పొంగులేటి కుమారుడి కంపెనీపై కబ్జా కేసు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీపై కేసు నమోదైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ గండిపేట రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లిలో  300 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నించడంతో ఈ కేసు నమోదైంది. గత నెల  30న 70 మంది బౌన్సర్లను తీసుకెళ్లి ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేసి, స్థల యజమానిపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు   కేసు నమోదు చేశారు. గత నెల  30 అర్ధరాత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన పలువురు వ్యక్తులు, నంబర్ ప్లేట్లు లేకుండా తీసుకొచ్చిన జెసిబిలతో ఆ భూమిలోకి బలవంతంగా ప్రవేశించి ప్రహారీ గోడను కూల్చేయడమే కాకుండా, అక్కడ ఉన్న గోశాలలు, షెడ్లు,  ధ్వంసం చేసినట్టుగా పల్లవీషా అనే మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో పాటు మరో ఐదుగురిపై   కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ ప్రవేశం, ఆస్తి ధ్వంసం వంటి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు న్నామని పోలీసులు తెలిపారు.  ఇలా ఉండగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదు కావడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అన్నిటికీ మించి రేవంత్ కేబినెట్ లో అత్యంత కీలకంగా ఉన్న పొంగులేటి కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీ దౌర్యన్యంగా కబ్జాకు ప్రయత్నించిందన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. 

బౌలర్ల వైఫల్యం.. పేలవ ఫీల్డింగ్!

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా రాయ్‌పూర్  వేదికగా బుధవారం (డిసెంబర్ 3) జరిగిన రెండో  మ్యాచ్‌లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి  358 పరుగులు చేసింది. అయితే 359 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో వన్డే సిరీస్ లో భారత్, దక్షిణాఫ్రికాలు 1-1తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి భారత బౌలర్ల వైఫల్యం, పేలవ ఫీల్డింగ్   కూడా కారణం.   టాస్ కోల్పోయి భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టాల్సి రావడంతోనే మ్యాచ్ విజయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే శీతాకాలం కావడంతో రాత్రి వేళలో విపరీతంగా మంచుకురుస్తుంది. దాంతో బౌలర్లకు బంతిపై గ్రిప్ దొరకదు. అలాగే ఫీల్డర్లూ మంచులో తడిసిన బంతిని ఆపడం, క్యాచ్ పట్టడం కష్టమౌతుంది. బాల్ చేతుల్లోంచి జారి పోతుంది.  తొలి వన్డేలో కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ.. సౌతాఫ్రికా టాప్ ఆర్డర్డ్ ను బౌలర్లు మంచు ప్రభావం కనిపించడానికి ముందే పెవిలియన్ కు పంపడంతో విజయం సాధ్యమైంది. అయితే రెండో వన్డేలో ఆలా జరగలేదు. అంతే కాకుండా..తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ డెత్ ఓవర్లలో పరుగులు వేగంగా రాబట్టలేకపోవడం కూడా ఒక కారణం. చివరి పది ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 74 పరుగులే చేసింది. అలా కాకుండా మరో పాతిక ముఫ్ఫై పరుగులను చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.   ఇక టీమ్ ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమవ్వడం టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం.  ముఖ్యంగా   ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చారు.  ఆ తరువాత పేలవ ఫీల్డింగ్ క్యాచ్ డ్రాప్ లు కూడా భారత ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా యశస్వి జైసవాల్  మార్క్‌రమ్ క్యాచ్‌ను డ్రాప్ చేయడం చాలా కాస్ట్లీగా పరిణమించింది. మార్కరమ్  53 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన సులభమైన క్యాచ్ ను యశస్వియాదవ్ నేలపాలు చేశారు. ఈ తరువాత మార్కరమ్ సెంచరీ చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి అని చెప్పవచ్చు.  ఇక టీమ్ ఇండియా ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. భారత ఆటగాళ్లు  మిస్ ఫీల్డింగ్, ఓవర్ త్రోలతో చేజేతులా మ్యాచ్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించారు. 

జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విస్తరణ ప్రక్రియ పూర్తి

  జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలియం చేస్తూ తీసుకున్న ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి ..ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఒక సర్కిల్ జారీ చేశారు ..27 మున్సిపాలిటీలు, కమిషనర్లలో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకి ఆదేశాలు ఇచ్చారు.. జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్‌లో శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇవాళ ఆమోదించారు. దీంతో మొత్తం 27 స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. 

దివ్యాంగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు

  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఏడు వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.  శాప్‌ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నామని పేర్కొన్నారు.  ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ప్రీ ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని తెలిపారు. అమరావతిలో దివ్యాంగ భవన్ నిర్మిస్తామని తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

చిత్రపురి కాలనీ అక్రమాల కేసు విచారణ పూర్తి...ఫైనల్ రిపోర్ట్

  హైదరాబాదు నగరంలోని గచ్చిబౌలి లో ఉన్న చిత్రపురి కాలనీ కోఆపరేటివ్​ సొసైటీకి సంబంధించిన భారీ అక్రమాలపై సాగిన దాదాపు పదిహేనేళ్ల విచారణకు తెర పడింది. 2005 నుండి 2020 వరకూ చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ తన ఫైనల్‌ రిపోర్ట్‌ను నవంబర్‌ 27న తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. విచారణలో భాగంగా సొసైటీ నిధుల దుర్వినియోగం, ఆస్తుల కేటాయింపుల్లో గందరగోళం, అక్రమ ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు బయటపడినట్లు కమిటీ నివేదికలో స్పష్టమైంది. ఈ అక్రమాలకు మొత్తం 15 మందిని బాధ్యులుగా కమిటీ నిర్ధారించింది.ఈ వ్యవ హారంలో పాత, ప్రస్తుత కమిటీ సభ్యులతోపాటు కొంతమంది సినీ ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొనడం ప్రత్యేకంగా నిలిచింది.  ఈ విచారణలో ప్రధానంగా ప్రస్తావించబడినవారిలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, అలాగే బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ పేర్లు ఉన్నాయి. సొసైటీ కమిటీలో సభ్యులుగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి వీరికి సంబంధం ఉన్నట్లు రిపోర్ట్ సూచిస్తోంది. మొత్తం గా జరిగిన అక్రమాల కారణంగా సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు రూ. 43.78 కోట్లు రికవరీ చేయాలని, అదనంగా 18 శాతం వడ్డీతో సహా వసూలు చేయాలని గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ సూచించారు.ఫైనల్‌ రిపోర్ట్ కాపీని ఇప్పటికే సంబంధిత 15 మందికి పంపినట్లుగా అధికార వర్గాలు వెల్లడిం చాయి. ప్రభుత్వం రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.

దిత్వా తుఫానుతో నెల్లూరు అతలాకుతలం

  దిత్వా తుఫాను ప్రభావంతో  నియోజకవర్గంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, చలిగాలుల తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పంట పొలాలు జలమయం, కురిసిన వర్షాలకు పలు గ్రామాలలో వందలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.  ముఖ్యంగా వరి, ఇతర రకాల పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండి జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.  రాగల ఒకటి, రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నదులు, చెరువులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు.

కాకాణిపై పోలీసు స్టేషనులో సోమిరెడ్డి ఫిర్యాదు

  మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన ఫిర్యాదును నెల్లూరు రూరల్ పోలీసు స్టేషనులో అందజేశారు. తాను కోట్ల రూపాయలను దోచుకున్నానని కాకాణి నిరాధార ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.  దేవుడి గుడిని అభివృద్ధి చేస్తే తప్పు పట్టిన ఘనత కాకానికే దక్కుతుందని తెలిపారు. కాకాణి మనిషి జన్మ ఎత్తితే ఇలాంటి నిరాదార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. గతంలోనూ నా పై నిరాధార ఆరోపణలు చేసాడు..మా కుటుంబం దేవాలయాలకు, బడులకు, ఆసుపత్రికి భూములిచ్చిన చరిత్రి మాదని సోమిరెడ్డి తెలిపారు.  14.5 ఎకరాలు దాదాపు 60 కోట్లు విలువ చేసే భూములిచ్చామని పేర్కొన్నారు. త్వరలో కాకానీ  అండ్ బ్యాచ్ త్వరలో జైలుకు పోక తప్పదని తెలిపారు. కాకానికి మిగిలిన రాజకీయ నాయకుల్లాగా సంస్కారవంతంగా విమర్శలు చేయడం చేత కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని అన్నారు. ఈ మేరకు గత నవంబరులో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరుకు ఫిర్యాదు చేశారు  

త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ : సీఎం రేవంత్‌

  త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఇవాళ హుస్నాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.262.68 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని రేవంత్ అన్నారు. శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదే రోజు జరిగిందని ఆయన స్పూర్తితో 60 వేల కోసం ఉద్యోగాలు చేశామని తెలిపారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్‌లో సోనియా ప్రత్యేక రాష్ట్రం మాటిచ్చారని తెలిపారు.  పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల్లో అందరూ ఏకమై సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి పనిచేసే వారినే సర్పంచ్‌లను ఎన్నుకోవాలని కోరారు. కిరికిరి సర్పంచ్‌లను వస్తే ఐదేళ్ల కాలం వృధా అవుతుందన్నారు. అలాంటి వారిని ఎన్నుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో కోట్లాడైనా అత్యధిక నిధులు గ్రామాలకు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. హస్నాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. గడీలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్న గౌడ్ గారి నాయకత్వంలో బహుజనుల రాజ్య స్థాపనకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారని ఆ ప్రాంత ప్రాధాన్యతను  గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ  కార్యక్రమాలు అమలు చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.    

బీజాపూర్‌‌లో భీకర ఎన్‌కౌంటర్...12 మంది మావోలు మృతి

  ఛత్తీస్‌గఢ్‌  బీజాపూర్‌ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోలు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బుధవారం ఉదయం బస్తర్‌ డివిజన్‌ లోని అటవీ ప్రాంతంలో నక్సలైట్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. అక్కడ మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఈ ఘటనాస్థలి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని  బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు 2026 ఆగస్టు 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత భారత్ గా మార్చేందుకు ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.

రెండో వన్డేలోనూ కోహ్లీ సెంచరీ

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా రెండో మ్యాచ్ లోనూ మూడంకెల స్కోరు సాధించాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేసిన కోహ్లీ, ఇప్పుడు రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వన్డేల్లో కోహ్లీ చేసిన శతకాల సంఖ్య 53 కు చేరింది. క్రికెట్ లోని ఏ ఫార్మాట్ లోనైనా సరే అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు కోహ్లీదే.  ఈ మ్యాచ్ లో కోహ్లీ 90 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకం బాదిన కోహ్లీ ఆ తరువాత 102 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్ లో మాక్రంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వన్డేలోలాగే ఈ మ్యాచ్ లోనూ కోహ్లీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు.   ఇదిలా ఉంటే.. వ‌రుస‌గా రెండు వ‌న్డే మ్యాచ్‌ల్లోనూ శ‌త‌కం చేయ‌డం కోహ్లీ కెరీర్‌లో ఇది 11వ సారి.

తెలంగాణలో రెండు టర్మ్‌లు నేనే సీఎం : రేవంత్ రెడ్డి

  తెలంగాణలో రెండు టర్మ్‌లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి  సహకరించాలని ప్రధాని మోదీని కోరాని రేవంత్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అప్పటి ప్రధాని  మన్మోహన్ సింగ్ ఎలా సహకరించాడో ఇప్పుడూ అలాగే సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశాని రేవంత్‌రెడ్డి తెలిపారు.  నిన్నటి నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని   డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో  భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం అని చెప్పే ప్రయత్నం చేశాని రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వివాదాస్పదం చేస్తోందని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లు మూడు కోట్ల మంది ఉన్నారని… పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని తాను చెప్పానని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా హిందూ సమాజం లాంటిదేనని తాను వివరించానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కోతుల తిప్పలు

  పల్లెలో  గ్రామ పంచాయితీ ఎన్నికల రగడ మొదలైంది.  గ్రామంలో ఉన్న కోతులను తరిమిన తర్వాతే ఓట్లు అడగాలని ఓటర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. కోతులు లేకుండా చేసిన అభ్యర్థికి ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.. దీనితో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోతుల బెడద సవాల్‌గా  మారుతుంది..జయశంకర్ భూపాలపల్లి జిల్లా..రేగొండ మండలం కేంద్రంలో మా ఓటు అమ్మేది లేదంటూ వేలిసిన వాల్ పోస్టర్లు....మండల కేంద్రానికి చెందిన మాడగాని నరేష్ అనే వ్యక్తి వాల్ పోస్టర్లు వేసి ఓట్ల అమ్ముకోము అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్‌గా  గెలిపిస్తామంటూ ఓటర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. తెలంగాణలో దాదాపు 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయంట. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడటంతో పాటు గుంపుగా దాడి చేయడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ అనేకం ఉన్నాయి.

సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా.. పోలీసులపై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం ప్రజలలో ఉంటారు. ప్రజలకూ తనకూ మధ్య బారికేడ్లు అనవసరమని భావించడమే కాదు.. ఆ దిశగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలని చెబుతుంటారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జనానికి తనకూ మధ్య పరదాలు కట్టించుకుని వారికి కనిపించకుండా ముఖంచాటేసి తిరిగారు. అయితే తాను అందుకు పూర్తిగా భిన్నమని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. తన పర్యటన సందర్భంగా పరదాలు, బారికేడ్లు వంటికి ఉండటానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. పోలీసులు కూడా ఆయన అభిమతానికి తగినట్లేనడుచుకున్నారు. పించన్ల పంపిణీకి ఆయన గ్రామాలకు వెళ్లిన సందర్భాలలో పోలీసుల ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని చంద్రబాబు ప్రశంసలు కూడా కురిపించారు. అయితే.. పోలీసుల తీరు పూర్తిగా మారలేదని ఆయన తాజాగా గమనించారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఆయన ప్రయాణించే సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిపైకి వాహనాలు రాకుండా అడ్డుకోవడాన్నిఆయన గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపించి అక్కడికక్కడే పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా? లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయానికి వెళ్లే దారిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను వెంటనే తొలగించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.  ఆ తరువాత ఆర్టీజీఎస్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ కూడా బారికేడ్ల విషయాన్ని ప్రస్తావించారు.  స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తే చాలన్నారు. రోడ్లను మూసేస్తూ  బారికేడ్లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు.  

పాతబస్తీలో మృతదేహాలు కలకలం

  హైదరాబాద్ నగరంలోని  చాంద్రాయణగుట్ట పరిధిలోని ఒక ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఆటోలో రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆటో పార్క్ చేసి ఉండగా, అందులో ఇద్దరు యువకులు ప్రాణం లేకుండా కనిపించడంతో స్థానికులు భయపడుతూ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరీక్షిస్తున్న సమయంలో ఆటోలో మత్తు ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్‌కు సంబంధించిన కొన్ని శాంపిల్స్‌ కనిపించాయి. పోలీసులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. యువకులు మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తు న్నారు. ఓవర్‌డోస్ కారణంగానే మరణించి ఉండవచ్చన్న ప్రాథమిక అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.  అయితే, ఇది హత్యలా? లేక యువకులే మత్తు పదార్థాలు తీసుకుని ప్రాణాలు కోల్పోయారా? అన్న దానిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ యువకులు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరణానికి గల కారణం వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత, భయం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ...గ్లోబల్ సమ్మిట్‌కి ఆహ్వానం

  తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు  ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తోన్న “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025” సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. మేరకు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందించారు.  కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్​ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ..​ 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ  రైజింగ్​ 2047  విజన్​ డాక్యుమెంట్​ రూపొందించినట్లు  చెప్పారు.   హైదరాబాద్​ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు  తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు.  మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ  ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా  చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ నుంచి అమరావతి మీదుగా బందర్​ పోర్ట్ వరకు 12 లేన్​ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, హైదరాబాద్​ నుంచి బెంగుళూరు హై స్పీడ్​ కారిడార్​ ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణం  చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.  రాహుల్‌, ఖర్గేకు ఆహ్వానం.. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‍ను సీఎం రేవంత్ కలిసి గ్లోబల్ సమ్మిట్‍కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్‍లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి ఆయనకు వివరించారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మాలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయి సమ్మిట్‌కు రావాలని కోరారు.  అలాగే ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు  మల్లు రవి, రఘువీర్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, చామల కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు.   

లోకేష్ విదేశీ పర్యటనలు.. ఆచరణలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఆంధ్రప్రదేశ్ తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్వోస్టర్లు భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానమే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అక్కర్లేదు. అభివృద్ధి, దార్శనికత విషయాలలో చంద్రబాబుకు ఉన్న ట్రాక్ రికార్డ్ కు లోకేష్ స్పీడ్ తోడుకోవడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చెబుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మంత్రి నారా లోకేష్ కేవలం మాటల్లోనే కాదు ఆచరణలో సైతం చూపుతున్నారు. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ట్రిలియన్  డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.  ఇందు కోసం దేశ, విదేశీ పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. దావోస్ మొదలైన ఈ ప్రయాణం సక్సస్ ఫుల్ గా సాగుతోంది. అదే క్రమంలో  మంత్రి నారా లోకేష్ ఈ నెలలో రెండే దేశాలలో పర్యటించనున్నారు. తొలుత అమెరికాలోనూ, ఆ తరువాత కెనడాలొనూ పెట్టుబడుల వేట కొనసాగించే లక్ష్యంతో లోకేష్ పర్యటించనున్నారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ నారా లోకేష్ డల్లాస్ సహా అమెరికా రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్ఆర్ఐలతో సమావేశం అవుతారు. అలాగే అమెరికాలోని అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. ఈ భేటీలన్నీరాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సాగనున్నాయి. అలాగే అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన రోజుల వ్యవధిలోనే అంటే డిసెంబర్ 11 నుంచి రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్న లోకేష్ ఆ పర్యటనలో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఈ భేటీల లక్ష్యం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రపప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వారికి వివరించడమే.  లోకేష్ తన పర్యటన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక పెట్టుబడుల హబ్ గా తీర్చిదిద్దడమేనని చెబుతున్నారు. 

కొత్తగూడెం రైల్వేస్టేషన్‌‌లో బాంబు పేలుడు

  భద్రాది కొత్తగూడెం రైల్వేస్టేషన్‌‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఓ సంచిలో ఉన్న బాంబును వీధి కుక్క రైల్వే ట్రాక్‌‌పైకి నోటితో లాక్కెళ్లింది. ఆ సంచిలో ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబును కుక్క కొరింది. దీంతో భారీ శబ్దంతో బాంబు పేలుడు సంభవించింది. కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ బాంబు పేలుడుతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో.. కొత్తగూడెం 3వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అంటూ పోలీస్ జాగిలాలతో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆగంతకుడు ఎటువైపు నుంచి వచ్చాడు. ఎటువెళ్లాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన మరసటి రోజే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు

  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటించారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు.  కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు ప్రారంభించామని తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి జలాలను కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం. పెన్నా వరకూ తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.  

విజయవాడకు మరో ఫ్లై ఓవర్ .. 500 కోట్ల వ్యయం!

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65ను సిక్స్ లేన్ గా విస్తరించడంలో భాగంగా   నగర పరిధిలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం జగరనుంది.  గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర  ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కానుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి దాదాపు 500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందనిఅంచనా.  ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తీరిపోయినట్లేనని చెబుతున్నారు.    ఇంతకీ ఈ ఫ్లై ఓవర్ ఎందుకంటే.. ఎన్ హెచ్ 65ను ఆరు లేన్ల రహదారిగా విస్తరించడానికి   భూమి ఆర్‌ఓడబ్ల్యూ 60 మీటర్లు ఉండాలి.  అయితే గొల్లపూడి, కనకదుర్గ వారథి మధ్య అంత వెడల్పు స్థలం లేదు.  రహదారి పక్కన స్థల సేకరణ భారీ వ్యవంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మార్కెట్ ధర ప్రకారమే ఇక్కడ గజం రమారమి లక్ష రూపాయలు ఉంటుంది. అంటే ఈ ఐదుకిలోమీటర్లూ రహదారి విస్తరణకు వెయ్యి కోట్ల రూపాయలు కేవలం భూసేకరణకే అవసరమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం తెరపైకి వచ్చింది.  భూసేకరణకు వెచ్చించాల్సిన మొత్తంలో సగం ఖర్చు పెడితే చాలు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తవుతుంది.   ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో భారీ పైవంతెన నిర్మాణం కష్టమని భావించినప్పటికీ ఒకవైపు ట్రాఫిక్‌ వదిలి మరోవైపు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత డీపీఆర్‌ ప్రాజెక్టు అప్రైజల్‌ అండ్‌ టెక్నికల్‌ స్క్రూటినీ కమిటీ వద్ద ఉంది. అక్కడ ఆమోదం లభించగానే.. మిగిలిన దశల్లో పరిశీలన పూర్చి చేసి వచ్చే ఏడాది నాటికి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  విజయవాడ -హైదరాబాద్‌ మార్గంలో మొత్తం 221.5 కిలోమీటర్ల రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించాలన్నది ఎన్ హెచ్ ఏఐ ప్రణాళిక. అందుకు అనుగుణంగా తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్‌ సమీపంలోని దండు మల్కాపూర్‌ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకూ విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవరించి,  అనుమంచిపల్లి నుంచి గొల్లపూడి వరకూ రోడ్డు విస్తరణకు ఆదేశించింది.