Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 18


    మా : మృత్యువును వరించడమా ?
    ఇం : ఓహొ - అవును. మృత్యువును వరించటం నిజానికి మృత్యువులో సుఖంవుంది. మృత్యువును వరించినవారు ఎందరో సుఖపడ్డారు. భవిష్యత్తునంతా గతంలోనికి ఇమిడ్చి, ఎంత సుఖన్నో అనుభవించి వుంటారు. ఒకరోజు నేనూ, చావవలసినవాణ్ణే. ఇవ్వాళే ఎందుకు చేరకూడదు?
    మా : అలా అనకు, నువ్వు బ్రహికివుండాలి.
    ఇం :  మనిషి బ్రతకాలంటే నమ్మకం  కావాలి. భగవంతుని మీద నమ్మకం - అదృష్టంమీద నమ్మకం - పనిమీద  నమ్మకం - మనిషిమీద నమ్మకం  - తిరుగుబాటుమీద నమ్మకం - తనమీద నమ్మకం - ప్రేమమీద నమ్మకం - ఇందులో ఏ ఒక్క నమ్మకం  - నాలో వుందో చెప్పగలవా ! మానసీ-
    మా : జీవితంమీద నమ్మకంవుందిగా?
     ఇం : జీవితం - పెద్ద  పెద్ద ప్రశ్నలకు సమాధానం దొరక్క - చిన్న చిన్న ప్రశ్నలతో రాజీపడి బ్రతకటం -ఇదేగా జీవితం? మానవజీవితం ? - నేను కోటానుకోట్ల మానవుల్లో ఒకణ్ని. నా జీవితంలోని మిధ్య - కోట్ల జీవితాల మిధ్య.
    మా : నీవు ఏం  చేయాలనుకొంటున్నావు ? ఏం చేస్తావు?
    ఇం :  ఏం చేస్తానా? అలసి నిద్రపోతాను. నవ్వేసి తేలిగ్గా  నిట్టరుస్తాను. అలా నవ్వేసి, వదలేయాటమే మంచిదిగా కనిపిస్తుంది. జీవితం హశ్యాస్పదమయింది. హసనాన్ని ఆపటం, నిరర్ధకం-
    (ఇంద్రజిత్ ఆకస్మాత్తుగా అట్టహాసం చేస్తాడు. మానసి రచయిత పక్కలకు వెళ్ళిపోతారు. తెలియకుండా  వాళ్ళు ముగ్గురూ గూడా అట్టహాసం చేస్తారు. రచయిత బాగా స్టేజీముందుకు వస్తాడు. రెండు చేతులూ ఎత్తి ప్రేక్షకులను, వాళ్ళు  నవ్వుతున్నట్లు నవ్వు ఆపటానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తాడు. అమల్ - విమల్ - కమల్ -  వెళ్ళిపోతారు. వారినవ్వూ క్రమంగా తగ్గిపోతుంది.)
    రచ : అలా నవ్వకండి. మీకు నమస్కారం చేస్తాను. కాస్త  ఆ నవ్వు ఆపండి. నిజమే-నాటకం- రాయటం నావల్ల అవటంలేదు. మీరు చూస్తూనే వున్నారుగా నేను  ఎంత ప్రయత్నిస్తున్నానో?
    అమల్ , విమల్ , కమల్ వాళ్ళ నాటకం ఇంద్రజిత్.
    (పిన్ని ప్రవేశిస్తుంది)
    పిన్ని : భోజనానికిరావా?
    రచ :రాను.
    (పిన్ని వెళ్ళిపోతుంది. మానసి ప్రవేశిస్తుంది.)
    మా : భోజనం చెయ్యవా ?
    రచ : (రెండు చేతులతో ముఖాన్ని దాచుకొంటూ) నువ్వు  కూడా....?
    మా : పోరాపాటయింది రాస్తున్నావా?
    రచ " ఎలా రాయను? ఇంద్రజిత్ తిరిగి రాడు. మూడు సంవత్సరాల్లో మూడు  ఉత్తరాలు రాశాడు.మూటిలోను ఒకటే ధోరణి...
    మా : ఏమిటి?-
    రచ : ఏముంది. తిరుగుతున్నాడు. చక్రంలా  తిరుగుతూనే వున్నాడు. చావటంలేదు. రకరకాల స్వప్నాలు బుర్రలో తిరుగుతున్నాయి. కాని, చావురాదు. జీవితాన్ని దాని అసలు రూపంలో చూసేవాణ్ని. జేవితాన్ని స్వప్నంలా తలచేవాణ్ని గురించి ఏ నాటకం వ్రాయను.
    మా : అలాంటివాణ్ని గురించే నాటకం రాయాలి?
    రచ : లాభంలేదు. ఎన్నిసార్లు అతణ్ని సంఘటనా చక్రంలో ఇరికించటానికి ప్రయత్నించానో అన్నిసార్లూ - అతను  ఆ చక్రం బయటకెళ్ళి పడుతూనే వున్నాడు. ఇది వాస్తవంకాదు అంటాడు. అతనిచేత ఎన్నో చెప్పించాలని ప్రయత్నిస్తాను. ప్రతిసారి - సంభాషణ పరిధిని దాటి వెళ్ళిపోతాడు. ఇది వాస్తవం కాదు అంటాడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అవసరమైన దానికంటే ఎక్కువగా తెలుసుకొన్నాడు.
    మా : అయినా అతను కలలు కనటం మానలేదు.
    రచ : కలలు ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోతాయిగా.
    మా : అవును, అదినాకూ - తెలుసు.  
    రచ : అలాంటప్పుడు.
    మా : కరగిపోనియ్.
    రచ : ఆ, తర్వాత ?
    మా : ప్రవాహాన్ని దాటటానికి, స్వప్నాల ఆధారం వుండదుగా?
    రచ : లేకపోతే  మునిగిపోతాడు.
    మా : మునిగిపోతే పోనియ్. అప్పుడైనా భవిష్యత్ ఆధారం దోరుకుతుంది. అక్కణ్ణుంచే  జీవితం ప్రారంభం కావచ్చును.
    రచ : ఇదంతా నీకు ఎలా తెలుసు ?
    మా : ఎలా తెలిసిందా ?ఏమిటి తెలిసింది? నాకు ఏమీ తెలియదు. నేను ఒక మూర్ఖురాలిని. నాకు తెలిసిందంతా - నమ్మటం మాత్రమే.
    (మానసి వెళ్ళిపోతుంది.)
    రచ : నమ్మకం ! పాతాళంమీద నమ్మకం.
    (ఇంద్ర ప్రవేశిస్తాడు.)
    ఇం : (కవిత)-
    ఆస్తికత్వపు, బలహీనతలో ఈదుతున్నాను.
    జీవిత భారాన్ని తృణంమీద వేసి ఈదుతున్నాను.
    పొగమంచు నిట్టూర్పుల్లో-
    వాక్కున్నాయి. తీరాలు రెండూ
    ఈ ప్రవాసంలో తెలుసుకున్నాను.
    ఒక తథ్యాన్ని-
    మేఘాలమాటున కన్పించే
    స్వర్ణ సామ్రాజ్యం.
    నక్షత్రమాలికల్లో
    తేలిపోతున్నా  స్వర్ణపూచాయ
    అన్నీ మిధ్యేవని తెలుసుకున్నాను.
    నిన్ను నేను  కోరేది ఒక్కటే.
    మిధ్యావచనాలతో
    నమ్మించకు ఈ లోకాన్ని
    పరంపరాగతంగా వస్తున్న
    ఆస్ధ ! విశ్వాసాలను తొలగించు
    నీ మనః పటలంనుండి-
    (స్వయంగా మునిగి చూడు భూమి ఎంత లోతుగా వుందో)
    మానవుడు క్రియా శీలుడు.
    మునిగికూడా తప్పిపోడు.
    అధికారాన్ని హస్తగతం చేసుకోటానికి
    వెనుకాడడు వెళ్ళడానికి
    పాతాళానికైనా-
    రచ : ఇంద్రజిత్ !
    ఇం : ఏమిటి ?
    రచ : నువ్వు తిరిగి వచ్చావా?
    ఇం : అవును.
    రచ : ఎప్పుడు వచ్చావ్ ?

 Previous Page Next Page