
రామ్ గోపాల్ వర్మ సినిమా చేసాక ఎవరూ నన్ను పట్టించుకోలేదు
తేజస్విని మడివాడు బుల్లితెర మీద కాకమ్మ కథలు షో ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కాకమ్మ కథలు షో గురించి బిగ్ బాస్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. కాకమ్మ కథలో షోలో ఎవరు వస్తున్నారు వాళ్ళ కథేంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతూ ఉన్న టైములో ఆడియన్స్ తన గురించి ఎక్కువ తెలుసుకున్నట్లు చెప్పింది. ఐతే బిగ్ బాస్ కానీ ఇతర రియాలిటీ షోస్ లో మాత్రం స్క్రిప్ట్ ప్రకారం వెళ్లడమే కాబట్టి తన గురించి పెద్దగా ఏమీ ఉండదు అని చెప్పింది. ఇక బిగ్ బాస్ అంటే కొట్టుకోవడానికి లోపలి వెళ్ళేది అంది. 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు హౌస్ లోకి వెళ్లాను. అక్కడికి వెళ్లి పెద్ద ముత్తైదువులా కూర్చోలేను కదా. అప్పుడు రారా కొట్టుకుందాం అన్నాను తర్వాత 30 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్లాను. హే మీరు కొట్టుకోండిరా అన్నాను. కాకమ్మ కథలకు థాంక్స్ చెప్పాలి. ముందు ఏడ్చేదాన్ని అందరూ నా గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని. తర్వాత అన్నీ చేంజ్ అయ్యాయి. టాలీవుడ్ తేజస్వినిని జడ్జ్ చేసి వర్క్ ఇవ్వలేదు. సీతమ్మ వాకిట్లో మూవీలో క్యూట్ పెర్ఫార్మెన్స్ తర్వాత 40 సినిమాలు వచ్చాయి. 45 సినిమాలు 4 వెబ్ సిరీస్ లు చేసాను 10 రియాలిటీ షోస్ చేసాను. 21 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు నా వయసు 35. నాకు కళామ తల్లి కానీ, టాలీవుడ్ కానీ , నాకు నేను ద్రోహం చేయలేదు చేసుకోలేదు. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవి . నేను రామ్ గోపాల్ వర్మ సినిమా చేయగానే అందరూ షాకై ఈ పిల్లతో వద్దు అనుకున్నారు. అది తనను బాధపెట్టిందని చెప్పింది. ఒక సినిమా బట్టి తన క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారు అని ప్రశ్నించింది. "నేను మిస్ హైదరాబాద్ అని ఒకటి ఉంది. అందులో "మిస్ టాలెంటెడ్ ". "డాబర్ గులాబరి ఫ్రెష్ ఫేస్ సెగ్మెంట్ "లో నేను రన్నరప్ గా వచ్చాను. ఫస్ట్ రన్నరప్ రీతూ వర్మ... సెకండ్ నేను. కాలేజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు డాబర్ గులాబరి చేసాను ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో మూవీ చేసాను.
Jul 31, 2026 2:51PM
లెజెండరీ డైరెక్టర్ కే.విశ్వనాధ్ మూవీ ఆఫర్ ని వదులుకున్న న్యూస్ రీడర్
న్యూస్ రీడర్స్ లో చాలా స్పెషల్ గా చూడగానే చాలా అందంగా పర్ఫెక్ట్ జర్నలిస్ట్ అనిపించేలా ఉండే టీవీ 9 న్యూస్ రీడర్ ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్తలు చదివే విధానం కూడా చాలా వినసొంపుగా ఉంటుంది. ఐతే ఆమె కే.విశ్వనాధ్ గారి మూవీని రిజెక్ట్ చేసిన విషయం రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "ఒక రోజు కే .విశ్వనాధ్ గారి ఆఫీస్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. సర్ మీ ప్రోగ్రాం ఒకటి చూశారట మిమ్మల్ని కలుస్తాను అన్నారు . నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ . ఎందుకంటే కాలేజ్ టైములో ఆల్ రౌండర్ అవార్డుని ఆయన చేతుల మీదగాని అందుకున్నా. మా అమ్మకు కూడా ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నాకు మ్యూజిక్ , డ్యాన్సింగ్ నేర్పించింది. అలాంటి ఆయన పిలిచారని ఆనందంతో వెళ్లాను. చాలా బాగున్నావమ్మా చూడడానికి తెలుగు పిల్లలా లేవు...కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నావు . అయ్యో సర్ మాది పశ్చిమ గోదావరి . తెలుగు బాగా మాట్లాడతాను. అప్పుడు ఆయనకు ఒక స్టోరీ చెప్పారు. ఎందుకు చెప్తున్నారా అనుకున్నాను. ఆ మూవీలో హీరోయిన్ అనుకుంటున్నాను ఆడిషన్ చేద్దామా అన్నారు. సర్ అసలు ఏ రకంగానూ మీ హీరోయిన్లకు మ్యాచ్ అవ్వను. " అని చెప్పాను. "సాగరసంగమం, స్వర్ణ కమలం లాంటి సినిమా కాదు ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి. ఆసిడ్ అటాక్స్ కి సర్వైవ్ ఐన అమ్మాయి. ఐతే సోనమ్ కపూర్ ని శృతి హాసన్ ని చేయించమని అనిల్ కపూర్ కి కమల్ హాసన్ కి చెప్పాను. ఐతే వాళ్ళు కమర్షియల్ మూవీతో లాంచ్ అవుదామనుకున్నారు. వాళ్ళ ముక్కు నీ ముక్కు ఒకేలా ఉంది అందుకే పిలిచాను అన్నారు. ముక్కు కీ రోల్ ప్లే చేస్తుందని అప్పుడు తెలిసింది. ఐతే ఈ మూవీ చేస్తావా అన్నారు. అప్పటికి నాకు పెళ్ళై రెండు నెలలయింది. మా ఇంట్లో వాళ్లకు చెప్పాలి అన్నాను. ప్రొడ్యూసర్ ని ఇచ్చి ఇంటికి పంపించి మాట్లాడమన్నారు. వాళ్లేమో తన ఇష్టం అండి అన్నారు. చాలా నమ్మకం ఇచ్చారు. ఇందులో కిస్ సీన్లు , హగ్ సీన్లు ఉండవు అన్నారు. అల్లరి నరేష్ గారి మూవీ శుభప్రదం అని. తర్వాత ఆయన కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టి మీ లాంటి వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చారు. కానీ నాకు నటన మీద అంత ఇంటరెస్ట్ లేదు అని చెప్పాను. ఆ తర్వాత ఆ మూవీకి మంజరి ఫడ్నవీస్ చేసింది." కానీ ఇది నా లైఫ్ లో గుర్తుండిపోయే ఒక మెమరీ.
Jul 31, 2026 2:43PM.webp)
Brahmamudi : రాజు భయంతో ఇందూ చంకెక్కిన వైనం.. ఐశ్వర్య నిజం బయటపెట్టనుందా
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1098 లో...రాజు కోసం ఇందు కాఫీ పట్టుకొని వెళ్తుంది. మా బావ ఎప్పుడు నా దారికి వస్తాడోనని ఇందు అనుకుంటుంది. అప్పుడే గోడపై బల్లి కన్పిస్తుంది. ఏ బల్లి మా ఇద్దరిని కలపడానికి ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని ఇందు అనగానే బల్లి ఏదో సౌండ్ చేస్తుంది. నాకూ అర్థం కాదు నీ బాష అని ఇందు అనుకుంటుంది. రాజు అది చూసి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నావని అడుగుతాడు. ఏం లేదు బావ అని ఇందు అంటుంటే.. అప్పుడే రాజు దగ్గరికి బల్లి వస్తుంది. దాన్ని చూసి రాజు భయపడి ఇందు చంక ఎక్కుతాడు. నేను అంటే ఎంత ఇష్టం లేకుంటే ఇలా చంకన ఎక్కుతావ్ బావ అని ఇందు అనగానే అంతలేదని రాజు అంటాడు. ఆ తర్వాత ఐశ్వర్య పార్టీకి వెళ్తుంటే ఎక్కడికి అని ఇందు అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఐశ్వర్య అనగానే ఎవరు ఎక్కడికి వెళ్లినా నా భార్యకి చెప్పి వెళ్ళాలని రాజు అంటాడు. ఏంటి ఆంటీ మీరు ఏం మాట్లాడడం లేదు.. ఇంట్లో మీ పెత్తనం నడిచేది.. ఇప్పుడు దానిది నడుస్తుందా అని రేఖని ఐశ్వర్య అడుగుతుంది. ఇప్పుడు రేఖ పిన్ని వెళ్ళాలన్న ఇందు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని రాజు అంటాడు. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరున్న కార్ కీస్ ఇందు లాక్కొని ఇకనుంచి నీకు కార్ వద్దని చెప్తుంది. ఏంటి ఆంటీ మీరు సైలెంట్ గా ఉన్నారని ఐశ్వర్య అడుగుతుంది కానీ రేఖ సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి రేఖ నువ్వు దానికి భయపడుతున్నావా అని రేఖని భ్రమరాంబ అడుగుతుంది. ఎందుకు ఆ రాజు చెప్పినట్లు చేస్తుంది.. ఆ రాజు ఏమైనా అంటున్నాడా అని శేషు అంటాడు. మీరు సైలెంట్ గా ఉండండి నా ప్లాన్ నాకు ఉందని రేఖ అనగానే అదేంటో మాక్కుడా చెప్పమని భూషణ్ అనగానే అవసరం లేదని చెప్పి రేఖ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఐశ్వర్య బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటే అక్కడ అవ్వదు.. అప్పుడే లక్కీ నేను డ్రాప్ చేస్తానని అంటాడు. అవసరం లేదని ఐశ్వర్య అనగానే సరే నేను బయటకు వెళ్తున్నాను నాకు భయంగా ఉంది వస్తావా అని లక్కీ అడుగుతాడు. సరే నేను పార్టీకి వెళ్తున్నాను.. నువ్వు కూడా నాతో రా అని లక్కీ బైక్ ఎక్కి ఐశ్వర్య వెళ్తుంది. లక్కీ మాత్రం ఫూల్ హ్యాపీగా ఉంటాడు. ఎలాగైనా ఐశ్వర్యని ఇంప్రెస్ చేసి నా ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. తరువాయి భాగంలో ఐశ్వర్య ఫూల్ గా డ్రింక్ చేసి వచ్చి అసలు ఈ ఇందు రాజు భార్యాభర్తలు కాదని చెప్తుంటే ఎవరు నమ్మట్లేదని అంటుంది. ఒకవేళ ఐశ్వర్య చెప్పేది నిజమే కావచ్చని భ్రమరాంబ, శేషు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 10:09AM
Karthika Deepam2 : పారిజాతం డ్రామా.. సూరజ్ మైండ్ గేమ్తో జ్యోత్స్నకు షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -736 లో..... మాలిని దగ్గరికి పారిజాతం వెళ్లినందుకు తనని శివన్నారాయణ ఇంట్లో ఉంచనివ్వడని పారు ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్లకుంటే వేరే వాళ్ళ ద్వారా మన విషయాలు తెలుసుకునేది.. అలా కాకుండా ఉండాలని ఇలా చేసానని పారిజాతం తనని తాను కవర్ చేసుకుంటుంది. అలా దక్షిణామూర్తి దగ్గర ఆయన పరువుపోవడానికి కారణం కార్తీక్ అని పారు అంటుంది. ఉంగరం తీసుకోమని మా బావ ఏమైనా చెప్పాడా అని దీప అంటుంది. జ్యోత్స్నకి పెళ్లి చేస్తానని బాధ్యత తీసుకుంది కార్తీక్ కాబట్టి అంటున్నానని.. వాడే కనుక పెళ్లి సంబంధం తీసుకొని వస్తే వాళ్ళు వచ్చి ఇలా గొడవ చేసే వాళ్ళా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు చెప్తున్నా జ్యోత్స్న పెళ్లిలో ఈ ఉంగరం మాలినికి ఇస్తానని పారు ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా అర్ధం అయిందా మాలిని ఆఫీస్ లో కాదు ఇంట్లో వాళ్ళని కూడా కోనేస్తుందని.. ఇక వేరే వాళ్ళు అనే ఛాన్స్ ఇవ్వకుండా అందరు జ్యోత్స్న పెళ్లి గురించి ఆలోచించండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత పారు దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మీ తాత మనల్ని క్షమించాడా అని పారు అడుగుతుంది. అలా ఎలా దొరికిపోయావ్ గ్రానీ అని జ్యోత్స్న అనగానే అంతా ఆ సూరజ్ గాడి వల్లే అని పారిజాతం అంటుంది. వాడి సంగతి చెప్తానని సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. ఎందుకు రా ప్రతీ దాంట్లో కలుగజేసుకుంటున్నావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు ఏమైంది బంగారం అని సూరజ్ అంటుంటే జ్యోత్స్న ఇంకా కోప్పడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే దీప, కార్తీక్ వెళ్తుంటే జ్యోత్స్నని చూసి ఆగుతారు. ఎందుకు జ్యోత్స్న తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావని దీప అంటుంది. అదంతా నీకు అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న పెళ్లి గురించి కార్తీక్ మాట్లాడతాడు. వాళ్ళ మాటలన్నీ సూరజ్ వింటాడు. ఆ తర్వాత సూరజ్ ఆఫీస్ కి వెళ్తాడు. జ్యోత్స్న కూడా వెళ్తుంది. జ్యోత్స్న పేరుని సూరజ్ ఒక పేపర్ పై రాస్తాడు. నా పేరు ఎందుకు రాసావని జ్యోత్స్న కోప్పడుతుంది. నువ్వు ప్రేమించే అమ్మాయి పేరు ఇలా రాస్తే నీ ముందు ప్రత్యక్షమవుతుందని పంతులు చెప్పాడు బంగారం అని సూరజ్ చెప్తాడు. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఇంటి దగ్గర కార్తీక్ తో జ్యోత్స్న అన్న మాటలు మళ్ళీ జ్యోత్స్న తో సూరజ్ అంటుంటే ఇవన్నీ చాటుగా విన్నావు కదరా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఏమైనా నాలుగు గోడల మధ్య అనలేదు కదా.. అందరు వినేలా అన్నావ్ కదా అని సూరజ్ అంటాడు. దాంతో జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 10:06AM.webp)
Illu illalu pillalu : ప్రేమ కాపురంపై వల్లి కుట్ర.. రామరాజు వేదనతో హై వోల్టేజ్ డ్రామా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -537 లో..... ప్రేమ బాధపడుతుంటే భద్రవతి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అసలు వాడికి ప్రేమ అంటే ఇష్టం లేదు.. వెళ్తుంటే కూడా ఆపలేదని భద్రవతి అంటుంది. ప్రేమ తొందరపడ్డావేమోనని అనిపిస్తుందని విశ్వ అనగానే నువ్వు ఏంట్రా ఇలా మారిపోయావు.. మీ చెల్లికి ఉన్న పౌరుషం కూడా నీకు లేదని భద్రవతి అంటుంటే ఎంతసేపు పౌరుషం, పగ అంటారు కానీ దాని కాపురం గురించి అసలు ఎవరైనా ఆలోచించారా అని రేవతి అంటుంది. మనమేనా ఆలోచించేది.. వాళ్ళు ఆలోచించారా.. మేనత్త అంటుంది కానీ తనైనా వచ్చిందా అని భద్రవతి అంటుంది. దాంతో ప్రేమ బాల్కనీ నుంచి ఎవరైనా వస్తారేమోనని చూస్తుంది. నిజమే నా గురించి ఎవరు రావడం లేదని ప్రేమ బాధపడుతుంది. మరొకవైపు ధీరజ్ బాధపడుతుంటే వేదవతి వచ్చి ఇదంతా నా వాళ్లనే జరిగింది.. నన్ను క్షమించురా అని అనగానే నువ్వు మంచి గురించి అలోచించి అలా చేసావ్ అమ్మ అని ధీరజ్ అంటాడు. మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు.. వెళ్లి తీసుకొని రారా అని వేదవతి అంటుంది. మరొకవైపు వల్లి అనుకుంది చేసిందని తనని పూలు చల్లుతూ భాగ్యం వాళ్ళు స్వాగతం చెప్తారు. అనుకున్నది అయిందని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ, ధీరజ్ ల ఫోటో తీసుకొని హీరో, హీరోయిన్ కాపురం కూలిపోయిందని వాళ్ళ ఫోటోని మంటలో వేస్తుంది వల్లి. ఆ తర్వాత నర్మద, సాగర్ ల ఫోటో తీసుకొని నెక్స్ట్ వీళ్ళే అని వాళ్ళ ఫోటో మంటలో వేస్తుంది వల్లి. మరొకవైపు ప్రేమకి నర్మద ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఈ ప్రేమ ఎందుకు ఇలా చేస్తుందని నర్మద అంటుంటే సాగర్ వస్తాడు. మరి నువ్వు చేసిందేంటి.. నా దగ్గర నిజం దాచి తప్పు చేసావని నర్మదతో సాగర్ గొడవ పడుతాడు. ఎవడి గోల వాడిదే అన్నట్లు మా ఆయన బాధ అయనదే అని నర్మద అనుకుంటుంది. మరొకవైపు తిరుపతి, రామారాజు ఒక దగ్గర డ్రింక్ చేస్తారు. నన్ను వాళ్ళు పనోడు అంటు ఎన్ని మాటలు అన్నా కూడా.. నా బుజ్జమ్మ ఉందనుకున్నా కానీ ఇంత మోసం చేసిందని రామరాజు బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 10:04AM.webp)
Podharillu : కేశవ కోసం ఇల్లు వదిలేసిన శైలు..అన్న పెళ్లి కోసం వెనక్కి తగ్గిన కేశవ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -169 లో......పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుందని శైలుని వరాలు కొడుతుంది. ఇప్పటికైనా నేను చెప్పినట్లు విను అని వరాలు అంటుంది. నేను కేశవని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శైలు చెప్తుంది. అయితే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో.. నా కూతురు చచ్చిందని అనుకుంటానని వరాలు అనగానే శైలు బ్యాగ్ తో పాటు బయటకు వస్తుంది. వాళ్ళ నాన్న, అన్న వద్దని చెప్పినా శైలు వినిపించుకోకుండా వెళ్తుంది. మరొకవైపు కేశవ, చక్రి ఇంటికి వెళ్తారు. కాసేపటికి బ్యాగ్ తో శైలు వస్తుంది. తను అలా రావడం చూసి అందరు షాక్ అవుతారు. నా పెళ్లిచూపులు క్యాన్సిల్ చేసుకున్నాను.. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పంది. మీరు ఇప్పుడు పెళ్లి చేస్తారో.. ఏం చేస్తారో అంతా మీ ఇష్టమని శైలు అంటుంది. మహా నువ్వు ఆ అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళమని మాధవ చెప్తాడు. శైలుని తీసుకొని మహా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామని మాధవ అంటాడు. అలా రావడం తప్పు అని మాధవ అంటాడు. ఇక ఈ ఇద్దరికి పెళ్లి చెయ్యడమే అని చక్రి అనగానే చక్రిని తీసుకొని కేశవ పక్కకి వెళ్తాడు. ఏంట్రా పెళ్లి అంటావ్ .. అన్నయ్యకి కాకుండా నేను చేసుకోనని కేశవ అనగానే అప్పుడే నారాయణ వస్తాడు. అలా ఆలోచిస్తే ఎప్పటికి చేసుకోలేవని నారాయణ అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్తారు. నేను శైలుతో మాట్లాడి చెప్తానని కేశవ అంటాడు. ఆ తర్వాత శైలుని తీసుకొని కేశవ బయటకు వెళ్తాడు. నీకు నా మీద ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చేంత ఇష్టం ఉందని తెలియదు. ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వు అంటే కూడా నాకూ ఇష్టం అని ఐ లవ్ యు అని కేశవ చెప్పగానే ఇన్నాళ్లకి మనసులో మాట చెప్పావని శైలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన బుగ్గ మీద కేశవ ముద్దు పెడుతాడు. ఇప్పుడు చెప్పాలిసింది ఇంకొక విషయం.. మా అన్నయ్య మా కోసం చాలా కష్టపడ్డాడు.. తనకి కాకుండా నేను చేసుకోను.. తనకి ఎలాగైనా పెళ్లి చేస్తానని మా వదిన అంటుంది.. తనకి అయ్యాకే మనం చేసుకుందామని కేశవ అనగానే శైలు సరే అంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ ఉండాలని శైలు అనగానే హాస్టల్ లో ఉండు అంతా చూసుకుంటానని కేశవ చెప్తాడు. తరువాయి భాగంలో కేశవ ఒక్కడే ఇంటికి వస్తాడు. అమ్మాయి ఎక్కడ అని మాధవ అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో వదిలేసానని కేశవ చెప్తాడు. ఆ తర్వాత తన వల్లే కేశవ పెళ్లి వద్దు అన్నాడని మాధవకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 10:02AM.webp)
Godhavari : కోర్టు స్టేతో దిగొచ్చిన సింహాద్రి..తోట దక్కడంతో కుటుంబంలో ఆనందం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -70 లో.....తోట రిజిస్ట్రేషన్ అవుతుంటే నందు తన ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఆపుతుంది. సింహాద్రిని పేరు పెట్టి పిలుస్తుంటే మర్యాదగా మాట్లాడమని భువన అంటుంది. తోట మాది ఇది ఎవరికి అమ్మే రైట్ లేదని నందు అంటుంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఎంతో కొంత పడేస్తానని సింహాద్రి అంటాడు. తోట గురించి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని తోటని కొనడానికి వచ్చిన వాళ్ళు అంటుంటే ఏం లేదు అండి వాళ్ళ నాన్న చనిపోయి వాళ్ళ మైండ్ సరిగ్గా పని చెయ్యడం లేదని సింహాద్రి అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా అని సింహాద్రి కాలర్ పట్టుకొని అడుగుతుంది శారద. సింహాద్రి ఇంకా మాటలతో మాయ చెయ్యబోతుంటే శారద తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే తోట అమ్మిన అసలు వ్యక్తి రామరావు వాళ్ళ అన్నయ్యని అక్కడికి పంపిస్తాడు. అతన్ని తీసుకొని జాను వస్తుంది. పెద్దనాన్న నువ్వు ఎందుకు వచ్చావని రామరావు కొడుకు అడుగుతాడు. నువ్వు నోరు ముయ్ రా పాపం శంకర్ నారాయణ మంచి వ్యక్తి.. అలాంటి అతన్ని మోసం చేశారని అతను అంటాడు. తోటని అమ్మడానికి వీల్లేదని జాను కోర్ట్ నుంచి స్టే తీసుకొని వస్తుంది. దాంతో కొనడానికి వచ్చినవాళ్ళు అడ్వాన్స్ గా ఇచ్చిన అమౌంట్ కట్టాలి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని సింహాద్రికి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత మా అన్నయ్య మీకోసం మంచి చెయ్యాలని చూస్తే మీరు ఇలా చేస్తున్నారని భువన అంటుంది. మీకు ఇంకా అర్ధం కాలేదా.. మీ అన్నయ్య ఎలాంటి వాడో మేం తేలుస్తామని జాను అంటుంది. ఆ తర్వాత సూర్య దగ్గరికి జాను వెళ్లి సూర్య నాకు చాలా సంతోషంగా ఉంది. మా తోట మాకు వస్తుందని అంటుంది. అమ్మగారు మంచి మూడ్ లో ఉన్నారు.. ప్రేమ గురించి చెప్పండి బాబు అని సూర్యతో తుఫాన్ అంటాడు. సూర్య చెప్పబోతుంటే జానూకి ఫోన్ వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాను ఇంట్లో అందరితో సంతోషంగా మాట్లాడుతుంది. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదని జానూతో శారద అంటుంది. ఇప్పుడు అవన్నీ అవసరం లేవమ్మా అది నాన్న కష్టమని జాను అంటుంది. ఆ తర్వాత ఇన్ని రోజులుగా సింహాద్రి అంకుల్ చాలా చేసాడు. ఇప్పుడు ఒక్క దానితో మోసగాడు అవుతాడా అని గౌతమి అంటుంది. నీ క్లాస్ మేట్ కళ్యాణ్ వాళ్ళ నాన్న అని సపోర్ట్ చేస్తున్నావా నాణెంకి రెండు వైపులా చూడాలని జాను అంటుంది. దాంతో గౌతమికి కోపం వస్తుంది. ఎక్కడ గొడవ అవుతుందోనని పదండి భోజనం చేద్దామని మురళి అంటాడు. మరొకవైపు జాను చేసిన పనికి సింహాద్రి కోపంగా ఉంటాడు. తరువాయి భాగంలో మురళికి బ్లౌజ్ కుట్టమని ఆర్డర్ వస్తుంది. అచ్చం నందులాగా మా అమ్మాయి ఉంటుందని కస్టమర్ చెప్తుంది. దాంతో నందు కొలతలు మురళి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 9:57AM.webp)
Ye Devi Varamo Neevu: అంజలిని బుట్టలో వేయాలని రాకీ కొత్త ప్లాన్.. గీతాంజలి ఎంట్రీతో షాక్లో మనీష్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో.....అంజలిని రాకీ డబ్బుతో పడెయ్యాలనుకుంటాడు కానీ అంజలి డబ్బుతో పడే అమ్మాయి కాదని రాకీకి అర్థమవుతుంది. తనని పడేయ్యడానికి ఒక ప్లాన్ వెయ్యలనుకుంటాడు రాకీ. ఆ తర్వాత అంజలి ఇంట్లో అన్ని పనులు చేసి భోజనం ఏర్పాట్లు చేస్తుంది. అందరికి వడ్డిస్తుంది.. ఇంతక ముందు పనమ్మాయి కేవలం వంట చేసేది వెళ్ళేది కానీ అంజలి మాత్రం అన్ని పనులు చేస్తుందని రత్నం అంటుంది. పనిమనిషి అన్ని పనులు చేస్తుందని రత్నం మనవరాలు అంటుంది. తను పనిమనిషి కాదు మన మనిషి అనుకోబట్టే అన్ని చేస్తుందని రాజారావు అంటాడు. నువ్వు కూడా కూర్చొని భోజనం చెయ్ అమ్మా అని రత్నం అనగానే ఏంటి తను మనతో కూర్చొని కలిసి భోజనం చేస్తుందా అని రత్నం మనవరాలు అంటుంది. అలా తినమని గొప్ప మనసుతో వాళ్ళు చెప్పినా తినే సంస్కారం నాకు లేదని అంజలి కింద కూర్చొని భోజనం చేస్తుంది. అబ్బా సాంబార్ బాగుంది అంజలి అన్ని రుచులు చూపిస్తుందని రాకీ అంటాడు. అన్నయ్య నువ్వు సాంబార్ టేస్ట్ చెయ్ అని రాకీ అనగానే మనీష్ సాంబార్ వేసుకొని చాలా బాగుంది సేమ్ అత్తయ్య చేసినట్లు ఉందని మనీష్ అంటాడు. అంటే వంట విషయంలో తన తల్లిది వచ్చిందన్నమాట అని రాజారావు అనుకుంటాడు. ఆ తర్వాత అత్తయ్య ఇచ్చిన గడువు ఇంకా మూడు రోజులు ఉంది. ఈ మూడు రోజులు అత్తయ్యకి అంజలి కన్పించకూడదని మనీష్ అనుకుంటాడు. అప్పుడే గీతాంజలి కుటుంబంతో సహా వస్తుంది. తనని చూసి మనీష్ షాక్ అవుతాడు. రాజారావుకి వెళ్లి చెప్తాడు. నేను అంజలి రాకుండా చూస్తాను. నువ్వు వాళ్ళు లోపలికి రాకుండా చూడమని రాజారావు అంటాడు. ఆ తర్వాత గీతాంజలి వాళ్ళు రాకుండా మనీష్ ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఎంట్రా నీకు ఏమైంది అంటూ గీతాంజలి లోపలికి వస్తుంది. ఆ తర్వాత రాజారావు మనీష్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ అందరిని కన్ఫూజన్ చేస్తారు. తరువాయి భాగంలో అంజలి కాఫీ తీసుకొని వస్తుంటే మనీష్ ఆపి తను తీసుకొని వస్తాడు. కాఫీ చాలా బాగుంది ఒకసారి కాఫీ చేసిన అమ్మాయిని పిలవమని గీతాంజలి అనగానే మనీష్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 9:54AM.webp)
Jayam serial : జయ పెళ్లి చుట్టూ తిరుగుతున్న కుట్రలు, గందరగోళం!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. పెద్దసారు విశ్వ ఫ్యామిలీని ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ఎందుకు రుద్ర బావ వీరు చెప్పిన దానికి ఒకే చెప్పి జయ పెళ్లి చేస్తున్నాడు. అసలు జయ సొంత కూతురు కాదని బావకి తెలుసు ఎందుకు ఇలా చేస్తున్నాడో కారణం చెప్పాలని గంగతో రంగా అంటాడు. రుద్రని గంగ లాక్కొని గదిలోకి వస్తుంది. మా అన్నయ్య బాగా సీరియస్ గా ఉన్నాడని గంగ అంటుంది. ఎందుకని అని రుద్ర అడుగుతాడు. ఆ వీరు కి సపోర్ట్ చేస్తున్నారు ఏందుకని రంగా కోపంగా మాట్లాడుతాడు. ఇప్పుడు చెప్పను ఏం చేస్తావని రుద్ర అనగానే రంగా కాళ్ళు పట్టుకొని అడుగుతాడు. అన్నయ్య ఏంటి అది అని గంగ అంటుంది. అయిన రుద్ర చెప్పకుండా వెళ్తాడు. ఈ విషయం మనం అయిన విశ్వ సర్ కి చెప్పాలని రంగా, గంగ అనుకుంటారు. విశ్వ వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే రంగా వెళ్లి తన మొహం చూసి కాకుండా పక్కకి తిరిగి జయ మీ కూతురు కాదని చెప్తుంటాడు కానీ విశ్వ వెళ్లి రుద్ర వస్తాడు. రుద్రని చూసి రంగా షాక్ అవుతాడు. ఏంటి మీరు చేస్తుంది.. ఈ మాత్రం నాకు చెప్పడం చేత కాకనా అని రంగాపై రుద్ర కోప్పడతాడు. ఆ తర్వాత అందరు జయని రెడీ చేస్తుంటారు. ప్రమీల వచ్చి నా నగలు ఇవ్వాళా అని అడుగుతుంది. వద్దు అసలు నీలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి రావద్దని తెలియదా అని జయ కోప్పడుతుంటే అపర్ణ తనపై కోప్పడుతుంది. ఇక్కడ గొడవ అవుతుందని వెంటనే వీరుకి ఇషిక చెప్తుంది. నువ్వేం మాట్లాడావో విశ్వ సర్ దగ్గరికి తీసుకొని వెళ్లి చెప్తానని గంగ అనగానే అప్పుడే వీరు వచ్చి వద్దని ఆపుతాడు. ఫంక్షన్ డిస్టబ్ అవుతుందని వీరు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 31, 2026 9:52AM
బీచులు, బికినీలు అంటుంటే మీరేంటి పూజలు పునస్కారాలు అంటారు
రష్మీ గౌతమ్ బుల్లితెర మీద యాంకర్ గా అందరికీ సుపరిచితమే. ప్రదీప్, సుధీర్, రష్మీ, శ్రీముఖి, సుమ ప్రస్తుతానికి వీళ్ళే బుల్లితెరను ఏలుతున్నారు. అలాంటి రష్మీ జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేసేది. కానీ రీసెంట్ గా జరిగిన మార్పుల కారణంగా ఆమెను ఒక్క జబర్దస్త్ కి మాత్రమే పరిమితం చేశారు. అలాగే ఆమె ఇంకా ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద టాప్ తెలుగు ఇన్ ఫ్లూఎన్సర్ షోకి కూడా హోస్టింగ్ చేస్తోంది. అలాంటి రష్మీకి మూగ జీవాల పట్ల దయ ఎక్కువగా అలాగే దైవ భక్తి కూడా చాలా ఎక్కువే. రీసెంట్ గా గురు పూర్ణిమ సందర్భంగా రష్మీ ఆలయానికి వెళ్ళింది. భద్రాచలం వెళ్లి భక్తితో దైవాన్ని దర్శించుకుంది. ఇక తీర్ధప్రసాదాలు తీసుకుని ఆ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "వెరీ నైస్ ..చాలా దైవికంగా ఉన్నారు. హ్యాపీ గురు పూర్ణిమ " అంటూ విషెస్ చెప్పారు. ఒక నెటిజన్ ఐతే "చాలామంది పెళ్ళైన యాంకర్లు బీచులు, బికినీలు అంటూ చూపిస్తుంటే మీరేంటి ఇంకా పూజలు పునస్కారాలు అంటూ చూపిస్తున్నారు " అంటూ కామెంట్ చేసారు. ఇంకో నెటిజన్ ఐతే "సుధీర్ కోసమా రష్మీ గారు చేస్తున్నారు" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రాను రాను యాంకర్స్ కి షోస్ తగ్గిపోతున్నాయి. ప్రదీప్ మూవీస్ లో నటించడానికి సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లేసరికి ఢీ షోకి హోస్ట్ గా నందుని పెట్టారు. రష్మీ చేతిలో ఉన్న మూడు షోస్ కాస్త రెండు అయ్యాయి. ప్రదీప్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చేసాడు. సుధీర్ డ్రామా జూనియర్స్ , ఫామిలీ స్టార్స్ చేస్తున్నాడు.
Jul 30, 2026 4:34PM
ఏ దేవి వరము నీవు .... సంజన నటన అద్భుతం... నెటిజన్స్ రెస్పాన్స్ కి ఫిదా
సిల్వర్ స్క్రీన్ మీద నటించి పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద తమ సత్తా చాటుతూ ఉన్నారు. అందులో ఒకరు సంజన గల్రాని. 2005 లో సోగ్గాడు మూవీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ప్రభాస్ తో బుజ్జిగాడు మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లి ఫైనలిస్ట్ అయ్యింది. హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటూ టాస్కులు ఆడింది. ఇమ్మానుయేల్ ని కొడుకుగా భావించేది. ఇమ్ము కూడా అమ్మ అమ్మా అంటూ పిలిచేవాడు. అలాంటి సంజనా తెలుగు టీవీ సీరియల్ లో నటించి తన సత్తా చాటుతోంది. "ఏ దేవి వరము నీవు " అంటూ ఇటీవల మొదలైన ఈ నాటిక ఇప్పుడు తెలుగు ప్రజలను అలరిస్తోంది. జులై 6 నుంచి మొదలైన ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ రేటింగ్ లో ఉంది. అలాంటి ఈ సీరియల్ గురించి నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ ని సంజన వాటిని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ఇంతకు ఎవరెవరు ఏమన్నారో చూద్దాం. "రోజురోజుకూ ఆమె తన నటనను మెరుగు పరుచుకుంటున్నారు ఆమెను ఏమీ అనొద్దు. ఫస్ట్ టైం ఒక తల్లిగా, విలన్ గా నటిస్తున్నారు. చాల కష్టపడుతున్నారు... సంజన గారు మీ యాక్టింగ్ బాగుంది అలాగే సోనియా గారు శ్రవణ్ గారు మీ యాక్టింగ్ కూడా బాగుంది. చాలా బాగుంది ఈ కొత్త సీరియల్ ... హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఈ సీరియల్ మొత్తాన్ని సంజనా గారే కబ్జా చేసేసారు. నేను మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు సంజన గారు చాలా వెయిట్ తగ్గారని ఇప్పుడు ఆమె కోసమే ఈ సీరియల్ చూస్తున్నాం అన్నారు. కొంతమంది ఆమె నడకను, ముఖ కవళికలను జడ్జ్ చేస్తూ ఉంటారు గుడ్డిగా. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు " అంటూ కామెంట్స్ చేశారు.
Jul 30, 2026 4:00PM
ఆహాలో విందు, వినోదాన్ని వడ్డించడానికి త్వరలో ప్రాజెక్ట్ యుఎస్ ఏ
ఆహా ఓటిటి వేదిక పై మరో కొత్త షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ వేదిక మీద టాప్ తెలుగు ఇన్ ఫ్లూఎన్సర్ కొత్తగా మొదలై ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ షోకి మంచి లక్ష్మి , వైవా హర్ష జడ్జెస్ గా ఉన్నారు. అలాగే కాకమ్మ కథలు సీజన్ 3 నడుస్తోంది. ఇది కూడా ఫైనల్ కి వచ్చేసింది. అలాగే కుకు విత్ జాతిరత్నాలు కుకింగ్ షో కూడా ఫైనల్ కి వచ్చేసింది. ఇక గతంలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే పేరుతో ఒక కుక్కింగ్ షో టెలికాస్ట్ అయ్యేది. దానికి సుమ హోస్ట్ గా చేసింది. ఈ షో 5 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ షో సరికొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అది కూడా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ పేరుతో పట్టాలెక్కబోతోంది. ఆ పిక్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. ఆహా టీమ్ ఈ షోకి సంబందించిన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఫన్నీ నోట్స్ కూడా పెట్టింది. " ఇది కేవలం ఒక వంటల కార్యక్రమం కాదు. వంటలు బహు పసందు, వినోదాలతో విందు, మరుపురాని జ్ఞాపకాలతో మనసు నిండు .... అలాంటి వినోదాత్మకమైన వంటల కార్యక్రమం అమెరికాకు వస్తోంది. మీరు మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనుకునే వంట, హాస్యం, వేడుక త్వరలో రాబోతోంది. ఆహా వేదికపై వడ్డించడానికి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ త్వరలో మీముందుకు రావడానికి సిద్ధమవుతోంది. " అంటూ పెట్టిన ఫన్నీ నిజంగా బహు పసందుగానే ఉంది. నెటిజన్స్ ఈ పిక్స్ ని చూసి ఆల్రెడీ ఈ ఎపిసోడ్స్ ఎవరెవరిని ఇన్వైట్ చేయాలో కూడా ఒక మెనూ ప్రిపేర్ చేసేసి రిప్లైస్ లో రాసేశారు. "రీతూ, తనూజ, విష్ణు ప్రియా, నిఖిల్, కావ్య" వీళ్ళను తీసుకురావాలంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి సుమ హోస్ట్ గా చేయబోతున్న ఈ సీజన్ కి ఎవరెవరు వచ్చి వంటలు చేసి విందును, వినోదాన్ని ఎవరు అందిస్తారో చూడాలి.
Jul 30, 2026 10:45AM
చూడడానికి ఎదవలా కనపడినా చాలా మంచోడు... నిఖిల్ తో మోనీషా
కుకు విత్ జాతిరత్నాలు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ థీమ్ తో ఈ లేటెస్ట్ ఎపిసోడ్ రాబోతోంది. ఈ ప్రోమోలో ఫ్రెండ్స్ వచ్చిన వాళ్లంతా ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టుకుని వాళ్ళ వాళ్ళ గురించి చెప్పారు. పల్లవి గౌడ ఐతే "నిజానికి మీ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగినప్పుడు ఎవరున్నారు అని ఆలోచించాను. నేను చాలా బ్యాడ్ కూడా ఆ టైములో ఫీలయ్యాను. ఎందుకంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు అని " అంటూ ఫీలయ్యింది. తర్వాత స్నో అక్క మోనిష వచ్చి నిఖిల్ విజయేంద్ర సింహ గురించి చెప్పుకొచ్చింది. "ఇతను ఒక సెల్ఫ్ లెస్ పర్సన్. చాలా మంచి అబ్బాయి.. అక్కడెక్కడో స్నో పడిందట నేనొచ్చి ఇక్కడ పడ్డాను. చూడడానికి ఎదవలా కనపడినా చాలా మంచి కోతి జాతిరత్నం " అని చెప్పేసరికి ప్రదీప్ జాతిరత్నం కాదు కుకు అంటూ కరెక్ట్ చేసాడు. ఇక దీపికా పాప్ కార్న్ గెటప్ తో వచ్చింది. "ఈ రోజు మీరు పాప్ కార్న్ ని ఎన్ని రకాలుగా చూడొచ్చో అన్ని రకాలుగా చూడోచ్చు " అంటూ ప్రదీప్ నోట్లోకి ఒక పాప్ కార్న్ ని విసిరింది. "నేను పాప్ కార్న్ సైలెంట్ గా ఉంటే చూడాలనుకుంటున్న " అంటూ పక్క నుంచి డీమన్ పవన్ కౌంటర్ వేసాడు. ఇమ్మానుయేల్ ఒక గ్లాస్ గెటప్ వేసుకొచ్చి "ఫ్రెండ్ షిప్ అంటేనే మనం మనం అంటేనే ఫ్రెండ్ షిప్ " అనేసరికి నిఖిల్ వచ్చి చీర్స్ కొట్టాడు. హరి ఐతే బైక్ గెటప్ తో వచ్చాడు. "యాంకర్ కి ఎమోషన్ పెట్టుకునే మైక్ ఫ్రెండ్స్ కి ఎమోషన్ వాళ్ళు కలిసి తిరిగే బైక్ " అని చెప్పాడు. రీతూ క్యారేజ్ గెటప్ తో వచ్చింది. "అసలైన మనకున్న చిల్లర ఫ్రెండ్స్ అందరూ కనిపించేదే ఈ లంచ్ బాక్స్ వల్ల " అని చెప్పుకొచ్చింది. తర్వాత వాళ్లకు టాస్కులు ఇచ్చారు. బొమ్మను చూపిస్తే కలర్ క్లే తో దాన్ని తయారు చేస్తే వాటిని గుర్తుపట్టాలని చెప్పారు. ఇలా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ రాబోతోంది.
Jul 30, 2026 10:39AM
నరఘోషకు నమస్కారం ... వెరైటీగా పండు స్టేటస్ పిక్
బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఇటుక మీద ఇటుక పెట్టి అనే పాట ఎంత ఫేమస్ అయ్యిందో ఆ పాటను రాసిన దానికి తగ్గట్టు డాన్స్ చేసిన పండు మాష్టర్ కూడా అంతే ఫేమస్. పండు మాష్టర్ ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఢీ షో హోస్ట్ నందు ఐతే తనకు దేవుడు అవకాశం ఇస్తే గనక పండులా బతకాలనుకుంటాను అంటూ స్టేజి మీద చెప్పాడు. ఎందుకంటే పండు ఎం చేయాలనుకుంటాడో అది చేసేస్తాడు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు అని చెప్పాడు. ఐతే రీసెంట్ గా అంటే జూన్ 3 న అతనికి యాక్సిడెంట్ కి గురయ్యాడు. విశాఖలో ఒక ఈవెంట్ చేసి వస్తుండగా ఒక చోట కార్ ఆపి దాని వెనక నిలబడిన పండు మాష్టర్ ని కోళ్ల వాన్ ఢీ కొట్టడంతో కాళ్లకు గాయాలై హాస్పిటల్ లో చేరాడు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇక అతన్ని పరామర్శించడానికి సుమ, శేఖర్ మాష్టర్, యష్ మాష్టర్ వీళ్లంతా వీడియో కాల్స్ లో మాట్లాడారు కొంతమంది డైరెక్ట్ గా వెళ్లి పలకరించారు. ఇక ఆడియన్స్ నెటిజన్స్ కూడా పండు మాష్టర్ ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఇక జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ కోరుకుని ఒక జాకెట్ కూడా ఇస్తానని చెప్పారు. రష్మీ ఐతే పండు ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంది. అలాంటి పండు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. బెడ్ మీద పడుకుని "హాయ్ ఎవ్రీ వన్ ...నరగోషకు నమస్కారం " అంటూ పెట్టాడు. దీన్ని బట్టి తనకు నరఘోష బాగా తగిలిందని చెప్పకనే ఆ మెసేజ్ చెప్పాడు. నిజంగా సైన్స్ పరంగా ఆలోచిస్తే ఇదంతా ట్రాష్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ తరతరాలుగా పెద్దలు చెప్తూ వస్తున్న మాట కూడా ఒకటి ఉంది నరఘోషకు నల్లరాయి కూడా పగులుతుంది అని. నిజానిజాలు ఎలా ఉన్నా కానీ చాలామంది ఈ నమ్మకాన్ని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు.
Jul 30, 2026 10:34AM
చిట్టి మాష్టర్ కి ఢీ డాన్సర్ల నుంచి అరుదైన గౌరవం
గురు పూర్ణిమ అంటే చాలా మంది సాయి బాబాను , కొందరు గణేషుడిని ఇలా రకరకాలుగా వాళ్ళు కొలిచే దైవాన్ని పిక్స్ గా స్టేటస్ లో పెట్టుకుంటారు అలాగే వాళ్లకు పూజలు చేసుకుంటారు. ఇదంతా డివోషనల్ కానీ రేయాలిటీలోకి వచ్చేసరికి ఎవరికైతే ఏమీ లేని సమయంలో ఒక అవకాశం ఇచ్చి చెయ్యి అందిస్తారో వాళ్లనే గురువుగా భావిస్తారు. ఇక అలాంటి వాళ్ళు హెల్ప్ చేసి చెయ్యి అందించేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఐతే బుల్లితెర విషయానికి వస్తే ఢీ డాన్స్ షో అందరికీ తెలుసు. అందులో చిట్టి మాష్టర్ అంటే ఫుల్ ఫేమస్. చాలామందిని పైకి తెచ్చాడు కూడా మిగతా డాన్సర్స్ కూడా స్టేజి మీద చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి చిట్టి మాష్టర్ ని తమ గురువుగా భావిస్తూ చాలామంది డాన్సర్స్ ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఆయన పిక్ ని తమ స్టేటస్ లో పెట్టుకున్నారు. అలా తన పిక్ ని పెట్టుకున్న వాళ్ళందరి స్టేటస్ లను స్క్రీన్ షాట్స్ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు చిట్టి మాష్టర్. డాన్సర్ అనిల్ ఐతే హ్యాపీ గురు పూర్ణిమ మాష్టర్ అని చెప్పాడు. ఢీ చందు ఐతే గాడ్ ఫాదర్ అని పెట్టుకున్నాడు. డాన్సర్ కమలాకర్ ఐతే హ్యాపీ గురు పూర్ణిమ మాష్టర్ అని , ఢీ శివ కూడా హ్యాపీ గురు పూర్ణిమ మాష్టర్ ఐ లవ్ యు అంటూ పోస్ట్ చేసుకున్నాడు. అలాగే ఢీ లోని బాబీ మాష్టర్ కొరియోగ్రాఫర్ జిత్తు మాష్టర్ కి గురు పూర్ణిమ విషెస్ చెప్పాడు. ఏదేమైనా అజ్ఞానమనే చీకటికి పారదోలి వెలుగును ప్రసాదించడమే గురువు యొక్క లక్షణం అలాంటి గురువులందరికీ వందనం.
Jul 30, 2026 10:24AM.webp)
Brahmamudi : రేఖ రహస్యం, ఐశ్వర్య మోసం.. దుగ్గిరాల కుటుంబానికి పొంచి ఉన్న కొత్త ముప్పు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1097 లో.....మదన్ బాధపడుతుంటే రేఖ వెళ్తుంది. ఎందుకు అమ్మ వాడి గురించి నన్ను కొట్టావ్.. అసలు వాళ్ళ అమ్మని నువ్వు వెతుకుతానని మాటిచ్చావ్.. అసలు వాళ్ళ అమ్మ కి నీకు సంబంధం ఏంటని మదన్ అడుగుతుంటే రేఖ సైలెంట్ గా ఉంటుంది. ఇదే నీలో వచ్చిన మార్పు.. ఇంతకముందు నేను ప్రశ్న అడగకముందే సమాధానం చెప్పేదానివి ఇప్పుడు అడిగినా సమాధానం చెప్పట్లేదని రేఖతో మాధవ్ అంటాడు. ఆ తర్వాత ఐశ్వర్యని తన క్లాస్ మేట్ శశి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తనకి డైమండ్ రింగ్ ఇస్తాడు. అదంతా ఇందు చూస్తుంటే ఐశ్వర్య చూసి కావాలనే శశిని హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. రేపు ఇద్దరం కలిసి బయటకు వెళదామని శశి అనగానే ఐశ్వర్య సరే అంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య లోపలికి వెళ్తుంటే ఎవరు అతను అని ఇందు అడుగుతుంది. నా బాయ్ ఫ్రెండ్ అని ఐశ్వర్య చెప్తుంది. ఎందుకు అలా చేస్తున్నావ్.. ఎవరిని నమ్మకూడదని ఇందు చెప్తుంది. ఏంటి ఏదో నా గురించి అలోచించినట్లు యాక్టింగ్ చేస్తున్నావని ఐశ్వర్య అంటుంది.ఆ తర్వాత వెంకీకి నందు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యడు. దాంతో చలపతికి నందు ఫోన్ చేస్తుంది. దంతో వెంకీకి చలపతి ఫోన్ ఇస్తాడు. నాకు పని ఉంది అని వెంకీ ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకు రా అలా మాట్లాడుతున్నావని చలపతి అనగానే నువ్వే కదా దుగ్గిరాల ఇంటి వాళ్లతో ఏ సంబంధం పెట్టుకోకు అని వెంకీ అంటాడు. అంటే ఏంట్రా అని చలపతి అనగానే నందు ఆ దుగ్గిరాల వారసురాలు అని వెంకీ చెప్తాడు. వాళ్ళు షాక్ అవుతారు. అన్నయ్య ఇలాగే ప్రాబ్లమ్ వెతుక్కుంటూ వెళ్ళాడు. నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు అని చలపతి చెప్తాడు. ఆ తర్వాత లక్కీ రాజు హాల్లో ఉంటారు. రేఖ వర్క్ చేసుకుంటుంది. భ్రమరాంబని చూసి మా అమ్మ అలా ఉంటుందా అని లక్కీ అనగానే మీ అమ్మ అలా వుండదు.. రేఖ పిన్ని లాగా మోడ్రన్ గా ఉంటుందని రాజు అనగానే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవని లక్కీ అంటాడు. అందుకేగా నిన్ను వదిలేసిందని రాజు అనగానే రేఖ కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది. ఆ తర్వాత పెళ్లి అయిన దగ్గర నుంచి ఏ పూజ చేయలేదు.. రాజు నువ్వు కలిసి సత్యనారాయణ వ్రతం చెయ్యాలని ఇందుతో అపర్ణ అంటుంది. ఇప్పుడు అవేం వద్దని ఇందు చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 30, 2026 10:06AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com









