తెలంగాణ ఎంపీటీసీల్లో కాంగ్రెస్ ఆధిక్యం
తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ తుది దశకు చేరుకొంది. కౌంటింగ్ ప్రారంభమైన తొలిరౌండ్ నుంచి అధిక్యం ప్రదర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత పరిస్థితిలో మార్పు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఆధిక్యంలోకి దూసుకు వచ్చింది. తెలంగాణ జిల్లాల వారీగా బుధవారం ఉదయం పదకొండు గంటలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.
1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (163), తెలుగుదేశం (64), తెరాస (292), ఇతరులు (117)
2. కరీంనగర్: కాంగ్రెస్ (280), తెలుగుదేశం (33), తెరాస (349), ఇతరులు (155)
3. వరంగల్: కాంగ్రెస్ (264), తెలుగుదేశం (115), తెరాస (234), ఇతరులు (60)
4. ఖమ్మం: కాంగ్రెస్ (99), తెలుగుదేశం (243), తెరాస (0), ఇతరులు (283)
5. నల్గొండ: కాంగ్రెస్ (395), తెలుగుదేశం (151), తెరాస (114), ఇతరులు (175)
6. నిజామాబాద్: కాంగ్రెస్ (228), తెలుగుదేశం (31), తెరాస (239), ఇతరులు (85)
7. మెదక్: కాంగ్రెస్ (296), తెలుగుదేశం (102), తెరాస (216), ఇతరులు (59)
8. రంగారెడ్డి: కాంగ్రెస్ (221), తెలుగుదేశం (127), తెరాస (143), ఇతరులు (122)
9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (365), తెలుగుదేశం (174), తెరాస (297), ఇతరులు (133)
మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 2311, తెలుగుదేశం: 1040, తెరాస: 1884, ఇతరులు:1189.