కంగనా రౌనత్ కు హృతిష్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలి

బాలీవుడ్ హీరో హృతిష్ రోషన్ బాలీవుడ్ నటి  కంగనా రౌనత్ కు నోటీసులు పంపించారంట. ఇంతకీ కంగనా రౌనత్ ఏ చేసిందనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. సుజానే తో విడిపోయిన తరువాత హృతిక్ కంగనాను ప్రేమించాడని.. తరువాత విడిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా కొందరు కావాలనే ఇలా పుకార్లు పుట్టిస్తున్నారని.. ఈ వార్తల వల్లే హృతిక్ తనను ఆషికి-3 నుంచి తప్పించాడని వ్యాఖ్యానించింది. అయితే కంగనా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న హృతిక్..తన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నందుకు గాను.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి కంగనా మాత్రం..  తానెన్నడూ హృతిక్ పేరును చెప్పలేదని, ఆయన పరువు ఎక్కడ పోయిందని కంగనా తిరిగి ప్రశ్నిస్తోంది.

జగన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టండి.. దరిద్రం పోతుంది.. అచ్చెన్నాయుడు

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఈరోజు స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చలో భాగంగా అచ్చెన్నాయుడు మళ్లీ జగన్ పై తీవ్ర  స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటంతో సభా వ్యవహారాలన్నీ భ్రష్టుపట్టిపోయానని.. స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి కాకుండా అన్నీ మాట్లాడుతున్నారు.. మాట్లాడేందుకు సరుకు లేకపోతే ఊరుకోవాలని ఆయన అన్నారు. అసలు ప్రభుత్వం.. స్పీకర్ పై కాదు.. ఆపార్టీ సభ్యులు తమ అధినేతపై అవిశ్వాస తీర్మానం పెడితే సగం దరిద్రం వదిలిపోతుందని.. అప్పుడు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. ఇది నా సలహా అని ఎద్దేవ చేశారు.

ఆ హంతకుడి మీద చేయి వేయడానికి వీల్లేదు!

అండమాన్‌లో ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన ఓ ఐదేళ్ల పసికందుని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ విషయాన్ని ధృవీకరించేందుకు సాక్ష్యులు కూడా ఉన్నారు. కానీ హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. ఈ చిత్రమైన పరిస్థితికి కారణం, హంతకుడు జారవా అనే స్థానిక తెగకి సంబంధించినవాడు కావడమే! వేల సంవత్సరాలుగా ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్న ఈ తెగలు ఇప్పుడిప్పుడే మిగతా ప్రజలను చూసీ చూడనట్లు ఊరుకుంటున్నాయి. ఇదివరకైతే తమ ప్రాంతంలో బయటి వ్యక్తులు ఎవరు కనిపించినా వారి మీద దాడి చేసి తీరేవి. ప్రత్యేకమైన ఈ ఆదివాసీల సంస్కృతిని గమనించిన భారత ప్రభుత్వం కూడా వారి జోలికి వెళ్లేది కాదు. వారి ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని, అక్కడి అధికారులకు ఖచ్చితమైన హెచ్చరికలను జారీ చేసింది భారత ప్రభుత్వం. మరి తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ హత్యను చూసీచూడనట్లు ఊరుకుంటుందా! లేకపోతే హంతకులకి తగిన శిక్ష విధిస్తుందా! అన్నది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

అసలు విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదు.. వెంకయ్యనాయుడు

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదాపై మాట్లాడుతూ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీకి తాము చేసిన పనులు గురించి ప్రస్తావించారు. ఏపీలో ఎన్నో కేంద్రం విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశాం.. తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నషనల్ స్థాయికి తీసుకెళ్లామని, అమరావతి సమీపంలోని విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రూ. 65 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులను మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు.. విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేశామని వివరించారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి గుంటూరు, విజయవాడల అభివృద్ధికి రూ. 500 కోట్ల చొప్పున కేటాయించామన్నారు. వైజాగ్, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా నిర్ణయించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి మండళ్లుగా గుర్తించామని వెంకయ్య తెలిపారు. ఏపీ హామీల విషయంలో కేంద్రం చిత్త శుద్దితో ఉంది.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం ఒక్క రాష్ట్రానికి ఇంత సాయం చేయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు.. ఇంత అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుంటే, ఈ వ్యతిరేకత ఏంటని ప్రశ్నించారు. చట్ట రూప కల్పనలో కాంగ్రెస్ అప్పుడు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు వైలెంట్ అవుతుందని ఎద్దేవ చేశారు.

తన పౌరసత్వంపై రాహుల్ గాంధీ.. దీనిని ఎదుర్కొంటా..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే చాలా సార్లు రాహుల్ పౌరసత్వంపై విమర్శలు చేశారు. రాహుల్ లండన్ లో ఒక కంపెనీ పెట్టేందుకు గాను తాను బ్రిటన్ పౌరుడనని చెప్పుకున్నట్టు స్వామీ ఆరోపించారు. అయితే ఇప్పుడు దీనిపై రాహుల్ వివరణ ఇవ్వాలని బీజేపీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ.. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని.. ప్రధాని తన తాబేదార్ల ద్వారా తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని..  దీనిని ఎదుర్కొంటాం అని రాహుల్ గాంధీ అన్నారు.

గుర్రం కాలు విరగ్గొట్టినందుకు... బీజేపీ ఎమ్మెల్యే మీద కేసు!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముసోరి ఎమ్మెల్యే అయిన గణేష్‌ జోషికి ప్రభుత్వం మీద కొపం వచ్చింది. తన కోపాన్ని వెళ్లగక్కేందుకు ఆయన ధర్నాకు దిగారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ధర్నాను అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులని చూసేసరికి జోషిగారి అవేశం హెచ్చింది. అందులోనూ సదరు పోలీసులు, గుర్రాల మీద వచ్చేసరికి ఆయన అహం దెబ్బతిన్నట్లుంది. వెంటనే ఒక లాఠీని తీసుకుని ఓ గుర్రం మీద తన ప్రతాపమంతా చూపారు. పాపం! గుర్రం కాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. వెంటనే దాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లినా, విరిగిన కాలు బాగుపడేందుకు చాలా రోజులే పడేటట్లు కనిపిస్తోంది. అమాయకమైన జీవిని అకారణంగా చావబాదినందుకు జోషి మీద పలు కేసులను నమోదు చేశారు పోలీసులు. జోషిగారు మాత్రం తనకే పాపం తెలియదంటున్నారు. తన పార్టీ కార్యకర్తల మీదకు వచ్చినందుకు గాను, ఆ గుర్రాన్ని ఊరికే అదిలించాననీ, వేరే ఎక్కడో దాని కాలు ఇరుక్కుపోయి దెబ్బతిని ఉంటుందని అమాయకత్వాన్ని ఒలకబోస్తున్నారు. కానీ గుర్రం మీద జోషిగారు చూపిన ప్రతాపం అంతా వీడియోల రూపంలో ఉండటంతో, పోలీసులు మాత్రం ఆయనను న్యాయస్థానం ముందర నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

కన్నయ్య సహా నలుగురు విద్యార్ధులను బహిష్కరించండి..!

జెఎన్ యూ లో జరిగిన ఘటనలపై విచారణ జరపేందుకు గత నెలలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఒకటి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు నెల రోజుల పాటు ఘటనలపై పరిశీలించిన ఈ కమిటీ.. విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలతో పాటు మరో ఇద్దరు విద్యార్ధులను యూనివర్శిటీ నుండి బహిష్కరించాలని సూచించింది. దీనిపై వైస్ చాన్స్ లర్ ఎం జగదీశ్ కుమార్, చీఫ్ ప్రాక్టర్ ఏ దిమ్రీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అయితే కమిటీ సిఫార్స్ ను కనుక వీరు ఆమోదించినట్టుయితే వారిని బహిష్కరించక తప్పదు. ఒకవేళ అదే కనుకు జరిగితే యూనివర్శిటీలో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం.. వర్శిటీ క్రమశిక్షణా నిబంధనలను వీరు ఉల్లంఘించారని.. భవిష్యత్తులో ఇలాంటి తరహా గొడవలు జరగకుండా ఉండాలంటే బహిష్కరించాలని అభిప్రాయపడుతున్నారు. మరి కమిటీ నివేదిక ఇప్పటికే వైస్ చాన్స్ లర్ కార్యాలయానికి చేరగా, దీనిపై ముఖ్య అధికారులు చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

ఏపీ ప్రత్యేక హోదా చర్చపై రాజ్యసభలో రచ్చ..

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఆజాద్ ఎపీ ప్రత్యేక హోదాపై నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఏపీని విభజించారు.. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు వచ్చింది.. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు.. వెనుక బడిన ప్రాంతాలకు  ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.. ఇప్పుడు ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు..కనీసం ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు అని అన్నారు.   మేం ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటే వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలన్నారు.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని దిగ్విజయ్ సింగ్ అన్నారు.   ఏపీకి రెవెన్యూలోటు తీరుస్తామని హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఆనాడు ఎన్టీఏ, యూపీఏ రెండూ అంగీకరించాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరుతున్నామని కేవీపీ కోరారు.

ఉస్మానియా మెడికో విద్యార్ధులు మృతి.. కేసీఆర్ దిగ్భ్రాంతి

విజయవాడ, గొల్లపూడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మెడికల్ విద్యార్థులు మృతి చెందగా మరో 31 మందికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన రెండు విద్యార్థి బృందాలు ధనుంజయ్ అనే ప్రైవేటు ఏజెన్సీ బస్సుల్లో అమలాపురంలోని కిమ్స్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్‌కు వెళ్లాయి. ఈ కార్యక్రమం ఆదివారమే ముగియడంతో రెండు బృందాల్లో ఒక బృందం ఆరోజే ఇంటికి చేరుకున్నారు. ఇంకో బృందం మాత్రం.. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ను చూసేందుకు వెళ్లింది. అయితే వారు తిరిగి వచ్చే సరికి తమ పర్సులు ఇంక తమ వస్తువులు డ్రైవర్ శంకర్, క్లీనర్ దొంగలించారని గుర్తించి వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో గొడవ జరుగుతుండగానే డ్రైవర్ బస్సును నడిపాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును చెట్టుకు ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా..31 మంది తీవ్రంగా గాయపడ్డారు.   ఇదిలా ఉండగా మెడికోల మృతికి  సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

పీకపై కత్తి పెట్టినా ఆ మాట అనను... అయితే పాకిస్థాన్ వెళ్లిపో..శివసేన

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్స్) చీఫ్ మోహన్ భగవత్ జెఎన్ యూ వివాదం నేపథ్యంలో భావి తరాలకు ‘భారత్ మాతా కీ జై’ అన్న నినాదాన్ని నేర్పాల్సి ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘పీకపై కత్తి పెట్టినా... భారత్ మాతా కీ జై అనమంటే అనను’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు అసదుద్దీన్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది. దీనిపై శివసేన పార్టీ ఘాటుగా స్పందిస్తూ..  ‘భారత్ మాతా కీ జై’ అని ఉచ్చరించకపోతే... తక్షణమే ఓవైసీ పాకిస్థాన్ వెళ్లిపోవాలని మండిపడింది. మరి శివసేన వ్యాఖ్యలకి అసదుద్దీన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

జగన్ అవిశ్వాస తీర్మానం.. మూజువాణి ఓటుతో ఓటమి..

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్నిఓడించింది ప్రభుత్వం. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించి, బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. దీంతో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేపట్టడంతో సభను వాయిదా వేశారు. అయితే  న్యాయమూర్తులను కించపరిచే విధంగా జగన్ వ్యాఖ్యలు చేశారని, తాను క్షమాపణ చెప్పాలా..వద్దా అనేది తనకే వదిలేస్తున్నామని అధికార పక్ష నేతలు స్పీకర్ కు తెలిపారు.

జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఏం తమాషాగా ఉందా.. తోలు తీస్తా..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఫుల్ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో రూ.7వేల కోట్ల అవినీతి జరిగిందని, ఎన్టీపీసీ, కృష్ణపట్నంలో అవినీతి జరిగింది జగన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు జగన్ నిప్పులు చెరిగారు. మొన్న కూడా జగన్ భూదందాపై ఆరోపణలు చేశారు.. వాటిని నిరూపించాలని సవాల్ చేశాం..ఇప్పుడు మళ్లీ పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణల చేసిన నేపథ్యంలో.. జగన్ ఆరోపణలు నిరూపించాల్సిందేనని.. అప్పుడే సభ జరుగుతుందని అన్నారు. ఇది సభ అనుకున్నారా.. ఇంకేమన్నా అనుకున్నారా.. ఇది పవిత్రమైన దేవాలయం..ఏం తమాషాగా ఉందా హౌస్ అంటే అని విరుచుకుపడ్డారు. దమ్ముంటే పోలవరం, విటిపిఎస్, కృష్ణపట్నంలో అవినీతి జరిగిందని నిరూపించగలరా.. లేకపోతే జగన్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీయిజం చేస్తే తోలు తీస్తామని, వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు క్షమాపణ మాత్రం చెప్పి ఊరుకుంటే ఊరుకునేది లేదన్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాగే తప్పుడు ఆరోపణలు చేసి, క్షమాపణ కోరితే ఎలా అన్నారు.

జగన్ రూట్ లోనే తెలంగాణ కాంగ్రెస్..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 8మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు జరిగేలా చూడడానికి తాము చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినట్లు జగనే స్వయంగా చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ పంథాలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ అధికార పార్టీలోకి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుండి.. టీడీపీ నుండి పలువురు వలసలు వెళ్లిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినా.. స్పీకర్ సరిగ్గా స్పందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.   దీనిలో భాగంగానే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ ఏకపక్షంగా సాగుతోందని నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ఆలోచన చేస్తోంది.

గంటాకు చంద్రబాబు క్లాస్.. 'యూజ్ లెస్ ఫెలో' అంటుంటే ఏం మాట్లాడరా..?

మన ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో అప్పుడప్పుడు తిట్లు తినిపించుకోవడం అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షాలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడం.. దానికి మీరు ఏం చేస్తున్నారు.. మాట్లాడరా అని చంద్రబాబు వారికి క్లాస్ పీకడం.. క్లాస్ పీకించుకున్న తరువాత వారు అప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అప్పుడు ప్రతిపక్షమంపై విరుచుకుపడటం పరిపాటైపోయింది.. తాజాగా ఇప్పుడు గంటా మరోసారి చంద్రబాబుతో క్లాస్ పీకించుకున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లలో భాగంగా చంద్రబాబుపై.. ప్రభుత్వ వైఖరిపై మాటల తూటాలు పేల్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గంటా నోరు మొదపలేదు. దీంతో అప్పుడే చంద్రబాబు గంటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తరువాత ఎలాగొలా ముద్రగడ నోరు కట్టడి చేశారు.   అయితే ఇంతలో  కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. చంద్రబాబును ఏకంగా 'యూజ్ లెస్ ఫెలో' అంటూ తీవ్రమైన పదజాలం వాడారు. దీనికి చంద్రబాబు ఆగ్రహించి.. ''రామ చంద్రయ్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మీరు కడప జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇలాగైతే ఎలా? ఇది పద్ధతిగా లేదు'' అని గంటాకు క్లాస్ తీసుకున్నారట. మరి ఇప్పుడైనా  గంటా స్పందిస్తారో లేదో చూడాలి.

నన్ను విలన్‌ను చేయొద్దు.. మీ శ్రమను వృథా చేసుకోకండి.. మాల్యా..

ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈనెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది..  మరోవైపు చెక్‌ బౌన్సు కేసులో భాగంగా నాంపల్లి కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులపై విజయ్ మాల్యా స్పందిస్తూ.. ‘ద సండే గార్డియన్‌’ వార్త పత్రిక అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. ఏదో స్నేహితులను కలవడానికి వస్తే పారిపోయాడు అన్న ముద్ర వేశారు.. అని అన్నాడు. అంతేకాదు ఆ పత్రిక వాళ్లు మీరు భారత్‌కు ఎప్పుడు తిరిగి వెళ్లనున్నారని ప్రశ్నించగా, ఆయన ఆ ప్రశ్నకు.. ప్రస్తుతం నా వాదనను వినే పరిస్థితులు అక్కడ లేవు.. ఇప్పటికే నామీద క్రిమినల్‌ అనే ముద్ర వేశారు.. గతేడాది నాకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. కాని నేను పారిపోలేదు. మరి ఇప్పుడెందుకు నన్ను క్రిమినల్‌గా చిత్రికరిస్తున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు ‘నన్ను విలన్‌ను చేయొద్దు. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి అని అన్నారు.   అంతేకాదు.. బ్రిటన్‌లో మీడియా నా కోసం వెతుకులాడుతోంది. విచారకరమైన విషయమేమిటంటే.. ఇప్పటికీ వారు సరైన ప్రాంతాన్ని కనుగొనలేదు. అయినా నేను మీడియాతో మాట్లాడను. అందువల్ల మీ శ్రమను వృథా చేసుకోకండి’ అని ట్విటర్‌లో తెలిపారు.