.webp)
వయసుతో పాటు వచ్చిన మార్పులపై అనసూయ బోల్డ్ కామెంట్స్!
ఏ పని చేయాలన్నా వయసు బట్టే ఉంటుంది. కోపం ఆనందం దుడుకుదనం ఇవన్నీ వయసుతో పాటు మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి. 20 , 30 లో ఉన్న తొందరపాటు తనం 40 లోకి వచ్చేసరికి ఉండదు. ఇప్పుడు అదే విషయాన్నీ అనసూయ చెప్పుకొచ్చింది. ఇంతకూ ఎం చెప్పిందంటే " అలా స్క్రోల్ చేస్తూ ఉంటే స్కై ఇన్ ది కర్బ్ అనే స్టోరీ కనిపించింది. దాన్ని షేర్ చేశా. మంచి పనులు చేసినా జడ్జ్ చేసేవాళ్ళు ఉంటారు అనేది ఇందులో తెలుస్తుంది. ఆ వీడియోలో ఒక వాక్యం ఉంటుంది. తిట్టిన ఆ జనాలే రెండో రోజు పొగుడుతారు. అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం నేను నా ఆలోచనలు నా విధానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అప్పట్లో ఒక ఇష్యూ కోసం రైజ్ చేసిన పాయింట్ కి తలా తోక లేకుండా ఇప్పటికీ కంపేర్ చేస్తున్నా అప్పుడు ఉన్న అగ్రేషన్ ఇప్పుడు నాకు లేదు. ఎందుకిలా చేశారు, మీరు మీకెంత ధైర్యం, ఎలా వెళ్తారు మీరు అంటూ కోపంతో ఇలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు హాట్ బ్లడ్. అలాగే ఎర్లీ 30 స్ . ఇప్పుడు ఎర్లీ 40 స్ . ఇప్పుడు తెలివి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది. మీ ఆలోచనలు కూడా మారిపోతాయి. లాస్ట్ వీక్ అనుకున్నది ఇప్పుడు అనుకున్నది ఒకేలా ఉండదు. నాకు ఒకప్పుడు నచ్చని సినిమా ఇప్పుడు నచ్చుతుంది. ఒకప్పుడు నచ్చిన సినిమా ఇప్పుడు చూస్తే ఇదేం సినిమా అప్పుడు ఎలా అసలు నచ్చింది అనిపిస్తుంది. డ్రెస్ విషయంలో ఫుడ్ విషయంలో కూడా. ఒకప్పుడు నాకు కాప్సికం అస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు చాలా ఇష్టంగా అన్ని వెజిటబుల్స్ తింటాను. అంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కానీ తప్పు , రైటు అన్న విషయాలు మాత్రం అస్సలు మారవు కదా. నువ్వు చెప్పే విధానంలోనే ఎదుటి వాళ్ళ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. అది చూడాలి కదా " అంటూ అనసూయ ఎర్లీ మార్నింగ్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసింది.
Jun 9, 2026 5:00PM.webp)
రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్!
డ్రామా జూనియర్స్ సీజన్ 9 లో ముస్కాన్ మంచి హుషారున్న లేడీ పిల్లల పరిగెడుతూ ఇంటరెస్టింగ్ స్కిట్స్ చేసి జడ్జెస్ ని మెప్పిస్తోంది. రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముస్కాన్ చిన్నప్పటి రోజా గెటప్ లో వచ్చి ఆమెలానే అనుకరించి చేసి చూపించింది. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు. స్టేజి మీదకు వచ్చి కాపాడండి అంటూ అరిచేసరికి "ఎవరమ్మా నువ్వు అంత భయస్తురాలిలా ఉన్నావ్ " అంటూ సుధీర్ వచ్చాడు. "నా పేరు రోజా అండి " అంది. అంతే సుధీర్ కింద పడిపోయి "రోజానా కాపాడండి " అంటూ కౌంటర్ వేసాడు. "అమ్మో చీమ చీమ" అంటూ స్టేజి మీద గెంతింది ముస్కాన్ "ఏమయ్యిందమ్మా " అని అడిగాడు. అమ్మో చీమకు కూడా హాని చేయడం రాదండి" అంది ముస్కాన్. ఇంతలో బొమ్మాళి బ్రదర్స్ వచ్చారు. "ఎవరు బాబు నువ్వు " అంటూ స్టేజి మీద ఉన్న ఒకతన్ని అడిగాడు . "ఆ సందు చివర మీ చెల్లిని గోల చేసింది నేనేరా " అన్నాడు అతను. "రోజా వద్దు రోజా " అన్నాడు ఒక బ్రదర్. అంతే ఆ గోల చేసిన వాడిని కింద పడేసి కుమ్మేసింది చిన్న రోజా అలియాస్ ముస్కాన్. "రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ " అన్నారు బొమ్మాళి బ్రదర్స్. ఇక తర్వాత స్టేజి మీదకు ఫ్లవర్ బొకేతో అనిల్ రావిపూడి, శ్రీకాంత్ వచ్చారు. "అనిల్ గారు మా చెల్లి గురించి ఒక్కమాట చెప్పండి " అన్నారు బొమ్మాళి బ్రదర్స్ ."ఆవిడొక గయ్యాళి అని ఇలా ఎవరన్నా చెబితే అస్సలు నమ్మకండి " అన్నారు అనిల్ రావిపూడి. "అసలు ఆ నాలిక అనేది ఉందా లేదా అన్నట్టు ఉంటుంది" అన్నారు అనిల్. ఇక సుధీర్ ఐతే "అప్పటి రోజా గారి గురించి చెప్పండి " అంటూ శ్రీకాంత్ ని అడిగాడు. "ఇంత సాఫ్ట్ అమ్మాయి ఎలా పైకొస్తుందా అనుకునేవాడిని " అనేసరికి బాలయ్య డైలాగ్ ఆ చిటికెలు అనేది బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. "ఇలాంటి వాళ్ళ వల్లే నేను ఇలా తయారయ్యా . లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉండేదాన్ని" అని రోజా చెప్పారు. "ఫస్ట్ మూవీలో నా అమాయకత్వం చూసి సెల్వమణి గారు పడిపోయారు. పాపం " అంటూ సిగ్గుపడిపోతూ నవ్వేసరికి "మీరే పాపం అంటే థాంక్యూ మేడం " అన్నాడు సుధీర్.
Jun 9, 2026 3:29PM.webp)
న్యూస్ రిపోర్టర్ మహేష్ను పిచ్చెక్కించిన హైపర్ ఆది, పండు!
టీవిలో వచ్చే వాతావరణ సూచన అంటే 80 స్ , 90 స్ లో ఒక ఎమోషన్ . వాన పడే సూచన ఉంది అనగానే ముందే అందరూ అలెర్ట్ ఐపోయేవాళ్లు. న్యూస్ రీడర్ టీవీ స్క్రీన్ మీద వాతారణం మేఘాలు అవన్నీ చూపిస్తూ చెప్పడం ఇప్పటికీ చాలామందికి గుర్తే. అలాంటి ఒక కాన్సెప్ట్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ లో మాహేష్ ఆచంట న్యూస్ రీడర్ గెటప్ లో వచ్చాడు. ఆదికి న్యూస్ రీడర్ కి మధ్యన ఒక వాన కన్వర్జేషన్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. "హలో న్యూస్ రీడర్ గారేనా అండి" అని ఆది ఫోన్ చేసాడు. "ఆ న్యూస్ రీడర్ నే చెప్పు " అన్నాడు మహేష్ . "సర్ మా ఊళ్ళో రాళ్ళ వర్షం ఏమన్నా పడిద్దా అండి" అని అడిగాడు ఆది. "ఎందుకు"అన్నాడు న్యూస్ రీడర్. "మా నాన్నగారు ఒక నాలుగు రాళ్లు వెనకేసుకోమన్నారండి. అందుకే వెనకేసుకుందామని " అని ఆది చెప్పేసరికి మహేష్ షాకైపోయాడు. "వర్షం పడితే పడింది గాని ఒక రెండు ఆపగలరా వర్షాన్ని" అని అడిగాడు మళ్ళీ ఆది. "ఏ ఎం చెత్తావ్" అన్నాడు న్యూస్ రీడర్. "మా ఆవిడ వడియాలు ఆరేసింది" అన్నాడు ఆది. దాంతో మళ్ళీ షాకయ్యాడు మహేష్. తర్వాత పండు లైన్ లోకి వచ్చాడు. "సర్ న్యూస్ రిపోర్టరా సర్ " అని ఫోన్ చేసాడు. "అవును " అని మహేష్ అనేసరికి "ఉందా " అని పండు అడిగాడు. "ఏంటది " అన్నాడు న్యూస్ రిపోర్టర్. "అదే సర్ ఉందా" అని మళ్ళీ అడిగాడు పండు. "ఏంటది..ఏముందరా " అన్నాడు మహేష్ కోపంగా. "వర్షం పడితే కరువు పోద్ది అన్నారు కదా ..అదే ఉందా " అన్నాడు పండు మళ్ళీ. ఇలా వాన కాన్సెప్ట్ అందరినీ అలరించబోతోంది.
Jun 9, 2026 12:41PM.webp)
హెవెన్ అండ్ హెల్ కాన్సెప్ట్తో నవ్వుల పంట!
కుక్కు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే నవ్వులే నవ్వులు. హెవెన్ అండ్ హెల్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ థీమ్ రాబోతోంది. ఒక్కొక్కొళ్ళు ఒక్కో గెటప్ లో వచ్చారు. "హెవెన్ మీట్స్ హెల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ " అంటూ చెప్పాడు ప్రదీప్. హెల్లో - హెవెనో కానీ అందాల రాక్షలు ఇక్కడే ఉన్నారు అంటూ సంజయ్ తుమ్మ అటు శ్రీదేవిని ఇటు ముచ్చెర్ల అరుణ గారిని కలిపి అనేసారు. యాదమ్మ రాజు యముడి గెటప్ లో వచ్చాడు. ఆర్జే హేమంత్ రేలంగి మావయ్య గెటప్ లో వచ్చాడు. యముడు యాదమ్మ రాజును చూసి "అందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నారు. ఆయన మాత్రం కొంచెం వైల్డ్ గా ఉన్నారు ఎవరాయన " అని అడిగాడు. "ఈసారి ఎంటర్టైన్మెంట్ చేయకపోతే మిమ్మల్ని తీసుకుపోతా నేను " అంటూ యముడు రేలంగి మావయ్యను బెదిరించాడు. అవినాష్ అరుంధతి మూవీలోని పశుపతి గెటప్ లో పుర్రెను తీసుకుకుని వచ్చాడు. ఇక మణికంఠ ఐతే ఆమ్మో బొమ్మ మూవీలో బొమ్మ గెటప్ లో చేతిలో ఒక ఎముకను తీసుకుని వచ్చాడు. అది కాస్తా జారిపోయేసరికి రోహిణి ఆ పుర్రెను పట్టుకుని "స్పూన్ ఇవ్వండి ఐస్ క్రీం తింటా " అంటూ కామెడీ చేసింది. దాంతో అవినాష్ కి కోపం వచ్చి "25 ఏళ్ళ నుంచి నిన్ను సమాధిలో కుళ్ళబెట్టానే " అన్నాడు. పక్కనే ఉన్న మణికంఠ "అందుకే గబ్బు వాసన వస్తోంది " అంటూ కౌంటర్ ఇచ్చాడు. రోహిణి ఊర్వశి గెటప్ లో వచ్చింది. "నేను ఊర్వశిని " అని చెప్పి తానే నవ్వుకునే సరికి "జోక్ వేసుకుని మీరే నవ్వుకుంటారేంటి " అన్నాడు ప్రదీప్. "స్వర్గం ఎలా ఉంటది ఉంటది అని మానవులంతా ఉర్రూతలూగుతున్నారు " అని రోహిణి అనేసరికి "వాట్ ది హెల్ " అంటూ యముడు యాదమ్మ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో రోహిణి షాకయ్యింది
Jun 9, 2026 11:59AM.webp)
Godhavari : సూర్య ఇచ్చిన షాక్తో మారిన జాను.. కుటుంబ బాధ్యతలు తీసుకునేందుకు రెడీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో..... శంకర్ లేడన్న బాధలో కుటుంబం ఉంటుంది. నా తమ్ముడిని చంపేశారు అని శాంతి అనగానే అందరు షాక్ అవుతారు. అవును నా తమ్ముడు చనిపోవడానికి కారణం మీరే.. ముఖ్యంగా ఆ నందు.. నా తమ్ముడు తన కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి కొండంత ఆశతో వచ్చాడు కానీ తన గొంతెమ్మ కోరికలు వాడిని చంపాయి.. ఉన్న డబ్బు, తోట దానికే ఇస్తే మిగతా కూతుళ్ల పరిస్థితి ఏంటని వాడు గుండెపగిలి చచ్చాడని శాంతి అంటుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ సైలెంట్ గా ఉండమని మురళి అంటున్నా కూడా శాంతి వినకపోవడంతో అత్త అని జానూ గట్టిగా అరుస్తుంది. ఇంకొకమాట మాట్లాడిన అత్తవి అన్న విషయం మర్చిపోతానని జాను కోప్పడుతుంది. అంటే ఏం చేస్తావే అని శాంతి అంటుంది. వదిన మా బాధలో మేం ఉంటే నువ్వు ఏంటి అని శారద కోప్పడుతుంది. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళవే.. జరిగింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటని పెద్దావిడ కోప్పడుతుంది. మురళి మీ అమ్మని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళమని మురళితో పెద్దావిడ చెప్తుంది. దాంతో మురళి వాళ్ళ అమ్మని అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు. నువ్వు అత్త మాటలు ఏం పట్టించుకోకని నందుతో జానూ అంటుంది. ఆ తర్వాత జానూ ఒంటరిగా బయట చెరువు దగ్గర ఉంటుంది. అక్కడ తన నాన్న ఆత్మ రూపంలో వచ్చి కుటుంబం బాధ్యతలు.. నువ్వు తీసుకుంటానని మాటివ్వమని అంటాడు. జానూ మాటిస్తుంది. దాంతో శంకర్ అక్కడ నుంచి మాయం అవుతాడు. నాన్న అంటూ జానూ చెరువు లోపలికి వెళ్తుంటే సూర్య వచ్చి ఆపుతాడు. అయినా వినకుండా లోపలికి వెళ్ళబోతుంటే జానూ చెంపపై సూర్య కొడతాడు. ఏం చేస్తున్నావంటూ జానుని వెనక్కి తీసుకొని వస్తాడు సూర్య. ఇంటికి తీసుకొని వచ్చాక ఇప్పుడు నీ కుటుంబానికి నువ్వే ధైర్యం.. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని సూర్య మోటివేట్ చేస్తాడు. జానూ లోపలికి వెళ్తుంది. తరువాయి భాగంలో సూర్య చేసిన మోటివేషన్ కి జానూ మారిపోయి ప్రొద్దున లేచి అందరికి దైర్యం చెప్తూ భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
Jun 9, 2026 11:00AM.webp)
Brahmamudi : సీఈఓ పీఠం కోసం కుట్రలు.. ఇందును కాపాడిన నారాయణ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1053 లో....ఇందు సీఈఓ అవ్వకుండా ఉండాలని తనని ఐశ్వర్య కిడ్నాప్ చేస్తుంది. ఎందుకు అక్కవి అయి ఉండి ఇలా చేస్తున్నావ్.. నేను మీటింగ్ కి అటెండ్ అవ్వాలి.. లేకపోతే నష్టాల్లోకి వెళ్తామని ఐశ్వర్యని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. అయిన ఐశ్వర్య పట్టించుకోదు. అదంతా నారాయణ కిటికీలో నుండి చూస్తాడు. అక్క అని అంటుంది అదేంటి అంత కఠినంగా ఉంది.. పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది.. ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలని నారాయణ అనుకుంటాడు. మరొకవైపు మీటింగ్ మొదలవుతుంది. ఆ ఇందు ఏంటి ఇంకా రావడం లేదని రేఖ అనుకుంటుంది. నేను ఇప్పటివరకు కంపెనీని బాగా చూసుకున్నాను.. మీ సపోర్ట్ ఉంటే ఇక మీదట కూడా బాగా చూసుకుంటానని రేఖ అంటుంది. కంపెనీలో ఇప్పడేం ప్రాబ్లమ్స్ లేవంటారా అని మీటింగ్ లో ఒకతను అడుగుతాడు. ఉన్నాయి లేవు అని అనడం లేదు.. వాటిని పరిష్కరిస్తూ ముందుకి వెళ్లడమే గొప్ప లక్షణం అని రేఖ తన ప్రపోజల్ ని బోర్డు మెంబర్స్ ముందు పెడుతుంది. అలాగే రాజు కూడా నన్ను సీఈఓని చెయ్యండి అని తన ప్రపోజల్ చెప్తాడు. దాంతో ఇద్దరు రేఖకి మరొక ఇద్దరు రాజుకి సపోర్ట్ చేస్తారు. నేను ఉహించినట్లే జరిగింది. ఇప్పుడు ఈ పరంధామయ్య నాకు ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యడని రేఖ అనుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి పరంధామయ్య గారు మీ ఓటు ఎవరికి అని రేఖ అడుగుతుంది. నా ఓటు నీకు వెయ్యాలని లేదు అలాగని అతనికి వెయ్యడం నాకు ఇష్టం లేదు.. కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వండి.. ఇంకా టైం ఉంది కదా అని పరంధామయ్య అంటాడు. మరొకవైపు ఇందుని కాపాడడానికి నారాయణ అక్కడున్న రౌడీలతో కలిసి డ్రింక్ చేసి వాళ్ళని కొడుతాడు. ఇందు దగ్గరికి నారాయణ వస్తాడు. అక్కడే ఐశ్వర్య కూడా ఉంటుంది. ఎవరు నువ్వు అని ఐశ్వర్య అడుగుతుంది. ఇందాక దారిలో ఎదురుపడ్డది నేనే అని నారాయణ అంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తానని నారాయణ అంటాడు. తరువాయి భాగంలో అక్కడ పరంధామయ్యపై నీ ఓటు ఎవరికి అని రేఖ ఒత్తిడి పెడుతుంది. దాంతో అతను రేఖ పేరే చెప్పాలని అనుకుంటాడు. మరొకవైపు ఇందుని నారాయణ బైక్ పై ఎక్కించుకొని మీటింగ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 9, 2026 10:58AM
Karthika Deepam2 : జ్యోత్స్నకు సూరజ్ వార్నింగ్.. అసలు ఆ రాక్షసుడు ఎవరు?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -691 లో..... ధీరజ్ గురించి జ్యోత్స్న ఆలోచిస్తుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చోమని పారిజాతం వెటకారంగా అంటుంది. అప్పుడే సూరజ్ ఫోన్ చేసి.. నన్ను గుర్తు చేసుకుంటున్నావ్ కదా అని అడుగుతాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఎవడ్రా నువ్వు.. అసలు నేను తిడుతుంటే నీకు కోపం రాదా అని జ్యోత్స్న అనగానే నాకు కోపం అయినా.. ఏదైనా.. రావాలని అనుకున్నప్పుడే వస్తుంది. ఒకరు చెప్పినప్పుడు నాకు రాదు అని సూరజ్ అంటాడు. దాంతో జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. అసలు ఎవడ్రా నువ్వు అని జ్యోత్స్న అనగానే వీడియో కాల్ చెయ్యాలా చూస్తావా అని సూరజ్ అంటాడు. ఈ ఒక్క రాత్రి బాగా నిద్రపో.. రేపటి నుంచి అసలు నిద్ర పట్టదని సూరజ్ ఫోన్ కట్ చేస్తాడు. వాడు ఎవడో నీకంటే కంత్రిగాడిలాగా ఉన్నాడని పారిజాతం అంటుంది. మరుసటి రోజు శౌర్య ఆడుకుంటూ శివన్నారాయణ గదిలో దాక్కుంటుంది. తన కోసం దీప వెతుకుతుంది. శౌర్య అలమరాలో దాక్కుంటుంది. అందులో నుంచి బయటకు వస్తుంటే కొన్ని బుక్స్ పడిపోతాయ్.. అందులో శివన్నారాయణ, దక్షిణామూర్తి కలిసి ఉన్న ఫోటో.. రెండు వక్కలుగా ఉంటుంది. ఆ ఫోటో కింద పడిపోతుంది. అది చూసి ఇదేంటీ ఇలా అయిపోయిందని అది పట్టుకొని హాల్లోకి వెళ్లి జ్యోత్స్నని అడుగుతుంది. మా అమ్మని అడుగమని శౌర్యతో జ్యోత్స్న అనగానే అక్కడున్న సుమిత్రకి ఆ ఫోటో చూపిస్తుంది. దాంతో తను షాక్ అవుతుంది. ఆ ఫోటో ఎందుకు అమ్మమ్మ ఇలా ఉందని శౌర్య అడుగుతుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎవరు ముద్దుల తాత ఈ ఫోటోలో ఉంది.. ఎందుకు ఇలా చింపారని శౌర్య అంటుంది. కాంచన వెంటనే శౌర్యని పిలుస్తుంది. నీకు తర్వాత చెప్తాను.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమని పంపిస్తుంది. సారీ నాన్న అని కాంచన అనగానే గతం గురించి ఒక్క శౌర్యకే కాదు అందరికి తెలియాలి.. తెలిస్తేనే ఇక అతని టాపిక్ ఇంట్లో తియ్యరని శివన్నారాయణ అంటాడు. అక్కడే కార్తీక్, దీప అందరు ఉంటారు. అతను నా ప్రాణస్నేహితుడు. మేం ఎలా సన్నిహితంగా ఉన్నామో.. మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. తండ్రి ఒప్పుకుంటాడని సుమిత్ర నా కొడుకు దశరథ్ ని పెళ్లి చేసుకుంది. అప్పుడు నా కొడుకు అతని కంపెనీలో మేనేజర్ గా చేసేవాడు.. నా కూతురికి భర్తగా సరిపోడని.. నా కొడుకుని గన్ తో కాల్చగా.. సుమిత్ర అడ్డు పడడంతో గోడకి తాకింది. ఆ తర్వాత సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చూడడానికి వస్తే తనని కూడా చంపేసాడు. అలాంటి రాక్షసుడు వాడు అని శివన్నారాయణ చెప్తాడు. నేను చెప్పింది తప్పా అని సుమిత్రని అడుగగా లేదు మావయ్య నిజమే చెప్పారని సుమిత్ర అంటుంది. ఇక మీదుట అలాంటి వాడి గురించి మాట్లాడవద్దని శివన్నారాయణ చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప, జ్యోత్స్న వెళ్లేసరికి సూరజ్ వర్క్ చేస్తుంటాడు. కార్తీక్ బయటకు వెళ్తాడు. దీప కూడా వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 9, 2026 10:54AM.webp)
Illu illalu pillalu : ధీరజ్ కోసం పుట్టింటికి ప్రేమ.. వల్లి, సుకన్యల కుట్రలు ఫలించాయా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ''ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -492 లో..... ధీరజ్ కి ప్రేమ భోజనం తీసుకొని వెళ్తుంది నువ్వు ఏంటే ఇక్కడ అని ధీరజ్ అడుగుతాడు. నువ్వు ఇక్కడ ఉంటే నా మనసు అక్కడ ఎలా ఉంటుందిరా అని ప్రేమ అంటుంది. దానితర్వాత ప్రేమ తనకి భోజనం తినిపిస్తుంది. అసలు ఇదంతా నా వళ్లే కదా.. నీకు కోపంగా లేదా.. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అని ప్రేమ బాధపడుతుంటే అవన్నీ నువ్వేం ఆలోచించకు అని ధీరజ్ దైర్యం చెప్తాడు. మరొకవైపు వల్లికి సుకన్య భోజనం తినిపిస్తుంది. ఒసేయ్ నువ్వు ముందు భోజనం తిను.. ఎవరైనా వచ్చారంటే మరిది స్టేషన్ లో ఉన్న బాధ లేకుండా ఎలా తింటుందోనని అనుకుంటారని సుకన్య అంటుంది. అప్పుడే చందు వస్తాడు. తను రావడం గమనించి నాకు ఆకలిగా లేదని యాక్టింగ్ మొదలుపెడుతుంది కానీ చందు సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఏంటే మన మాటలు గానీ విన్నాడంటావా అని వల్లి అనగానే వింటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావ్.. పుట్టింట్లో ఉంటావని సుకన్య అంటుంది. ఆ తర్వాత వేదవతికి రామరాజు భోజనం తీసుకొని వస్తాడు. మీరు తిన్నారా అని వేదవతి అడుగుతుంది.లేదని రామరాజు అంటాడు. మీకేనా కడుపు తీపి.. నాకు లేదా.. వాడు అలా ఉంటే ఎలా తినగలనని వేదవతి ఏడుస్తుంది. ఆ తర్వాత సేనాపతి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుంటే రామరాజు కత్తి పట్టుకొని వెళ్తాడు. నా కుటుంబాన్ని పగపట్టావు కదరా.. నిన్ను బ్రతకనివ్వనని రామరాజు తన పైకి వెళ్తుంటే తిరుపతి వచ్చి అడ్డుపడతాడు. ఇప్పుడు మనం ఆవేశపడకూడదు బావ అని రామరాజుని తిరుపతి కూల్ చేస్తాడు. ఆ తర్వాత ప్రేమ ఏడుస్తూ.. ఇదంతా నావల్లే నావల్ల వచ్చిన సమస్యని నేనే దూరం చేస్తానని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికి తిరిగి వస్తేనే వాడు బయటకు వస్తాడన్న భద్రవతి మాటలు ప్రేమ గుర్తుచేసుకుంటుంది. మరోవైపు అంత ఈ పెళ్లి చెయ్యడం వల్లే అన్న వేదవతి మాటలన్నీ గుర్తు చేసుకొని ప్రేమ వాళ్ళ ఇంటికి బయల్దేరుతుంది ప్రేమ. అలా ప్రేమ వెళ్ళడం సుకన్య చూసి వల్లికి చెప్తుంది. ప్రేమ వాళ్ళింటికి వెళ్ళిపోయిందని వల్లి, సుకన్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ వెళ్ళడం నర్మద చూసి తన వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
Jun 9, 2026 10:52AM.webp)
Podharillu : కన్నాకు అమ్మలా మారిన మహా.. చక్రి మనసులో మొదలైన కొత్త అలజడి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -131 లో..... మనీషా తన అన్నకి లంచ్ బాక్స్ తీసుకొని సైట్ దగ్గరికి వస్తుంది. మీ కోసం బిర్యాని చేసానని మనీషాకి మాధవ బిర్యాని ఇస్తాడు. బిర్యాని బాగుందని మనీషా అంటుంది. ఇలా మీతో మాట్లాడుతు నేను హిందీ నేర్చుకుంటానని మాధవ అంటాడు. ఆ తర్వాత కన్నాకి బాగా జ్వరం రావడంతో మహా ట్యాబ్లెట్స్ కోసం చూస్తుంటే అక్కడ ట్యాబ్లెట్స్ ఉండవు. దాంతో నారాయణని తీసుకొని రమ్మని మహా పంపిస్తుంది. నారాయణ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాక కన్నాకి మహా దగ్గరుండి మరి ట్యాబ్లెట్స్ వేసి తన చున్నీతో కన్నాని తుడుస్తుంది. అదంతా అప్పుడే వచ్చిన మాధవ, కేశవ చూస్తారు. ఈ రోజు వదిన నన్ను అమ్మలాగా చూసుకుందని వాళ్ళు రాగానే కన్నా చెప్తాడు. అప్పుడే మహా వస్తుంది. హమ్మయ్య వచ్చారా.. ఒకవేళ కన్నాకి జ్వరం బాగా వస్తే ఎలా అని అనుకున్నాను.. మీరే వచ్చారని మహా అంటుంది. ఆ తర్వాత కేశవకి చక్రి ఫోన్ చేసి.. నేను రావడానికి లేట్ అవుద్దని చెప్తాడు. అందరు భోజనం చేస్తుంటారు. చక్రి ఇంకా రాలేదని మహా అడుగుతుంది. వాడికి లేట్ అవుతుందని చెప్పాడని కేశవ చెప్తాడు ఆ తర్వాత అందరు భోజనం చేసి పడుకుంటారు. మహా మాత్రం చక్రి కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే చక్రి వస్తాడు. ఎందుకు ఇంత లేట్ అయిందని మహా అడుగుతుంది. వేరే ట్రిప్ కి వెళ్ళానని చక్రి చెప్తాడు. ఆ తర్వాత చక్రి దగ్గరికి కేశవ వచ్చి.. ఒరేయ్ తనని గమనించావా తను నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. తను నిన్ను ప్రేమిస్తున్నట్లు ఉంది అని కేశవ అనగానే చక్రి సిగ్గుపడతాడు. ఆ తర్వాత మరుసటిరోజు మహాని తీసుకొని చక్రి ఇంటర్వ్యూకి వెళ్తాడు. మహా స్టెప్స్ ఎక్కుతుంటే ఒకతను డాష్ ఇస్తాడు. మరి ఇంత అందం గ్లామర్ ఉంటే ఎలా అని అంటాడు. దాంతో మహా అతనిపై సీరియస్ అవుతుంది. తీరాచూస్తే అతని దగ్గరికే మహా ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇక నాకు జాబ్ వచ్చినట్లే అని మహా తిరిగివెళ్తుంటే అతను పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు సెలెక్టెడ్ అని అంటాడు. మీ ప్రొపైల్ చూసే సర్ ముందే అప్పాయింట్ చేసాడని అక్కడ వర్క్ చేసే ఆవిడ వచ్చి అప్పాయింట్ మెంట్ లెటర్ ఇచ్చి వెళ్తుంది. తరువాయి భాగంలో మహా జాబ్ వచ్చిందని ఇంట్లో అందరికి బట్టలు తీసుకొని వస్తుంది. చక్రికి మాత్రం స్పెషల్ గా వచ్చి బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 9, 2026 10:49AM.webp)
Jayam serial : ప్రీతి శ్రీమంతానికి విచిత్రమైన కండిషన్.. బాక్సింగ్ ఛాంపియన్గా గంగ మారాల్సిందేనా
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో......గంగ, రుద్రలని ఇంటికి భోజనానికి పిలుస్తుంది సుధా. వాళ్లకు భోజనం వడ్డించి తన కూతురు గురించి చెప్తూ బాధపడుతుంది సుధా. నా కుటుంబం మీద ఎవరి కన్నుపడిందో ఏంటో.. నా కూతురు నాకు దూరం అయ్యి ఇరవైరెండు సంవత్సరాలు అవుతుందని సుధా ఎమోషనల్ అవుతుంది. నిజం తెలిసి కూడా చెప్పలేకపోతున్నానని రంగా తినే దగ్గర నుంచి లేచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత రంగా దగ్గరికి పైడిరాజు,లక్ష్మి వచ్చి.. ఏంట్రా మధ్యలో నుంచి వచ్చేసావని అడుగుతారు. మీరు నిజం తెలిసి కూడా వాళ్ళకి చెప్పట్లేదు.. పాపం సుధా అమ్మ ఎంత బాధపడుతుందోనని రంగా అంటాడు కానీ ఆ విశ్వ సర్ కి.. వద్దనుకొనే కదా దూరం పెట్టాడని పైడిరాజు అంటాడు. ఇన్ని సంవత్సరాలు అయింది. అతను మారలేదని అంటావా.. ముందు వాళ్ళకి నిజం చెప్పండి అని రంగా అంటాడు. ముందు రుద్ర బాబుకి చెప్పాలని లక్ష్మి అనగానే బావకి చెప్పను.. ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదని కోప్పడతాడని రంగా అంటాడు. అప్పుడే గంగ వస్తుంది. అదంతా విందేమోనని టెన్షన్ పడుతారు. కానీ గంగ ఏం వినలేదు .. మీరు ఏదో దాస్తున్నారనిపిస్తుంది.. అదేంటో మీరు చెప్పేవరకు మేం అడగమని గంగ అంటుంది. ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి గంగ, స్నేహ, ఇందుమతి వెళ్లి శ్రీమంతం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తారు కానీ నువ్వు బాక్సింగ్ లో ఛాంపియన్ అయ్యాకే శ్రీమంతం అని ప్రీతీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 9, 2026 10:43AM
25 ఏళ్ల నాటి వడ్డే నవీన్ ముందే బయటపెట్టిన సీక్రెట్ సుమ!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ని అలరించిన హీరో వడ్డే నవీన్ దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఆ మూవీ టీమ్ అంత ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఫేమస్ యాంకర్, నటి సుమ కనకాల వడ్డే నవీన్ ఇంటికి వెళ్ళింది. ఒక ఇంటరెస్టింగ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో నవీన్ ఫేమస్ సాంగ్ పెళ్ళిలోంచి జాబిలమ్మ నీకు అంత కోపం అనే సాంగ్ ని సుమా, నవీన్ కలిసి పాడారు. ఆ తర్వాత ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పింది. " చాలా బాగుంది సినిమాలో నేను చేసాను గుర్తుందా" అంటూ సుమా ఆ మూవీ క్లిప్ ని చూపించింది. అలా అప్పట్లో నవీన్ తో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేశారు. “1999లో జరిగిన షూటింగ్లో పెళ్లి చూపుల సన్నివేశంలో నేను కనిపిస్తాను. ఐతే అప్పటికే నేను గర్భవతిని కూడా. ఆ మూవీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గారు. ఈ మూవీ అప్పట్లో బిగ్ హిట్. ఈ సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది” అని సుమ తెలిపారు. నవీన్ గారితో ఇంటర్వ్యూ అనేసరికి మనం చేసిన సినిమా కూడా ఉంది కదా అని ఇది బయటకు తీసా అంటూ సుమా ఆనందంతో చెప్పింది. శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించిన చాలా బాగుంది చిత్రం అప్పట్లో ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమ చిన్న పాత్రలో కనిపించింది. 25 ఏళ్ల క్రితం అప్పట్లో ఇలాంటి సోషల్ మీడియా లేదు కాబట్టి అంత వైరల్ కాలేదు కానీ ఇప్పుడు సుమా చూపించిన ఈ బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Jun 8, 2026 3:26PM.webp)
ప్రదీప్ వేలుకి రింగ్ తొడిగిన గోమతి!
కుక్కు విత్ జాతిరత్నాలు షోలో ఒక ఇంటరెస్టింగ్ విషయం జరిగింది. ఈ సండే స్పెషల్ లో వచ్చిన లవ్ థీమ్ లో ఎవరి జాతి రత్నం వాళ్లకు వచ్చారు. ఇందులో గోమతి స్పెషల్ గా డ్రెసప్ అయ్యి వచ్చింది. ఐతే హరి వచ్చి ఇప్పుడు రాసిన లెటర్ ఆయన చదవలేడు ఎందుకంటే ఆయనకు సిగ్గు ఎక్కువ. ప్రదీప్ లెటర్ నేను చదువుతా అన్నాడు. ఇక ఆ లెటర్ ఏంటో హరి చదివాడు. "ప్రియమైన ప్రదీప్ కి ఉమ్మ . ఓహ్ వెరీ డీప్. నీ పేరు ప్రదీప్ నీ మీద నా లవ్వు వెరీ డీప్. మీరు యాంకరింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరికీ హాయ్ హలో అని వినిపిస్తే నాకు మాత్రం హాయ్ ఐ లవ్ యు అని వినిపిస్తుంది. అందరి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటే నా గుండె మాత్రం మీరు కనిపించినంత సేపు ప్రదీప్ ప్రదీప్ అని కొట్టుకుంటుంది. మీరు షోలో టేక్ ఏ షార్ట్ బ్రేక్ అని చెప్పండి కానీ ఎప్పటికీ నా హార్ట్ ని బ్రేక్ చేయకండి . ఇట్లు ప్రేమతో నిన్ను హగ్ చేసుకోవడానికి వస్తున్న నీ ప్రియురాలు. " " అని లెటర్ చదివాడు. ఇక గోమతి ప్రియా వచ్చి ప్రదీప్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఇమ్మానుయేల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 కి ఫస్ట్ జోడి అంటూ హింట్ ఇచ్చేసాడు. ఇక గోమతి ఐతే "ఈ షోలో ఏ థీమ్ పెట్టినా అందులో లవ్ థీమ్ మనదే. ఈయన నా ఆస్తి. ఈయన సంపాదిస్తున్న ఆస్తులన్నీ నాకే " అని చెప్పేసింది. తర్వాత స్పెషల్ గిఫ్ట్ తెచ్చానంటూ ఒక రోజా పువ్వు తెచ్చి అందులో ఉన్న రింగ్ ని ప్రదీప్ వేలుకి తొడిగింది. ఇక పక్కనే ఉన్న హరి, ఇమ్ము కలిసి రోజా పూరెక్కలు జల్లి సందడి చేశారు.
Jun 8, 2026 11:55AM.webp)
అలీ సీక్రెట్ లవ్ లెటర్స్ వ్యవహారం బయటపెట్టిన ప్రదీప్!
కుక్కు విత్ జాతి రత్నాలు షో ఈ వారం లవ్ థీమ్ స్పెషల్ గా వచ్చేసింది. హోస్ట్ జడ్జెస్ అంతా కలిసి రెడ్ అండ్ బ్లాక్ కంబినేషన్ కాస్ట్యూమ్స్ తో కలర్ గా వచ్చేసారు. ఇక ప్రదీప్ ఐతే సరదాగా ఒక లవ్ లెటర్ ని ఆడియన్స్ కోసం రాసాడు. స్కూల్ లో లవ్ లెటర్ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాసాను అనేసరికి సంజయ్ తుమ్మ ఎంట్రీ ఇచ్చి స్కూల్ లో రాయకపోతే ఇంత టైం పడుతుంది లవ్ లెటర్ రాయడానికి నన్ను చూడు స్కూల్ లో, కాలేజ్ లో తర్వాత ఇప్పుడు లవ్ లెటర్స్ రాస్తూనే ఉన్నాను అంటూ చెప్పుకున్నారు. ఐతే ఆన్సర్ షీట్స్ కంటే లవ్ లెటర్స్ ఎక్కువున్నాయన్న మాట అంటూ ఆయన పరువు తీసేసాడు ప్రదీప్. ఈ మధ్యలో ప్రదీప్ అలీ లవ్ స్టోరీ గురించి అడిగాడు. "ప్రేమించేంత టైం నాకు రాలేదు, దక్కలేదు. కానీ ఊళ్ళో మాత్రం ఒక అమ్మాయి ప్రేమించింది. మా ఇంటి పక్కనే. లెటర్ రాసేసి నా షూ ఇంటి బయట ఉండేది అందులో పెట్టేసి వెళ్లిపోయేది." అన్నారు. వెంటనే ప్రదీప్ "ఆ షూలో లవ్ లెటర్ పెట్టినావిడ ఈపాటికి ఈ షో చూస్తూ ఉంటారు" అన్నాడు. "ఇప్పుడు రావాలంట నేనే మీ షూలో లవ్ లెటర్ పెట్టాను అని ఎం చేస్తారండి అలా వస్తే " అని జడ్జ్ శ్రీదేవి అడిగారు. " హాయ్ హౌ ఆర్ యు ఎలా ఉన్నా మీ ఆయన పిల్లలు ఎలా ఉన్నారు" అని అడుగుతా "లవ్ లెటర్ ని షూలో ఎప్పుడూ పెట్టకండి " అంటారు కదా అంది శ్రీదేవి. ఇక శ్రీదేవి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ ప్రేమించే టైం దొరకలేదని చెప్పారు. సినిమా తన ఫస్ట్ లవ్ ఐపోయిందని సినిమాలు చేసేటప్పుడే పెళ్లి ఐపోయింది అని ఆ తర్వాత లవ్ చేసుకున్నామని నువ్వు కూడా పెళ్లి చేసుకుని ప్రేమించుకో అంటూ ప్రదీప్ కి సలహా ఇచ్చారు శ్రీదేవి.
Jun 8, 2026 11:16AM.webp)
ఫ్రీగానే చూడొచ్చు... సబ్స్క్రిప్షన్ పై ప్రియాంక బోల్ట్ కామెంట్స్!
ఈమధ్య ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రతీ ఒక్క బుల్లితెర సెలబ్రిటీ సబ్స్క్రిప్షన్స్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళ ప్రొఫైల్ కి . విష్ణుప్రియ మొదలు పెట్టిన ఈ సబ్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ ని ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇక రీసెంట్ సుబ్స్క్రిప్షన్ గురించి ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ వర్ష గెస్ట్ గా వచ్చిన ప్రియాంక నల్కరిని అడిగింది. "నువ్వు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పెట్టావా లేదా ?" అని వర్ష అడిగేసరికి "వామ్మో వద్దు తల్లి. అప్పుడప్పుడు ఇలా ఇంటర్వ్యూకి పిలువు ఏదన్న గిఫ్ట్ ఇవ్వు అదే చాలు నాకు. నేను హ్యాపీ "అనేసింది. "ఎందుకంత భయపడ్డావ్ " అని మళ్ళీ వర్ష అడిగేసరికి "ఎందుకంటే నేను చూస్తున్నా కదా అలా. ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నాను. ఐతే నాకు యూట్యూబ్ ఉంది." అంది. "ఏంటి ప్రియాంక సబ్స్క్రిప్షన్ అనగానే దణ్ణం పెట్టావ్ " అంది వర్ష. "అంటే నాకు అలా వద్దు. నన్ను చూసి మనీ కట్టేది అదంతా వద్దు. నాకు ఇష్టం లేదు. నేను యాక్టింగ్ చేస్తాను వర్క్ చేస్తాను. అలా సంపాదించుకుంటాను కానీ ఇలా ఫోటో పెట్టి అలా నాకు వద్దు. నాకు ఎంత కష్టమైన పరిస్థితి ఐనా కానీ ఒక పూట తినకుండా కూర్చుంటా నాకు అలా వద్దు. " అని చెప్పింది ప్రియాంక. "మా ప్రియాంకకు ఐతే ఇష్టం లేదు చూడాలి అనుకుంటే మీరు ఫ్రీగా చూడొచ్చు " అని వర్ష అనేసరికి "ఏయ్ ఫ్రీగా ఎం చూడొచ్చు " అంటూ నవ్వుతూ అడిగిని. "అంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రియాంక పెట్టే ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు కానీ పే చూసి చూడక్కర్లేదు " అని చెప్పింది వర్ష. "అవును మీరు ఎక్స్పెక్ట్ చేసేంత కంటెంట్ ఏమీ ఉండవ్ వేస్ట్" అని క్లారిటీ ఇచ్చింది ప్రియాంక.
Jun 8, 2026 10:58AMబిగ్ బాస్ 10 దశావతారం ప్రోమో రిలీజ్ ....నోయెల్ ఆటా పాటా అదుర్స్!
బిగ్బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది. ఇది అలాంటి ఇలాంటి ప్రోమో కాదు. సరికొత్తగా వచ్చేసింది. "ఎన్నో యుద్దాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు .. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం. ఆ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది నేను కాదు. లవ్ చేసే ఫాన్స్ చెప్తారు." అంటూ "బిగ్ బాస్ కోరిక మేరకు మీ టీవీ వాల్యూం పెంచండి అంటూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూపించాడు అందులో ఒక తల్లి పిల్లలకు ఆవకాయ అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంది. తర్వాత కొంతమంది కుర్రాళ్లను తర్వాత ఒక రోడ్ సైడ్ టిఫిన్ వాలాని చూపించాడు. ఒక హెయిర్ సలోన్ ఒక కస్టమర్ చేయించుకున్న బిబి 10 హెయిర్ కట్ని చూపించాడు. మరో వైపు హైఫై ఫామిలీ హోమ్ థియేటర్ లో కూర్చుని పాప్ కార్న్ తింటూ బిగ్ బాస్ని ఎంజాయ్ చేయడం కనిపించింది. "వెల్కమ్ కింగ్ ...అమ్మ ఆవకాయ బిగ్ బాసు, క్లాసు మాసు కల్సే స్పేసు, ఆ స్వాగుకు మేము పెద్ద ఫ్యాన్సు నాగ్ సర్కి మేము కల్ట్ ఫ్యాన్సు బిగ్ బాస్ మాకెంతో క్లోజు , బిగ్ బాస్ మీకెంతో క్రెజు , బిగ్ బాస్ నిశ్శబ్దం ఏరోజు బిగ్ బాస్ మా డైలీ డోసు రోజూ బోలెడన్ని మెమొరీసు చూసే ఆడియన్స్ బిందాసు టీవీ స్క్రీన్లలో మల్టీప్లెక్సు ప్రతీ సీజన్తో కొత్త ఫేజు , బిబి లవ్వు తగ్గదు ఎంత పెరిగినా మా వయసు మాలో మేమె అవుతాము హోరాహోరీ ఫైటర్సు నచ్చినవాళ్లకు కష్టం వస్తే కన్నీళ్లు తుడిచే టిష్యూసు సీజన్స్ అన్ని కొత్తగా మా స్ట్రెస్ బస్టర్సు నాగ్ సర్కి మెం కల్ట్ ఫ్యాన్సు " అంటూ నోయెల్ సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ ప్రోమో లాస్ట్లో అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇంకా అన్ని రకాల క్లాస్ మాస్ వాళ్ళను చూపించి "చెదరని ప్రస్థానం తరగని అభిమానం బిగ్ బాస్ సొంతం..ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాఫ్టర్కి సాక్ష్యం కాబోతోంది.. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం..ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ " అంటూ చెప్పారు నాగార్జున.
Jun 7, 2026 3:08PMనవదీప్ ...నువ్వు నా లైఫ్ మార్చావ్!
నవదీప్ అన్న పేరుకు అటు మూవీస్ ఇటు బుల్లితెర అంటూ పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే వీటికి మించిన ఐడియోలజీతో ఫ్లై హై అంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్గా ఉంటూ ఆకాశంలో ఎగురుతూ ఎంతోమంది యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ ఐకాన్గా ఉన్నాడు. నవదీప్ పెట్టే వీడియోస్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఇతని ఇన్స్టాగ్రామ్ పేజీని. ఈ వీడియోస్ మధ్యలో రీసెంట్గా ఒక ఇంటరెస్టింగ్ స్టోరీని తన ఇన్స్టా స్టేటస్లో పోస్ట్ చేసాడు. అదేంటంటే "హే నవదీప్ నేను గత నెల రోజుల నుంచి జిమ్కి కచ్చితంగా వెళ్తున్నా. ఇప్పుడు జిమ్కి నేను ఎడిక్ట్ అయిపోయాను. మెంటల్గా కూడా నాకు జిమ్ ఎంత హెల్ప్ చేసింది. అలాగే రోజంతా ఎనేర్జిగా ఉంచుతోంది. శారీరకంగా మానసికంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు జిమ్ కి వెళ్ళడానికి అవకాశం ఇవ్వని మా నాన్నే స్వయంగా నా జిమ్ టైం అయిపోయాక వచ్చి మరీ పిక్ చేసుకుంటున్నారు. నిజంగా ఈ విషయం గురించి మాటల్లో చెప్పలేదు. ఇది నాకు చాలా పెద్ద విషయం. 30 ఏళ్ళ వయసులో పేరెంట్స్తో ఉండడం అంటే అంత సులువైన విషయం కాదు అందులోనూ మా నాన్న జిమ్కి వచ్చి నన్ను పికప్ చేసుకోవడం చూస్తుంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. నువ్వు చెప్పిన మాటలను విని నేను జిమ్లో చేరాను. నన్ను ఇలా మోటివేట్ చేసినందుకు చాలా సంతోషం. హ్యాపీ సండే" అంటూ ఆమె తనను మోటివేట్ చేసిన హీరో నవదీప్ గురించి ఆమె మాటల్లో చెప్పేసరికి నవదీప్ కూడా ఆసమ్ ...అంటూ స్టోరీ పోస్ట్ చేసాడు.
Jun 7, 2026 2:52PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com








