చెన్నై టెస్ట్ : ఆస్ట్రేలియా పై ధోని డబుల్ ధమాకా

 

 

 

 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇండియా సెంచరీల మోత మోగించింది. మూడోరోజు సెంచరీ చేస్తాడనుకున్న మాస్టర్ సచిన్ అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ, ధోనిలు మాత్రం అదరగొట్టారు. సచిన్ టెండూల్కర్ 81 పరుగుల చేసి లియాన్ బౌలింగులో అవుటయ్యారు. ఆతరువాత క్రీజులో వచ్చిన ధోని తన ధనాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. వరుసగా వికెట్లు పోతున్నా ధోనీ నిబ్బరంగా ఆడుతూ 200 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం స్కోరు 515 ఎనిమిది వికెట్లు కోల్పోయింది.  ఆసీస్ పై ఇండియా 135పరుగుల ఆధిక్యం సాధించింది.

ధోనీ నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటడమే కాకుండా తొలిసారి డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో డబుల్ చేయడం ధోనీకి ఇదే తొలిసారి. 231 బంతుల్లో ద్విశతకం చేసిన ధోనీ 21 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ధోనీ ఇప్పటి వరకు 74 టెస్టుల్లో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలు చేశాడు. 2005 డిసెంబర్ 5న ధోనీ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. మళ్లీ అదేగట్టపై ధోనీ తొలి డబుల్ సెంచరీ చేశాడు.

బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో నేడు కేసీఆర్ సమావేశం

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో సమావేశమవనున్నారు.  పాలమూరు-రంగారెడ్డి పథకంపై కేసీఆర్ చర్చించానున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చినా, ప్రస్తుత రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఐసిస్ లక్ష్యంగా ఇజ్రయిల్‌లో యూఎస్ భీకర దాడులు

  గత కొంత కాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా, ఉక్రెయిన్ - రష్యా, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఐసీస్ టెర్రరిస్టులపై అటాక్ చేసింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరకా భారీగా దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంాఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తాజాగా  ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని సొకోటో రాష్ట్రంలో ఐసీస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమాయక క్రైస్తవులపై మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులపై చర్య తీసుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ చేశారు. నైజీరియాలో క్రైస్తవ మతం అస్తిత్వానికి ముప్పు ఉందని ట్రంప్ అన్నారు.  పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు హింస కొనసాగిస్తున్నారని చెప్పారు. అలా చేస్తే భవిష్యత్ లో నరకం అనుభవించాల్సి వస్తుందని ఐసిస్ ని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. మా యుద్ద వీరులు అద్భుతంగా తమ వ్యూహాలను అమలు పరిచారు. అది కేవలం యునైటెడ్ స్టేట్స్ మాత్రమే చేయగలదు. నా నాయకత్వంలో అమెరికా రాడికల్ ఇస్తామిక్ ఉగ్రవాదాన్ని పెరగనివ్వదు. క్రైస్తవులపై దాడులు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటా. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అంటూ ట్రంప్ స్పందించారు. కాగా, ఈ దాడులను యూఎస్ ఆఫ్రికా కమాండ్ ధృవీకరించింది. కాకపోతే ఎంతమంది చనిపోయారన్న విషయం వెల్లడించలేదు. ఇటీవల క్రైస్తవులపై ఐసీస్ దారుణంగా దాడులు చేసింది. మారణహోమం సృష్టించి వేల మందిని హతమార్చింది. ఈ క్రమంలోనే నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు ఐసిస్ పై దాడి జరిగినట్లు యూఎస్ మిలిటరీ ఆఫ్రికా కమాండ్ తెలిపింది.

తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సమ్మేళనం

తిరుపతి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం (డిసెంబర్ 29) వరకూ నాలుగు రోజులపాటు భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరగనుంది.  తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే ఈ సమ్మేళనానికి  32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించి, సమగ్ర అభివృద్ధి కోసం భారతీయ దృక్పథాన్ని ప్రోత్సహించే జాతీయ స్థాయి కార్యక్రమం.  సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచ స్థాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో అనుసంధానం చేసి భావితరాలకు అందించే ఆశయం తో విజ్ఞన భారతీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 2007 నుంచీ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. తొలి సమ్మేళనం భూపాల్ లో జరిగింది. ఆ తరువాత  2009 లో ఇండోర్, 2012 లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023 లో అహ్మదాబాద్ లో భారతీయ విజ్ణాన సమ్మేళనాలు జరిగాయి. ఈ ఏడు తిరుపతి వేదికగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమం జరుగనుంది. ఇందులో సదస్సులు, మేధావుల చర్చలు, చర్చా గోష్టిలు, విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఎక్స్ పో లో  వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు,  80 పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.  ఈ  భారతీయ విజ్ణాన ప్రదర్శన ప్రారంభ సభకురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిధులుగా హాజరౌతారు.  కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే,  డీఆర్డీవో  మాజీ డైరెక్టర్ జనరల్, రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎన్ఐఎఫ్  డైరెక్టర్ అరవింద్ రాణాడే,  దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థల డైరెక్టర్లు, వివిధ యూనివర్సిటీల వీసీలు, పరిశోధకులు  పాల్గొంటారు. ఇక 29న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరౌతారు.

గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సాకారం కానుందా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా వార్తలలో ఉన్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే  దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విజయవాడ కార్పొరేషన్ ను విస్తరించి గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ గా చేయాలన్నదే ఆ ప్రతిపాదన. ఇందుకు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 74 గ్రామాలను   విలీనం చేసి.. గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నదే ఆ ప్రతిపాదన. అమరావతికి ఆనుకుని ఉన్న నగరం విస్తరణ అత్యంత ముఖ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఆ ప్రతిపాదనలో ఒక కదలిక వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం (డిసెంబర్ 25) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వివరించారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి తోడుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరించాలని విజ్ణప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి చాలా కాలంగా  గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉంది. ఆ అంశాన్నే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి సత్వరమే విజయవాడ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తసుకోవాలని కోరారు. తక్షణమే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య   ఆ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు. జీవీఎంసీపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని చిన్ని అన్నారు.

బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్ లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  ఆ దేశంలో దీపూ చంద్ర దాస్ దారుణ హత్య మరవకముందే, రాజ్‌బర్ జిల్లాల్లో మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. బుధవారం (డిసెంబర్ 24 రాత్రి ఈ దారుణం జరిగింది.   రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో   29 ఏళ్ల అమృత్ మొండల్ అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే  అమృత్ మొండల్  ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.  అమృత్ మండల్ సామ్రాట్ బహిన్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఆ సంస్థ పేరిట సొమ్ములు వసూలు చేస్తూ, దౌర్జన్యాలకూ, హింసాకాండకూ పాల్పడుతున్నాడన్న అభియోగాలు ఉన్నాయి. అతడిపై   హత్యా నేరం సహా రెండు కేసులు ఉన్నాయి. అదలా ఉంచితే  గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉన్న అమృత్ మొండల్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగింది.  ఇదలా ఉండగా హిందువులు లక్ష్యంగా బంగ్లాదేశ్ లో దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ లో హిందువులకు కుటుంబాలు లక్ష్యంగా ఏడు దాడులు జరిగాయి. ఏడు గృహాలు దగ్ధమయ్యాయి. 

అమరవతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు తోడు కొత్త నిర్మాణాలకూ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు మంత్రి నారాయణ గురువారం (డిసెంబర్ 25)శంకు స్థాపన చేశారు. ఈ ఐకానిక్ భవన నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన  రెండు బేస్‌మెంట్ అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. 52 కోర్టు హాళ్లు ఉంటాయన్నారు. ఇందు కోసం 45 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు శాశ్వత నిర్మాణ పనుల ప్రారంభాన్ని ఒక చారిత్రక ఘట్టంగా మంత్రి నారాయణ అభివర్ణించారు.  ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ  నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అద్భుతమైన డిజైన్‌తో ఈ హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ హైకోర్టు శాశ్వత భవనానికి రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే.. భవనం మొత్తం బరువును నేల అంతటా సమానంగా పంపిణీ చేయడానికి ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనినే  రాఫ్ట్   ఫౌండేషన్ అంటారు. నేల స్వభావం మెత్తగా ఉన్నప్పుడు లేదా భవనం బరువు భారీగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది భవనానికి  పటుత్వాన్ని ఇస్తుంది.   

భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదలీ వేటు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదలీ వేటు పడింది. ఆయన స్థానంలో   రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. బదలీ వేటు పడిన జయసూర్యకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలనిఆదేశాలు జారీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.  జయసూర్య  పనితీరుపై పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన తీరుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు నెలల కందటే డీఎస్పీ జయసూర్య అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.  అయితే అప్పట్లో జయసూర్యకు మద్దతుగా ఆయన సమర్ధుడైన అధికారి  అంటూ ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్   రఘురామ కృష్ణరాజు కితాబివ్వడం సంచలనం సృష్టించింది. పవన్ కల్యాణ్ ఆదేశించినా, ప్రభుత్వం విచారణ జరుగుతోందని ప్రకటించినా గత రెండు నెలలుగా డీఎస్పీ జయసూర్యపై ఎటువంటి చర్యా లేదు.  ఇప్పుడు హఠాత్తుగా ఆయనపై బదలీ వేటు పడింది. అయితే జయసూర్యపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు అంటున్నారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు అంతర్గ విచారణలో నిరూపితం కాకపోవడం వల్లనే రెండు నెలల తరువాత బదలీ వేటు వేశారనీ, ఒక వేళ ఆరోపణలు నిరూపితమై ఉంటే సస్పెండ్ చేసి ఉండేవారనీ అంటున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సిట్ స్పీడ్ మామూలుగా లేదుగా?

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణ  గురువారం (డిసెంబర్ 25)  అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో సిట్ దూకుడు పెంచింది.  ప్రభాకరరావు కస్టడీ గడువు ముగుస్తున్న రోజే కేసులోని కీలక నిందితులందరినీ ఒకేసారి విచారించేందుకు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావు, మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావుతో పాటు మరికొందరిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ప్రభాకరరావు కస్టడీ గడువు ముగిసే చివరి రోజున సిట్ ఒకే సారి వీరందరినీ విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించి కీలక అంశాలపై సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 14 రోజుల కస్టోడియల్ విచారణలో  ప్రభాకరణావు చాలా వరకూ ప్రశ్నలన్నిటికీ నో అనే సమాధానాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌లుగా పనిచేసిన నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ప్రస్తావించినప్పటికీ, ఆరు వేల ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ విషయంపై   ప్రభాకర్‌రావు మౌనం వహించినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, మావోయిస్టుల అంశంపైనే మాజీ మంత్రి హరీష్‌రావు తనతో మాట్లాడినట్టు చెప్పిన ప్రభాకర్‌రావు, తనకు అప్పటి సీఎం  కేసీఆర్ రీ-ఎంప్లాయిమెంట్‌ను ఎలా ఇచ్చారన్న విషయంపై మాత్రం స్పందించలేదని సమాచారం. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితమే ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావులను కలిపి సిట్ విచారించింది. ప్రణీత్‌రావును దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, ఇవాళ ఆయన మినహా మిగిలిన నిందితులందరినీ విచారించారు. అలాగే ప్రభాకర్‌రావు పెద్ద కుమారుడు నిశాంత్‌రావును సైతం  నాలుగు గంటల పాటు విచారించిన సిట్, ఆయన ఆర్థిక లావాదేవీలపై వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసుకు అనుబంధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా సిట్ దృష్టి సారించింది. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్‌ను విచారణకు పిలిచి, ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించింది. తన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై తనను సిట్ ప్రశ్నించిందని నందకుమార్ వెల్లడించారు. అప్పుడే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న అనుమానం వచ్చినట్టు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సిట్‌కు సమర్పించినట్టు   తెలిపారు.  మరోవైపు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను మరోసారి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను శుక్రవారం (డిసెంబర్ 26)  సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు నోటీసుల అంశంపైనా కీలక చర్చ జరుగుతోంది. అదేవిధంగా, బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులను విచా రిస్తున్న సిట్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ స్థాయి అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇవాళ్టితో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ, అధికార వర్గాల్లో నెలకొంది.

మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే హతం

ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న అగ్ర మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే అలియాస్ పాకా హనుమంతు భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో  హతమయ్యాడు. కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో గురువారం (డిసెంబర్ 25)   ఒడిశా ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ , సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన కూబింగ్ ఆపరేషన్  ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో  గణేష్ ఉయికేతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా  ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక పోతే ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన గణేష్ ఉయికే సీపీఐ  మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు. మోస్ట్ వాంటెడ్  మావోయిస్టుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. గణేష్ ఉయికేపై   . మొత్తం కోటి రూపపాయల రివార్డు ఉండగా, తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా పాతిక లక్షల రివార్డు  ప్రకటించింది. తెలంగాణలోని  నల్గొండ జిల్లా చందూర్ మండలం పుల్లెమ్ల గ్రామానికి చెందిన గణేష్ ఉయికే, బీఎస్సీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి, క్రమంగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ అగ్రస్థాయి నేతగా ఎదిగారు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మిగిలి ఉన్న కేవలం ముగ్గురు సభ్యుల్లో గణేష్ ఉయికే ఒకడిగా భద్రతా సంస్థలు గుర్తించాయి. మిగిలిన వారిని  ఛత్తీస్‌గఢ్‌లో మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, జార్ఖండ్‌లో అనాల్డా అలియాస్ తూఫాన్‌ మాత్రమే. ఇదిలా ఉండగా, మావోయిస్టు పాలిట్‌బ్యూరో సభ్యుల్లో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిషిర్ బేస్రా ఇంకా పరారీలో ఉన్నారు. మరోవైపు, పాలిట్‌బ్యూరో సభ్యులు వెనుగోపాల్ రావు అలియాస్ సోను, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న ఇప్పటికే లొంగిపోయారు. గణేష్ ఉయికే హతంతో ఒడిశా, పరిసర రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భద్రతా దళాలు చెబుతున్నాయి.ఇలా ఉండగా గణేష్ ఉయికే ఎన్ కౌంటర్ పై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు.  తాజా ఎన్కౌంటర్తో నక్సల్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందన్న ఆయన.. వచ్చే ఏడాది మార్చి 31లోగా దేశంలో  మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.   

ఆంధ్ర కురియన్, ఉక్కు కాకాని... మన మహనీయుడు వెంకటరత్నం

ప్రజాసేవే తన వృత్తి అని నమ్మి,  జీవితమంతా ప్రజలతోనే, వారి సేవలోనే గడిపిన ఆదర్శ నాయకుడు స్వర్గీయ కాకాని వెంకటరత్నం.  ఆయన మరణించి గురువారం (డిసెంబర్‌ 25) నాటికి సరిగ్గా  53 ఏళ్లు. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ జనంస్మరించుకుంటూనే ఉన్నారు.  దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన గ్రామీణ రైతు, కూలీ బంధువుగా వారికి చేయూతనందించిన ప్రజల మనిషి కాకాని వెంకటరత్నం. ప్రజానాయకునిగా అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకాని వెంకటరత్నం. ప్రజా పోరాటాలలో నిమగ్నుడైన ఆయనను ‘ఉక్కు కాకాని’ అని ప్రజలు ప్రేమగా పిలుచుకున్నారు. అసలు సిసలు ప్రజా నాయకుడైన  కాకాని వెంకటరత్నం చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే కాక, ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమంత్రిగా చేసిన కాలంలో ఆయన స్థాపించిన పాల సేకరణ కేంద్రాలు, శీతలీకరణ కేంద్రాలు, జిల్లా పాడి పరిశ్రమ కేంద్రాలు గ్రామీణ రైతాంగ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అందుకే కాకానిని చాలా మంది ‘ఆంధ్రా కురియన్‌’గా పిలుచుకుంటారు. కుల మతాలకి అతీతంగా ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం ఆయన నైజం. ముఖ్యంగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లంటే కాకానికి ప్రత్యేక అభిమానం. స్థానిక పనుల కోసం ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడకూడదనీ, స్థానికంగా ప్రజలు సహకరించుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందని కాకాని ప్రచారం చేసేవారు. ఆయనది ఎలిమెంటరీ స్కూల్ చదువే, అయినా ఎన్నో వేల మంది పెద్ద చదువులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులే కొద్దో గొప్పో విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేశారు. వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ మంత్రిగా కాకాని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు అమోఘం. గ్రామాల్లో పేదరికాన్ని, ముఖ్యంగా ఒంటరి మహిళ ఆర్థిక స్థితిగతులు మారాలంటే, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం పాడి, గుడ్డు ముఖ్యమని గమనించి, ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాడి పరిశ్రమలో మధ్యవర్తుల బెడద పోతేగాని బీదరికాన్ని నిర్మూలించలేమని నిర్ణయించుకున్నారు.  గ్రామాల్లో ఆయన సాధించిన విజయాలు చూసి జమీందార్లు, ఎంతోమంది భూ కామందులు కలిసి కాకానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండా ప్రయత్నించారు. అయినా కాకాని ప్రజానాయకుడుగా పేరొందారు. తమ సిద్ధాంతాలని వ్యతిరేకించే కాకాని వెంకటరత్నం, రైతు కూలీలకు   నాయకుడు అవ్వడం కమ్యూనిస్టులకి నచ్చలేదు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు, మనుగడకే ఆయన ముప్పు అని భావించారు. కమ్యూనిస్టు పార్టీ కాకాని మీద కత్తి కట్టి, ఆయన్ని చంపే ప్రయత్నాలు కూడా చేసింది. అయితే వాళ్లెవరూ కాకాని లంచగొండి అని శంకించకపోగా, ఆయన కార్యదీక్ష, క్రమశిక్షణను మెచ్చుకున్న వాళ్లే. కాకాని వెంకటరత్నం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కూడా 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, యువకులకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చెప్పి, ఉద్యమాన్ని ఉధృత స్థితికి తీసుకువెళ్లారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాల్ని, వ్యతిరేకిస్తూ గన్నవరం విమానాశ్రమంలో ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విమానం ఆగకుండా చేసినప్పుడు యువకుల మీద పోలీసులు జరిపిన కాల్పులను తట్టుకోలేక కాకాని చివరకు ప్రాణాలే విడిచారు. కాకాని ఆశించిన ప్రత్యేక రాష్ట్రం 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలయినా ఇంతవరకు ఆయన జ్ఞాపకార్థం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఆయన స్ఫూర్తి, స్మారణ చిహ్నం ఏర్పాటు చేయలేదు. అంతకు ముందెప్పుడో పెట్టిన కాకాని విగ్రహాన్ని కూడా తొలగించారు. విజయవాడలో ఆ సర్కిల్‌ని కాకాని పేరుతో కాకుండా  బెంజ్‌ సర్కిల్‌  అనే పిలుస్తున్నారు. ఎట్టకేలకు కాకాని విగ్రహాన్ని బ్రిడ్జి కింద అతి కష్టం మీద మళ్లీ పెట్టారు, అదీ జిల్లా ప్రముఖుల పట్టుదల వల్ల.  కనీసం ఈ 54వ వర్ధంతికైనా కాకాని వెంకటరత్నం పేరును   అమరావతి అవుటర్‌ రింగ్ రోడ్డు కు   పెట్టి ఆ మహనీయుడ్ని గౌరవించాలని అందరూ  కోరుకుంటున్నారు.