జగన్ అకౌంట్లో ఇంకో దిక్కుమాలిన ఇంటర్వ్యూ

ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం.. వివిధ మీడియా సంస్థలకు జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూలు. మొన్నామధ్య ఒక నేషనల్ మీడియా సంస్థకు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పరమ చెత్త ఇంటర్వ్యూగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు వెకిలి నవ్వులతో సమాధానాలు దాటవేయడం, పరమ చెత్త ఇంగ్లీషు మాట్లాడ్డం, అర్థంపర్థం లేని ఎక్స్.ప్రెషన్లు ఇవ్వడం, ఆడపిల్లలా సిగ్గుపడిపోవడం, జాతీయ రాజకీయాల గురించి తనకు అంతగా ఐడియా లేదని అనడం... ఇవన్నీ చూసి దేశవ్యాప్తంగా జనం ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రా జనం ఇన్నేళ్ళు ఎలా భరించార్రా బాబూ అనుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే పరిస్థితి. ఏ ప్రశ్న అడిగినా నాలుక చివర రెడీగా వున్న అబద్ధాలను చెప్పుకుంటూ వెళ్ళారు. జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూల పరిస్థితి ఎలా వుందంటే, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేలా పరిస్థితి తగలడింది. ఇలాంటి పరిస్థితిలో జగన్ మళ్ళీ ఒక తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పోనీ, తెలుగు మీడియా సంస్థ కదా, తెలుగులోనే మాట్టాడతాడు కదా ఇంటర్వ్యూలో కొంచెం క్లారిటీ వుంటుందేమో అనుకుంటే, అన్ని ఇంటర్వ్యూల కంటే నీచ నికృష్టంగా ఏడిచింది ఈ ఇంటర్వ్యూ.. ఇంగ్లీషు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో నసుగుతూ సమాధానాలు ఇచ్చిన జగన్ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అత్యంత మూర్ఖంగా సమాధానాలు ఇచ్చారు. జగన్ మూర్ఖుడని తెలుసుగానీ, మరీ ఇంత మూర్ఖ శిఖామణి అని తెలియదే అనేలా ఈ ఇంటర్వ్యూ సాగింది. అప్పులు తెచ్చి అందరికీ పంచడమే తప్ప అభివృద్ధి ఎక్కడ వుంది మహానుభావా అంటే, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాము కదా అని సమాధానం చెప్పారు. ఫిషింగ్ హార్బర్లు కడితే అభివృద్ధి ఎందుకు అవుతుంది అని అడిగితే, ఫిషింగ్ హార్బర్ వల్లే కోల్‌కతా కోల్‌కతా అయిందట, ఫిషింగ్ హార్బర్ వల్లే ముంబై ముంబై అయిందట. అందుకే వైజాగ్‌ని వైజాగ్ చేయడం కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారట. ఈయన రాకముందు వైజాగ్‌లో ఎవరూ ఫిషింగ్ చేయకుండా చెక్కభజన చేస్తూ వుండేవారు.. ఈయన వచ్చాక అక్కడ జనానికి చేపలు పట్టడం నేర్పారు..  పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేం ప్రాబ్లం.. అది ఆయన వ్యక్తిగత విషయం, చట్టబద్ధమైన విషయం ఆ విషయం మీరు మాటమాటకీ ఎందుకు ప్రస్తావిస్తారు. ఆ పాయింట్ మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే, జగన్ మరీ మూర్ఖంగా ఆ పాయింట్ మీదే పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయొద్దని అంటాను అని మొండిగా వాదించారు. ఈ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన అనేక వితండవాద సమాధానాలు ఆక్ ఈజ్ పాక్ పాక్ ఈజ్ ఆక్.. ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా ఏడిచాయి.  బాబాయ్ హత్య గురించి ప్రశ్నిస్తే అది దిక్కుమాలిన ఎక్స్.ప్రెషన్తో సంబంధం లేని సమాధానాలు. ఈ ఐదేళ్ళలో హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు మగడా అంటే, బాబాయ్‌కి రెండో పెళ్ళి అయింది.. కొడుకు కూడా వున్నాడు.. ఇదీ జగన్ సమాధానం. బాబాయ్ హత్య గురించి టీవీలో అవినాష్ రెడ్డి మాట్లాడింది విని ఈయనకి అవినాషే మంచోడు అనిపించిందట. అందుకే అవినాష్‌కి మద్దతుగా నిలిచాడట. ఇలాంటి  ఆణిముత్యాలు జగన్ ఇంటర్వ్యూలో చాలా వున్నాయి. మొత్తమ్మీద జగన్ అకౌంట్లో మరో దిక్కుమాలిన ఇంటర్వ్యూ చేరింది.

జనం సొమ్ముతో జల్సాలు.. జగన్ ప్యాలెస్ లో బంగారంతో చేసిన కుర్చీలు!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క‌సారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయ‌న‌కు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా..  తెలుగు మీడియాతో మాట్లాడ‌ట‌మా అన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా నిత్యం కాక‌పోయినా  తరచుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసి ప్ర‌భుత్వ విధానాలు, అభివృద్ధి,  సంక్షేమ ప‌థ‌కాల‌పై వివ‌రిస్తుంటారు. కానీ  జ‌గ‌న్ మాత్రం త‌న ఐదేళ్ల పాల‌న‌లో ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే చిన్న‌చూపు   అన్నది పక్కన పెడితే.. మీడియా వాళ్లు ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారోన‌న్న భ‌యం ఆయనను  తెలుగు మీడియా దూరంగా ఉంచడానికి కారణమని వైసీపీ నేతలే చెబుతుంటారు.  తాజాగా ఎన్నిక‌ల వేళ తప్పనిసరి పరిస్థితులలో  జ‌గ‌న్ ఓ తెలుగు ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. జగన్ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జ‌గ‌న్ కు ఇబ్బంది క‌లిగించే ప్ర‌శ్న‌ ఒక్కటి కూడా వేయకుండా  చాలా జాగ్రత్త పడ్డాడు.  జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌గ‌లిగే ప్ర‌శ్న‌ల‌తోనే ఆ ఇంట‌ర్వ్యూ సాగింది. ఇంట‌ర్వ్యూ జ‌రిగిన విధానం అలా  ఉంచితే.. ఇ ఇంట‌ర్వ్యూ సందర్భంగా జ‌గ‌న్ , స‌ద‌రు టీవీ ఛానెల్ ప్ర‌తినిధి కూర్చున్న కుర్చీలు ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.   తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్యాలెస్‌లోనే ఇంట‌ర్వ్యూ జరిగిందని అంటున్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, టీవీ ఛానెల్ ప్ర‌తినిధి కూర్చున్న కుర్చీల‌ను చూసి తెలుగు ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. జ‌గ‌న్ ధ‌న‌వంతుడ‌ని అంద‌రికీ తెలుసు.. దేశంలోని రాష్ట్రాల సీఎంల‌లో అత్యంత ధ‌న‌వంతుడు జ‌గ‌న్ అని జాతీయ మీడియాలోనూ గతంలోనే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, జ‌గ‌న్ వ‌ద్ద సొమ్మంతా అవినీతి, అక్ర‌మాల‌తో, దొడ్డిదారిన సంపాదించిందేన‌న్న విమర్శలూ ఉన్నాయి. అక్రమాస్తుల కేసులోనే  జ‌గ‌న్ జైలుకు సైతం వెళ్లొచ్చారు. ల‌క్ష‌ల కోట్లు సంపాద‌న క‌లిగిన వారి ఇళ్ల‌లోనైనా బంగారం పూత‌తోచేసిన కుర్చీలు చాలా అరుదు. రాజుల కాలంలో బంగారం పూత‌తో కూడిన‌ కుర్చీలు ఉండేవ‌ని పుస్త‌కాల్లో చ‌దువుకోవ‌ట‌మే త‌ప్ప వాటిని చూసిన దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కుర్చీలకు, బంగారపు తొడుగు వేసిన సింహాలు క‌నిపించాయి. వీటిని చూసిన తెలుగు ప్ర‌జ‌లు షాక్ అవుతున్నారు. ఒక్కో కుర్చీకి రెండు బంగార‌పు సింహాలు ఉన్నాయి. దాదాపు ఒక్కో సింహం కేజీ బంగారంతో చేసిన‌ట్లు తెలుస్తోంది. జగన్ అవినీతి సొమ్ముతో తన ఇంట్లో బంగారపు కుర్చీలు చేయించుకున్నారని  ఆయ‌న చెల్లెలు వైఎస్‌ షర్మిల ఇటీవ‌లి కాలంలో  చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆమె మాటలను జనం న‌మ్మ‌లేదు. ప్ర‌స్తుతం బంగారం కుర్చీల‌కు సంబంధించిన ఫోటోలు బయట పడటంతో అందరూ షాక్ అవుతున్నారు.   ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు అక్ర‌మంగా సంపాదించార‌న్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఇసుక‌, మ‌ట్టి మాఫియాతోపాటు, గంజాయి అక్ర‌మ ర‌వాణా, మ‌ద్యం మాఫియాతో జ‌గ‌న్, ఆయ‌న అనుచ‌రులు ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల సొమ్మును జేబులో వేసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  తాజాగా లాండ్ టైట్లింగ్  యాక్ట్ తో ప్ర‌జ‌ల సొమ్మును త‌న సొమ్ముగా మార్చుకునేందుకు జ‌గ‌న్ కుట్ర చేశారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక ప్ర‌జా సొమ్ముతో ప్ర‌ముఖ న‌గ‌రాల్లో విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు, ఆ భ‌వ‌నాల్లో బంగార‌పు కుర్చీలు చేయించుకుంటున్న జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేను, నా అభ్య‌ర్థులు పేద‌వాళ్లం, డ‌బ్బు లేదు.. అప్పుల్లో ఉన్నారంటూ బ‌హిరంగంగా ఎలా చెప్పగలుగుతున్నారని జనం విస్తుపోతున్నారు.   మ‌రోవైపు దేశంలోనే ధ‌నిక ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రైన  జ‌గ‌న్.. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో మాత్రం.. ఈ ఎన్నిక‌లు పేద‌ల‌కు, ధ‌నికుల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.   ప్ర‌జ‌లంతా పిచ్చోళ్లు.. తాను ఏది చెప్పినా వింటారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో  డ‌బ్బులు పంచేస్తే ఓట్లు వేస్తార‌ని జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ఫిక్స్ అయిన‌ట్లు క‌నిపిస్తున్నది.  ప్ర‌జ‌ల ప‌ట్ల‌ జ‌గ‌న్‌, వైసీపీ అభ్య‌ర్థుల దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలివేయాలంటే మే13న జ‌రిగే పోలింగ్ లో ఓటును ఆయుధంగా మార్చాల్సిందే. ఇప్ప‌టికే   ఏపీలోని మెజార్టీ ప్ర‌జ‌లు.. ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం తెలుగుదేశం కూటమికి పోటెత్తుతున్న జనాలను, డజనుకు పైగా సర్వేల ఫలితాలను చూస్తే అర్ధమైపోతుంది. 

కొట్టు సత్యనారాయణని తరిమికొట్టిన ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎవరో తెలుసా? చెప్పలేరు.. ఎందుకంటే జగన్ మంత్రివర్గంలో ఉనికి, గుర్తింపు లేని అనేకమంది మంత్రులలో ఆయన కూడా ఒకరు. కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదన విషయంలో అగ్రనేతకే పాఠాలు చెప్పగల స్థాయికి చేరుకున్న కొట్టు సత్యనారాయణ ఈసారి ఎన్నికలలో కన్ఫమ్‌గా ఓడిపోయే ఎమ్మెల్యేలలో ఒకరు. గురువారం నాడు తాడేపల్లిగూడెంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో కొట్టు సత్యనారాయణ అక్కడకి వచ్చారు. పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్యోగులు ఆయన్ని ఆపారు. ఒక అభ్యర్థి అయిన మీరు ఇక్కడకి రావడం కరెక్ట్ కాదన్నారు. దాంతో కొట్టు సత్యనారాయణ అహం దెబ్బతింది ‘అందర్నీ లోపల వేయించేస్తాను’ అని నోరు జారారు. దాంతో ఉద్యోగులు ఒక్కసారిగా కొట్టు సత్యనారాయణ మీద విరుచుకుపడ్డారు. దాంతో కొట్టు సత్యనారాయణ అక్కడ నుంచి బయటకి వచ్చేశారు. బయటకి వచ్చిన కొట్టుకు ఏం మాట్లాడాలో అర్థం కాక, అక్కడే వున్న హిందీ పోలీసులతో ‘మై హిందీ బాత్ కర్తాహూ’ అని వచ్చీ రాని పిచ్చి హిందీ మాట్లాడారు. అక్కడ నుంచి వెళ్ళిపోకుండా అక్కడే వున్న కొట్టు మీద ఉద్యోగులు విరుచుకుపడ్డారు. ‘లోపల వేయిస్తావా.. మీ పని అయిపోయింది.. పో ఇక్కడ నుంచి అని కసిరారు’ దాంతో చెమటలు పట్టిన కొట్టు సత్యనారాయణ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మొత్తమ్మీద కొట్టు సత్యనారాయణ అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే, ఆగ్రహంగా వున్న ఉద్యోగుల చేత కొట్టించుకోకుండా బయటపడ్డారు.

ఓట‌రా మేలుకో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కాపాడుకో!

అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయుధం ఓటు.. ప్ర‌జా పాల‌న సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్ర‌భుత్వాల‌ను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌న్నా ఆయుధం ఓటే.. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మ‌న చేతుల్లోనే ఉంది. మన‌ది ఒక్క ఓటే క‌దా వెయ్య‌క‌పోతే ఏమ‌వుతుందిలే అనుకుంటే అది పొర‌పాటే. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఓట‌ర్లు చేసిన ఆ పొర‌పాటే ఇప్పుడు వారి జీవితాల‌కు శాపంగా మారింది. రాజ‌ధాని లేని రాష్ట్రంగా చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకోవ‌డంతోపాటు.. గంజాయికి నిల‌యంగా మారింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఏపీ మారింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీల‌ను త‌రిమేసిన రాష్ట్రంగా.. మొత్తంగా మ‌రో శ్రీ‌ల‌కం దేశంగా మారేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కార‌ణం ఏపీ ఓట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే. ఏపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయ‌లేదు, ఉద్యోగాలు క‌ల్పించ‌లేదు, క‌నీస సౌక‌ర్యాలు లేవు.. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్దెత్తున జ‌రిగాయి. గొంతెత్తి అడిగిన వారు  జైళ్ల‌కు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్‌ న‌మోదైంది. దాదాపు 20శాతం మంది ఓట‌ర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10శాతం మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ముందుకు వ‌చ్చినా ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాక‌పోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలకే ప‌రిమితం కావ‌డంతో   రాష్ట్రంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి జీవ‌నోపాధి కోసం   చిన్న‌ాచితికా ప‌నులు కూడా దొర‌క‌క పోవ‌డంతో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు రాష్ట్రాల‌కు పెద్ద సంఖ్య‌లో   వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల్లో జీవ‌నం సాగిస్తున్న ఏపీ ఓట‌ర్లు.. సొంత రాష్ట్రం వెళ్లి ఓటువేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. ఫ‌లితంగా ఓటింగ్ శాతం త‌గ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెయ్యి నుంచి 10వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్ధులు ఓడిపోయిన ప‌రిస్థితి. ఇత‌ర ప్రాంతాల‌కు ఉపాధికోసం వెళ్లిన‌ ఏపీ ఓట‌ర్లు ఆశించిన స్థాయిలో త‌మ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ‌త ఐదేళ్ల‌లో పీక‌ల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.   గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 151 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌గానికి పైగా స్వ‌ల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లే. 20శాతం మంది ఓట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వైసీపీ అధికారంలోకి రావ‌డం.. ఏపీ ప్ర‌జ‌లు ఉపాధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే పేద‌ల‌కు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిలో వేగంగా జ‌రుగుతున్న ప‌నుల‌ను నిలిపివేశారు.   ఏపీ సీఎంగా చంద్ర‌బాబు కొన‌సాగిన‌ స‌మ‌యంలో అమ‌రావ‌తి, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో కుల‌వృత్తుల వారికి పుష్క‌లంగా ప‌నులు దొర‌క‌డంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్ప‌డింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌క్ర‌బుద్ధితో వారి జీవ‌నోపాధిపై దెబ్బ‌కొట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుక‌బ‌డి పోయింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు పెద్దెత్తున పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ సీఎం హోదాలో వాట‌న్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. అలాఅని కొత్త కంపెనీల‌నుకూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువ‌త ఉద్యోగాలు చేసుకునేందుకు అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశారు. మ‌ట్టి, ఇసుక దోపిడీతో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు జేబులు నింపుకున్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయించి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. వైసీపీ నేత‌ల ఆగ‌డాలు త‌ట్టుకోలేక పోయిన చాలా మంది ఏపీని వ‌దిలి జీవ‌నోపాధికోసం ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనంత‌టికీ కార‌ణం.. ఇత‌ర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ స‌మ‌యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోక పోవ‌టం వ‌ల్ల‌నేని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా క‌లిసి పోటీచేసి అధికారంలోకి వ‌చ్చాయి. 2014 నుంచి ఐదేళ్లు ఏపీలో ఎటుచూసినా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుద‌ల‌తో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా చేయ‌డం, పాత రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు, కొత్త రోడ్లు వేయ‌డం, యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. చంద్ర‌బాబు హ‌యాలో ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వ‌న‌రులుఉన్న‌ తెలంగాణ రాష్ట్రంతో పోటీప‌డింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అబివృద్ధి అనే ప‌దాన్ని మ‌ర్చిపోయి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగించి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైకో పాల‌న‌తో ఐదేళ్లు న‌ర‌క‌యాత‌నకుగురైన ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం ఆ బారినుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వ‌చ్చింది. ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్పి మ‌ళ్లీ ప్ర‌జాపాల‌నను తెచ్చుకొనే అవ‌కాశం ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోఉన్న ఓట‌ర్లు, ఇత‌ర రాష్ట్రాల్లోఉన్న ఏపీ ఓట‌ర్లు  పోలింగ్ రోజు ఏపీలోని వారి స్వంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని. ఐదేళ్ల జగన్ దుర్మార్గ‌  పాల‌నకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.   జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు   ఆయుధంతో బుద్ధి చెప్పాలి.   నిర్ల‌క్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా.. మ‌ళ్లీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.

ఫ్లాష్ న్యూస్... డిప్రెషన్లో జగన్.. సైకో థెరఫీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో ఎన్టీయే కూటమి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజుల్లో ప్రచార గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీలన్నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారంలో దుమ్ము దులిపేస్తూ, జగనన్న మీద దుమ్మెత్తి పోస్తున్నారు.  ప్రతిపక్షాలు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేస్తుంటే, అధికార పార్టీ నాయకుడు, అంగబలం, అర్థబలం వున్న నాయకుడు జగన్ మాత్రం తాడేపల్లి కోటను దాటికి బయటకి రావడం లేదు. చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే, ఓటమి చెందబోతున్నానని అర్థం చేసుకున్న జగన్ ఇక ప్రచారం చేయడం ఎందుకులే అని చేతులెత్తేశాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని... అయితే తాడేపల్లి కోటకు సంబంధించిన వర్గాలు చెబుతున్నది వేరేలాగా వుంది. జగన్ ఇప్పుడు పూర్తిస్థాయి డిప్రెషన్లో కూరుకుపోయి వున్నారట. ఓటమి తప్పదని తెలిసిన తర్వాత ఆ డిప్రెషన్ మరింతగా పెరిగిపోయిందట. మొన్న మచిలీపట్నం సభలో గొంతు వణికేలా ప్రసంగించిన జగన్, కేవలం ఫిజికల్‌గా ఏడవలేదంతే, దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఆ మీటింగ్ తర్వాత జగన్ మానసిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందట. తాను ఇన్ని బటన్లు నొక్కినా, జనం ఎన్నికలలో తన ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకున్న ఆయన భారీ స్థాయిలో హర్టయ్యారట. ఐదేళ్ళ నుంచి తాను వేసిన ప్లాన్ ఇలా అట్లర్ ఫ్లాప్ కావడం, ఓటమి తర్వాత తాను జైలుకు వెళ్ళడం తప్ప మరొక మార్గం లేకపోవడంతో జగన్ భారీ స్థాయిలో డిప్రెషన్లో కూరుకుపోయాడని తెలుస్తోంది. గత ఎన్నికలలో ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల, ఇంకోవైపు విజయమ్మ, మరోవైపు అంతర్లీనంగా బ్రదర్ అనిల్ కుమార్... ఇలా చాలామంది జగన్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు తాను పూర్తిగా ఒంటరి అయిపోవడం, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారడం, జనం మూడ్ పూర్తిగా అవతగం కావడంతో జగన్ డిప్రెషన్ లోయలోకి పడిపోయారని తెలుస్తోంది. ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకి తీసుకురావడానికి ప్రస్తుతం ఆయనకు సైకాలజిస్టుల చేత సైకో థెరఫీ జరుగుతోందని చెబుతున్నారు. డిప్రెషన్ తగ్గడానికి పవర్ ఫుల్ మందులు కూడా వాడుతున్నారని సమాచారం. ఆ ‘సైకో’ థెరపీ, డిప్రెషన్ మందుల సహకారంతో ప్రస్తుతం జగన్ బండి నడుస్తున్నట్టు తెలుస్తోంది.

జనం డిసైడైపోయారు.. తేడా తెలిసిపోయింది!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్  ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.  ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్లూ రాష్ట్రంలో పాలన సాగించింది. ఇక ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మూడో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో తేల్చనున్నారు. ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో అంటే మే 13న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి తమ తమ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు.  వైసీపీ,  తెలుగుదేశం కూటమిలలో  ఈసారి విజయం ఎవరిదన్న విషయాన్ని ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చి చెప్పేశాయి.  వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని పరిశీలకులు సైతం సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీపై   ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? ఐదేళ్ల పాలనలో జగన్ పట్ల అంతటి విముఖత ఎందుకు కలిగింది? అన్న ప్రశ్నకు సమాధానంగా ఐదేళ్ల చంద్రబాబు పాలన, ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూస్తే చాలు.   ఇంకొంచం వివరంగా చెప్పాలంటే.. రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల పాలన ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు, జగన్ ల పనితీరును కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికి ఇవ్వాలి..  మరోసారి సీఎంగా ఎవరిని చూడాలనేది ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చేసింది. సర్వేలు చూసినా, విశ్లేషకుల అభిప్రాయాలను గమనించినా.. ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతుంది. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన జనం  ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో  మే 13న తమ ఓటు ద్వారా చెప్పేస్తారు.   అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొని మరీ జనం తమ తీర్పు చెప్పడానికి రెడీ అయిపోయారు. అయితే, చంద్రబాబు, జగన్ పాలనలను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే అనిపిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తె జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్ధిక  అరాచకత్వాన్ని ప్రదర్శించి.. పన్నుల రూపంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపారు. చంద్రబాబు ఇతర దేశాలలో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే.. జగన్ హయంలో ఏపీలో ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు-ఘోరాలలో జగన్ సర్కార్ దేశంలోనే ముందు వరుసకు చేరింది.  ఏకంగా దళితుడిని చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంటపెట్టుకొని తిరగడంతో  జగన్ నేరాలకు కొమ్ముకాస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడింది.  విద్యా, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించేదేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు మేలు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనం కూడా చంద్రబాబు, జగన్ పాలనల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించారు. అందుకే  చంద్రబాబు పాలనకే మొగ్గు చూపుతున్నారు.  అందుకు ఇప్పటికే వెలువడినడజనుకు పైగా సర్వేలు చంద్రబాబే సీఎం అని తేల్చేశాయి. వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశాయి. అలాగే  ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపిస్తున్న ప్రజాదరణ, ప్రజా స్పందనలను చూసినా ఆ విషయం అర్ధమైపోతుంది.   తెలుగుదేశం కూటమి సభలకు జనం పోటెత్తుతుంటే.. వైసీపీ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. చివరాఖరికి పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రచారానికి కూడా జనం ముఖం చాటేస్తున్నాయి. డబ్బులు ఇచ్చి, మందు పోసి సమీకరించిన వారు కూడా ఇలా కనిపించి అలా మాయమైపోతున్నారు. దీంతో ఐదేళ్ల జగన్ పాలనను అంతుకు ముందు ఐదేళ్ల చంద్రబాబు పాలనతో పోల్చి చూసుకుని రాష్ట్ర ప్రగతి, పురోగతి, నిజమైన ప్రజా సంక్షేమం కావాలంటే చంద్రబాబు మఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టా ల్సిందేనన్నదే జనాభిప్రాయమనీ, అదే సర్వేలలో ప్రతిఫలిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎన్నికలైన వెంటనే విదేశాలకు జగన్.. దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు నాలుగు రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సాధ్యమైనంత మందిని కలిసి ఓటు అభ్యర్థించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇతరత్రా విషయాలను అసలు పట్టించుకోరు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం మధ్యలో విరామం తీసుకుంటున్నారు. ఎవరినీ కలవకుండా, పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయకుండా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమౌతున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ప్రచారం జోలికి వెళ్లకుండా ప్యాలెస్ కు పరిమితమైపోయారు. ఔను ఈ నెల 2, 3, 8 తేదీలలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. పోనీ ఎండల్లో తిరగడం వల్ల వచ్చిన అస్వస్థతతో విశ్రాంతి తీసుకున్నారా అంటే అలాంటి సంకేతాలేమీ లేవు. ఎన్నికల ప్రచారం కంటే ముఖ్యమైన పనులేవో ఆయన చక్కబెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  అందుకు కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట.. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సీఐడీ సిబ్బంది కీలక ప త్రాలను దగ్ధం చేసిన సంగతి తెలసింది. జగన్ అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరించే సీఐడీ చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే ఆ పత్రాల దగ్ధం జరిగిందని స్వయంగా సిట్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. నాడు దగ్ధం చేసిన పత్రాలలో హెరిటేజ్ కు చెందిన కీలక పత్రాలు, అలాగే చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పత్రాల దగ్ధం సమయంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొందరిని ఆ వీడియోలు, పొటోలు తమకు ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ను అధికారులు చట్ట విరుద్ధంగా పొందారని, వాటినే  దగ్ధం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినవచ్చాయి. అంటే అప్పటికే రాష్ట్రంలో ప్రజల మూడ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉందనీ, ఎన్నికలలో ఓటమి ఖాయమనీ వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేసి.. ఆ పత్రాల దగ్ధానికి సీఐడీ చీఫ్ ను పురిగొల్పి ఉంటుందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  అంతే కాకుండా ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమనీ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు ఇప్పుడు సర్దుకునే పనిలో పడ్డారనీ అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇప్పుడు సిట్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం సంఘటన జరిగిన నెల రోజులకు జగన్ ప్రచారంలో తరచూ విరామం తీసుకుంటూ.. ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపైనా అటువంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఓటమి ఎటూ తప్పదు.. కనీసం తప్పులు దొరకకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై ఆయన ప్యాలెస్ లో మంత్రాంగం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా మే 13న పోలింగ్ జరుగుతుంది. సరిగ్గా నాలుగు రోజుల తరువాత జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారు. భార్య భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థిస్తూ  పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్, స్విట్జర్ ల్యాండ్, ఫ్రాన్స్ లో పర్యటించనున్నట్లు తెలిపారు.  ఏపీలో పోలింగ్ పూర్తయిన వెంటనే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ విదేశీ పర్యటన అభ్యర్థనపై సీబీఐ కోర్టు గురువారం (మే9) విచారించనుంది. ఓటమి భయంతో జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయనకు స్వయానా సోదరి షర్మిల ఇప్పటికే ఆరోపించారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనీ, ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే అరెస్టు తథ్యమనే భయంతోనే ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపించారు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే పీక్ టైంలో ప్రచారాన్ని సైతం వదిలేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపై అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.   

ఉండిలో ప్రచారం ఆపేసిన వైసీపీ.. ఎందుకంటే?

రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఆయనపై జగన్ సర్కార్ కేసులు బనాయించింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించింది. అయితే అన్నిటినీ తట్టుకుని జగన్ అస్తవ్యస్థ, అరాచక, అసమర్థ పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కూటమి అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి దక్కడంతో ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించినా, ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో చంద్రబాబు రంగంలోకి దిగి రఘురామకృష్ణం రాజును తెలుగుదేశంలో చేర్చుకుని ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయనను బుజ్జగించి మరీ చంద్రబాబు ఉండి నుంచి రఘురామకృష్ణం రాజును బరిలోకి దింపారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణం రాజు విజయం కోసం చురుకుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఉండిలో తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడిన  శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.  తొలుత శివరామ రాజు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధపడినప్పటికీ తెలుగుదేశం ఓట్లు చీల్చడం కోసం ఆయనను రెబల్ గా పోటీ చేయాలని జగన్ సూచించడంతో ఆయన ఇప్పుడు ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.  ఇంతలో ఏమైందో ఏమో కానీ గత కొన్ని రోజులుగా ఉండిలో వైసీపీ ప్రచారం నిలిచిపోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ అధినేత జగన్ స్వయంగా ఉండిలో పార్టీ నేతలు, క్యాడర్ కు ప్రచారాన్ని నిలిపివేయాలనీ, అలాగో డబ్బులు కూడా వ్యయం చేయవద్దనీ ఆదేశించారు. జగన్ స్వయంగా వైసీపీ అభ్యర్థి నరసింహరాజుకు ఫోన్ చేసి నియోజకవర్గంలో ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఇందు వల్ల తెలుగుదేశం రెబల్ అభ్యర్థికి ప్రయోజనం చేకూరుతుందనీ, శివరామరాజు తన సొంత పలుకుబడితో తెలుగుదేశం ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందనీ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు ప్రచారంలో ముందున్నారు. ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. రెబల్ ఉనికి ఉండిలో నామమాత్రంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ స్థితిలో వైకాపా రెబల్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్నిఆపివేయడం రఘురామకృష్ణం రాజుకే ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు.  

ఏబీవీ సస్పెన్షన్ ను కొట్టేసిన క్యాట్!

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్  ఏబీ  వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ పిటిషన్ పై వాదనలు పూర్తై తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్ ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండో సారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని క్యాట్ స్పష్టం చేసింది.  ఆయనను తక్షణమే సర్వీసులోనికి తీసుకుని   ఏరియర్స్ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ఏబీవెంకటేశ్వరరావు సస్పెన్షన్  చట్ట విరుద్ధమని దేశ సర్వెన్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆయన రెండో సారి సస్పెండ్ చేయడం వేధింపుల కిందకే వస్తుందని క్యాట్ తన తీర్పులో పేర్కొంది.   నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ రావుపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో న్యాయ వివాదం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.  తన సస్పెన్షన్ ను ఏబీవీ క్యాట్ లో సవాల్ చేశారు. అయితే అప్పట్లో క్యాట్ ఏబీవీ సస్పెన్షన్ ను సమర్ధించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్యాట్  నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశానుసారం రాష్ట్రప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంది. అయితే ఇలా విధుల్లోకి తీసుకున్నట్లే తీసుకుని మళ్లీ పాత ఆరోపణలతో రెండో సారి సస్పెండ్ చేసింది.  ఒకే ఆరోపణలపై రెండో సారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది. 

ఏపీలో ల్యాండ్ మైన్‌లా పేలిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!

ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  ప్రచారాస్త్రంగా మారింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మంగా అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివాదం అలుముకుంది. దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.  ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటికే చేసిన సర్వేలో తమ భూమి పరిణామం తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వైసీపీ సర్కార్ కు ఘోర ప‌రాభ‌వం త‌ప్పేట‌ట్లు లేదు. భూములు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ప్ర‌జ‌లు బుద్ధి చెబుతారు. తెలంగాణాలో అదే జ‌రిగింది. కేసీఆర్ ఓడిపోవ‌డానికి  ధరణి కూడా ఒక కార‌ణం.  ఈ చట్టం వల్ల కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. గ్రామాల్లోనూ లెక్కకు మించి  సమస్యలు వచ్చాయి. రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన రైతులు పడిన బాధలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు.  ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణాలో ధ‌ర‌ణి లాగే, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..  ఏపీ పాలిటిక్స్‌లో ల్యాండ్ మైన్‌లా పేలింది. ప్రభుత్వం భూములు గుంజుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందని విపక్షాలు. లేదు మీ భూముల పరిరక్షణకే ఈ చట్టమని అధికార పక్షం ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఈ చట్టంలోని లొసుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒక్కో అంశం.. ఎంత ప్రమాదకమైనదో లాయర్ల విశ్లేషణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భయం ఏర్పడుతోంది. ఇది వైసీపీకి పెను సవాల్ గా మారింది.   సంక్షేమ పథకాలను అమలు పర్చినా, కేసీఆర్ ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పదేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు, గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా.. రెండా.. చివరకు దళితబంధు కింద పది లక్ష రూపాయలను కూడా ఇస్తూ ఆ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక రైతు భరోసా కింద నిధులు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా అందచేశారు.  అయినా ఓడిపోయారు.  ఓడిపోవ‌డానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ధరణి పోర్టల్ అని చెప్ప‌వ‌చ్చు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ ప్ర‌ధాన కారణమని చెప్పుకోవ‌చ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు అలాంటి అంశాన్నే భుజానకెత్తుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది.   ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.  పట్టాదారు పాస్ పుస్తకాలపై... ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలు శాశ్వతమని, ముఖ్యమంత్రులు కారని, అలాంటిది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను ఎలా ముద్రిస్తారంటూ టీడీపీ నేతలు పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీకి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.  బడా పారిశ్రామికవేత్తలకు భూ సేకరణలో వివాదాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

జగన్‌కి ఓటు వేస్తే... వీటికి ఒప్పుకున్నట్లే!

ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు. మీరు ఆంధ్రప్రదేశ్ ఓటరా? మీ మనసులో ఏ మూలనైనా జగన్‌కి ఓటు వేయాలన్న ప్రమాదకరమైన ఆలోచన వుందా? అయితే ఆ బాధ్యత గల పౌరుడు చేస్తున్న హెచ్చరికలు చూడండి.. ఆలోచించి ఓటు వేయండి. ఈసారి జగన్‌కి ఓటు వేస్తే.... * మాకు డెవలప్‌మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే... * మా రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోవచ్చని ఒప్పుకున్నట్లే... * పోలవరం ప్రాజెక్టు కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * పరిశ్రమలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే... * కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... * ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే.... * కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే..... * సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే.... * పీఆర్సీలు, అరియర్స్ అవసరం లేదు.. మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే..... * రోడ్లు మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే.... * రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా రాష్ట్రాన్ని పులివెందుల తోడేళ్ళకు రాసిచ్చేశాం అని ఒప్పుకున్నట్లే.... * మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే.... * మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే.... * రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే.... * కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... * ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... * ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే.... * డిఎస్సీ మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... * మా బతుకులకి 5 వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే... * మిగతా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్టే.... * మీ ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేసుకోండి, మేమేమీ అనం అని ఒప్పుకున్నట్లే.... * ఎంతమందినైనా హత్య చేసుకోండి మేం ఏమీ అడగమని ఒప్పుకున్నట్లే...

ఉదయగిరి గడ్డ కాకర్ల సురేష్‌ అడ్డ! ఉద‌య‌గిరి కోట‌పై టీడీపీ జెండా!

రాయలవారి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఉదయగిరి జ‌గ‌న్ పాల‌న‌లో కళావిహీనంగా మారింది.  పట్టణ ముఖ ద్వారంలోని  ఉదయగిరి ఆనకట్ట చెరువు ఆధునికీకరణ పనులు నిధులులేక ఆగిపోయాయి. గండిపాళెం జలాశయం రూపురేఖలు కోల్పోయింది.  ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం మండలాల్లోని ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించటానికి వీలుగా గండిపాళెం జలాశయం వద్ద ఏర్పాటు చేసిన సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు జ‌గ‌న్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయింది. 2002లో సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 46 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు నీటిని సరఫరా చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల మంజూరును నిలిపేసింది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు  పంపిన ప్రతిపాదనలు  బుట్టదాఖలయ్యాయి.  గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయటానికి వీలుగా పట్టణంలోని గండిపాళెం మార్గంలో 2018 తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల నిధులతో మినీ స్టేడియం మంజూరైంది. అయితే ప్రభుత్వం మారటంతో ఈ మినీ స్టేడియం నిర్మాణ పనులకు నిధులు నిలిపేశారు. తాగునీటి సమస్య తో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు  కూటమి అధికారం లోకి రాగానే పూర్తి చేస్తామ‌ని తెలుగుదేశం పార్టీ హామీనిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది.  కూట‌మి అభ్య‌ర్థి కాక‌ర్ల సురేష్ గెలుపు కోసం ఆయ‌న తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్ర‌జ‌లు  వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు.  టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని,  ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను, ఎంపీ అభ్యర్థి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీ తో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల తెలిపారు.  వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను, కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు.  వైసీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఓట్లను వేయించుకోవాలనే కుట్రలకు అధికార పార్టీ పాల్పడుతోంద‌ని,  మద్యం, నగదు పంపిణీతో పాటు పోలింగ్‌ రోజు గొడవలతో భయోత్పాత  సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.   వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ త‌న దైన స్టైల్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూట‌మికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ స‌ర్వేల్లో తేలిపోయింది.  ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.

నెల్లూరు విజయసాయికి అందని ద్రాక్షే.. దేశం కూటమిలో జోష్.. జగన్ శిబిరంలో నైరాశ్యం!

వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు.  ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు. ఎన్నికల కమిషన్ తమ పథకాలను నిలిపివేస్తోందనీ, తమకు మద్దతుగా ఉన్న అధికారులపై బదలీ వేటు వేసి.. అధికారులెవరూ అధికార పార్టీకి సహకరించకుండా చేస్తోందనీ వ్యాఖ్యానించి. అటువంటి అనుచిత సహకారం లేకపోతే గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇక తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఆయన ప్రచారానికి జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ కూడా పెద్దగా రావడం లేదు. సొమ్ములిచ్చి రప్పించుకున్న వారు కూడా ఇలా కనిపించి అలా మాయమై పోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తన ఓటమి తానే ఓప్పుకునేలా చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేశాయి. ఇంతకీ ఆయన సమాజిక మాధ్యమం వేదికగా ఏమన్నారంటే.. నిజాయితీగా పని చేస్తున్న అనంత రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని, అనంతపురం డీజీపీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసేసింది. ఇదేక్కడి న్యాయం. వాస్తవానికి తెలుగుదేశం కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో  రూ. 2 కోట్ల భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నందుకు పోలీసులు వారిని అభినందించాలి అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం అనంత పోలీసు అధికారులను బదిలీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని పేర్కొన్నారు.   సాధారణంగా ఇలాంటి బేల మాటలు.. ఓటమి బాటలో ఉన్నప్పుడే నేతల నోట వస్తాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరును అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు విమర్శించిన సందర్భంలో చంద్రబాబు ఓటమి భయంతో  మాట్లాడుతున్నారంటూ ఇదే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   అదలా ఉంచితే విజయసాయి రెడ్డి జగన్ సర్కార్ లో, వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు. వరుసగా రెండు సార్లు జగన్ ఏరి కోరి ఆయనను రాజ్యసభకు పంపారు. అయితే ఇప్పుడు తన సొంత జిల్లా అంటూ చెప్పుకుని తగదునమ్మా నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి జిల్లాకు చేసింది మాత్రం శూన్యం.  కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పోటీదారుగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి తాను స్థానికుడిననని ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా సొంత పార్టీలోని కీలక నేతలే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి స్థానిక అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు కీలక నేతలు, ప్రజల నుంచి గట్టి మద్దతు లేదు. ఇటీవలే జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి మద్దతుగా   చాలా వరకూ వైసీపీ క్యాడర్ ఆయనతో పాటే తెలుగుదేశం వైపు వచ్చేసింది.  

దూసుకెళ్తున్న బాలశౌరి ... ఎన్నికల ప్రచారంలో బందరు పోర్టు  కీలకాంశం 

రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.గత  ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి  ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ‌ల్లభ‌నేని బాల‌శౌరి ఇక్కడి నుంచి  వ‌రుసగా రెండోసారి విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో  టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను ఓడించి విజ‌యం ద‌క్కించుకున్న బాలశౌరి త్రి కూటమి అభ్యర్థిగా మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆ వెంట‌నే ఆయ‌న కార్యరంగంలోకి దిగిపోయారు.బందరు పోర్టు విషయంలో బాలశౌరి  రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారు. స‌మ‌స్యలున్న చోట తాను ఉన్నానంటూ నిరూపించుకుంటున్నారు. కీల‌క బందరు ప్రాజెక్టు విషయంలో బాలశౌరికి  మంచి పేరు తెస్తోంది. కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల అయిన బందరు పోర్టు విషయంలో ఆయన హాయంలోనే  కదలిక వచ్చింది. గత  ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైకాపా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పోర్టు నిర్మాణంపై జిల్లావాసుల్లో ఆశలు సన్నగిల్లాయి. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చినా దానిపై స్పష్టత లేకుండాపోయింది.  తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకోవడంతో కెనరా బ్యాంకు పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణను బాల‌శౌరి స్వయంగా తీసుకువ‌చ్చి.. సీఎం జగన్‌ను సచివాలయంలో కలిసేలా ఏర్పాటు చేశారు. వీరి నడుమ సుమారు అరగంటకుపైగా భేటీ జరిగింది. ఈ భేటీలో బాలశౌరి కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. బందరు పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.   పోర్టు నిర్మాణం త్వరలో మొదలవుతుందని వ‌ల్లభ‌నేని బాల‌శౌరి స్పష్టం చేస్తున్నారు.  దీంతో బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించినట్లయింది. దీని వెనుక బాల‌శౌరి క‌ష్టం ఉండ‌డంతో వైకాపాలో ఉన్న ఆయ‌న అనుచ‌రులు హ‌ర్షం వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, రెండు నెల‌ల కింద‌ట కూడా రాష్ట్ర స‌మ‌స్యల‌ను కేంద్రానికి వివ‌రించ‌డంలోను, లేఖలు రాయ‌డంలోనూ వల్లభనేని బాల‌శౌరి దూకుడు ప్రద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. పోర్టుకు సుదీర్ఘ చరిత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మ‌చిలీప‌ట్నం ఒక‌ప్పుడు బ్రిటిష్ హ‌యంలో పెద్ద తీర ప్రాంత ప‌ట్ట‌ణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమ‌తులు, దిగుమ‌తులు జరిగేవి. అంతకు ముందే రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. మచిపలీట్నం లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పలవురు సీనియర్ రాజకీయ నేతలు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటాలని ప్రధాన పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో మచిలీపట్నం ఒకటి. అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు (ఎస్ సి), పెడన, పెనుమలూరు, మచీలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,518,826మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 737,936కాగా.. మహిళలు 780,825మంది ఉన్నారు. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే.. 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. సీపీఐ నుంచి పోటీచేసిన సనక బుచ్చికోటయ్య గెలిచారు. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు విజయం సాధించారు. 1962లో మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందడం విశేషం. 1967లో కాంగ్రెస్ నుంచి వై.అంకినీడు ప్రసాద్ విజయాన్ని అందుకున్నారు. 1971లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు గెలిచారు. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి అంకినీడు విజయం సాధించారు.. 1980లో తిరిగి ఆయనే గెలిచారు. 1984, 1989, 1991లో కాంగ్రెస్ నుంచి కావూరి సాంబశివరావు విజయం సాధించారు. 1996లో కైకాల సత్యనారాయణ (నటుగు) తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు.  ఏపీలో ఇప్పటికే పోర్టుల ఆధారంగా ఎగుమతులు ఊపందుకున్నాయి. కరోనావైరస్ మహమ్మారి తర్వాత విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయి. ఉదాహరకు కాకినాడ పోర్ట్ నుంచి 2020-21తో పోలిస్తే 2021-22 లో బియ్యం ఎగుమతులు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2019లో వల్లభనేని బాలశౌరి విజయం 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఆయన 60వేలకుపైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచినా.. రెండు నెలల క్రితం పార్టీకి దూరమయ్యారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో మచిలీపట్నం టికెట్ జనసేన పార్టీకి దక్కింది. . సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మరోసారి జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.ఇటు వైఎస్సార్‌సీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా నియమించింది. వైకాపా కార్యకర్తలు ఇటీవల జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తోంది. వైకాపా అరాచకాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని జనసేన నేత వాడ వీర ప్రతాప్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీ ఎన్నికల ప్రచారానికి నాని.. వైసీపీకి టిట్ ఫర్ టాట్!

గదిలో బంధించి కొడితే పిల్లి కూడా  పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నానిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గతంలో జగన్ సర్కార్ సినిమా టికెట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన కారణంతో నానిని జగన్ సర్కార్ నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించంది. సినీ పరిశ్రమ మేలు కోసం అంటూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు, సర్కార్ నిర్ణయం సినీ పరిశ్రమకు మేలు కాదు కీడు చేస్తుందంటూ చెప్పినందుకు  నానిపై పలువురు వైసీపీ నాయకులు నానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాని స్థాయి ఏమిటంటూ నిలదీశారు.  అంతే కాకుండా అప్పట్లో ఆయన సినిమా శ్యాం సింగరాయ్ విడుదల సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు. అప్పటికి మౌనంగా ఉన్న నాని..నానిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని ఆయనను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీకి ఇప్పుడు నాని సరైన బదులిచ్చినట్లైంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట, అదీ వైసీపీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న వేళ నాని తన గళం విప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమన్న సంకేతం ఇస్తూ తన ప్రచారానికి తానే బెస్టాఫ్ లక్ చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు.  దీంతో నాని నాడు వైసీపీ తనను వేధించిన తీరుకు టిట్ ఫర్ టాట్ అన్న చందంగా రిటార్డ్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సనిమా శ్యాం సింగరాయ్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు ఇప్పుడు సరైన బదులిచ్చినట్లైందని అంటున్నారు.  

భాగ్యనరకం!

చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి  ఏటా వానాకాలంలో భాగ్యనగర  వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది. విశ్వనగరం అంటూ ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం విశ్వనరకంగా మారిపోయింది.   లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనాలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరౌతున్న హైదరాబాదీయులు మంగళవారం సాయంత్రం ఆకాసం మబ్బుపట్టి వర్షం కురవడంతో హమ్మయ్యా అని ఆనందపడ్డారు. అయితే నిముషాల వ్యవధిలోనే వారి ఆనందం ఆవిరైపోయింది. మెల్లిగా మొదలైన వర్షం కుండపోతగా మారింది.  జనాలకు నరకం చూపించింది. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయాలు వదిలి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో మొదలైన వాన ఏకధాటిగా రెండు గంటలకు పైగా కురిసింది.  దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోయాయి. భారీ వర్షం కారణంగా చూపుతూ కొంత సేపు మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి.  ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ కు వానకష్టాలు మాత్రం తీరడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   చిన్నపాటి వర్షానికే   రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నరకయాతన హైదరాబాదీయులకు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

కాళేశ్వరం కుంగింది అందుకే...నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి  ప‌లు సూచ‌న‌లు చేసింది.  1) మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు.   2) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించారు. 3) 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని,  రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.   4) బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో, మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని, వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే, మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు నివేదిక‌లో రాశారు.  మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. 5) 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.   6) ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరం మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు.  7)  ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింద‌ని డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికలో తెలిపింది. 8) డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది.   మ‌రో వైపు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను  జ్యుడీషియల్‌ కమిషన్‌ సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి జ్యుడీషియల్‌ కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది.  ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక  అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌