Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఇరవై రెండవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


ఇరవై రెండవ అధ్యాయము

 

 

 

పాము విషమునుంచి తప్పించుట 1. బాలాసాహెబు మిరీకర్. 2. బాపూసాహెబు బూటీ. 3. అమీర్ శక్కర్. 4. హేమాడ్ పంతు సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయము

బాబాను ధ్యానించటం ఎలా? భగవంతుని నైజముగాని, స్వరూపముగాని అగాధములు. వేదాలుగాని, వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషుడుగాని వాటిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపాన్ని చూసి కనుగొని తీరాలి. ఎందుకంటే తమ ఆనందానికి భగవంతుని పాదాలే ముఖ్యమార్గమని వారికి తెలుసు. జీవిత పరమార్థాన్ని పొందటానికి గురువు పాదాలనే ధ్యానించాలి కానీ యింకొక మార్గం లేదని వారికి తెలుసు. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చెప్పుచున్నాడు. అది ధ్యానానీ, భక్తికి కూడా అనుకూలిస్తుంది.
నెలలో కృష్ణపక్షంలో రానురాను వెన్నెల క్రమంగా క్షీణిస్తుంది. చివరికి అమావాస్యరోజు చంద్రుకు కనిపించడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం  ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూడటానికి ఆతృతపడతారు. మొదటి రోజు చంద్రుడు కనిపించడు. రెండవరోజు సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్యగుండా చూడమని చెపుతారు. ఆత్రుతతో, ధ్యానంతో ఆ సందుద్వారా చూసినప్పుడు దూరంగా వున్న చంద్రుని ఆకారం ఒక గీతలా కనిపిస్తుంది. వారు అపుడు సంతోషపడతారు. ఈ సూత్రాన్ని అనుసరించి బాబా తేజాన్ని చూద్దాము గాక. బాబా కూర్చున్న విధానం చూడండి. అది ఎంత సుందరంగా వుంది! వారు కళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసుకుని ఉన్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదంపై వేసుకుని వున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలు వున్న మధ్య వ్రేలు ఉన్నాయి. ఈ కూర్చున్న విధానాన్ని బట్టి చూస్తె బాబా మనకీ దిగువ విషయం చెప్పడానికి నిశ్చయించు కున్నట్టుంది. "నా ప్రకాశాన్ని చూడాలని వుంటే, అహంకారాన్ని విడిచి అత్యంత అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్యవ్రేలుకు మధ్య వున్న బొటన వ్రేలుపై దృష్టిని సారిస్తే నా ప్రకాశాన్ని చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం''
ఒక క్షణం బాబా జీవితాన్ని గమనిద్దాము. బాబా నివాసం వలన షిరిడీ ఒక యాత్రస్థలం అయ్యింది. అన్ని మూలాలనుండి ప్రజలు అక్కడ గుమిగూడుతూ ఉండేవారు. బీదవారు గొప్పవారు కూడా అనేక విధాలుగా మేలు పొందుతుండేవారు. బాబా యొక్క అనంతప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానాన్ని, వారి సర్వాంతర్యామి తత్త్వాన్ని వర్ణించగల వారెవ్వరు? వీటిలో ఏదైనా ఒకదాన్ని గాని, అన్నింటినీగానీ అనుభవించినవారు ధన్యులు. ఒక్క్జోక్కప్పుడు బాబా దీర్ఘమౌనాన్ని పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొక్కప్పుడు చైతన్యఘనులుగా ఉండేవారు. ఆనందంలో అవతారంగా భక్తులచే పరివేష్ఠితులై ఉండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొక్కప్పుడు హాస్యం, తమాషా చేయటంలో మునిగేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్తుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దింపేవారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధము అనేక విధాలుగా అనేకమందికి కలుగుతూ ఉండేది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేథాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాడు. వారి ముఖారవిందాన్ని చూడటంలో ఆసక్తిగాని, వారితో సంభాశించటంలోగాని, వారి లీలలు వినటంలోగాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుతుండేవారం. వర్షబిందువులను లెక్కించగాలం; తోలుసంచిలో గాలిని మూయగలం. కానీ బాబా  లీలలను లెక్కించలేము. వాటిలో ఒక్కదాన్ని గురించి చెబుతాము. భక్తుల ఆపదలను కనుగొని, భక్తులను వాటి బారినుండి సకాలంలో బాబా ఎలా తప్పిస్తూ ఉండేవారో యిక్కడ చెబుతాము.
బాలాసాహెబు మిరీకర్ :
సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకైన బాలసాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామలతదారుగా ఉండేవారు. అతను ఒకరోజు చితలీ గ్రామ పర్యటనకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో బాబాను చూడటానికి షిరిడీ  వచ్చారు. మసీదుకు వెళ్ళి, బాబాకునమస్కరించాడు. బాబా అతని యోగక్షేమాలు అడిగి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఇలా అడిగారు "నీకు మన ద్వారకామాయి తెలుసా?'' బాలాసాహెబుకు  ఆ ప్రశ్న బోధపడకపోవటంతో ఊరుకున్నాడు. "నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుంటారో వారిని ఆమె కష్టాలనుండి యితరాత్రా నుండి తప్పిస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హ్రుదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి తప్పిస్తుంది. ఆమె ఒడిని ఆశ్రయించినవారి కష్టాలన్నీ సమసిపోతాయి. ఎవరామె నీడని ఆశ్రయిస్తారో వారికి ఆనందం కలుగుతుంది.'' అన్నాడు. తరువాత బాబాసాహెబుకు ఊదీ ప్రసాదం యిచ్చి అతని శిరస్సుపై చేయి వేశారు. బాలాసాహెబు వెళ్తుండగా బాబా "నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలుసా? అదే, సారపు!'' అన్నారు. బాబా తమ ఎడమచేతిని మూసి దాన్ని కుడిచేతి దగ్గరికి తెచ్చి పాముపడగలా వుంచి, "అతడు మిక్కిలి భయంకరమైనవాడు. కాని ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపడుతుండగా, పాము ఏమి చేయగలదు?'' అన్నారు.
అక్కడున్నవారందరూ దీని భావాన్ని తెలుసుకోడానికి, దానికి మిరీకరుకి గల సంబంధం తెలుసుకోడానికి కుతూహాల పడుతున్నారు. కాని బాబాని ఈ విషయమై అడగడానికి ధర్యం లేకపోయింది. బాలాసాహెబు బాబాకు నమస్కరించి, మసీదును విడిచి శ్యామాతో వెళ్లారు. బాబా శ్యామాను పిలిచి, బాలాసాహెబుతో  చితిలీ వెళ్ళి ఆనందించమన్నారు. బాబా ఆజ్ఞానుసారం తానూ కూడా వెంట వస్తానని శ్యామా బాలాసాహెబుతో చెప్పారు. అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పారు. శ్యామా బాబాకి ఈ సంగతి తెలిపారు. బాబా ఇలా అన్నారు "సరే, వెళ్ళవద్దు. అతని మంచి మనం కోరాము. ఎఇద్ నుదుట వ్రాసి ఉందొ అది జరుగక తప్పదు''
ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచింది శ్యామాను తన వెంట రమ్మన్నారు. శ్యామా బాబావద్దకు వెళ్ళి సెలవు పుచ్చుకుని బాలాసాహెబుతో టాంగాలో బుయలుదేరారు. వారు రాత్రి 9గంటలకు చితిలీ చేరుకున్నారు. ఆంజనేయాలయంలో బసచేశారు. కచేరీలో పనిచేసే వారెవరూ రాలేదు; కాబట్టి నెమ్మదిగా ఒకమూల కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. చాపపైన కూర్చుని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుతున్నారు. అతను ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉంది. దాన్ని ఎవ్వరూ చూడలేదు. అది బుసకొడుతూ కదులుతూ ఉంది. ఆ ధ్వని నౌకరు విన్నాడు. అతడు ఒక లంటారు తెచ్చి, సర్పాన్ని చూసి పాము పాము అని అరిచాడు. బాలాసాహెబు భయపడ్డారు. వణకటం ప్రారంభించారు. శ్యామా కూడా ఆశ్చర్యపడ్డారు. అందరూ మెల్లగా కర్రలను తీశారు. బాలాసాహెబు నడుమునుండి పాము దిగటం ప్రారంభించింది. దాన్ని కొట్టి చంపేశారు. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించారు. బాబాయందు బాలాసాహెబుకు ఉన్న ప్రేమ ధృఢమైంది.
బాపూసాహెబు బూటీ :
నానా డెంగలే అనే గొప్ప జ్యోతిష్కుడు, బాపూసాహెబు బూటీ శిరిడీలో ఉండేటప్పుడు, ఒక రోజు ఇలా అన్నారు : "ఈ దినం నీకు అశుభము. నీకీ దినం ప్రాణగండము వుంది'' ఇది బాపూసాహెబును ఆందోళనకు గురిచేసింది. ఆయన యథాప్రకారం మసీదుకు వెళ్లగా, బాబా బాపూసాహెబుతో ఇలా అన్నారు : "ఈ నానా ఏమంటున్నాడు? నీకు మరణం వున్నదని చెపుతున్నాడు కదా? సరే! నీవు ఏమీ భయపడనక్కరలేదు. 'మృత్యువు ఎలా చంపుతుందో చూద్దాము గాక!' అని అతనికి ధైర్యంతో జవాబు ఇవ్వు'' ఆనాటి సాయంకాలం బాపూసాహెబు బూటీ మరుగుదొడ్డికి వెళ్ళారు. అక్కడొక పామును చూశాడు. అతని నౌకరు దాన్ని చూశాడు. ఒక రాయిని ఎత్తి కొట్టబోయాడు. బాపూసాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మన్నాడు. నౌకరు కర్రను తీసుకుని వచ్చేలోపలే, పాము కదిలిపోయి అదృశ్యం అయ్యింది. ధైర్యంతో ఉండమని బాబా చెప్పిన పలుకులను బాపూసాహెబు జ్ఞాపకానికి తెచ్చుకుని సంతోషించారు.
అమీరు శక్కర్ :
కోపర్ గాం తాలుకాలో కొరాలే గ్రామవాసి అమీరు శక్కర్. అతడు కసాయి కులానికి చెందినవాడు. అతడు బాంద్రాలో కమీషను వ్యాపారిగా పనిచేశాడు. అక్కడ అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతడు కీళ్ళవాతంతో బాధపడుతూ ఉండటంతో, భగవంతుణ్ణి జ్ఞాపకానికి తెచ్చుకుని, వ్యాపారాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరి బాధనుండి తప్పించమని బాబాను వేడుకున్నాడు. చావడిలో కూర్చోమని బాబా అతన్ని ఆజ్ఞాపించారు. అటువంటి రోగికి ఆ స్థలం సరైంది కాడు. అది ఎప్పుడూ తేమగా ఉంటుంది. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషదం, నిర్ణయసూత్రం. మసీదుకు రావడానికి బాబా అతనికి అనుమతి ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించారు. అది అతనికి అత్యంత లాభాకారి అయ్యింది. ఎందుకంటే బాబా ఉదయం, సాయంకాలం చావడివైపు వెళ్తుండేవారు. అదీ కాక రోజు విడిచి రోజు ఉత్సవంతో వెళ్ళి బాబా అక్కడ నిద్రిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగింది. ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్ గాం పారిపోయాడు. అక్కడొక ధర్మశాలలో దిగారు. అక్కడొక ఫకీఎరు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫకీరు నీళ్ళు కావాలి అంటే అమీరు వెళ్ళి నీరు తెచ్చి యిచ్చాడు. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయాడు. అమీరు చిక్కుల్లో పడ్డాడు. అతను పోలీసులకు తెలియపరిస్తే మొట్టమొదట సమాచారం తెచ్చినవాడు అవడం వలన తనకా ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉంటుందని పట్టుకుంటారు. ఆ చావుకు కూడా అతడు కారణభూతుడు అయ్యి ఉండవచ్చునని అనుమానిస్తారు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టటం తనదే తప్పని అతడు గ్రహించి, పశ్చాత్తాప పడ్డాడు. షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకుని ఆ రాత్రే అక్కడినుండి శిరిడీకి వెళ్లాడు. మార్గమధ్యంలో బాబా నామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. సూర్యోదయానికి ముందే షిరిడీ చేరుకొని ఆతృతనుండి రోగవిముక్తుడయ్యాడు. ఒకనాటి మధ్యరాత్రి బాబా, "ఓ అబ్దుల్! నా పరువువైపు ఏదో దుష్టప్రాణి వస్తున్నది'' అని అరిచారు. లంటారు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరువు చూశాడు కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెపుతూ నేలపై సటకాతో కొడ్తున్నారు. అమీరు శక్కర్ బాబా లీలను చూసి అక్కడికి పాము వచ్చిందని బాబా అనుమానించి ఉండు వుంటారు అనుకున్నాడు. బాబా సాంగత్యం వలన, బాబా ఆడే మాటల, చేసే క్రియల భావాన్ని అమీరు గ్రహిస్తూ ఉన్నాడు. అమీరు తన దిండుకు సమీపంలో ఏదో కదులుతూ ఉండటం గమనించి, అబ్దుల్ ను లంటారు తీసుకుని రమ్మన్నాడు. అంతలో అక్కడొక పాము కనపడింది. అది తలను క్రిందికీ పైకీ ఆడిస్తూ ఉంది. వెంటనే దాన్ని చాపేశారు. ఇలా బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీరును కాపాడారు.
తేలు - పాము :
1.    తేలు : బాబా ఆజ్ఞతో కాకాసాహెబు దీక్షిత్ నిత్యం శ్రీఏకనాథ మహారాజ్ రచించిన భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు. ఒకరోజు పురాణకాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత అయ్యారు. రామాయణంలో రామాయణంలో ఆంజనేయుడు తన ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించే భాగాన్ని చదువుతున్నప్పుడు వినేవారందరూ మైమరచి పోయి వున్నారు. అందులో హేమాడ్ పంతు ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజంపై పడి వాడి ఉత్తరీయమ్పై కూర్చుంది. మొదట దాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణాల శ్రవణం చేస్తారో వారిని భగవంతుడు రక్షిస్తాడు. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజంపై ఉన్న తేలును చూసారు. అది చచ్చినదానిలా నిశ్శబ్దంగా కదలకుండా వుంది. అది కూడా పురాణము వింటున్నట్లు గమనించాడు. భగవంతుని కటాక్షం స్మరించి, పురాణశ్రావణంలో ఉన్న ఇతరులకు భంగము కలగచేయకుండా ఉత్తరీయం రెండు చివరలను పట్టుకుని, దానిలో తేలు ఉండేటట్లు చేసి, బయటకు వచ్చి ఆ తెలుసను తోటలో పారవేశారు.
2.    పాము : ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చుని ఉన్నారు. ఒక సర్పం కిటికీలో వున్న చిన్న రంద్రం ద్వారా దూరి చుట్టుకుని కూర్చుంది. దీపాన్ని తెచ్చారు. మొదట అది వెలుతురుకు తడబడింది. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చుంది. తల మాత్రం క్రిందకి మీదకి ఆడిస్తూ ఉంది. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకుని వేగంగా వచ్చారు. అది ఎటూ కాని స్థలంలో ఉండటంతో దాన్ని చంపలేకపోతున్నారు. మనుష్యుల శబ్దం విని ఆ సర్పం వచ్చిన రంద్రంలోకి గబగబా దూరింది. అందరూ ఆపదనుండి తప్పించుకున్నారు.
బాబా అభిప్రాయము :
ముక్తారామ్ అనే ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవటంతో మంచే జరిగింది అన్నాడు. హేమాడ్ పంతు అందుకు ఒప్పుకోలేదు. అది సరియైన ఆలోచన కాదన్నాడు. పాములను చంపటమే మంచిదన్నాడు. ఇద్దరికీ గొప్ప వాదం జరిగింది. ముక్తారామ్ సర్పాలు మొదలైన క్రూరజంతువులను చంపవలసిన అవసరం లేదన్నాడు. హేమాడ్ పంతు వాన్ని తప్పకుండా చంపాలని అన్నాడు. రాత్రి సమీపించింది. చర్చ సమాప్తం కాలేకపోయింది. ఆ మరుసరి రోజు ఆ ప్రశ్నను  బాబాను అడిగారు. బాబా ఇలా జవాబిచ్చారు : "భగవంతుడు సకలజీవులలో నివశిస్తూ వున్నాడు. అవి సర్పాలుగాని, తేళ్ళుగాని కానివ్వండి. ఈ ప్రపంచాన్ని నడిపించే సూత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళతో సహా సకల ప్రాణులు భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తాయి. వారి అనుజ్ఞ అయితేగాని ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. ప్రపంచమంతా వాటిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. అనవసరమైన కలయాలలో, చంపటంలో పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే''

ఇరువది రెండవ అధ్యాయము సంపూర్ణము

 

మూడవరోజు పారాయణ సమాప్తము