Agnipariksha season2 : అదిరిపోయే ట్విస్ట్లతో ఎపిసోడ్-8.. ఫస్ట్ ఫైర్ కార్డ్ దక్కించుకున్న రాజకుమారి!
అగ్నిపరీక్ష ఎపిసోడ్-8లో హైలైట్ ప్రియా శెట్టి ఎంట్రీనే. సీజన్ 1 కంటెస్టెంట్ గా వచ్చి స్టేజ్ మీదకు రాగానే మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయ్ అంది. వస్తూ వస్తూనే ఫస్ట్ ఫైర్ కార్డ్ ని తీసుకొచ్చింది. అది మామూలు కార్డ్ కాదు.. రివర్స్ ది డెసిషన్ పవర్ ఉన్న కార్డ్. ఇంకా గ్రూపులు కట్టలేదా, రేపు మీ పక్కనోళ్లనే దాటుకుని వెళ్లాల్సి వస్తుందని ముందే వార్నింగ్ ఇచ్చి గేమ్ కి కిక్ ఇచ్చింది. ఆ కార్డ్ కోసం ప్రియా రాజకుమారిని పిలిచింది. రాజకుమారి చరణ్ ని, చరణ్ అపూర్వని లాగారు. ముగ్గురికి బోర్డు మీద 1 నుంచి 30 దాకా నంబర్లు, ముందు రెండు బెలూన్స్. రూల్ సింపుల్, ఒక నంబర్ చెప్తే దానికి తగ్గట్టు బెలూన్లో గాలి నింపుతారు. ఎవరి నంబర్ కి బెలూన్ పేలుతుందో వాళ్ళు అవుట్. ఫస్ట్ అపూర్వ అవుట్ అయిపోయింది. లాస్ట్ లో రాజకుమారి, చరణ్ ఇద్దరే మిగిలారు. అక్కడే రాజకుమారి అసలు తెలివి చూపించింది. అందరూ 1, 2 అని చిన్న నంబర్లు చెప్తుంటే, ఒక్కసారిగా 14 అని చెప్పి రిస్క్ చేసింది. దాంతో బెలూన్ ఫుల్ అయిపోయింది, చరణ్ కి ఇంక ఆప్షన్ లేకుండా పోయింది. చిన్న నంబర్ చెప్పినా బెలూన్ పేలి చరణ్ అవుట్. అలా భయపడకుండా ఆడినందుకే ఫస్ట్ ఫైర్ కార్డ్ రాజకుమారి కొట్టేసింది. Agnipariksha Season 2, Priya Shetty, Rajakumari Dayana, Bigg Boss Telugu updates, TeluguOne entertainment
Aug 23, 2026 12:37PMAgnipariksha season2 : రెండో ఫైర్ కార్డ్ను సొంతం చేసుకున్న దీపక్.. రసవత్తరంగా మారుతున్న పోటీ!
బిగ్ బాస్ సీజన్-10 కి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక అగ్నిపరీక్షలో గెలిచిన వారే హౌస్ లోకి ఎంట్రీ అవుతారు. ఫస్ట్ కార్డ్ రాజకుమారి గెలుచుకున్న తర్వాత సెకండ్ ఫైర్ కార్డ్ తీసుకుని వచ్చింది మర్యాద మనీష్. వాడు స్టేజ్ మీదకు రాగానే సీన్ మొత్తం లైట్ అయింది. ఈ లోపు నవదీప్ కి ఏదో పని ఉందని బయటికి వెళ్లిపోయాడు.. దాంతో షోని బిందు, అభిజిత్, శ్రీముఖి ముగ్గురే లాగారు. సెకండ్ టాస్క్ లో దీపక్, హేమంత్, గాయత్రి పోటీ పడ్డారు. టాస్క్ ఏంటే పేపర్ చేపల్ని ఎగరేసి ప్యాన్ లో పట్టుకోవాలి. దీపక్ మాత్రం ఎవరి జోలికి పోకుండా తన కలర్ చేపల మీదే ఫోకస్ పెట్టాడు. హేమంత్ మాత్రం అటు గాయత్రి ప్యాన్ లోంచి, ఇటు దీపక్ ప్యాన్ లోంచి లాగేయాలని చూశాడు. బజర్ కొట్టాక కూడా గాయత్రి దీపక్ ప్యాన్ లోని చేపల్ని ఎగరగొట్టింది, దానితో చిన్న గొడవ అయింది కూడా. చివరికి లెక్క చూస్తే హేమంత్ కి 16, గాయత్రికి 24, దీపక్ కి 27 వచ్చాయి. నిజాయితీగా ఆడినందుకు బిందు మాధవి దీపక్ ని బాగా మెచ్చుకుంది కూడా. అలా సెకండ్ ఫైర్ కార్డ్ `స్కిప్ ది రౌండ్ ` దీపక్ కొట్టేశాడు. ఈ కార్డ్ వల్ల ముందు ముందు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ వచ్చినట్టే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. Agnipariksha Season 2, Bigg Boss Telugu updates, Deepak Fire Card, Maryada Manish, TeluguOne entertainment
Aug 23, 2026 12:30PMAgnipariksha season2 : కళ్యాణ్ పడాల ఎంట్రీతో హైఓల్టేజ్ డ్రామా.. అమన్ను వరించిన మూడో ఫైర్ కార్డ్!
బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అగ్నిపరీక్ష స్టేజ్ మీదకి వస్తాడు. వాడు రాగానే స్టేజ్ మొత్తం మారిపోయింది. నేను బిగ్ బాస్ గెలిచానంటే దానికి కారణం అగ్ని పరీక్షే, ఇక్కడి జడ్జ్ లు, హోస్ట్ లే అని ఎమోషనల్ గా చెప్పాడు. వస్తూనే అమన్ ని పిలిచి, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ 10 విన్నర్ అయితే ఎలా స్పీచ్ ఇస్తావనే టాస్క్ ఇస్తాడు. అమన్ కూడా బిగ్ బాస్ 9 ట్రోఫీ పట్టుకుని అదిరిపోయే స్పీచ్ ఇచ్చి ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత అసలు గేమ్ మొదలైంది. ఈ టాస్క్ కోసం అమన్, మిథిలేష్, రోహిత్ సెలెక్ట్ అయ్యారు. రెండు లెవెల్స్, ఫస్ట్ జెండా పాతడం, సెకండ్ పిల్లోస్ కలెక్ట్ చేయడం. ఫస్ట్ లెవెల్ లోనే మిథిలేష్ ఔట్ అయిపోయాడు. ఇక పిల్లో టాస్క్ లో అమన్, రోహిత్ ఇద్దరూ ఫుల్ ఫిజికల్ అయిపోయారు. గొడవ పెద్దదవుతుందని శ్రీముఖి అపూర్వని సంఛాలక్ గా పెట్టింది.. అయినా ఆపలేదు. లాస్ట్ కి అపూర్వ తీర్పు ఇచ్చింది. పిల్లోస్ ఎక్కువ అమన్ దగ్గర ఉన్నా, రోహిత్ ఫిజికల్ తక్కువ చేశాడని వాడినే విన్నర్ అంది. దాంతో శ్రీముఖి, అభిజిత్, బిందు ముగ్గురూ సీరియస్ అయ్యారు. నీ ఇష్టానికి రూల్స్ మారుస్తావా అని అపూర్వని పక్కన పెట్టేసి, ఎక్కువ పిల్లోస్ ఉన్న అమన్ నే విన్నర్ అని ప్రకటించారు. ఈ థర్డ్ కార్డ్ పవర్ ఏంటో సీక్రెట్ గా ఉంచారు. ఆ కార్డ్ ని జ్యూరీ దగ్గర పెట్టారు. అమన్ మాత్రం ఆ పవర్ ని బిందు మాధవి దగ్గరే ఉంచమన్నాడు. ఆమె నాకు రెడ్ ఇచ్చినా నమ్మకం ఉందని చెప్పాడు. Agnipariksha Season 2, Kalyan Padala, Bigg Boss Telugu updates, Aman Rohit pillow task, TeluguOne entertainment
Aug 23, 2026 12:20PMAgnipariksha season 2 : గేమ్ రూల్స్ను మార్చేసిన ఫైర్ కార్డ్స్.. ఆసక్తికరంగా బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ రేసు!
బిగ్ బాస్ సీజన్-10 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా అగ్ని పరీక్ష సీజన్-2 లో ఎనిమిదో ఎపిసోడ్ తో అసలు గేమ్ మొదలైందని చెప్పాలి. ఇప్పటిదాకా నామినేషన్లు, చిన్న చిన్న టాస్కులు అనుకుంటే, ఇప్పుడు ఫైర్ కార్డ్స్ వచ్చాయి. ఈ కార్డ్స్ అంటే మామూలు పవర్స్ కాదు, ఒకసారి చేతికి వస్తే గేమ్ నే మార్చేయొచ్చు. అందుకే అందరి కళ్ళు ఆ కార్డ్స్ మీదే పడ్డాయి. ఈ ఎపిసోడ్ కి స్పెషల్ టచ్ ఏంటంటే.. సీజన్ 9 వాళ్ళని తీసుకురావడం. ప్రియాశెట్టి, మర్యాద మనీష్, కళ్యాణ్ పడాల ముగ్గురూ వచ్చి టాస్కులు ఆడించారు. వాళ్ళు వస్తూనే మీరు ఇంకా గ్రూపులు కట్టలేదా, ఇక్కడ ఫ్రెండ్షిప్ లు చూడకూడదు, పక్కనోడిని దాటేసి వెళ్లాలని గట్టిగానే చెప్పారు. కళ్యాణ్ అయితే నేను బిగ్ బాస్ విన్నర్ అయ్యానంటే అగ్నిపరీక్ష వల్లే అని చెప్పి కొత్త వాళ్లకి ఇంకా కసి పెంచాడు. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మూడు ఫైర్ కార్డ్స్, మూడు డిఫరెంట్ గేమ్స్, చాలా ఫిజికల్, మైండ్ గేమ్ కనిపించింది. నవదీప్ మధ్యలో వెళ్లిపోవడం, సంఛాలక్ గా ఉన్న అపూర్వ తప్పు తీర్పు ఇవ్వడం, జడ్జెస్ దాన్ని కరెక్ట్ చేయడం, చివరికి పవర్స్ ని సీక్రెట్ గా పెట్టడం - అన్నీ కలిపి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ కార్డ్స్ ముందు ముందు ఎవరి తలరాతలు మారుస్తాయో చూడాలి మరి. Agnipariksha Season 2, Bigg Boss Telugu, Fire Cards, Priya Shetty Maryada Manish Kalyan Padala, TeluguOne entertainment
Aug 23, 2026 11:38AMPodharillu: కుటుంబ పగలు, భావోద్వేగాల నడుమ సాగుతున్న పొదరిల్లు సీరియల్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-186లో.. మీ అక్క మీద అంత ప్రేమ ఉన్నావాడివి మీ అక్కకి పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఎందుకు చూపించడం లేదని పెద్ది వాళ్ళ మేనమామయ్యని తాయారు అడుగుతుంది. మీ అక్క బాగున్నంతవరకు నా వరకు ప్రేమగానే చూసుకుంది. తనని వెళ్ళనివ్వు ఈ చంపుకోవడాలు వద్దు అని తాయారు అంటుంది. మీరు శిక్ష వేయాలని అనుకొని మీ అక్క ఆత్మకి శాంతి లేకుండా చేస్తారా, ఈ కుటుంబం మీద పడ్డని తూడ్చడానికి మేనమామగా మీరు అండగా నిలబడలేరా అని మహా అంటుంది. మా మామయ్య నిజంగా మా అత్తయ్యని చంపారో లేదో తెలియదు.. కానీ జైలు శిక్ష అనుభవించి వచ్చారు కదా.. ఇక మీరు మీ పగని మర్చిపోలేరా అని గాయత్రి అంటుంది. మామయ్య.. మా అమ్మ చిన్నపుడే చనిపోతే, నాన్న జైలు పాలు అవుతే మేము నలుగురం అనాధల్లా పెరిగాం మామయ్య.. మా మీద జైలుకి వెళ్ళొచ్చిన వాడి కొడుకులు అనే ముద్ర పడింది. మా అమ్మ మా దీన స్థితి చూసి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి అని మాధవ అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా వీడు మారడు.. వీడి పగ చల్లారదు.. ఎప్పటికి వాళ్ళ అక్కని నేనే చంపానని అనుకుంటాడు. అలాగే అనుకో.. నేను ప్రతీ సంవత్సరం ఈ ఊరికి వస్తాను.. మొక్కులు తీర్చికుంటూనే ఉంటానని నారాయణ అంటాడు. ఆ తర్వాత మాధవ వాళ్ళ మేనమామ అందరిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మహా, చక్రి, మాధవ, కేశవ, కన్నా, నారాయణ అందరు కార్ లో ఇంటికి వస్తుంటారు. నొప్పిగా ఉందని చక్రి అంటాడు. దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆపనా అని కేశవ అంటాడు. మహా ఆపమని చెప్తుంది. ఇక చక్రికి తగిలిన గాయాలకి మందు రాస్తుంది మహా. కాసేపటికి అందరు ఇంటికి వస్తారు. కేశవ బయటకి వెళ్ళొస్తానని చెప్తాడు. ఎక్కడికి అని మాధవ అడుగగా శైలు వాళ్ళ ఇంటికి అని కేశవ అంటాడు. ఒక్కడివే ఇంత రాత్రి వెళ్ళొద్దని మాధవ చెప్తాడు. దాంతో అతని వెంట చక్రి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక శైలు వాళ్ళ అమ్మ వరాలు ఉంటుంది. కేశవని చూసి..ఇదేనా మీ అన్నయ్య పెంపకం.. మా కూతురిని తల్లిని చేశావంటు కేశవని తిడుతుంది. ఇక శైలు వాళ్ళ నాన్న, శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ కూడా వచ్చి కేశవని తిడుతుంటే అప్పుడే శైలు వచ్చి వాళ్ళని ఆపుతుంది. ఆపండి.. కేశవ ఏం తప్పు చేయలేదు..నేనే అబద్ధం చెప్పానని శైలు అనగానే వరాలు, సురేష్, చక్రి, కేశవ, శైలు వాళ్ళ నాన్న అంతా షాక్ అవుతారు. నిజం చెప్పమని వరాలు అనగానే మీరు ఎక్కడ నాకు నచ్చని పెళ్ళి చేస్తారేమోనని అప్పుడు అలా అబద్ధం చెప్పానని శైలు అంటుంది. చూసారా మా తమ్ముడి తప్పేం లేదని చక్రి అంటాడు. ఎప్పటికైనా శైలు నాదే అంటూ శైలుని తీసుకొని కేశవ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Podharillu serial, Podarillu latest episode, Telugu serial updates, Mahalakshmi Chakri, Kesava Shailu story
Aug 23, 2026 11:14AMIllu illalu pillalu: రామరాజుని కుంగదీసిన మోసం.. బయటపడుతుందా శ్రీవల్లి నిజం?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-557లో.. రామరాజు తీవ్ర నిరాశలో ఉంటాడు. తను ఎంతో నమ్మిన సింహాద్రి మోసం చేయడంతో మిల్లులో 5 లక్షలు పోయాయని తెలుసుకుని కుంగిపోతాడు. నమ్మిన వాడే మోసం చేస్తే గుండె తట్టుకోలేదని వేదవతితో చెప్పుకుంటూ ఏడుస్తాడు. ఈ మాట విని ఇంట్లో అందరు షాక్ అవుతారు. అదే సమయంలో శ్రీవల్లి తన తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ ఉంటుంది. మంచి భర్త, మంచి కుటుంబాన్ని మోసం చేశానని, పేదవాళ్లమని ముందే చెప్తే బాగుండేదని తల్లిదండ్రులను తిడుతుంది. నా కాపురం నాశనం అయిపోతుందని చాలా బాధపడుతుంది శ్రీవల్లి. రామరాజు దగ్గర వల్లి గురించి ప్రేమ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. వల్లి వాళ్ల ఆస్తులు, బిజినెస్ లు అన్నీ అబద్ధమని చెప్పబోతుంది. కానీ నర్మద వెంటనే ప్రేమను ఆపేస్తుంది. ఇప్పుడు చెప్తే గొడవ పెద్దదవుతుందని అడ్డుకుంటుంది. దీంతో నిజం బయటకు రాకుండా ఆగిపోతుంది. వల్లి తన పరువు కాపాడుకోవడానికి భాగ్యం చెప్పినట్లుగా చింతామణికి 6 లక్షలు ఇస్తుంది. అప్పటికే చందు బావ దగ్గర పెళ్లి కోసం 10 లక్షలు తీసుకున్న విషయం కూడా ఇంట్లో తెలియడంతో వల్లి మరింత టెన్షన్ పడుతుంది. ఈ డబ్బు విషయం రామరాజుకి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతుంది. మరోవైపు విశ్వ తన తెలివితో భద్రవతిని మాటల్లో పెట్టి ఏమారుస్తాడు. వల్లి విషయం బయటకు రాకుండా ఉండటానికి కొత్త ప్లాన్ వేస్తాడు. వల్లిని ఇంట్లో ఉండేలా చేయడానికి విశ్వ, భాగ్యం కలిసి డ్రామా ఆడుతారు. భాగ్యం, ఆనందరావు బస్తీ గెటప్ లో ఇంటికి వస్తారు. వాళ్లను ఆ గెటప్ లో చూసి అందరు షాక్ అవుతారు. ప్రేమ చెప్పాల్సిన నిజం అక్కడితో ఆగిపోతుంది. అసలు వల్లి నిజం బయటపడుతుందా లేదా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Illu illalu pillalu serial, Star Maa serial updates, Srivalli truth, Ramaraju, Telugu TV serial gossip, TeluguOne entertainment
Aug 23, 2026 11:01AMBrahmamudi: రేఖ రహస్యం రాజు చేతిలో.. రిపోర్టులు చింపేసినా తప్పని షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1118లో.. భ్రమరం చేతిలో ఉన్న కాగితాలు డీఎన్ఏ రిపోర్టులేమోనని రేఖ మొదట కంగారుపడుతుంది. కానీ అవి శేషు లెక్కల గురించి అని తెలిసి ఊపిరి పీల్చుకుంటుంది. అయితే రాజు మాత్రం రేఖను ఆట పట్టిస్తూ.. నీ రిపోర్టులు ఎవరికి తెలిస్తే నువ్వు షాక్ అవుతావో వాళ్ల దగ్గరే పెట్టానని రాజు అంటాడు. వెంటనే రేఖ.. లక్కీ దగ్గరా అని కంగారుపడుతుంది. దానికి రాజు.. నీ కన్న కొడుకు లక్కీ అని అందరి ముందు ఒప్పుకుంటే ఈ బాధే ఉండదు కదా అని అంటాడు. రేఖ పరుగెత్తుకుంటూ వెళ్లి రిపోర్టులను దొరికించుకుని చింపేస్తుంది. కానీ రాజు.. ఇది సాఫ్ట్ కాపీ.. నా మెయిల్లో ఉంది. వంద జిరాక్స్లు తీసి ఇంట్లో పరిస్తే ఏం చేస్తావంటూ ఆమెకు మరో షాక్ ఇస్తాడు. రేఖ భయంతో మెట్లపై కూర్చుని ఉండగా అపర్ణ వచ్చి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఒకప్పుడు నువ్వు ఇందుని ఇలాగే పరుగులు పెట్టించావ్.. ఇప్పుడు నా మనవడు నిన్ను అలాగే పరుగులు పెట్టిస్తున్నాడని అపర్ణ అంటుంది. రేఖ కోపంగా స్పందించినా, అపర్ణ మాత్రం .. నీ పాపం పండింది. నువ్వు చేసిన ప్రతి పనికి గుణపాఠం తప్పదు. అనుభవించకపోతే అనుభవించేలా చేస్తాడు నా మనవడు అని చెప్పేసి వెళ్లిపోతుంది. దీంతో రాజు చేతిలో రేఖ రహస్యం బయటపడబోతుందనే టెన్షన్ మరింత పెరుగుతుంది. మరోవైపు రాజు, ఇందు కలిసి సుభాష్ ఆపరేషన్ రిపోర్టుల కోసం హాస్పిటల్కు వెళ్తారు. అన్ని రిపోర్టులు చూసిన డాక్టర్.. గుడ్ న్యూస్.. నరాలకు ఎలాంటి సమస్య లేదు. ఆపరేషన్ చేస్తే బాగవుతారు. కానీ తర్వాత ఫిజియోథెరపీ, చిన్నపిల్లాడిలా ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్తాడు. ఇందు వెంటనే.. మా తాతయ్య కోసం ఏమైనా చేస్తాను డాక్టర్ అంటుంది. రాజు కూడా.. డాక్టర్ చికిత్సతో పాటు నీ ప్రేమ కూడా తాతయ్యను మళ్లీ నడిచేలా చేస్తుందంటూ ఇందుకు ధైర్యం చెప్తాడు. ఇక ఇంట్లో గ్రాండ్ పార్టీ చేయాలని ఐశ్వర్య తన ఫ్రెండ్స్ను పిలుస్తుంది. డబ్బులు, ఏర్పాట్ల కోసం అపర్ణను అడిగినా ఆమె దగ్గర లేవని చెప్పడంతో శశికి ఫోన్ చేసి పార్టీ ఏర్పాట్లు చేయిస్తుంది. నా రేంజ్ ఏంటో చూశావా అంటూ ఐశ్వర్య హంగామా చేస్తుంది. అపర్ణ, రేఖ, శేషులు మొన్నే గొడవ జరిగింది.. మళ్లీ ఇందుతో సమస్య రావచ్చని చెప్పినా.. ఐశ్వర్య మాత్రం.. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇందుకు భయపడ్డానని అనుకుంటారు. ఈ పార్టీ కచ్చితంగా చేసుకుంటానంటూ మొండిగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Brahmamudi Today Episode, Brahmamudi Serial Today Episode August 22 2026, Brahmamudi Episode 1118, Brahmamudi Star Maa Serial Latest Episode, Brahmamudi Rekha DNA Reports
Aug 23, 2026 10:53AMKarthika Deepam2 : దీపకి షాకిచ్చిన శివన్నారాయణ.. మూడు రోజుల్లో సూరజ్, జ్యోత్స్న పెళ్లి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-756 లో.. కంపెనీ బోర్డు మీటింగ్ లో అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటారు. ఇక నుండి దీపే శాశ్వత సీఈఓ అని శివన్నారాయణ చెప్తాడు. ఇది విని దాస్, ఇతర మెంబర్లు ఆశ్చర్యపోతారు. దీప మాత్రం .. నా వల్ల కాదు అంటూ సైన్ చేయడానికి భయపడుతుంది. కార్తీక్ మాత్రం ఆమెకు ధైర్యం చెప్తాడు. సీఈఓ పదవికి లాయర్ ఒక పెద్ద కండిషన్ పెడతాడు. దీప ఒకవేళ మధ్యలో పదవి వదిలేస్తే 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాలని పేపర్లో ఉంటుంది. ఇది విని కార్తీక్ .. 10 కోట్లా అని షాక్ అవుతాడు. కంపెనీని కాపాడటానికే ఈ రూల్ పెట్టామని శివన్నారాయణ చెప్తాడు. దీపకు ఇది పెద్ద టెన్షన్ అవుతుంది. దీప ఇంకా టెన్షన్ లోనే ఉంటుంది. ఇంత పెద్ద బాధ్యత నేను మోయగలనా అని కార్తీక్ తో చెప్తుంది. నువ్వు చేయగలవు దీపా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని ధైర్యం ఇస్తాడు కార్తీక్. నువ్వు ఉంటేనే కంపెనీ సేఫ్ గా ఉంటుందని దీపతో కార్తీక్ అంటాడు. దీంతో దీప కొంచెం ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఇంట్లో పెళ్లి వార్త వస్తుంది. 3 రోజుల్లో సూరజ్, జ్యోత్స్న పెళ్లి అని సుమిత్ర అనౌన్స్ చేస్తుంది. సూరజ్ చాలా సంతోషిస్తాడు. జ్యోత్స్న మాత్రం.. అంత తొందరగా పెళ్లా అని కంగారు పడుతుంది. జ్యోత్స్న వాళ్ల అమ్మ.. మంచి ముహూర్తం ఉంది తల్లి అని చెప్పి ఒప్పిస్తుంది. దీప దగ్గరికి సూరజ్ వస్తాడు. అక్కా మొదటి శుభలేఖ నీకే ఇస్తా, ఇది నా చిన్న గిఫ్ట్ అని చెప్తాడు. దీప కళ్లలో నీళ్లు వస్తాయి. నీ వల్లే నా పెళ్లి జరుగుతుంది అక్కా అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న మాత్రం మనసులో ఏదో దాచుకుని.. ఈ పెళ్లి జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లి పనులు మొదలవుతాయి. ఎపిసోడ్ చివర్లో అందరూ దీప సైన్ కోసం ఎదురు చూస్తారు. సైన్ చెయ్యి దీపా అని కార్తీక్ అంటాడు. దీప పెన్ను పట్టుకుంటుంది. దాస్ మాత్రం మనసులో ..దీప సీఈఓ అయితే నా ప్లాన్ అంతా పోతుందని ప్లాన్ వేస్తాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Karthika Deepam2 Today Episode, Suraj jyotsna Marriage, Karthik, Deepa, 756 episode, Deepa Permanent CEO
Aug 23, 2026 10:42AMJayam serial : గోరింటాకు వేడుకలో ఇషిక ప్లాన్ రివర్స్.. సీసీటీవీతో బయటపడే నిజం ఏంటి?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -354 లో.....అందరు గోరింటాకు పెట్టుకోవడానికి రెడీ అవుతారు. జయకి వంశీ గోరింటాకు పెట్టకుండా స్నేహ పెట్టేలా గంగ చేస్తుంది. ఇప్పుడు అందరికి గోరింటాకు పెట్టడానికి ఉన్నారు కానీ ప్రమీల అక్కకి ఎవరున్నారని జయ అనగానే ప్రమీల బాధపడుతుంది. తను లోపలికి వెళ్తుంది.. సుధా నీ కూతురికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదని కాస్త నేర్పించమని శకుంతల కోప్పడుతుంది. ప్రమీల వెనకాలే గంగ, రుద్ర వెళ్తారు. మీరు ఈ ఇంట్లో జరిగే ప్రతి పండుగలో భాగం కావాలని రుద్ర చెప్తాడు. దాంతో ప్రమీల వాళ్లతో పాటు గోరింటాకు పెట్టుకోవడానికి వస్తుంది. అందరు మగవాళ్ళు తమ భార్యలకి గోరింటాకు పెడుతారు. ప్రమీలకి శకుంతల గోరింటాకు పెడుతుంది. గంగకి రుద్ర గోరింటాకు పెడతాడు. కాసేపట్లో గంగ చేతులు ఇరిటేషన్ వస్తాయి. ఎందుకు అంటే అందులో కెమికల్ కలిపానని జయతో ఇషిక అంటుంది. కానీ గంగకి కాకుండా ఇషికకి ఇరిటేషన్ వస్తుంది. అప్పుడే రంగ, గంగ వస్తారు. ఏంటి నువ్వు గోరింటాకులో మందు కలపడం మేము చూడలేదనుకున్నావా అని రంగ తను కెమికల్ కలుపుతున్న వీడియోని చూపిస్తాడు. అది చూసి ఇషిక సారీ చెప్తుంది. ఆ తర్వాత అందరి గోరింటకు పండుతుంది. జయ గోరింటాకు పండదు. ఆ తర్వాత అసలు ఈ రోజు సరదాగా జరిగింది దానికి కారణం గంగ అని సుధా అంటుంది. మరొకవైపు ఇషిక గోరింటాకు కడుక్కుందని సూర్య కోప్పడతాడు. తరువాయి భాగంలో మన ఇంటికి ఎవరో వచ్చారు. స్టోర్ రూమ్ లో ఈ తాడు ఉంది.. చెప్పులున్నాయి నేను ఇంటికి వస్తుంటే బయట ఒక పెద్దకర్ర ఉందని రుద్ర చెప్తాడు. సీసీటీవీ చూద్దామని గంగ అంటుంది. రుద్ర సీసీటీవీ చూస్తుంటే వీరు టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Jayam serial, Zee Telugu serial updates, Ganga Ranga Ishika, Jayam serial latest episode, TeluguOne entertainment
Aug 23, 2026 10:34AMYe Devi Varamo Neevu : గీతాంజలికి క్షమాపణ చెప్పిన అంజలి.. ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు '(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -42 లో.... మనీష్ డల్ గా ఉంటాడు. నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చడం లేదని రత్నం అంటుంది. అంజలిని తీసుకొని మనీష్ వెళ్తుంటే జాగ్రత్త అని చెప్తుంది. ఎప్పుడు నాకూ జాగ్రత్త అని చెప్తావ్ కదా అని మనీష్ అంటాడు. ఇప్పుడు అంజలి బాధ్యత కూడా నీదే కదా అని రత్నం అంటుంది. ఆ తర్వాత కమల ఎదురుపడి చేసిన తప్పుకి చెంపలు వేసుకొని మరి క్షమాపణ అడుగమని అంజలితో చెప్తుంది. తనకి ఎలా మాట్లాడాలో తెలుసు అమ్మ నువ్వు తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని కమలతో మనీష్ అంటాడు. మనీష్ , అంజలి కార్ లో వెళ్తుంటారు. మీడియా ముందు ఎలా మాట్లాడాలో అంజలికి మనీష్ చెప్తాడు. ఎమన్నా డౌట్ ఉంటే అడుగమని మనీష్ అనగానే మీ అత్తయ్య ప్రొద్దున ఏ టైమ్ కి లేస్తారు. ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తుందని అంజలి అడుగుతుంది. దాంతో అతను కార్ ఆపి నేను ఏం అడుగమన్నా నువ్వేం అడుగుతున్నావని మనీష్ అంటాడు. ఒక హెల్ప్ చేస్తావా మీ అత్తయ్యకి పిఏ గా చేస్తాను.. అందుకు మీ అత్తయ్యని ఒప్పిస్తావా అని అంజలి అనగానే అది జరగని పని అని మనీష్ అంటాడు. ఆ తర్వాత అంజలి మీడియా ముందుకి వెళ్లి మాట్లాడుతుంది. అదంతా టీవీలో గీత చూస్తుంది. నేను ఆ రోజు చేసింది తప్పు.. గీతాంజలి గారు మాకు వేరొకచోట ఆశ్రయం ఇచ్చారు కానీ ఆవేశంలో అలా మాట్లాడాను ఒక తల్లిగా నన్ను క్షమించండి అని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. గీత పాజిటివ్ అవుతుంది. మనీష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు గీతకి ఒకతను ఫోన్ చేసి ఆ అంజలి ఇప్పుడు కూడా మిమ్మల్ని చెడు చెయ్యాలని చూస్తుంది. ఇంట్లో నుంచి గెంటేసాక సారీ చెప్తుంది. ఇంత మంచి అమ్మాయిని ఎలా గెంటేసిందని అనుకోవాలని ఇప్పుడు సారి చెప్పిందని అనగానే గీతకి మళ్ళీ కోపం వస్తుంది. తరువాయి భాగంలో రత్నంని గీత తన ఇంటికి రమ్మంటుంది. తనతో అంజలిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. అంజలిని చూసి గీత షాక్ అవుతుంది. ఈ ఇంట్లోకి వద్దని అంటుంది గీత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Ye Devi Varamo Neevu serial, Star Maa serial updates, Geetha Anjali storyline, Manish Rathnam Telugu serial, TeluguOne entertainment
Aug 23, 2026 9:22AMGodhavari: మురళి తెచ్చిన చీర కట్టిన నందు.. భావోద్వేగాల మధ్య సాగిన వరలక్ష్మి వ్రతం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -90 లో..... నందుకి మురళి చీర తీసుకొని వస్తాడు. అది చూసి ఏం బాలేదని మురళి మొహంపై నందు చీర విసిరేస్తుంది. దాంతో తనమీద పెద్దావిడ కోప్పడుతుంది.భర్త వంద రూపాయల చీర పెట్టి తీసుకొని వచ్చిన సరే అది అదృష్టమని పెద్దావిడ చెప్తుంది. ఆ తర్వాత నందు దగ్గరికి మురళి వస్తాడు. నందు నిజంగా ఆ చీర నచ్చలేదా అని అడుగుతాడు. నచ్చలేదని నందు అంటుంది. ఎంత పెట్టి కొన్నావ్ ఏంటని నందు అనగానే రెండువేలు అని మురళి చెప్తాడు. ఏదో ఇరవై వేల రూపాయల చీర అన్నట్లు చెప్తావ్ ఏంటని నందు అంటుంది. మరొకవైపు జానూ వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి జాను వచ్చి ఏడుస్తుంది. తన మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. నాకు సూర్య ప్రేమ నిజాయతి అనిపించింది. తనని పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడే ఉండి అందరిని చూసుకోవాలి అనుకున్నానని జానూ ఎమోషనల్ అవుతుంది. నాన్న నువ్వు చెప్పినట్లు ఈ కుటుంబాన్ని నేనే చూసుకుంటానని జాను అనుకుంటుంది. మరొకవైపు జాను ఫోటో చూస్తూ సూర్య బాధపడుతాడు. ఆ తర్వాత ఇంట్లో వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మురళి తీసుకొని వచ్చిన చీరని నందు కట్టుకుంటుందో లేదోనని మురళి టెన్షన్ పడుతాడు. మురళి తీసుకొని వచ్చిన చీరనే నందు కట్టుకొని వస్తుంది. దాంతో మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నందు వరలక్ష్మి వ్రతం చేస్తుంది. మురళి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత కిన్నెరకి ఆపరేషన్ ఎలా చేయించాలని అందరు ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Godavari serial, Star Maa serial updates, Nandhu Murali Telugu serial, Janu Surya emotional scenes, TeluguOne entertainment
Aug 23, 2026 9:07AM.webp)
ధైర్యానికి నిలువెత్తు రూపం రాజానగరం రాజకుమారి.... కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్
ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. కానీ అన్ని కథలు మనకు తెలియవు. కొన్ని కథలు మాత్రం రియాలిటీ షోస్ ద్వారా బయటకు వస్తూ ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అలాంటి రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి . ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్స్ ని ఫిల్టర్ చేసే పనిలో ఉంది. అలంటి ఈ షోలో రాజకుమారి అనే కంటెస్టెంట్ స్టోరీ మాత్రం చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది. జీవితంలో ఒక మనిషి యుద్దాన్ని ఎలా చేయాలో ఆమె జీవితాన్ని వింటే తెలుస్తుంది. అలాంటి రాజకుమారి స్టేజి మీదకు వచ్చి తన లైఫ్ ని మొత్తం నాన్ స్టాప్ గా చెప్పేసింది. " తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుంచి వచ్చాను. నా పేరు రాజకుమారి. నాకు ముగ్గురు పిల్లలు. నాకు ఇష్టం లేకపోయినా మా మావయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. అతను నేను నల్లగా ఉన్నానని మూడు నెలలకు వెళ్లి పిన్ని వాళ్ళ అమ్మాయిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏడాది తర్వాత నాకు రెండో పెళ్లి చేశారు. అతను కూడా బాధ్యతగా ఉండడు. తనతో ఎన్ని బిజినెస్ లు చేయించినా నేనే ఓడిపోయాను. అప్పుడు అర్ధమయ్యింది మార్చాల్సింది అతన్ని కాదు మారాల్సింది నేను అని. నా ముగ్గురు పిల్లలతో రోడ్డు మీద నిలబడ్డ .చివరికి తిప్పలు పడి ఒక ఇల్లు కట్టాను. అది కూడా పూర్తికాలేదు కానీ నీడ దొరికింది. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకున్న యాక్టింగ్ టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ లక్ష మంది ఫాలోవర్స్ ని సంపాదించా. ఆ టైములో నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ బుగ్గ మీద ఉన్న ఎముక విరిగిపోయింది. దాంతో నా పిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు. ఒక నెల రోజులు వాళ్ళు నా దగ్గరకు రాలేదు . నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోయా. అప్పుడే డిసైడ్ అయ్యా నా ప్రాణం పోలేదు కదా అనుకున్నా. ఒక నెల రోజుల్లో రికవరీ అయ్యాను. భయం అనే షార్ట్ ఫిలింలో అవకాశం వచ్చింది. దానికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నా. 10 వ తరగతి తర్వాత నేను నేర్చుకున్న టైలరింగ్ నా జీవనోపాధి అయ్యింది. నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే నేను ఇప్పుడు మిషన్ కుట్టి నా పిల్లలను చదివించి అనుకున్న స్థాయికి వాళ్ళను తీసుకెళ్లలేను. నా కలను నెరవేర్చుకోవడానికి నా పిల్లల చదువులకు డబ్బు అవసరం . ఈ రెండింటి కోసం నాకు వచ్చిన ఈ బిగ్ బాస్ గోల్డెన్ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తే నాలా నలుపుగా ఉన్న కొంతమందైనా ధైర్యంగా బయటకు వచ్చి బతకుతారని అనుకుంటున్నాను. నా చిన్న బాబు దిండు లేకుండా నా పొట్ట మీద పడుకునేవాడు కానీ అలాంటిది నాకు యాక్సిడెంట్ ఐనప్పుడు నన్ను చూసి పారిపోయేవాడు. పిల్లల కోసం ఇంత కష్టపడుతుంటే ఇలా అయ్యిందేమిటా అని భయమేసింది. " అని రాజకుమారి తన జీవితం మొత్తాన్ని ఆవిష్కరించింది. ఆమె మాటలకు నవదీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి ఆమె ఫైటింగ్ స్పిరిట్ కి ఫిదా ఇపోయారు. తర్వాత రాజకుమారి నవదీప్ చేసిన సినిమాల్లో ఆయన పక్కన ఉంటే బాగుందనిపించేది ఇప్పుడు కూడా ఉండాలనిపిస్తాది అంటూ సరదాగా ఫన్నీగా చెప్పింది . ఆ మాటలకు నవదీప్ లేచి స్టేజి మీదకు వచ్చి రాజకుమారితో కలిసి రాంప్ వాక్ చేశారు. ఐతే ముందు ఆయన్ని ఇంప్రెస్స్ చెయ్యి అని శ్రీముఖి చెప్పేసరికి పెన్ను , పాడ్ కావాలని చెప్పి రైట్ నుంచి లెఫ్ట్ కి తెలుగులో కవిత రాసి ఐ లవ్ యు సర్ అని చెప్పింది . తర్వాత ఇద్దరూ కలిసి రాంప్ వాక్ చేశారు. అలాగే తనకు సపోర్ట్ చేసిన వాళ్లకు ధన్యవాదాలు చెప్పింది. ఇంకా ఊరోళ్లంతా కుళ్ళుకుని సచ్చిపోండి అంటూ కూడా సరదాగా చెప్పి అందరినీ ఎంటర్టైన్ చేసి డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ సంపాదించేసింది.
Aug 22, 2026 5:18PM
డ్రామా జూనియర్స్ టైటిల్ విన్నర్ ప్రణీత్ కి 15 లక్షల కాష్ ప్రైజ్
డ్రామా జూనియర్స్ సీజన్ 9 విన్నర్స్ ని అనౌన్స్ చేసేసారు. ఈ వారం ఎపిసోడ్ లో చిన్నారులు చేసిన స్కిట్స్ అన్నీ కూడా బాగా హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ ఎపిసోడ్ కి నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చి షోని మరింత పాజిటివ్ గా మార్చారు. ఆయన కూడా పిల్లల స్కిట్స్ ని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇందులో అనిల్ రావిపూడిని తమ్ముడు అంటూ రాజాని లడ్డు ఆంటీని పిలుస్తూ హీరో శ్రీకాంత్ ని మామ అని పిలుస్తూ శ్రీవియా చేసిన స్కిట్ హైలైట్ అయ్యింది. ఇక కళ్యాణ్ రామ్ హోస్ట్ సుధీర్ మీద సరదాగా వేసిన జోక్స్ కి అందరూ నవ్వుకున్నారు. ఫైనల్ గా అనిల్ రావిపూడి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ నుంచి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేశామని చెప్పి వాళ్ళను స్టేజి మీదకు పిలిచారు. హార్దిక్, ఆదిదేవ్, వైశాలి, యద్విశ్రీ, ప్రణీత్ సెలెక్ట్ అయ్యారు. ఇందులో సెకండ్ రన్నరప్ గా వైశాలి నిలిచింది. రన్నరప్ గా ఆది దేవ్ సెలెక్ట్ అయ్యాడు. టైటిల్ విన్నర్ గా ప్రణీత్ నిలిచాడు. కళ్యాణ్ రామ్ టైటిల్ విన్నర్ ప్రణీత్ ని హగ్ చేసుకున్నారు . అందరూ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. "హ్యాపీ నా " అని కుర్రాడిని అడిగాను అతను చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది అంటూ చెప్పారు కళ్యాణ్ రామ్ . "ఇదీ స్పోర్ట్స్ మెన్ షిప్ అంటే. హ్యాపీనా అని అడిగినప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి అవార్డు తీసుకోవచ్చా అని అడిగాడు " అంటూ చెప్పి చాలా సంతోషపడ్డారు. వెంటనే మిగతా చైల్డ్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజి మీదకు పిలిచారు. అలా అందరి మధ్యలో ప్రణీత్ కి అవార్డుని అందించారు కళ్యాణ్ రామ్. టైటిల్ విన్నర్ కి 15 లక్షల కాష్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన ఆది దేవ్ కి 2 లక్షలు , సెకండ్ రన్నరప్ వైశాలి లక్ష కాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఇక ఈ డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఇక్కడితో పూర్తయిపోయింది.
Aug 22, 2026 5:12PM.webp)
బిగ్బాస్ అంటే శ్రీముఖి.... నువ్వు మా ఇంటి బంగారానివి
బుల్లితెర మీద కనిపించే యాంకర్స్ లో ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నది శ్రీముఖి అంటే అతిశయోక్తి కాదు. ఏ షో ఐనా తనదైన స్టైల్ హోస్ట్ చేస్తూ అందరినీ మెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కి హోస్ట్ చేస్తోంది. ఐతే శ్రీముఖి అంటే ఎంతో ఇష్టం ఉన్న ఒక అభిమాని శ్రీముఖి గురించి బిగ్ బాస్ గురించి రాసిన ఒక మెసేజ్ ని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. ఇంతకు ఆనంద కృష్ణ శ్రీముఖిని వర్ణిస్తూ ఎం రాసారో చూద్దాం. " శ్రీముఖి! నీతో ఒక విషయం ప్రత్యేకంగా షేర్ చేసుకోవాలని ఉంది. అది నీపై నాకు ఉన్న అభిమానం, ఆప్యాయత గురించి. బిగ్బాస్ సీజన్స్ మొదలైనప్పుడు నాకు వాటిని చూడాలనేంత ఇంటరెస్ట్ ఎప్పుడూ రాలేదు. కానీ సీజన్ 3 స్టార్ట్ ఐన ఆ రోజు నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను ఆ షో చూడటం మొదలుపెట్టాను. నిజం చెప్పాలంటే, నేను ఆ సీజన్ను ప్రత్యేకంగా నీ కోసమే చూశాను. వేరే కంటెస్టెంట్స్ కోసమో కానీ పరిచయం ఉన్న వాళ్ళ కోసం కానీ కాదు. ఇప్పటికీ నీ ఎంట్రీ నాకు గుర్తుంది. నువ్వు 13వ కంటెస్టెంట్గా స్టేజ్పైకి వచ్చావు. “దిమాక్ ఖరాబ్”, “ఒసేయ్ రాములమ్మ” వంటి పాటలతో, ఆ అద్భుతమైన రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్లో స్టేజ్ను మరింత ఆకర్షణీయంగా మార్చావు. అందరూ ఒక్కొక్కరుగా హౌస్ లోకి వెళ్లారు. కానీ బిగ్బాస్ హౌస్ రూల్స్ను మొదట చదివింది నువ్వేనని కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా ఒక్కో ఎపిసోడ్ చూస్తూ వస్తున్నప్పుడు మూడో వారానికి వచ్చేసరికి నా మనసుకి అర్థమైపోయింది నువ్వే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని. ముఖ్యంగా డంబెల్ టాస్క్ సమయంలో దాదాపు మొత్తం హౌస్ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నువ్వు చూపించిన ఎమోషనల్ గా మెంటల్ గా నువ్వు చూపించిన తెగువా నాకు నచ్చినా.. ఎవ్వరూ నీ మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నిజంగా అప్పుడే నేను నీ అభిమానిని అయ్యాను. మొదటి రోజు నుంచి షో చివరి రోజు వరకు బిగ్బాస్ పట్ల నీకు ఉన్న ప్రేమ, ప్యాషన్, అంకితభావం ప్రతి ఎపిసోడ్లో కనిపించాయి. దాంతో నీ పట్ల నా మనసులో అయితే ఒక ప్రత్యేకమైన భావన ఏర్పడింది. “బిగ్బాస్ అంటే శ్రీముఖి” అని. అంతగా నువ్వు నా మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నావు. షోలో నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ల విషయంలో నువ్వు ఎప్పుడూ నెగటివ్ గా చెప్పలేదు. తర్వాత జరిగిన బజ్ ఇంటర్వ్యూలలో నువ్వు ఎంతో మెచ్యూరిటీతో, వారి గురించి మంచి మాటలే మాట్లాడావు. అది నీలో ఉన్న మంచితనాన్ని, పరిపక్వతను చూపించింది. నీ జీవితంలో, కెరీర్లో లేదా అగ్నిపరీక్ష విషయంలో ఎలాంటి సవాళ్లు, విమర్శలు లేదా మాటలు ఎదురైనా వాటిని నువ్వు ఎంతో ధైర్యంగా తీసుకుని ముందుకు సాగావు. కొంతమంది కంటెస్టెంట్లపై మనకు ఉన్న అభిమానం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. కానీ 2019 నుంచి నీపై నాకు ఏర్పడిన అభిమానం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఇక ముందు కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా మనసులో సంపాదించుకున్న స్థానం అలాంటిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఎవరితోనూ అమానవీయంగా ప్రవర్తించవని నేను నమ్ముతాను. చివరిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను… నువ్వు మా ఇంటి బంగారం శ్రీముఖి! నీకు మరింత శక్తి, మరింత విజయం రావాలి. ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, మెరిసిపోతూ, అందరి ప్రేమను పొందుతూ ఉండాలి. ఎప్పుడూ ఇలాగే బంగారంలో నీ శక్తితో మెరిసిపోవాలని కోరుకుంటున్నాను " అంటూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ ని పంపించారు.
Aug 22, 2026 5:04PM
అబ్బా తమ్ముడు... ఏమి కోరికలురా వీళ్ళవి... 500 ఎపిసోడ్స్ , ఇమ్మూతో వీడియో సాంగ్
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ షో 200 ఎపిసోడ్స్ సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక ఇందులో ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ళ కోరికను చెప్పి చేతిలో ఒక కర్రను విరగ్గొట్టారు. ఇంతకు ఎవరెవరు ఎం కోరిక కోరుకుని కర్ర విరగ్గొట్టారు. ఎవరు విరగ్గొట్టలేకపోయారో చూద్దాం. ముందుగా శ్రీముఖి వచ్చి స్టార్ మా పరివారం షో 200 నుంచి 500 వరకు మేమందరం ఇలానే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా అంటూ కర్ర విరగ్గొట్టింది. "నేను ప్రతీ ఆదివారానికి తప్పకుండా రావాలి .. నా కలల రాణి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ " అంటూ కళ్ళజోడు దించి మరీ కైపుగా డెబ్జానీ వైపు చూసాడు అమరదీప్. కానీ కర్ర విరగ్గొట్టలేకపోయాడు. తర్వాత డెబ్జానీ వచ్చింది. "నాన్న కివి ఫ్రూట్ బిజినెస్ చేస్తారు . అది మంచిగా జరగాలని కోరుకుంటున్నా " అంటూ కర్ర విరగ్గొట్టేసింది. "ఆడపిల్ల విరగ్గొట్టింది కదయ్యా నీ మొహం " అంటూ ఇమ్మానుయేల్ అమర్ మీద కౌంటర్ వేసాడు. "నేను ఇమ్మానుయేల్ తో ఒక వీడియో సాంగ్ చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ఆ కర్రను విర్రోగ్గట్టడానికి ట్రై చేసింది కానీ కాలేదు. ఇమ్మానుయేల్ దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు కర్ర విరగాలి అని కానీ అతను ట్రై చేసినా విరగలేదు. తర్వాత శ్రీముఖి ఒక కాన్సెప్ట్ ఇచ్చింది. "మమ్మల్ని ఎన్నో ఎపిసోడ్స్ లో డాన్స్ ద్వారా ఎంటర్టైన్ చేశారు. దాంట్లో నంబర్ 1 ఎవరు" అంటూ అక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చింది. ఇక బాలు వెళ్లి 9 నంబర్ దగ్గర నిలబడ్డాడు. "బాలు 9 ఎందుకు " అని అడిగింది. " నా సీరియల్ టైమింగ్ 9 కదా " అని అమాయకంగా ఆన్సర్ ఇచ్చాడు. "నిజాయితీగా చెప్పావు కానీ నువ్వు నంబర్ 1 లో ఉండాలి " అంటూ బాలుకి సపోర్ట్ చేసింది శ్రీముఖి.
Aug 22, 2026 4:50PM
సంకేత్ కి ట్రోఫీ వెళ్ళకూడదు అన్న మాటలు విన్న నైనికా ... ఢీ విషయం రివీల్
ఢీ షో 20 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇక కప్పుని రాజు కొట్టాడు. ఈ సీజన్ పూర్తయిపోయింది. ఐతే నెక్స్ట్ సీజన్ గురించిన అప్ డేట్స్ ఇంతవరకు బయటకు రాలేదు. ఐతే ఫినాలే ఎపిసోడ్ లో ఢీ షోకి కొంచెం బ్రేక్ రాబోతోంది అంటూ చెప్పారు. ఐతే బ్రేక్ రావడం కరెక్ట్ కాదు అంటూ ఆడియన్స్ కూడా కోరుకున్నారు అలాగే ఈ ఎపిసోడ్ కి వచ్చిన కొంత మంది సీనియర్ కొరియోగ్రాఫర్స్ కూడా బ్రేక్ ఇవ్వడం సరి కాదు అన్నారు. మరి ఎప్పుడు కొత్త సీజన్ అప్ డేట్ వస్తుంది అన్న విషయం తెలీదు. ఐతే ఈ ఢీ షోలో సంకేత్ కూడా ఫైనలిస్ట్ అయ్యాడు. ఐతే తనకు ట్రోఫీ రాకూడదు అంటూ ఎవరో చెప్తున్న ఒక విషయాన్నీ సంకేత్ కో-కంటెస్టెంట్ నైనికా సంకేత్ తో కలిసి వ్లాగ్ చేసింది. ఆ విషయాన్నీ ఈ వీడియోలో చెప్పింది. ఢీ షోలో రెండు గ్రూప్స్ ఉంటాయి. కానీ సంకేత్ వేరే గ్రూప్ నుంచి వచ్చాడు. అది వేరే గ్రూప్. ఈ గ్రూప్ క్లాషెస్ లో ఒక ఈవెంట్ లో కొన్ని విషయాలు నా చెవిన పడ్డాయి. ఇటు వైపు ఉన్న పర్సన్ కి అటు వైపు గ్రూప్ నుంచి ఒక కంటెస్టెంట్ కాల్ చేసి ఏదైతే అది అయ్యింది కానీ సంకేత్ కి అస్సలు ట్రోఫీ వెళ్ళకూడదు అన్న మాటల్ని ఇవతల వైపు ఉన్న నేను వినేసాను. ఐతే ఈ విషయాలు నాకు తెలిసిపోయాయి అని నా పక్కన ఉన్న కంటెస్టెంట్ ఎవరికీ ఎం చెప్పొద్దూ అంటూ బతిమాలాడేసరికి ఇవన్నీ ఇలా ఉంటాయని నాకు తెలుసు అని చెప్పాను " అంటూ అవార్డ్స్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగింది. "జనాలకు ఎందుకు అనిపిస్తోంది మనం రిలేషన్ షిప్ లో ఉన్నామని " అని అడిగింది. "ఎందుకంటే మనం కలిసి రీల్స్ చేస్తూ షార్ట్స్ చేస్తూ ఉంటామని కదా అందుకేనేమో " అన్నాడు సంకేత్ . "అవును అతను చాలామందితో రీల్స్ చేస్తాడు నేను కూడా చాలా మందితో రీల్స్ చేస్తాను . కానీ కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు చెప్పట్లేదు కానీ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వస్తారు " అని ఆ కామెంట్స్ ని చెప్పి నైనికా నవ్వుకుంది.
Aug 22, 2026 4:36PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



.webp)



