
సుధీర్ పక్కన విష్ణుప్రియ కావాలంటున్న నెటిజన్స్!
డ్రామా జూనియర్స్ సీజన్ 9 మెగా లాంచ్ ప్రోమో బయటకు వచ్చేసింది. రోజా, శ్రీకాంత్, అనిల్ రావిపూడి కూడా ఎంట్రీ ఇచ్చారు. "మీకో మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్న తెలుసా" అని సుధీర్ అనేసరికి "కొంపదీసి వెళ్ళిపోతావా ఏంటి" అంటూ అనిల్ రావిపూడి జోక్ వేశారు. వెంటనే సుధీర్ మళ్ళీ "రోజా గారిని పంపించేస్తున్నాం" అని సుధీర్ అనిల్ కలిసి డాన్స్ చేశారు. ఇంతలో రోజా రానే వచ్చారు. వెంటనే సుధీర్ దణ్ణం పెట్టేసాడు. "విన్నానురా మొత్తం విన్నాను. ఇంతలో అనిల్ రావిపూడి సుధీర్ భుజం మీద ఒక్కటిచ్చి "అన్ని కౌంటర్లు నేనే వేయాలా నువ్వు కూడా ఒకటేసుకో "అన్నాడు. ఇంతలో హీరో శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చారు. "సుధీర్ మీద పంచులు వేయడం మానేసాను " అన్నారు. "ఎందుకండీ" అని అనిల్ చాలా ఆతృతగా అడిగారు. "ఆ తర్వాత యాంకర్ గా ఆడే మానెత్తాడు" అన్నారు శ్రీకాంత్. ఇక తర్వాత పిల్లలు వచ్చారు మాములుగా లేవు వాళ్ళ మాటలు వాళ్ళ జోక్స్ విని జడ్జెస్ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక ఒక చిన్నారు వచ్చి రోజాను చూసి వెక్కిరించింది. "నేనెవరో తెలుసా నీకు " అని అడిగారు రోజా. "సారీ అండి నాకు తెలీదు" అని చెవులు పట్టుకుంది. దాంతో తలబాదుకున్నారు రోజా. మరో చిన్నారి వచ్చి శ్రీకాంతన్నా అనేసరికి "అబ్బా ఎంత బాగుందో ఆ పిలుపు " అన్నారు శ్రీకాంత్. ఇక రోజాను వెక్కిరించిన ఆ చిన్నారి వచ్చి థాంక్యూ మామయ్యా అంది. ఇక అనిల్ రావిపూడికి బాగా కోపం వచ్చేసింది. "పోయిన సీజన్ అంతా నన్ను మావయ్య అని పిలిపించి ఈ సీజన్ లో ఆయన రాగానే అటు తోసేత్తారా " అన్నారు కామెడీగా. ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ కి బర్త్ డే విషెస్ చెప్తూ అతని పక్క విష్ణుప్రియ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సర్కార్ లేటెస్ట్ సీజన్ లో విష్ణుప్రియ సుధీర్ పక్కన కో-హోస్ట్ గా చేస్తోంది. వీళ్ళ జోడి యాంకరింగ్ కి బాగా క్లిక్ అయ్యింది. దాంతో నెటిజన్స్ ఇలా కోరుతున్నారు. మరి మేకర్స్ ఈ విషయాన్నీ ఆలోచించి విష్ణు ప్రియను తెస్తారా లేదా చూడాలి.
May 19, 2026
తండ్రైన జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర మీద హాస్యం పండించి ఆడియన్స్ తో కెవ్వు కేక పెట్టించిన కెవ్వు కార్తీక్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు కార్తీక్ తండ్రయ్యాడు. ఆయన భార్య శ్రీలేఖ రీసెంట్ గా పండంటి బిడ్డను కన్నది. కార్తీక్ ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసాడు. "మేము అమ్మ, నాన్న అయ్యాము... చిన్ని పాదాలు మా జీవితాల్లోకి అడుగుపెట్టి, మా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేశాయి.జీవితంలో గాయాలు మాన్పడానికి దేవుడు ఎదో ఒక మార్గం చూపిస్తాడు. మాకు మార్గదర్శి అయిన వెలుగును కోల్పోయిన సరిగ్గా రెండేళ్ల తర్వాత, మా జీవితాల్లోకి ఒక కొత్త వెలుగు ప్రవేశించింది. మేము తల్లిదండ్రులయ్యామని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాము . తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు." అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో oka పోస్ట్ పెట్టాడు కెవ్వు కార్తీక్. ఇక ప్రియాంక సింగ్ , జబర్దస్త్ అవినాష్, గెటప్ శీను, మహిశివన్, నటి సురేఖావాణి, టేస్టీ తేజ, బుల్లితెర నటి శిరీష, పంచ్ ప్రసాద్-సునీత, సత్యశ్రీ, ధరణి ప్రియా, షబీనా, పాగల్ పవిత్ర, సుష్మ కిరణ్, సావిత్రి చొక్కారావు, తాగుబోతు రమేష్, రసజ్ఞ రీతూ, నటుడు చింటూ, జబర్దస్త్ అభి వంటి వాళ్లంతా కెవ్వు కార్తీక్ కి విషెస్ చెప్తున్నారు. ఐతే పుట్టింది అమ్మాయా , అబ్బాయా గెస్ చేయగరాలా ? అంటూ ఆడియన్స్ ని అడిగాడు. ఐతే చాలామంది ఫాన్స్ అండ్ కో-ఆర్టిస్టులంతా అమ్మాయి పుట్టింది...మీ అమ్మ పుట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెవ్వు కార్తీక్ వాళ్లందరికీ థాంక్యూ చెప్పి త్వరలోనే ఎవరు పుట్టారు అనేది రివీల్ చేస్తానని చెప్పాడు
May 19, 2026.webp)
ఆకట్టుకుంటున్న సుడిగాలి సుధీర్ జోకర్ మూవీ ఫస్ట్ లుక్!
బుల్లితెర మీద బాగా పాపులర్ ఐన సుధీర్ గురించి తెలియని వాళ్ళే ఉండరు. ఎవరన్నా సుధీర్ మీద జోక్స్ వేశారంటే మాత్రం ఇక నెటిజన్స్ వాళ్ళను ఆడేసుకుంటున్నాడు. సుధీర్ అటు టీవీ షోస్ లో హోస్ట్ చేస్తూనే ఇటు సిల్వర్ స్క్రీన్ మీద అవకాశం వచ్చినప్పుడల్లా హీరోగా తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అలాంటి సుధీర్ " సుధీర్ జోకర్ " అనే టైటిల్ తో ఒక మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రి మంకీస్, గాలోడు వంటి మూవీస్ తో ఒక మోస్తరు కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఐతే "గోట్ " అనే మూవీలో నటించాడు సుధీర్. ఐతే అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మాత్రం ఇంకా కంఫర్మ్ కాలేదు. ఇక ఇప్పుడు కొత్తగా ఈ మూవీని ఆయన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుధీర్ మంచి స్టైలిష్ గ ఇంటరెస్టింగ్ గెటప్ లో కనిపించాడు. చేతిలో పేక పట్టుకుని నోట్లో సిగార్ తో కనిపించాడు. ఈ మూవీలో ఐషా హీరోయిన్గా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతోంది. ఇక ఆమెతో పాటు అభిరామి, మురళి శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ , శ్రీధర్ మక్కువ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక త్వరలోనే ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అదేవిధంగా అభిమానులతో ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సుధీర్ జోకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది."సుధీర్ జోకర్ " ఫుల్ లెన్త్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. సినిమా టైటిల్ను బట్టి ఇందులో కామెడీ , డ్రామా, మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సుడిగాలి సుధీర్ ఆన్స్క్రీన్ ఇమేజ్కు సరిగ్గా సరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.మూవీ స్టోరీ, రిలీజ్ అప్ డేట్స్ అన్నీ త్వరలో తెలియబోతున్నాయి. ఇప్పటికే రిలీజయిన టైటిల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
May 19, 2026
ఆకుల దండలతో కమెడిన్స్కి సత్కారం!
కూకు విత్ జాతి రత్నాలు షో ఈ వారం ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్, యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. జడ్జెస్ కూడా పడీ పడీ నవ్వుకున్నారు. వీళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ కి అలీ ఇంకా ఖుషీ ఐపోయాడు. "వంటల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటే మమ్మల్ని అందరినీ నవ్వించడంలో మీరు బిజీగా ఉన్నారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరంతా బాగా చేశారు. అద్భుతం. ఈ సమయంలో నేను మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా" అంటూ నిజంగానే ఒక స్పెషల్ గిఫ్ట్ ఐతే తెచ్చారు. అసలే ఫారెస్ట్ థీమ్ తో వచ్చిన ఈ ఎపిసోడ్ దానికి తగ్గట్టే పచ్చటి ఆకులన్నిటితో కలిపి ఒక పెద్ద దండను తయారుచేసి తెచ్చారు. ఆ మూడు దండలను ముగ్గురు జడ్జెస్ కి ఇచ్చారు అలీ. వాళ్ళు కూడా ఈ ముగ్గురి మెడలో వేశారు. అంతే కాదు ఈ ముగ్గురికి తలా ఒక 500 ఇచ్చారు అలీ. ఇక ఈ కమెడియన్స్ కూడా అదే మహాప్రసాదంలా కళ్ళకద్దుకున్నారు. "సర్కస్ కూడా మూడు గంటలు నడుస్తుంది. దాంట్లో జోకర్ లేకపోతే సర్కస్ అనేదే లేదు. సో అలాగా ఈ ఈవెంట్ లో మనం గ్రేట్ కమెడియన్స్ అండ్ గ్రేట్ ఎంటెర్టైనెర్స్ . మనం మన సీనియర్స్ ని చూసి నేర్చుకున్నాం. ఇలాగే కంటిన్యూ చేయండి. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ " అంటూ మెచ్చుకున్నారు. ఇక హరి ఐతే "మీలాంటి లెజెండ్ కమెడియన్ మమ్మల్ని ఇలా మమ్మల్ని ఇలా ప్రోత్సహించడం మమ్మల్ని ఇలా పొగగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 500 నాకు ఒక కోటి రూపాయలుగా అనిపిస్తోంది. ఇది నోట్ కాదు ఇందులో నాకు ఆనందం కనిపిస్తోంది, ఒక గుర్తింపు కనిపిస్తోంది. ఈ డబ్బు దాచుకుంటాను " అని చెప్పాడు. ఇక యాదమ్మ రాజు ఐతే "నేను హరి అంత మాట్లాడలేను కానీ థాంక్యూ సో మచ్ సర్. మీరే నాకు ఇన్స్పిరేషన్ సర్. మీరు మాకు చాలామంచి గిఫ్ట్ ఇచ్చారు. అది చాలు సర్ మాకు. ఇక జడ్జి శ్రీదేవి ఐతే "మీరు జాతిరత్నాలు కాదు ఆణిముత్యాలు" అన్నారు.
May 19, 2026
ఈ పింక్ లిప్స్ ఎవ్వరివి...రొమాంటిక్ నైట్ లో హాట్ టాస్క్!
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ ఐతే మంచి రొమాంటిక్ నైట్ లో హాట్ టాస్క్ లు ఇచ్చి ఆడించింది శ్రీముఖి. కపుల్స్ లో జెంట్స్ అందరినీ వేరే వైపు పంపించి లేడీస్ అందరినీ లిప్ స్టిక్ గట్టిగా వేసుకోమని చెప్పింది. ఇక ఒక వైట్ బోర్డు ఇచ్చి అందులో వాళ్ళ వాళ్ళ లిప్ స్టిక్ లిప్స్ తో ముద్రలు వేయమని చెప్పింది. ఇక జెంట్స్ అందరినీ పిలిచి ఎవరి భార్యల లిప్స్ వాళ్ళు కనిపెట్టండి అని చెప్పింది. ఇక జెంట్స్ అంత తెగ సిగ్గుపడిపోతూ లిప్స్ ని కనిపెట్టే పనిలో పడ్డారు. ఐతే నూకరాజు ఆసియా లిప్ మార్క్స్ ని చూసి కనిపెట్టేసాడు. ఇక తర్వాత నటరాజ్ మాష్టర్ నీతూ లిప్ మార్క్స్ ని కనిపెట్టేసాడు. మిగతా మూడు జంటలు మాత్రం ఒక లిప్ మార్క్ ని పట్టుకుని వేళ్ళాడుతూ ఉన్నారు. ఐతే ఆ లిప్ మార్క్ జానువి అంటూ భాను చెప్పాడు. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ , మహేష్ కి ఫైనల్ గా మిగిలిన రెండు లిప్ మార్క్స్ ని చూపించింది. దానిలో వాళ్ళు వాళ్ళ భార్యల పెదవుల ముద్రలను చూసి గుర్తుపట్టారు. అలాగే మధ్యలో భర్తలను ఒకవైపు భార్యలను ఒకవైపు పెట్టి వాళ్ళ ముందు రకరకాల కలర్స్ లో లిప్ స్టిక్స్ పెట్టి ఏ అకేషన్ కి ఏ కలర్ ని ప్రిఫర్ చేస్తారో ఆ కలర్ ని భార్య భర్త సరిగా గెస్ చేయాలి అని చెప్పింది. ఈ టాస్క్ లో జాను భాను విన్నర్స్ అయ్యారు.,
May 19, 2026.webp)
అలీ చేతి నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా గొప్పోళ్ళు అవుతారు!
బుల్లితెర మీద ఇమ్మానుయేల్ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ అలా స్టార్ మా పరివారం షో ఆ తర్వాత బిగ్ బాస్ ఇలా ప్రతీ షోలో టాలెంట్ చూపిస్తూ పైపైకి ఎదుగుతూ వెళ్ళాడు. ఇక ఇప్పుడు కూకు విత్ జాతిరత్నాలు షోలో జాతిరత్నంగా వచ్చి మిగతా కమెడియన్స్ తో పాటు తానూ కూడా అంతకుమించి ఎంటర్టైన్ చేస్తూ ఆడియెన్స్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కల నెరవేరింది అని చెప్పాడు. కూకు విత్ జాతిరత్నాలు షోలో అది కూడా సీనియర్ కమెడియన్ అలీ చేతుల మీద డబ్బులు అందుకున్నాడు. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. "సర్ బేసిక్ గా మీ చేతి నుంచి ఒక్క రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళు చాల గొప్పవాళ్ళు అవుతారు లేదా గొప్పోళ్ళయితేనే ఇస్తారు అని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. అలీ గారి చేయి చాలా మంచిది అంటారు. నేను ఎక్కువగా స్క్రిప్ట్స్ రాసుకుంది శ్రీనగర్ కాలనీలో మీ ఇల్లు ఉంది కదా సర్ పెంట్ హౌస్ లో ఒక ఇల్లు ఉంది కదా సర్ మా అన్న అందులో ఉంటాడు. నేను అక్కడే కూర్చుని స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉంటాను. ఇది ఆలీ గారి ఇల్లు ఇక్కడికి వచ్చిన ఏ ఆర్టిస్ట్ కైనా ఈ ఇల్లు కలిసొస్తుంది అని. మీ చెయ్యి చాల మంచిది అనుకున్నా సర్. అప్పటి నుంచి నేను చాలాసార్లు అనుకున్నా సర్ మీరు ఈ షోలో రాకేష్ అన్నకు డబ్బులు ఇస్తే నేను కూడా ఎలాగైనా ఆయన చేతి నుంచి ఒక్క రూపాయైనా తీసుకోవాలి అనుకున్నా సర్. నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది." అని చెప్పాడు ఇమ్మానుయేల్.
May 19, 2026
Godhavari : గోదావరి సీరియల్లో ఊహించని గొడవ.. భువనకు షాకిచ్చిన సింహాద్రి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -07 లో.....శంకర్ తన ఫ్యామిలీని తీసుకొని తోటకి వెళ్తాడు. అక్కడే సింహాద్రి కూడా ఉంటాడు. ఆ తర్వాత శంకర్ తన ఫ్యామిలీకి ఇది మన తోటనే మనమే తీసుకున్నానని చెప్తాడు. అది విని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలని డబ్బు పోగు చేసానని శంకర్ చెప్తాడు. ఇప్పుడు మన కుటుంబంలోకి ఈ తోట కూడా చేరిందని శంకర్ చెప్తాడు. ఈ తోట అంతా చూసి వస్తామని పిల్లలు వెళ్తారు. తోట అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. నాన్న ఇంత డబ్బు పెట్టి ఇక్కడ కొనే కంటే సిటీలో ఇల్లు కొంటే బాగుండేదని నందు అంటుంది. దూరపు కొండలు నూనుపు అని ఉంటుంది. ఎందుకు అలా ఆలోచిస్తావని జానూ అంటుంది. అక్క ఈ కొబ్బరికాయలతో ఆట ఆడుకుందామా.. ఎవరు ఎక్కువ దూరం వేస్తే వాళ్లే విన్ అయినట్టు అని కిన్నెరా అంటుంది. జానూ కొబ్బరి విసిరి వేస్తుంటే.. అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు. తనకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అది చూసి జానూ సారీ చెప్తుంది. అప్పుడే భువన వచ్చి నీకు కళ్ళు కన్పించడం లేదా అని కోప్పడుతుంది. జానూని కొట్టబోతుంటే శంకర్ వచ్చి ఆపుతాడు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదా అని భువన అంటుంది. ఆ విషయంలో భువనకి సపోర్ట్ చెయ్యకుండా శంకర్ కి సపోర్ట్ చేస్తాడు సింహాద్రి. దాంతో భువన కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఊళ్ళో శంకర్ వెళ్తుంటే తోట కొన్నావ్ అంట.. నువ్వు నమ్మి ఆ సింహాద్రికి డబ్బు పంపిస్తున్నావ్ జాగ్రత్త.. సొంతవాళ్లనే నమ్మడానికి లేదని అంటాడు. మీరు ఏం అంటున్నారో నాకు అర్థం అయింది కానీ మా సింహాద్రి అలా కాదని శంకర్ చెప్తాడు. ఆ తర్వాత సూర్య జరిగింది గుర్తుచేసుకుంటాడు. అప్పుడే భువన వచ్చి మళ్ళీ జానూని తిట్టడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత శంకర్ వాళ్ళ అక్క సంబంధం మాట్లాడడానికి తాంబులంతో వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026.webp)
Brahmamudi : రాజుకు ఇందు షాక్.. రూ.10 లక్షల అప్పుతో దొరికిపోయిన ఐశ్వర్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1035 లో.... రాజుకి రావలసిన డబ్బులో కండిషన్స్ బ్రేక్ చేసాడని అన్ని కట్ చేసి వేయి రూపాయలు చేతికి ఇస్తుంది ఇందు. దాంతో నేను ఏం కండిషన్స్ బ్రేక్ చేసానని రాజు అడుగుతాడు. దాంతో ఇందు అన్ని విషయలు గుర్తుచేసి మరి చెప్తుంది. దాంతో నాకు రావలసిన డబ్బు ఇలా చేస్తావా అని కోపంగా భోజనం చెయ్యనుపో అని రాజు అంటాడు. అదేంటీ భోజనం చెయ్యకపోతే నీరసం అవుతాడు. మళ్ళీ నాకే ఖర్చు అని ఇందు అనుకొని నువ్వు భోజనం చెయ్యకపోతే నేను కూడా చెయ్యనని ఇందు అంటుంది. రాజు చెయ్ పట్టుకొని ఇందు తీసుకొని వెళ్తుంది. మరొకవైపు భోజనం చెయ్యడానికి రేఖ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. స్వాతి వచ్చి బావకి భోజనం గదిలోకి తీసుకొని రమ్మన్నాడని తీసుకొని వెళ్తుంది. దానికి బావ అంటే ఎంత ఇష్టమో అని భ్రమరాంబ అంటుంది. అందులో ఇష్టం ఏముంది వదిన.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారని రేఖ అంటుంది. నువ్వేమన్నా సరే నీ కొడుకే నా ఇంటికి అల్లుడు అని భ్రమరాంబ అనుకుంటుంది. ఆ తర్వాత రాజు, ఇందు భోజనానికి వస్తారు. ఇందుని కావాలనే రేఖ అక్కడ నుంచి పంపిస్తుంది. రాజు ని పేపర్స్ పై సంతకం పెట్టించడానికి ఒప్పించాలని అనుకుంటారు కానీ రాజు మాటతీరు చూసి షాక్ అవుతారు. ఏం జాబ్ చేస్తావని రాజుని రేఖ అడుగుతుంది. నాకు జాబ్ చెయ్యాలసిన అవసరమేంటి.. నాకు బిజినెస్ చేయాలని ఉంది.. ఇప్పుడు ఎలాగూ ఈ ఇంటికి అల్లుడిని కదా కంపెనీస్ మొత్తం నేనే చూసుకుంటాను.. డెవలప్ చేస్తానని రాజు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇందు వస్తుంది. భోజనం చేస్తారు. వాడి వాలకం చూస్తుంటే సంతకం పెట్టేలా లేడు అని రేఖతో భ్రమరాంబ అంటుంది. పెడతాడు, వాడికి డబ్బు అవసరం ఉండే ఇదంతా చేస్తున్నాడు.. అసలు వాడి గురించి కనుక్కోవాలని రేఖ అంటుంది. ఆ తర్వాత రాజేష్ డబ్బు కోసం ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. మీ ఆంటీని అడుగుతానని రాజేష్ అంటే వద్దని ఐశ్చర్య రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే ఇందు వచ్చి ఏంటని అడుగుతుంది. పది లక్షలు అప్పు తీసుకుందని ఇందుతో రాజేష్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026.webp)
Karthika Deepam2 :దీపను లీడ్లోకి రాకుండా జ్యోత్స్న ప్లాన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -673 లో.... బోర్డు మీటింగ్ లో బోర్డు మెంబర్స్ జ్యోత్స్న సీఈఓగా ఉండాలని చెప్తారు. దశరథ్, కార్తీక్ మాత్రం దీప అని చెప్తారు. దాంతో ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోవాలని చీటీలపై ఎవరు సీఈఓగా ఉండాలో రాయాలని శివన్నారాయణ చెప్తాడు. ఇద్దరికి సమానమైన ఓట్లు వస్తాయి. దాంతో ఇద్దరు సీఈఓగా ఉండండి అని శివన్నారాయణ అంటాడు. అలా ఏం వద్దని జ్యోత్స్న అంటుంది. అయితే ఇద్దరికి ఒక పోటీ పెడుతున్నాను.. అందులో ఎవరు గెలిస్తే వాళ్లే సీఈఓ. మన రెస్టారెంట్ రెండు బ్రాంచ్ లో నష్టాల్లో ఉన్నాయి.. ఆ రెండు చెరొకటి ఇస్తాను.. మీకు రెండు వారాలు టైమ్ ఇస్తాను.. ఎవరైతే రెస్టారెంట్ ని ముందుగా నష్టాల్లో నుంచి బయటకి తెస్తారో.. వాళ్లే విజేత వాళ్లే సీఈఓ అని శివన్నారాయణ అంటాడు. నాకు ఒకే అని జ్యోత్స్న, దీప అంటారు. ఆ తర్వాత దీపకి బావ సలహాలు ఇవ్వొద్దు.. వాళ్ళు ఈ రెండు వారాలు దూరంగా ఉండాలని జ్యోత్స్న అనగానే అందరు తనపై కోప్పడతారు. బావ సపోర్ట్ లేనిదే దీప గెలవలేదా అని ఇండైరెక్ట్ గా జ్యోత్స్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీనికి నేను ఒప్పుకుంటున్నానని దీప అనగానే దశరథ్, కార్తీక్ షాక్ అవుతారు. బావ మా ఇంట్లో ఉంటాడు. దీప వాళ్ళింట్లో ఉండడు.. వీళ్లిద్దరు కలవకూడదని జ్యోత్స్న షరతు పెడుతుంది. ఆ తర్వాత కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్తాడు. అప్పుడే కార్తీక్, దీపలని తీసుకొని జ్యోత్స్న వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావే అని కాంచన కోప్పడుతుంది. నీ కొడుకుని తీసుకొని వెళ్ళడానికి వచ్చానని జ్యోత్స్న అనగానే అదేం మాట్లాడుతుందిరా అని కాంచన అంటుంది. దాంతో బోర్డు మీటింగ్ లో జరిగింది మొత్తం చెప్తారు. కండిషన్ చెప్తుంది అదంతా విని ఎందుకు ఒప్పుకున్నారని కార్తీక్, దీపలపై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026.webp)
Illu illalu pillalu :సుకన్యపై రివర్స్ అయిన తిరుపతి ప్లాన్.. కాలేజీకి వెళ్లనని అమూల్య కన్నీళ్లు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -474 లో..... ప్రేమని ధీరజ్ తీసుకొని వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తాడు. తనతో కేక్ కట్ చేయించి.. ఈ రోజు నుంచి మన కొత్తప్రయాణం మొదలవుతుందని అంటాడు. మరుసటిరోజు ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత సుకన్యని తిరుపతి ఎలా పడెయ్యాలో ఆలోచిస్తాడు. అప్పుడే ప్రేమ, ధీరజ్ వస్తారు. అల్లుడు నువ్వు మా అమ్మాయిని ఎలా పడేసావో చెప్పమని అడుగుతాడు. ఏముంది మామ నేను తను అటుగా వెళ్తుంటే ఇలా కాలు అడ్డం పెట్టాను ఒడిలో పడిపోయిందని ధీరజ్ అనగానే ఒకసారి ఎలానో చూపించమని తిరుపతి అంటాడు. ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంటే ధీరజ్ తన కాలు అడ్డం పెడతాడు. ధీరజ్ ఒళ్ళో ప్రేమ పడిపోతుంది. ఇద్దరు అలాగే చూసుకుంటారు. అదంతా తిరుపతి చూసి సుకన్య వెళ్తుంటే కాలు అడ్డం పెడుతాడు. ప్లాన్ రివర్స్ అయి సుకన్య ఎత్తుకొని వెళ్తున్న బిందె తిరుపతిపై పడిపోతుంది. ఆ తర్వాత జరిగింది గుర్తుచేసుకొని విశ్వ కోపంగా ఉంటాడు. అమూల్య పై పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత అమూల్య కాలేజీకి టైమ్ అవుతుందని వేదవతి పిలుస్తుంది. అమూల్య భయంగా హాల్లోకి వస్తుంది. నాన్న నేను కాలేజీకి వెళ్ళను మానేస్తానని అనగానే అందరు షాక్ అవుతారు. ఎందుకు అమూల్య, ఆ విశ్వ గాడు ఏమైనా అంటాడేమో అని భయపడుతున్నావా.. అలా ఏం ఆలోచించకు.. నీకు మేం తోడుగా ఉన్నామని ధీరజ్ అంటాడు. అవును అమ్మా.. నువ్వు ధైర్యంగా కాలేజీకీ వెళ్ళమని రామరాజు అంటాడు. ఆ తర్వాత చందుతో అమూల్య కాలేజీకి వెళ్తుంది. కాసేపటికి రామరాజు ఇంటికి కొన్ని చెక్కబొమ్మలు తీసుకొని వస్తాడు. ఆ బొమ్మలు అన్ని జంటలుగా పెట్టి ఇవన్నీ బొమ్మలే కాదు.. మన కుటుంబమని వేదవతితో రామరాజు అంటాడు. నర్మద, వల్లి ఆ మాటలు వింటుంది. ఇప్పుడు వల్లి మన కుటుంబాన్ని పెద్దగా చేస్తుంది. ఆ తర్వాత నర్మద, ప్రేమ మన కుటుంబం పెద్దగా చేస్తారని రామరాజు అంటాడు. ఆ తర్వాత వల్లి అక్క నిన్ను వేరొక హాస్పిటల్ చూపించుకోవాలని అనుకుంటున్నామని నర్మద అంటుంది. అలా ఏం వద్దని వల్లి అంటుంది. ఎందుకు వద్దు.. నర్మద బాగా చదువుకుంది కదా.. తను పెద్ద హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుందని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026
Podharillu : శైలు ప్రాణాలు కాపాడిన కేశవ.. మహా సర్టిఫికెట్స్ కోసం చక్రి ఫైట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -116 లో.. నిద్రపోతున్న చక్రిని మహా బయటకు తీసుకొని వెళ్తుంది. మా వదిన నీతో వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది చెప్పమని మహా అడుగుతుంది. ఏం చెప్పిందో ఏంటో తెలుసుకోవాలని నాకు నిద్ర పట్టడం లేదని మహా అంటుంది. తన ఫ్రెండ్ దగ్గరికి నిన్ను పంపించామని చెప్పిందంటే వెళ్తుందేమోనని చక్రి అనుకుంటాడు. ఏం లేదండి.. మీరు మీ ఇంట్లో చాలా గారాబంగా పెరిగారంట.. మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోమని చెప్పిందని చక్రి చెప్తాడు. అంతేనా అని మహా అడుగుతుంది. మరొకవైపు శైలుని నలుగురు యువకులు అత్యాచారం చేయబోతుంటే.. కేశవ వచ్చి వాళ్ళని కొడుతాడు. అప్పుడే పోలీసులు వస్తారు. ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడొద్దు అమ్మా.. జాగ్రత్తగా ఉండాలని శైలుకి ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఈ అబ్బాయి నిన్ను సేవ్ చేసాడు.. తనకి థాంక్స్ చెప్పమని శైలుతో ఇన్స్పెక్టర్ చెప్తాడు. కానీ మత్తులో ఉన్న శైలుకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత బలవంతంగా శైలు ని ఎక్కించుకొని తీసుకొని వెళ్లి కీర్తికి అప్పగిస్తాడు కేశవ. శైలు మత్తు వదలగొట్టి తనకి జరిగింది మొత్తం చెప్తుంది కీర్తి. ఆ తర్వాత మహా వాష్ రూమ్ సరిగ్గా లేక ఇబ్బందిపడుతుంది అనుకొని తనకోసం ఒక వాష్ రూమ్ కట్టాలని అందరు నిర్ణయం తీసుకుంటారు. అందుకోసం కన్నా తను దాచుకున్న పాకెట్ మనీ ఇస్తాడు. వద్దని అంటున్నా కన్నా ఇస్తాడు. అప్పుడే మహా వస్తుంది. ఏంటి ఇక్కడున్నారని మహా అడుగుతుంది. నీ కోసం వాష్ రూమ్ కడుతున్నామని చక్రి చెప్తాడు. అవునా.. ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని మహా అంటుంది. ఒరేయ్ అమ్మాయిని నువ్వే తీసుకొని వెళ్ళు అని చక్రికి మాధవ చెప్తాడు. మహాని చక్రి ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో అదే ఇంటర్వ్యూ దగ్గరికి భూషణ్ వెళ్తాడు. అక్కడ మహాని చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఇంటర్వ్యూ ఛైర్ లో భూషణ్ కూర్చొని ఉంటాడు. తన మొహం కనిపించకుండా కవర్ చేసుకొని మహా సర్టిఫికెట్స్ మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. భూషణ్ మొహం చూసి మహా షాక్ అవుతుంది. ఆ విషయం చక్రికి వెళ్లి చెప్తుంది మహా. నా సర్టిఫికెట్స్ నాకు కావాలని మహా అనగానే తనని తీసుకొని భూషణ్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026
Podharillu : శైలు ప్రాణాలు కాపాడిన కేశవ.. మహా సర్టిఫికెట్స్ కోసం చక్రి ఫైట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -116 లో.. నిద్రపోతున్న చక్రిని మహా బయటకు తీసుకొని వెళ్తుంది. మా వదిన నీతో వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది చెప్పమని మహా అడుగుతుంది. ఏం చెప్పిందో ఏంటో తెలుసుకోవాలని నాకు నిద్ర పట్టడం లేదని మహా అంటుంది. తన ఫ్రెండ్ దగ్గరికి నిన్ను పంపించామని చెప్పిందంటే వెళ్తుందేమోనని చక్రి అనుకుంటాడు. ఏం లేదండి.. మీరు మీ ఇంట్లో చాలా గారాబంగా పెరిగారంట.. మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోమని చెప్పిందని చక్రి చెప్తాడు. అంతేనా అని మహా అడుగుతుంది. మరొకవైపు శైలుని నలుగురు యువకులు అత్యాచారం చేయబోతుంటే.. కేశవ వచ్చి వాళ్ళని కొడుతాడు. అప్పుడే పోలీసులు వస్తారు. ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడొద్దు అమ్మా.. జాగ్రత్తగా ఉండాలని శైలుకి ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఈ అబ్బాయి నిన్ను సేవ్ చేసాడు.. తనకి థాంక్స్ చెప్పమని శైలుతో ఇన్స్పెక్టర్ చెప్తాడు. కానీ మత్తులో ఉన్న శైలుకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత బలవంతంగా శైలు ని ఎక్కించుకొని తీసుకొని వెళ్లి కీర్తికి అప్పగిస్తాడు కేశవ. శైలు మత్తు వదలగొట్టి తనకి జరిగింది మొత్తం చెప్తుంది కీర్తి. ఆ తర్వాత మహా వాష్ రూమ్ సరిగ్గా లేక ఇబ్బందిపడుతుంది అనుకొని తనకోసం ఒక వాష్ రూమ్ కట్టాలని అందరు నిర్ణయం తీసుకుంటారు. అందుకోసం కన్నా తను దాచుకున్న పాకెట్ మనీ ఇస్తాడు. వద్దని అంటున్నా కన్నా ఇస్తాడు. అప్పుడే మహా వస్తుంది. ఏంటి ఇక్కడున్నారని మహా అడుగుతుంది. నీ కోసం వాష్ రూమ్ కడుతున్నామని చక్రి చెప్తాడు. అవునా.. ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని మహా అంటుంది. ఒరేయ్ అమ్మాయిని నువ్వే తీసుకొని వెళ్ళు అని చక్రికి మాధవ చెప్తాడు. మహాని చక్రి ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో అదే ఇంటర్వ్యూ దగ్గరికి భూషణ్ వెళ్తాడు. అక్కడ మహాని చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఇంటర్వ్యూ ఛైర్ లో భూషణ్ కూర్చొని ఉంటాడు. తన మొహం కనిపించకుండా కవర్ చేసుకొని మహా సర్టిఫికెట్స్ మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. భూషణ్ మొహం చూసి మహా షాక్ అవుతుంది. ఆ విషయం చక్రికి వెళ్లి చెప్తుంది మహా. నా సర్టిఫికెట్స్ నాకు కావాలని మహా అనగానే తనని తీసుకొని భూషణ్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026.webp)
Jayam serial : సూర్య కొత్త ప్రాజెక్ట్ వెనుక వీరు కుట్ర..జయం సీరియల్లో ఊహించని ట్విస్ట్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -272 లో.....ప్రాజెక్ట్ ఒకే అయినందుకు సూర్య స్వీట్ తీసుకొని వస్తాడు. ఆ ప్రాజెక్ట్ వల్ల ప్రాబ్లమ్ వస్తుందని రుద్ర చెప్తాడు. అవన్నీ మీరు చెప్పొద్దూ.. మాకు వదిలెయ్యండి అని సూర్య కోపంగా మాట్లాడతాడు. మొదటి రోజే సక్సెస్ సాధించానని ఇషిక అంటుంది. అందరికి స్వీట్స్ ఇస్తాడు సూర్య. అన్నయ్యకి ఇవ్వలేదని ప్రీతీ అడుగుతుంది. అంటే ఇది అన్నయ్యకి స్వీట్ న్యూస్ కాదని సూర్య అంటాడు. మొదటి రోజే సక్సెస్ సాధించావ్ ఇషిక గ్రేట్ అని వీరు అనగానే థాంక్స్ అని చెప్పి ఇషిక వెళ్ళిపోతుంది. అయ్యో పిచ్చి ఇషిక.. ఆ ప్రాజెక్ట్ వచ్చేలా చేసిందే నేను.. అది ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్ట్ కాదు.. ముంచే కాలేజీ ప్రాజెక్ట్ అని వీరు అనుకుంటాడు. మరుసటిరోజు రంగా మామిడికాయలు తీసుకొని వచ్చి ఇంట్లో అందరిని పిలుస్తాడు. అందరు వస్తారు. రుద్ర మాత్రం స్పెషల్ గా రెడీ అయి వస్తాడు. నా భర్తకి నా దిష్టే తగిలేలా ఉందని గంగ అనుకుంటుంది. పెద్దమ్మకి ఇప్పుడు ఆవకాయ పెట్టడంలో హెల్ప్ చేస్తాను కదా.. ఎప్పుడు హెల్ప్ చేసినా ఇలాగే రెడీ అవుతానని రుద్ర అంటాడు. అప్పుడే ఇషిక, సూర్య ఆఫీస్ కి రెడీ అవుతారు. ఇషిక నువ్వు ఇంట్లోనే ఉండు ఆవకాయ పెట్టాలని ఇందుమతి అనగానే ఆ పనులన్నీ ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు చేస్తారని ఇషిక అంటుంది. ఏంటి ఆఫీస్ కి వెళ్ళగానే పొగరు తలకి ఎక్కిందా అని ఇషికపై శకుంతల కోప్పడుతుంది. ఎప్పుడు ఆవకాయ పెట్టినా ఇంట్లో అందరం సరదాగా ఉంటాం.. అందుకే తను ఉండమంది అని శకుంతల కోప్పడుతుంది. దాంతో ఇషిక ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత రుద్ర, గంగ మామిడికాయ వక్కలు కట్ చేస్తుంటారు. మరొకవైపు విశ్వ ఇంటికి సీతారాములు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 19, 2026
రోజా గారు మంచి ఫిలాంత్రఫిస్ట్...నెక్స్ట్ టార్గెట్ జాఫర్!
ఫామిలీ అసెంబ్లీ లేటెస్ట్ ఎపిసోడ్ కి జర్నలిస్ట్ జాఫర్ అతని భార్య వచ్చారు. వీళ్ళతో రోజా ఒక టాస్క్ ఆడించారు. భార్యను ఎత్తుకుంటే పైన వేళ్ళాడే ద్రాక్ష గుత్తును నోటితో అందుకుని తినడం ఐతే. ఇక ఆమె బాగా ఆడారంటూ రోజా మెచ్చుకుంది. ఇక జాఫర్ రోజా గురించి ఆమె చేసిన పనుల గురించి చెప్పుకొచ్చారు. "రోజా గారి హజ్బెండ్ చాలా మంచి పర్సన్. రోజా గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి విభేదించే వాళ్ళు ఉన్నారు కానీ ఆమె భర్తను అందరూ ఇష్టపడతారు. ఆమెను ఇంటర్వ్యూ చేస్తే కాంట్రోవర్సి అవుతుందని అంటారు కానీ ఆమె ఎంత మంచి ఫిలాంత్రఫిస్ట్ అనే విషయం ఎవరికీ తెలీదు. ఒకసారి నేను మా అమ్మాయి రోజా గారికి బుర్కా వేసి ఒక నియోజకవర్గానికి తీసుకెళ్లాం. అది లైవ్ రికార్డింగ్ అంతా. ఒక సమస్యను పరిష్కరించి చాలా గొప్ప పని చేశారు. ఆ వీడియో కూడా ఉంది. ఆ తర్వాత ఆమె తన పర్సులో ఉన్న డబ్బులు అది 25 వేలో 50 వేలో తెలీదు. తీసి కామ్ గా ఇచ్చేస్తా ఉన్నారు. అది కెమెరాలో రికార్డు కాలేదు. మేడం అది రికార్డు కాలేదు అని నేను చెప్తే వొద్దొద్దు జాఫర్ గారి అది జనాల కోసం కాదు అన్నారు. ఇలాంటివి ఆవిడ చాలా చేస్తూ ఉంటారు. పొలిటికల్ గా జనాలకు ఒక పర్సవం మాత్రమే తెలుస్తుంది. ఇంకో పార్శ్వము అనేది ఎక్స్పోజ్ కాదు. ఎందుకు ఎక్స్పోజ్ కాదు అంటే ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళు టార్గెట్ అవుతారు కాబట్టి" అని జాఫర్ చెప్పారు. "నెక్స్ట్ నువ్వే టార్గెట్ " అంటూ నవ్వుతూ చెప్పారు రోజా. "పర్వాలేదు. మంచి , చెడు రెండు విషయాలు చెప్పాలి జర్నలిస్ట్ అంటే " అన్నారు జాఫర్. "థాంక్యూ జాఫర్" అన్నారు రోజా.
May 18, 2026
నటరాజ్ - నీతూ, వాసంతి - పవన్ కళ్యాణ్ మధ్య గట్టిగ యుద్ధం!
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో రీసెంట్ ఎపిసోడ్ లో ప్రేమ గురు ఒక టాస్క్ ఇచ్చాడు. అది ప్రామిస్ కీపర్ - ప్రామిస్ బ్రేకర్. ఏ జంట లవ్ మాన్షన్ లోకి వచ్చే ముందు వాళ్ళు హ్యాండ్ కాస్ట్ చేసుకుని వాళ్ళు ప్రామిస్ ని రాశారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ ఎండింగ్ కి వచ్చేసరికి చాలా టఫ్ చేసేస్తున్నారు. ఇక టాప్ 5 లో నటరాజ్ మాష్టర్ - నీతూ, నూకరాజు - ఆసియా, మహేష్ - సాండ్రా, వాసంతి - పవన్ కళ్యాణ్, జాను - భాను ఉన్నారు. ఇక లవ్ గురు ఎం చెప్పాడంటే మాన్షన్ లో కి వచ్చాక ఏ జంట ఎం ప్రామిస్ చేశారో అది ఏ జంట నిలబెట్టుకున్నారో ఏ జంట నిలబెట్టుకోలేదు అడిగారు. దాంతో ఆసియ-నూకరాజు జోడి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నారంటూ అందరూ చెప్పారు. ఇక ప్రామిస్ బ్రేకర్స్ గా వాసంతి - పవన్ కళ్యాణ్ జోడికి 3 ఓట్లు, నటరాజ్ - నీతూకి 2 ఓట్లు పడ్డాయి. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో వాసంతి మీద నూకరాజు వేసిన జోక్ కి పవన్ కళ్యాణ్ ఫీలయ్యాడు. ఆ విషయంగా పవన్ కళ్యాణ్ మైండ్ లో ఉన్న నెగటివ్ థాట్స్ ని ఆసియా మాట్లాడి సాల్వ్ చేసింది. ఇక నూకరాజు తానూ వాసంతి మీద ఆ విధమైన జోక్ వేసినందుకు ఫీలవుతూ కమెడియన్ కాకూడదు అని అనుకున్నాడు. దాంతో వాసంతి వచ్చి "ఆ ఒక్క మాట బాధ కలిగింది. కమెడియన్స్ ఏమీ తక్కువ కాదురా. దేనిలో తక్కువ కాదురా కమెడియన్స్ అర్ధమవుతుందా నీకు నాలుగు తగిలిస్తా నీకు. పవన్ కళ్యాణ్ కి పెట్టె మనస్తత్వం ఉంది కానీ కొంచెం సిగ్గరి. నన్ను ఎమన్నా అంటే అస్సలు తట్టుకోలేడు. అదొక్కటే కానీ మిగతా అంత చాలా మంచోడు. నూకరాజు మీద నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎమన్నా కామెంట్స్ చేసి ఉంటె సారీ ఆంటీ " అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ అమ్మకు ఈ షో ద్వారా సారీ చెప్పింది వాసంతి. ఐతే మహేష్ - సాండ్రాకి మాత్రం ప్రామిస్ కీపర్ లో కానీ ప్రామిస్ బ్రేకర్ లో కానీ ఒక్క ఓట్ కూడా రాలేదు.
May 18, 2026.webp)
ఆ రోజుల్లో గోడ దూకి చిరు సినిమాలు చూసిన రోజా!
హీరోయిన్ రోజా ఫ్రెండ్ రియల్ స్కూల్ ఫ్రెండ్ రాధ ఫామిలీ అసెంబ్లీ షోకి వచ్చి ఆ రోజుల్లో రోజా చేసిన అల్లరి పనుల గురించి హీరో చిరు మూవీస్ గురించి చెప్పుకొచ్చారు. "నేను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మగారు అనేవాళ్ళు నీకు మంచి ఫీచర్స్ ఉన్నాయి నువ్వు హీరోయిన్ అవ్వొచ్చు కదా అనేవారు ఆంటీ. నేను హీరోయిన్ అయ్యాక చాలా ఇంటర్వ్యూలో రాధ గురించి ఆంటీ గురించి చెప్పాను. మేము 6 వ తరగతి నుంచి ఫ్రెండ్స్. నా బండి మీద నేను రాధా, లతా, హసీనా అందరం ఒక బైక్ మీద తిరుపతి అంతా రౌండ్స్ వేసేవాళ్ళం. అబ్బాయిలు చేసే పనులన్నీ చేసేవాళ్ళం. మా కాలేజ్ చాల స్ట్రిక్ట్ . ఎలా అంటే ఉదయాన్నే మా పేరెంట్స్ వచ్చి కాలేజ్ లో దింపాలి వెళ్ళేటప్పుడు వాళ్ళతోనే వెళ్ళాలి. అందుకే గోడ వెనక సైకిల్స్ పెట్టి ఒకరి భుజం మీద ఒకళ్ళం ఎక్కి గోడ దూకి బయటకు వచ్చి అటు సైడ్ నుంచి సినిమాకు వెళ్లిపోయేవాళ్ళం. మళ్ళీ వచ్చి ఆ సైడ్ నుంచే కాలేజ్ లోకి వెళ్లి సాయంత్రం మా పేరెంట్స్ తో వెళ్లిపోయేవాళ్ళం. కాలేజ్ ఎగ్గొట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి గారి సినిమాకు వెళ్లిపోయేవాళ్ళం. చిరు గారి సినిమా ఫస్ట్ డే అంటే అలా ఉంటుంది మరి. అలా చిరు గారి సినిమాలు చూసి ఆయనతోనే మూవీ చేసే అవకాశం వచ్చినప్పుడు చాల సంతోషంగా ఉంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఊటీలో "ఎంత ఘాటు ప్రేమయో" సాంగ్ షూటింగ్. ఆయన్ని చూడడమే ఫస్ట్ అంటే ఆయనతో డాన్స్ పెట్టేసారు. ఆ డాన్స్ లో మీరు చూసుంటారు మా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుందని సురేఖా గారు చెప్పారు." అన్నారు రోజా. "అమ్మా చిన్నప్పుడు రోజా గారు ఇన్నోసెంట్ గా " అని టేస్టీ తేజ అడిగాడు. "అవును నేను చాలా ఇన్నోసెంట్ అని చెప్పిన ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు. మా ఆయన కూడా నా ఇన్నోసెన్స్ చూసే 1991 లో పడిపోయారు. తర్వాత తెలిసింది పాలిటిక్స్ లోకి వచ్చాక అమ్మా అని " అని చెప్పారు రోజా. "మీరు చెప్పండి ముందు సర్ లైన్ వేసారా రోజా గారా " అని జాఫర్ అడిగేసరికి "సర్ లైన్ వేశారు. రోజా చేసే ప్రజా సేవ అంటే చాల ఇష్టం. ఆమె తినేటప్పుడు ఆమె చుట్టూ కొంతమంది ఉండాలి" అని రోజా ఫ్రెండ్ చెప్పారు. "అంటే నేను ఎక్కడికి వెళ్లినా ఫుడ్ మాత్రం అందరికీ పెడతాను. అందరూ హ్యాపీగా తినాలి." అని చెప్పారు రోజా.
May 18, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com





