‌సాగారు.  పెమ్మ‌సానికి చంద్రబాబు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు సీఎం హోదాలో అమెరికాలో పర్యటించిన‌ వేళ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలకు పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని  తెలుగుదేశం బ‌లోపేతానికి చంద్ర‌బాబుతో కలిసి పని చేయడం ప్రారంభించారు.  2014లోనే తెలుగుదేశం నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు.  కానీ, 2014, 2019లో అవ‌కాశం ద‌క్క‌లేదు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకోవడంతో చంద్రబాబు మరో ఆలోచన లేకుండా ఆ స్థానంలో పెమ్మసానికి టికెట్ ఇచ్చారు.   దీంతో గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెమ్మ‌సాని తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.  కిలారు రోశ‌య్య విష‌యానికి వ‌స్తే.. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యకు ఆ స్థానంలోనే  మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాక‌రించింది. గుంటూరు ఎంపీ అభ్య‌ర్థులుగా వైసీపీ అధిష్టానం ఇద్ద‌రిని బ‌రిలోకి దింపినా వారు పెమ్మ‌సానికి స‌రితూగ‌లేమ‌ని చేతులెత్తేశారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో  మరో గత్యంతరం లేక సీఎం జ‌గ‌న్ గుంటూరు పార్ల‌మెంట్ బరిలో  రోశ‌య్య‌ను బ‌రిలోకి దింపారు. ప్రజా సమస్యలపై ఎవరి అవగాహనలో ..  పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచీ గుంటూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గడపకూ వెళుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, లాయర్లు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, టీచర్లు, కార్మిక, కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. పేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాలను తెలుసుకుంటూ.. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్యపైనా చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతూ పెమ్మ‌సాని గుంటూరు పార్ల‌మెంట్  నియోజకవర్గ ప‌రిధిలోని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. అంతేకాదు.. అనేక సేవా కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తూ శెభాష్ పెమ్మ‌సాని అనిపించుకుంటున్నారు.   వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య గుంటూరు ప్రాంతంలో జన్మించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ప్రజల వద్దకు పెద్ద‌గా వెళ్లింది లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్ని గడపలు ఉన్నాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు.  రోశ‌య్యదీ రాజ‌కీయ నేప‌థ్య కుటుంబమే  అయినా.. ఆయన త‌న రాజకీయ జీవితంలోనూ సొంత నిర్ణ‌యాలు తీసుకున్న దాఖ‌లాలు లేవు. త‌న సామ‌ర్థ్యంతో రాజ‌కీయంగా ఎద‌గ‌లేదు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించిన పాపాన పోలేదు. ఏపీ రాజ‌ధాని విష‌యంలో..  పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ రాజధాని అమరావతిని అణువణువూ అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ.. కూట‌మి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామ‌ని, ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తామ‌ని గుంటూరు పార్ల‌మెంట్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.  వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించడం  లేదు. ఐదేళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉండి అడ్డుచెప్ప‌లేక పోయారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ప్ర‌భుత్వం వేధిస్తుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు. మూడు రాజధానులు అంటున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడుగుల‌కు మ‌డుగులొ త్త‌డం త‌ప్పితే.. అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి రోశ‌య్య ప‌ట్టించుకున్నదే లేదు. యువ‌త‌కు ఆద‌ర్శం..  పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య వృత్తిలో, వ్యాపార రంగంలో రాణించి ప్రపంచమే తన వైపు తిరిగి చూసేలా విజయాలు అందుకున్నారు. పేద ప్ర‌జ‌ల‌కు ,క‌ష్టాల్లో ఉన్న‌వారికి అండ‌గా నిలుస్తూ త‌న ట్ర‌స్ట్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. అంతేకాదు.. యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను రూపొందించారు.  వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య తన వ్యాపారాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డార ఆరోపణలు మెండుగా ఉన్నాయి. పదవిని అడ్డు పెట్టుకుని ప్రజా సందపను దోచుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క విష‌యంలోనూ రోశ‌య్య యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచేలా ప‌నులు చేయ‌లేదు.  అనేక అంశాల్లో పెమ్మ‌సాని చంద్ర‌శ‌ఖ‌ర్‌, కిలారి రోశ‌య్య‌ను గ‌మ‌నిస్తున్న‌ గుంటూరు పార్ల‌మెంట్  నియోజకవర్గ ప్ర‌జలు  పెమ్మ‌సానికి జై కొడుతున్నారు. భారీ మెజార్టీతో పెమ్మ‌సానికి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ పెమ్మ‌సాని మెజార్టీపైనే చ‌ర్చ‌ చేస్తున్నాయి. దీంతో, రాష్ట్ర రాజ‌కీయాల్లో పెమ్మ‌సానికే  అత్య‌ధిక మెజార్టీ అవ‌డం ఖాయ‌మ‌ని  విశ్లేష‌కులు గట్టిగా చెబుతున్నారు. 

పాస్‌బుక్ మీద ఫొటో... రైతుల ఓట్లు మటాష్!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో కారణాలు వున్నప్పటికీ, చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవాల్సిన విషయం... రైతుల భూమి హక్కు పత్రం అయిన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ప్రచురించుకోవడం. తమ పూర్వికులు వారసత్వంగా ఇచ్చిన భూమి, తాము కష్టపడి సంపాదించుకున్న భూమి హక్కు పత్రాల పుస్తకం మీద జగన్ ఫొటో వుండటాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వున్నారు. అయితే బాహాటంగా వ్యతిరేకిస్తే వేధించి ఉసురు తీస్తారన్న భయంతో ఇంతవరకు ఎవరూ కిక్కురుమని కూడా అనలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా రైతులకు తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తమ పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో పోవాలంటే, జగన్‌ని గద్దెదించడం మినహా మరో మార్గం లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఎక్కడోదాకా ఎందుకూ, జగన్ నియోజకవర్గంలోని పులివెందులలోనే వైసీపీ కార్యకర్త అయిన ఓ రైతు సాక్షాత్తూ భారతి ముందే ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశాడంటే ఈ అంశం మీద రైతుల్లో ఎంత వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. అలా జగన్ ప్రభుత్వం కూలిపోగానే ఇలా పాస్ బుక్‌లో జగన్ ముఖాన్ని చించేయడానికి రైతులు సిద్ధంగా వున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో వుండటం వల్ల రైతుల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని వైసీపీ నాయకులకు బాగా అర్థమైంది. రైతుల ఆస్తి మీద కూడా తన ఫొటోను ముద్రించుకోవాలనే దురాశకు రైతులు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలుసుకున్న నాయకులు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

తెలంగాణా పోలీసులు అమిత్ షా ను అరెస్టు చేస్తారా? రేవంత్ దూకుడు..

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది.  కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. అస‌లు కేసు ఏమిటంటే, ఇటీవ‌ల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో.. కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది.  ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా కాంగ్రెస్  నేత‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు.  చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు.  అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై డీప్ ఫేక్ వీడియో కేసు వెంటాడుతున్న‌ వేళ, అంతే స్థాయిలో అమిత్ షా మీద మరో కేసును సిద్ధం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మీద కేసు పెట్టేంత ధైర్యం చేయ‌డం దేశ రాజ‌కీయాల్లోనే ఉత్కంఠ‌గా మారింది.   సి.ఎం. రేవంత్‌రెడ్డి దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు సి.ఎం. రేవంత్‌ను అరెస్ట్ చేస్తారా? లేక తెలంగాణా పోలీసులు అమిత్‌షాను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ‌త నెల‌కొంది.

ఇవండీ అసలు సిసలు ‘నవరత్నాలు’!

పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో జనాన్ని మాయలో పడేశారు. ఈ ఐదేళ్ళ పరిపాలనలో ఆయన చెప్పిన నవరత్నాల అమలు ఎలా వున్నా, ఆయన అమలు చేసిన అసలు సిసలు నవరత్నాలు వేరే వున్నాయి. అవేమిటో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలియజేశారు. 1. ఇసుక మాఫియా: గతంలో తక్కువ ధరకు, కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా లభించే ఇసుకను బంగారం చేసేశారు. ఇసుక చుట్టూ రాష్ట్రవ్యాప్తంగా మాఫియాని క్రియేట్ చేశారు. సామాన్యులు ఇసుక కొనుక్కోలేని పరిస్థితి తెచ్చారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులకు ఇసుక భూములు వుంటాయి. వారి భూమిలోని ఇసుక వారి సొంత ఇంటి నిర్మాణానికి కూడా వాడుకోలేని పరిస్థితి తెచ్చారు. ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్నారు. అదేమిటని ప్రశ్నించిన వారిని అడ్డు తొలగించుకుని, ఆ ఇసుకలోనే పూడ్చేశారు. 2. జే బ్రాండ్ మద్యం: జగన్ ప్రభుత్వం పంపిణీ చేసిన దాన్ని ఆల్కహాల్ అనడం కంటే హాలాహలం అనడం బెటర్. దేశమంతటా అమ్మే బ్రాండ్స్.ని పక్కన పెట్టి తన సొంత మనుషులు క్రియేట్ చేసిన వింత బ్రాండ్స్.ని జనం గొంతులో పోశారు. మద్యం రేట్లను మూడింతలు పెంచేశారు. రేటు పెంచితే పెంచారు.. నాణ్యమైన మద్యం అయినా అమ్మారా? కాలకూట విషాన్ని అమ్మారు. జే బ్రాండ్ మద్యం పేరుకే మద్యం అని.. అందులో ప్రాణాలు తీసే కెమికల్స్ తప్ప ఆల్కహాల్ లేదని లాబ్ రిపోర్టు కూడా ప్రూవ్ చేశాయి. సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి, కల్తీ మద్యం ద్వారా లక్షల కోట్లు దండుకున్నారు. 3. భూ మాఫియా: ఏదైనా స్థలం మీద వైసీపీ నాయకుల కన్ను పడిందంటే సొంతం చేసుకోవడం ఖాయమంతే. మొదట ఏ వివాదమూ లేని స్థలాన్ని వివాదంలోకి లాగుతారు. ఆ తర్వాత రాయలసీమ బ్యాచ్‌ని రంగంలోకి దించుతారు. వీళ్ళు చెప్పిన ధరకు ఇచ్చేసి అసలు ఓనర్ బతుకుజీవుడా అని పారిపోయేలా చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు లెక్కపెట్టడానికి వీల్లేనని చేశారు. 4. మైనింగ్ మాఫియా: వైసీపీ నాయకుల మైన్స్.లో మాత్రమే ఏమాత్రం ఇబ్బంది లేకుండా తవ్వకాలు జరుగుతాయి. వైసీపీ నాయకుల డిమాండ్స్ తీర్చని, ప్రతిపక్ష నాయకులకు చెందిన మైనింగ్ యజమానులను ముప్పుతిప్పలు పెట్టి వాళ్ళ మైన్స్ మూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక సొంత మైనింగ్ అయితే అనుమతి తీసుకునేది గోరంత... తవ్వుకునేది కొండంత.. అడ్డు చెబితే ఏమవుతుందో తెలుసు కదా.. 5. హత్యా రాజకీయాలు: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ళలో ఎన్నో వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారు.  6. ప్రజల ఆస్తుల కబ్జా: రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల అరాచకాలే. ప్రజల ఆస్తులను కబ్జా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు. 7. ఎర్రచందనం, గంజాయి: మూడు రాజధానుల సంగతేమోగానీ, ఆంధ్రప్రదేశ్‌ని గంజాయి రాజధానిని చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. చాలామంది వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారులుగా మారారు. ఇక ఎర్రచందనం  విషయానికి వస్తే, గతంలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేవారు.. ఇప్పుడు అలాంటి అరెస్టులేవీ లేవు.. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయిందని కాదు.. ఎర్రచందనం స్మగ్లర్లు అస్మదీయులు కాబట్టి.. 8. దాడులు, అక్రమకేసులు: తమ మాట వినకపోతే దాడులు.. తమను వ్యతిరేకిస్తే అక్రమ కేసులు.. అనధికారికంగా, అధికారికంగా ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. చివరికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు.  9. శవ రాజకీయాలు: జగన్ పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పడానికి నోట మాట కూడా రాదు.. హత్యలు చేసి శవాలను డోర్ డెలివరీ చేయడంలో వైసీపీ నాయకులు స్పెషలిస్టులుగా మారారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దాన్ని ప్రతిపక్షం అకౌంట్లో వేసి శవాల మీద మరమరాలు ఏరుకునే పని జగన్ ఆశీస్సులతో వైసీపీ నాయకులు చేశారు.

జగన్ మానసిక స్థితి మీద అనుమానం: షర్మిల

తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె శనివారం నాడు జగన్‌కి ఒక అద్దాన్ని బహుమతిగా పంపారు. ఆ అద్దంతో జగన్‌కి తానే కనిపిస్తాడో, లేక చంద్రబాబు కనిపిస్తాడో చూసుకోవాలని సూచించారు. మీకు ఎందుకు చంద్రబాబు పిచ్చి ఇంతలా పట్టిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తన సోదరుడిని ఉద్దేశించి అన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో మేం న్యాయం కోసం పోరాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈరోజు వరకు చెప్పకుండా చంద్రబాబుతో మేం చేతులు కలిపామని చెబుతున్నారేంటని ఆమె నిలదీశారు. వివేకాని గొడ్డలితో నరికి హత్య చేస్తే సాక్షి ఛానల్లో హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు పేరు జపం ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు వివేకా హత్యమీద సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్ చేసిన మీరు, మీరు సీఎం అయిన తర్వాత సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వద్దన్నారో్ సమాధానం చెప్పాలి అన్నారు. ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ వున్నాడని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు కదా.. దానికి సమాధానం చెప్పండి అని షర్మిల అన్నారు. ‘‘మీకు చంద్రబాబు పిచ్చి పట్టిందేమోనని నాకు అనుమానంగా వుంది. అందుకే ఈ అద్దం మీకు పంపిస్తున్నాను. ఇందులో మీకు మీరే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చూసుకోండి’’ అని షర్మిల అన్నారు. 

మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి!!

ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి. అవును.. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే ఈ రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ముందుగానే రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితంలో ఆ రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటి మే 13 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగే రోజు. మరోరోజు జూన్ 4 ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడయ్యే రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీలో మే 13 అనే గొప్ప తేదీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయిదేళ్ళుగా తమను పట్టి పీడిస్తున్న కరోనా కంటే డేంజరస్ అయిన జగన్ అనే మహమ్మారిని ఓటు అనే వ్యాక్సిన్‌తో వదిలించుకునే అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మే 13 వస్తుందా.. ఎప్పుడెప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి గతంలో తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుందామా అని ఆత్రుతపడుతున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకుని పీడ విరగడ చేసుకునే రోజును నరక చతుర్దశిగా, ఎన్నికల ఫలితాలు విడుదలై, జగన్ ప్రభుత్వ పీడ విడగడయ్యే జూన్ 4వ తేదీని దీపావళిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించడం సమంజసమే కదా!

ప్రపంచ వింత: పూజారుల ఆశీస్సులు తీసుకున్న అసద్!

ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూ పూజారుల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారి చేత మెడలో దండ వేయించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూసారాంబాగ్‌లో శనివారం నాడు అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడే వున్న ఒక హనుమాన్ గుడి దగ్గరకి వెళ్ళిన మజ్లిస్ కార్యకర్తలు తమ నాయకుడిని ఆశీర్వదించాలని అక్కడే వున్న పూజారిని కోరారు. పూజారి అసదుద్దీన్‌ని ఆశీర్వదించి, మెడలో దండ వేసి, శాలువా కప్పారు. సాధారణంగా హిందూ నాయకులు చర్చికి వెళ్తారు, మసీదులకు, దర్గాలకు టోపీ పెట్టుకుంటారు. కానీ ముస్లిం నాయకులు హిందూ సంప్రదాయాలను కొద్దిసేపైనా పాటించింది చాలా తక్కువ. అది కూడా కరడుగట్టిన ముస్లిం నాయకుడు అసదుద్దీన్ హనుమాన్ గుడి పూజారి చేత ఆశీస్సులు తీసుకోవడం నిజంగా వెరైటీనే.  అసదుద్దీన్ ఇటీవల వేరే ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ముగ్గురు పూజారులు కూడా పాల్గొన్నారట. ఈసారి ఎన్నికలలో బీజేపీ తరఫున మాధవీలత హెదరాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. హిందూ ఓట్లు ఆమెకే పడతాయి. ముస్లిం మహిళల ఓట్లను కూడా ఆకర్షించే విధంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏనాడూ ఇప్పుడున్న స్థాయిలో అసదుద్దీన్ ప్రచారం చేసిన దాఖలాలు లేవని, మాధవీలతకు భయపడే ప్రచారం జోరు పెంచారని, హిందూ పూజారుల చేత ఆశీస్సులు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తిప్పల్లో భాగంగా అసదుద్దీన్ తాను ప్రచారం చేస్తున్న సమయంలో తెలుగు పాటలను కూడా వినిపిస్తున్నారు. హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి అసద్ చేస్తున్న మరో ప్రయత్నమిదని పరిశీలకులు అంటున్నారు.

ప్రియాంక గాంధీ పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా?

కాంగ్రెస్​ పార్టీపై, బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ.. వారసత్వ రాజకీయం. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే.. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ.. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు. అందుకే ఆమె ఈ లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయ‌డం లేదు. బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ఆమె విముఖత చూపారట‌. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తో పాటు బీజేపీ నేతలంతా, కాంగ్రెస్‌ ను వారసత్వ పార్టీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఇప్పటికే సోనియా కుటుంబం నుంచి ఆమెతో పాటు ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఎంపీలుగా ఉన్నారు. సోనియాగాంధీ 1998 నుంచి రాహుల్‌ గాంధీ 2004 నుంచి ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలుగా కొనసాగుతుండటంతో,  ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తే బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  అమేథి, రాయబరేలిల్లో ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదనను ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. బీజేపీ వారసత్వ రాజకీయాల విమర్శలకు భయపడే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  గ‌త కొంత కాలంగా రాయ్ బరేలిలో ప్రియాంక పోటీ చేస్తారంటూ తెగ ప్ర‌చారం జ‌రిగింది.  ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోని అమేథి, రాయ్ బరేలి లోక్ సభ స్థానాలు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి.  గత లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓడిపోయినప్పటికీ కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో  వయనాడ్ తో పాటు, రాయ్ బరేలి నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారు.  రాయబరేలిలో 2004 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్‌ గాంధీ  పోటీ చేస్తున్నారు. అయితే అమేథిలో ఓటమి భయం వెంటాడటం వల్లే రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి పారిపోయి రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.   ఈ ఎన్నికల్లో పోటీ చేసి కేవ‌లం ఒక‌ నియోజకవర్గానికే పరిమితం కావడం కంటే దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ  బలోపేతానికి కృషి చేయాలని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు.  మోదీ వేవ్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్​కు స్టార్ క్యాంపెనీయ‌ర్ గా ప్రియాంక గాంధీ ప్ర‌చారం చేస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌