68 రూపాయలకే ఐ-ఫోన్
ఈ ప్రకటన ఆన్లైన్లో కనిపిస్తే ఎగబడంది ఎవరు. కానీ 30,000 విలువ చేసే iPhone 5S ని ఎవరన్నా 68 రూపాయలకి అమ్ముతారా? అంటే అదే జరిగింది మరి! స్నాప్డీల్ సంస్థ చేసిన ఈ పొరపాటు ఓ వినియోగదారుడికి కలిసి వచ్చింది. ఈ నెల 12వ తేదీన స్నాప్డీల్ వెబ్సైట్లో కొత్త ఐఫోన్ విలువని పొరపాటుగా 68 రూపాయలు అంటూ పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడు కనిపిస్తాయా అని కాచుకుని కూర్చున్న నిఖిల్ బన్సల్ అనే విద్యార్థి మరుక్షణంలోనే దానిని ఆర్డరు చేసేసుకున్నాడు. స్నాప్డీల్ తన పొరపాటుకి చింతించి వెంటనే ఆ ధరని మార్చేసింది. కానీ అప్పటికే ఫోన్ కొనేసిన నిఖిల్ ఊరుకుంటాడా! స్నాప్డీల్ తనని మోసం చేసిందంటూ పంజాబులోని ఓ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు నిఖిల్కి అనుకూలంగా తీర్పుని ఇవ్వడమే కాకుండా నష్టపరిహారంగా ఓ రెండు వేలు చెల్లించమని చెప్పింది. అయినా స్నాప్డీల్కి మనసు ఒప్పలేదు. ఇదంతా ఓ సాంకేతిక పొరపాటు అంటూ ఓ వినియోగదారుల పోరంలో కేసుని దాఖలు చేసింది. అక్కడా స్నాప్డీల్కి చుక్క ఎదురైంది. ఈసారి నష్టపరిహారం 10,000కి పెరిగింది. అదీ సంగతి! ఇటూ ఐ-ఫోనూ చవకగా దొరికింది. అటు నష్టపరిహారమూ దక్కింది.