523 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

      కోల్ కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 523 పరుగులకు ఆలౌటైంది. 509/6 పరుగులతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దెబ్బకి 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 207 పరుగుల ఆధిక్యం లభించింది. నాల్గో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే ప్రజ్ఞాన్ ఓజా గ్రేమ్ స్వాన్ ఔట్ చేసాడు. తర్వాతి ఓవర్లో జహీర్ ఖాన్ మరో ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ మాట్ ప్రియర్ ను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తర్వాత అశ్విన్ రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, మాంటీ పనేసర్ ను ఔట్ చేసాడు. ఇండియా బౌలర్లలో ఓజాకు నాలుగు వికెట్లు లభించగా, అశ్విన్ కి మూడు వికెట్లు, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.

రామ్ చరణ్ జోక్యంతో వాయిదా పడ్డ ‘నాయక్’ ఆడియో

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, అందాల భామలు కాజల్ అగర్వాల్, మరియు అమల పాల్ కలిసి నటించిన ‘నాయక్’ సినిమా గురించి అభిమానులు చాల ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వివివినాయక్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో భారిఅంచనాలే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి వారంలోనే ‘ఫస్ట్-లుక్-స్టిల్స్’ రిలీజ్ చేసిన వినాయక్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది కూడా మంచి యాక్షన్ సీన్లకి సంబందిచినవి కావడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి వారంలోనే సినిమాకి మంచి క్రేజ్ సృష్టించగలిగేడు.   ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి బరిలో దిగబోతోందని ముందే ప్రకటించేరు. ఇక, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా ఈనెల 14వ తేదిన హైదరాబాదులో గల శిల్పకళా వేదికలో ఘనంగా జరిపేందుకు ముందు అనుకొన్నపటికీ, రామ్ చరణ్ జోక్యం తో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్నదానికంటే మరింత భారి ఏర్పాట్లు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరూ పాల్గోనేవిదంగా ఘనంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆతను సలహా ఇచ్చినట్లు తెలిసింది. అందుకే, 14న జరుపదలపెట్టిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదిగాకుండా, ఆ రోజు రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాకోసం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకొంటుంనందువల్ల ఫంక్షన్ మరో రోజుకి వాయిదా వేసుకొంటే బాగుంటుందని దర్శకుడు వినాయక్, నిర్మాత దానయ్య కూడా అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. అందువల్ల త్వరలోనే మరో తేది ప్రకటించే అవకాశం ఉంది.   నిర్మాతలు: దానయ్య మరియు రాధాకృష్ణ, బ్యానర్:యూనివర్సల్ మీడియా; దర్శకత్వం:వివి వినాయక్; సంగీతం: తమన్, కేమెర: చోట కే.నాయుడు.

కేన్సరంటే నాకు భయం లేదు: మనీషా కొయిరాలా

    బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు అండాశయ కేన్సర్ అని వైద్యులు నిర్థారించారు. తను అండాశయ కేన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాత తొలిసారిగా స్పందించారు. మనీషా ట్విట్టర్ లో తనకు  కేన్సర్ కేన్సర్ వ్యాధి అంటే భయం లేదనీ ,  అభిమానులు కూడా తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని  పేర్కొంది. అభిమానుల ప్రేమాభిమానాలతో తిరిగి తను పూర్తి  ఆరోగ్యంతో  ఇండియా వస్తానని చెప్పింది .  కేన్సర్ వ్యాధి నుంచి కోలుకుంటానన్న నమ్మకం ఉందని పేర్కొంది. తన  ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొంది. 

ధోని 50..ఇండియా 316 ఆలౌట్

    ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో భారత్ 316 పరుగులకు ఆలౌటైంది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జహీర్ ఖాన్(6), ఇషాంత్ శర్మ(0)తో ఔటయ్యారు. ఒంటరి పోరాటం చేసిన ధోని 52 పరుగుల చేసి అవుటవ్వడంతో ఇండియా 316పరుగులు చేయగలిగింది.ఇంగ్లాండు బౌలర్లలో అండర్సన్ మూడు, పనేసర్ నాలుగు, స్వాన్ ఒక వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ఇండియా 47 పరుగుల వద్ద సెహ్వాగ్ 23 తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత పనేసర్ పుజారాను 16 పరుగుల వద్ద అవుట్ చేశాడు. గంభీర్ 60 అర్థ సెంచరీ చేసి పనేసర్ బౌలింగులో ట్రాట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమవుతూ వస్తున్నాడు. కేవలం ఆరు పరుగులు చేసి కోహ్లీ అండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత కాసేపటికి వచ్చిన యువరాజ్ సింగ్ నిలదొక్కుకున్నట్లుగానే కనిపించాడు. అయితే 32 వ్యక్తిగత పరుగుల వద్ద స్వాన్ బౌలింగులో కుక్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 215 పరుగుల వద్ద భారత్ 5 వికెట్ కోల్పోయింది. సచిన్ టెండూల్కర్ సెంచరీ దిశగా వెళ్తున్న సమయంలో అతను అండర్సన్ బౌలింగులో ప్రియర్‌కు దొరికిపోయాడు. సచిన్ రూపంలో ఆరో వికెట్ భారత్ కోల్పోయింది. సచిన్ 76 పరుగులు చేశాడు. భారత్ స్కోర్ 230 వద్ద ఉన్నప్పుడు ఔటయ్యాడు. ఇది టెండూల్కర్‌కు 66వ అర్థ సెంచరీ.

జగన్ పార్టీలోకి మాజీ మంత్రి వసంత

    తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా కేడిసిసి బ్యాంకు చైర్మన్ గా ఉన్న వసంత గతంలో ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పని చేశారు. జిల్లాలోని నందిగామ మండలం ఇతవరం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి వసంత జగన్ పార్టీ లో చేరారు. తన కుమారుడు వెంకట కృష్ణ కూడా జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ పార్టీలో చేరి, వైఎస్ ఋణం తీర్చుకుంటానని వసంత అన్నారు. 1983-84 మధ్య కాలంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో వసంత రాష్ట్ర హోం మంత్రిగా పని  చేశారు. అయితే, వసంత జగన్ పార్టీలో చేరికఫై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఎంపి లగడపాటి రాజ్ గోపాల్ తో వైరం వల్ల జగన్ పార్టీలో చేరారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.

ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఏది...?

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరో నెల రోజుల వ్యవధిలో విడుదల అయ్యే అవకాశం ఉంది, ఇక సుకుమార్ తో సినిమా ఆ తర్వాత వస్తుంది. మరి ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా ఏది? ఇకపై వేగంగా సినిమాలు చేస్తానని మాట ఇచ్చిన మహేశ్ బిజినెస్ మ్యాన్ తర్వాత మాట నిలుపుకోలేదు. ఆ సినిమా విడుదల అయిన ఏడాదికి కానీ మళ్లీ ప్రేక్షకులను పలకరించలేదు. మరి వరసగా రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందిప్పుడు. ఆ రెండు విడుదలయిన తర్వాత మళ్లీ ఏడాది వరకూ మళ్లీ మహేశ్ సినిమా ఏదీ విడుదల అయ్యే అవకాశం కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ తర్వాతి ప్రాజెక్టు విషయంలో కన్పర్మేషన్ లేదు. అయితే రూమర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. మహేశ్ బాబు, క్రిష్, అశ్వినీదత్ కాంబినేషన్ లో ఒక సినిమా రావొచ్చు అని అంటున్నారు. దాని పేరు ‘శివం’ అని ప్రచారం లో ఉంది. ఇంకా మహేశ్, శ్రీనువైట్ల కాంబోలో మరోసినిమా వస్తుందంటున్నారు. ఇది కూడా కాదంటే…మహేశ్ కొంచెం రిలీఫ్ కోసం ఒక బాలీవుడ్ పిక్చర్ చేసే యోచన కూడా ఉందట! మరి వీటిలో ఏది పట్టాలెక్కుతుందో!

రవితేజ 'సారొచ్చారు' ఆడియో ట్రాక్ లిస్ట్

    మాస్ మహరాజ రవితేజ కొత్త సినిమా ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. రేపు ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేసారు. రవితేజ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్ని మంచి మ్యూజికల్ హిట్ అయ్యాయి. ‘సారొచ్చారు' లో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ‘సారొచ్చారు' ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్: 1. మేడ్ ఫర్ ఈచ్ అదర్ 2. జగదేక వీరా 3. రచ్చ రంబోలా... 4. గుస గుస 5. కాటుక కళ్లు

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా

    పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా 309 పరుగులతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాదించింది. 40/0 పరుగులతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకి 322 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి బ్యాట్స్ మెన్ మైఖేల్ స్టార్క్, నాథన్ లియోన్‌లు కొద్ది సేపు పోరాడి వెనుదిరిగారు. స్టార్క్ 68, లియోన్‌లు 43 పరుగులు చేశారు. డేల్ స్టెయిన్, రాబిన్ పీటర్స్ మూడేసి, మార్నే మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. సఫారీ జట్టు 1-0తో సిరీస్ సొంతం చేసుకొని టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

లంకలో టెస్ట్ గెలిచిన కివీస్

    శ్రీలంక ఫై న్యూజీలాండ్ జట్టు 14 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్ లో విజయం సాధించ గలిగింది. చివరి సారిగా 1998 లో కివీస్ లంక గడ్డ ఫై విజయం సాధించింది. దీనితో రెండు మ్యాచ్ ల సిరీస్ లో చెరో జట్టు విజయాన్ని సాధించి రెండు జట్లు ట్రోఫీ ని పంచుకున్నాయి. 363 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో శ్రీ లంక 195 పరుగులకే కుప్ప కూలి కివీస్ చేతిలో 167 పరుగుల ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ లో కివీస్ మొదటి ఇన్నింగ్స్ లో 412 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ ను  194/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీ లంక తొలి ఇన్నింగ్స్ ను 244 పరుగుల వద్ద ముగించగా, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు అల్ అవుట్ అయింది.  శ్రీ లంక రెండో ఇన్నింగ్స్ లో మాథ్యూస్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలన బాట్స్ మన్ ఎవరూ 30 పరుగుల స్కోరును కూడా చేయలేక పోయారు. రాస టేలర్ కు ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, హెరాత్ కు ‘ ప్లేయర్ అఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.  

దర్శిలో వెలసిన దిగంబర బాబా

    ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఓ గుట్టమీద దిగంబర బాబా వెలిశాడు. ఒంటిమీద నూలుపోగైనా లేకుండా యజ్ఞాలూ, యాగాలు చేయడం ఈయన ప్రత్యేకత. ఈ పూజలకు ఎవరైనా హాజరు కావొచ్చు. ఎంతసేపైనా చూసిపోవచ్చు.   బాబాకి చాలా మహిమలున్నాయని, ఆయన్ని చూస్తే చాలు సమస్యలన్నీ తీరిపోతాయనీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరగడంతో చిన్నా పెద్దా తేడాలేకుండా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పూర్తిగా దిగంబరంగా ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మహిళలుకూడా అశేషంగా తరలిరావడం మరో విశేషం.   భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేవుగానీ.. మహిళా సంఘాలు మాత్రం బాబా తీరుపై విరుచుకు పడుతున్నాయి. ఆడవాళ్లు తిరిగే చోట బట్టలూడదీసుకుని కూర్చోవడమేంటంటూ నిలదీశాయి. మాట వినకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాస్త సాఫ్ట్ గానే ఉపదేశం చేశాకగానీ బాబా బట్టలు కట్టుకోలేదు.

అత్యాచారం, దారుణ హత్య

    హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ వివాహితను ఎత్తుకెళ్లి గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి చంపేశారు. ఆల్వాల్ జవహర్ నగర్ లో పదిరోజుల్లో ఇలాంటిది ఇది రెండో దారుణ హత్య కావడం విశేషం.   పదిరోజుల క్రితం పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు దారుణంగా చెరిచి తమ గుట్టు బైటపడుతుందేమోనని చంపేశారు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.   మహారాష్ట్రకి చెందిన దత్తూరాజ్, సక్కుబాయ్ హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో ఉన్న జవహర్ నగర్ లో ఉంటూ కూలిపని చేసుకు బతుకుతున్నారు. పిల్లాడికి అన్నం ఇచ్చేందుకు స్కూల్ కెళ్లిన సక్కుబాయి రాత్రియినా తిరిగి రాకపోవడంతో దత్తూరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   మర్నాటి ఉదయం రచన కాలనీలో సక్కుబాయి శవం పోలీసులకు దొరికింది. ఎవరో దారుణంగా చెరిచి గొంతుకోసి మరీ చంపేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. క్లూస్ టీమ్ ఆధారాల్ని సేకరించింది. జాగిలాల్ని రంగంలోకి దించారు.

ముంబై టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లాండ్ పై చిత్తుగా ఓడిన ఇండియా

    స్పిన్ పిచ్, స్పిన్ పిచ్ అని పట్టుబట్టినా ధోనికి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు బంతిని గింగరాలు తిప్పిన పిచ్ పై ఇండియన్ స్పిన్నర్లు ఏమి చేయాలేక నోర్లు వెళ్ళబెట్టారు. తొలి టెస్ట్ పరాజయానికి ఇంగ్లాండ్ మాత్రం గట్టిగా ప్రతికారం తీర్చుకుంది. పది వికెట్ల తేడాతో భారత్ ను చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్ ను సమం చేసింది.   ఏడు వికెట్లకు 117 పరుగుల వద్ద ఆటను ప్రారంభించిన ఇండియా 142 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 56 పరుగుల ఆధిక్యత లభించింది. గంభీర్ ఒక్కడే కాస్తా నిలబడి 65 పరుగులు చేసి స్వాన్ బౌలింగులో అవుటయ్యాడు. ఇంగ్లాండ్ మాత్రం 56 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేదించింది. ఇంగ్లాండు స్పిన్నర్లు పనేసర్, స్వాన్ ఇండియా బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశారు. పనేసర్ ఆరు వికెట్లు తీసుకోగా, మరో స్పిన్నర్ స్వాన్ 4 వికెట్లు పడగొట్టాడు.

ఓజా స్పిన్ మాయ, ఇంగ్లాండ్ ఆలౌట్

    నిలకడగా ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బాట్స్ మెన్లు లంచ్ తరువాత ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కి క్యూకట్టారు. 178 పరుగులతో మూడో రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆటను ప్రారంభించింది. కుక్ 270 బంతుల్లో 122 పరుగులు, పీటర్సన్ 233 బంతుల్లో 186 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఎవరూ బాగా ఆడలేదు. ఇంగ్లాండ్ 413 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ స్పిన్నర్లు రెచ్చిపోయి ఆరు వికెట్లు తీశారు. ప్రజ్ఞాన్ ఓఝా 5, హర్భజన్ సింగ్ 2, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. ప్రయర్‌ను కోహ్లీ బౌలింగ్‌లో ధోనీ రనౌట్ చేశాడు. కీలకమైన కుక్ వికెట్‌ను అశ్విన్, పీటర్సన్ వికెట్‌ను ఓఝా తీశారు.

ఇండియా 327 ఆలౌట్

    ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 327 పరుగులకు ఆలౌటైంది. ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ బ్యాట్స్ మెన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశారు. భారత బాట్స్ మాన్ లలో పుజారా ఒంటరి పోరాటం చేసి 350 బంతుల్లో పుజారా 12 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. అశ్విన్ పరుగులు చేశాడు. మిగిలిన భారత బాట్స్ మ్యాన్లు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సెహ్వాగ్ 30, ధోనీ 29, భజ్జీ 21, కోహ్లీ 19, జహీర్ ఖాన్ 11, సచిన్ 8, సెహ్వాగ్ 30, గంభీర్ 4 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పనేసర్ ఐదు వికెట్లు పడగొట్టగా, స్వాన్ నాలుగు వికెట్లు,ఆండర్సన్ ఒక వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ పై పుజారా దూకుడు

    ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకవైపు వికెట్లు పడుతున్న పుజారా మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరి చేసిన పుజారా, రెండో టెస్టులో కూడా సెంచరీతో ఇండియాకి అండగా నిలిచాడు. అశ్విన్ కూడా హాఫ్ సెంచరీతో పుజారాకి మంచి సహకారం అందిస్తున్నాడు. తన వందో టెస్టు మ్యాచులో శతకం చేస్తాడని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్ అబిమానులను నిరాశపరిచాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పనేసర్ నాలుగు వికెట్లు, అండర్సన్ ఒకటి, స్వాన్ ఒక వికెట్ తీశారు. 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల వద్ద ఆట ముగిసింది.   ఇండియా స్కోర్ వివరాలు : గౌతమ్ గంభీర్ : 4, సెహ్వాగ్ : 30, పుజారా (నాటౌట్) : 114, సచిన్ : 8, కోహ్లీ : 19, యువరాజ్ సింగ్: 0, కెప్టెన్ ధోనీ : 29, అశ్వీన్ (నాటౌట్) : 60, ఎక్స్‌ట్రా : 2.

ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం

    అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. 77 పరుగుల టార్గెట్ ను భారత్ ఒక్క వికెట్ నష్టపోయి చేదించింది. వీరేంద్ర స్వెవాగ్ పరుగులు చేసి స్వాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. పుజారా 41 విరాట్ కోహ్లీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఐదు వికెట్ల నష్టానికి 340 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండు 356 పరుగుల వద్ద ఆరో వికెట్ పడిపోయింది. ప్రియర్ 91 పరుగుల  వద్ద అవుటయ్యాడు. కెప్టెన్ అలిస్టిర్ కుక్ కూడా 176 పరుగుల వద్ద అవుటయ్యాడు.  365 పరుగుల వద్ద ఇంగ్లాండు కుక్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు.  రెండో ఇన్నింగ్సులో ఓజా నాలుగు వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు , జహీర్ ఖాన్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.  

కుక్ ఒంటరి పోరాటం, ఇంగ్లాండ్ 235/5

    అహ్మదాబాదులో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 123 పరుగుల వద్ద కామ్టన్ జహీర్ ఖాన్ బౌలింగులో అవుట్ కాగా, ఓజా బౌలింగ్‌లో పీటర్సన్, ట్రాట్ వెనుదిరిగారు. ఉమేష్ యాదవ్ రెండు వరుస బంతుల్లో ఇయాన్ బెల్, సమిత్ పటేల్‌ను ఔట్ చేశాడు. నాల్గో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆల్ ఔట్ అయిన ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడుతోంది. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా కుక్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేశాడు. కామ్టన్ 37, ట్రాట్ 17, పీటర్సన్ 2, ఇయాన్ బెల్ 22 పరుగులు చేసి అవుటయ్యారు. సుమిత్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 230పరుగులతో ఆడుతోంది.