
సాండ్రాని హగ్ చేసుకోవడానికి వీల్లేదు...మహేష్ పెట్టిన రూల్ ఇదే!
బుల్లితెర మీద సాండ్రా - మహేష్ కాళిదాసు గురించి తెలియని వాళ్లుండరు. వీళ్ళు చాలా సీరియల్స్ లో నటించారు. మానసిచ్చి చూడు సీరియల్ ద్వారా మహేష్ తెలుగు ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. వీళ్లిద్దరు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. సాండ్రాకి ఆల్రెడీ మొదట పెళ్ళి అయ్యింది తర్వాత డివోర్స్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ దేవుడి దయ వలన మహేష్ వచ్చాడంటూ చాల ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇప్పుడు వీళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చారు. ఇందులో పెళ్ళికి ముందు మహేష్ ఒక కండిషన్ పెట్టాడంటూ శ్రీముఖి రివీల్ చేసింది. దాంతో జడ్జెస్ ఎం కండిషన్ అని అడిగారు. "పెళ్లయ్యాక ఎలా ఉండాలో అన్న రూల్స్ అవి. మేల్స్ ని హగ్ చేసుకోకూడదు" అని చెప్పాను అన్నాడు మహేష్. "ఏంటి వన్ సైడ్ రూలేనా " అంటూ జడ్జి లయ అడిగింది. "ఇది పెద్ద సమస్య కాదు. నువ్వు అంతలా చెప్తున్నావ్ కాబట్టి నువ్వు కూడా అదే రూల్ ఫాలో అవ్వు" అని చెప్పా అంటూ సాండ్రా చెప్పింది. ఇక శ్రీముఖి నన్ను హగ్ చేసుకోకుండా మాన్షన్ లోకి పంపించను అని చెప్పింది. కానీ మహేష్ నో అంటే నో అనేశాడు. "పెళ్ళికి ముందు పార్టీస్ కి వాటికి వెళ్లే వాళ్ళం వాళ్లంతా సాండ్రాని పైకి ఎత్తేసేవాళ్ళు" అన్నాడు మహేష్. "ఇప్పుడు ఈ రూల్ పెట్టడంలో తప్పు లేదయ్యా " అంటూ అనిల్ రావిపూడి మహేష్ ని వెనకేసుకొచ్చాడు. "ఇది హగ్గుల రూల్స్. అందరికీ చెప్తున్నా సాండ్రాని ఎవరూ హగ్ చేసుకోవడానికి రావొద్దు " అంటూ శ్రీముఖి అందరికీ వార్నింగ్ ఇచ్చింది.
Mar 16, 2026
అఖండ ధుని సాక్షగా ప్రియాంక జైన్ - శివ్ పెళ్లి
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ రియాలిటీ షో రీసెంట్ గా స్టార్ మాలో స్టార్ అయ్యింది. పది జంటలు ఒక లవ్లీ మాన్షన్ లో ఇది స్టార్ట్ అయ్యింది. ముందుగా వచ్చిన కపుల్ ప్రియాంక జైన్ - శివ్ .వీళ్ళను రాధ ఒక విషయం అడిగింది. ఈరోజు మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చెప్పాలి అంది. అంతే అసలు విషయం చెప్పారు. మా పెళ్లి త్వరలో జరగబోతోంది అంటూ మాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ప్రియాంక రివీల్ చేశారు. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. డెస్టినేషన్ అనేది ఉత్తరాఖండ్ లోని త్రియుగీ నారాయణ్ టెంపుల్ లో అఖండ ధుని సాక్షిగా చేసుకోవాలని ప్లాన్ చేసాం. ఈ టెంపుల్ లోనేఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అంటే శివ పార్వతులు ఇక్కడ వివాహం చేసుకున్నారు. అలాంటి ప్రదేశంలో ఈ శివ్ - పరి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ అఖండ ధుని మూడు యుగాలుగా అలా మండుతూనే ఉంది, అందుకే దీనిని 'అఖండ ధుని ఆలయం' అని కూడా పిలుస్తారు. ఇక శ్రీముఖి వాళ్ళను విష్ చేసింది. తర్వాత వాళ్ళ ప్రేమలో ఎంత మ్యాడ్నెస్ ఉందో టెస్ట్ చేసింది. అందులో ప్రియాంక పాస్ అయ్యింది. తర్వాత హ్యాండ్ కాస్టింగ్ పేరుతో వాళ్ళ చేతులతో ఉన్న ఒక చిత్రాన్ని చేసి ఇచ్చింది. అందులో శ్రీముఖి వాళ్లకు నచ్చిన కొటేషన్ ని రాయించింది. "ఆమె ప్రేమించే దాని కంటే నేనే ఎక్కువ ప్రేమిస్తాను " అంటూ శివ్ రాసాడు. ఐతే ప్రియాంక మాత్రం శివ్ కంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తాను అనేది రుజువు చేసి చూపిస్తాను అని చెప్పింది.
Mar 16, 2026
Jayam serial: అందరూ కలిసి ఉండాలని ప్లాన్ చేసిన రుద్ర.. వీరు ఏం చేయనున్నాడు?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-217లో.. అందరు కలిసి భోజనం చేస్తుంటారు. పెద్దసారు అందరితో కలిసి మాట్లాడతాడు. అందరికి తమ బిజినెస్ చూసుకోవడం ఓకే కదా అని పెద్దసారు అనగానే ఇషిక, వీరు ఓకే చెప్తారు. నేను కష్టపడి ఈ కంపెనీలని పేరుని సంపాదించానని, మీరంతా శ్రద్ధగా వర్క్ చేయాలని పెద్దసారు అందరితో చెప్తాడు. దాంతో వీరు.. ఇది మమల్ని మోసం చేసి దాని మీద నిర్మించిన సామ్రాజ్యం.. దీనిని నాశనం చేసేదాకా నేను ఊరుకోను అని వీరు తన మనసులో అనుకుంటాడు. అప్పుడే రుద్ర చూసి.. ఏంటి వీరు బాగా ఇన్ స్పైర్ అయినట్టున్నావని అడుగుతాడు. అవునని, రోజు మోటివేట్ అవుతానని వీరు అంటాడు. ఒకే ఒకే అందరికి అన్నీ ఇష్టమే కాబట్టి అందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. పెద్దసారు నేను మాత్రం ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటానని గంగ అనగానే అవును సిలిండర్ లు, లగేజ్ లు మోసేదానికి ఇది పెద్ద కష్టమేం కాదు కదా అని శకుంతల అంటుంది. దాంతో ఇషిక, వీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. శకుంతల గతం గురించి ఎందుకు.. తను ఈ ఇంటికి కోడలు అనే విషయం మర్చిపోకు అని పెద్దసారు అంటాడు. దాంతో రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా చెల్లి బాగా పనిచేస్తుందని గంగ వాళ్ళ అన్నయ్య అంటాడు. అవును గంగ ఈటింగ్, ఫైటింగ్ బాగా చేస్తుందని రుద్ర అనగానే అందరు నవ్వుకుంటారు. గంగ డల్ గా ఉంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. ఆ తర్వాత గంగ వాళ్ళ అన్నయ్య, ప్రమీల, గంగ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అదేంటి గంగ ఇక్కడికి తీసుకొచ్చావని ప్రమీల అడగగా.. నీకొక కొత్త జీవితం ఇవ్వాలని దేవుడికి మొక్కుకోవడానికి తీసుకొచ్చానని అనగానే తను షాక్ అవుతుంది. అదేంటి అనగానే నీ లైఫ్ ఇంకా బాగుండాలనే అని గంగ కవర్ చేస్తుంది. మరోవైపు ఒకతను వచ్చి నాకు పెళ్ళి కావాలని అర్చన చేయమని, దీవించమని అతను అనగానే పూజారి షాక్ అవుతాడు. ఏంటని అతను అనగానే అందరు పెళ్ళిళ్ళు వద్దంటుంటే నువ్వు చేసుకుంటానని అంటున్నావని షాక్ అయ్యానని పూజారి చెప్తాడు. అది నా చిన్నప్పటి నుండి కల అని అతను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 15, 2026
Illu Illalu Pillalu: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. వేరే అమ్మాయితో తిరుగుతున్నానని చెప్పిన విశ్వ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -419 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే జాబ్ ఇప్పించే బ్రోకర్ వాళ్ళని చూస్తాడు. ఎక్కడ దగ్గరికి వచ్చి మాట్లాడుతాడోనని వాళ్ళని చూసి పరుగెడతారు. మరోవైపు ప్రేమ, ధీరజ్ హోలీ ఆడుతుంటారు. అక్కడికే భాగ్యం, ఆనందరావు వస్తారు. విశ్వ, తను యాక్టింగ్ చేయమన్న అమ్మాయితో కలిసి హోలీ ఆడే దగ్గరికి వస్తారు ధీరజ్, ప్రేమ. అక్కడ వాళ్ళని చూసి ఈ బండోడిలో మన్మధుడు కూడ ఉన్నాడా అని వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేసి ఈ విశ్వగాడు ఒక అమ్మాయితో ఉన్నాడే వాళ్ళ క్లోజ్ చూస్తుంటే లవర్ లాగా అనిపిస్తుందని భాగ్యం అంటుంది. అదంతా నా ప్లాన్ అని శ్రీవల్లి చెప్తుంది. అమూల్య వెనకాల ఉండి, ఇదంతా ఎవరు చేసారో కనిపెట్టడానికి ఇదంతా ప్లాన్ చేసాను. వాళ్ళు కామాక్షి ఇంటిముందే హోలీ ఆడుతున్నారు. దాంతో కామాక్షి చూసి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుంది. దాంతో అసలు నిజం బయటపడుతుందని శ్రీవల్లి చెప్తుంది. భళే ప్లాన్ చేసావ్ అమ్మడు అని భాగ్యం అంటుంది. ప్రేమ, ధీరజ్ ని చూసి శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం. మరీ మంచిదే అమ్మ.. ప్లాన్ సులువుగా అవుతుందని శ్రీవల్లి అంటుంది. రామరాజు, నర్మద, సాగర్, వేదవతి, చందు, శ్రీవల్లి హోలీ ఆడతారు. మరోవైపు విశ్వ, ఒక అమ్మాయితో ఉండటం ధీరజ్ చూసి.. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని అడుగుతాడు. నా ఇష్టం రా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఏం చేస్తావో చేయిరా అని విశ్వ అనడంతో విశ్వ కాలర్ పట్టుకొని లాక్కెళతాడు ధీరజ్. మరోవైపు రేవతి ఏడుస్తుంటే అమూల్య ఓదారుస్తుంది. అప్పుడే భద్రవతి వచ్చి చూసి.. ఏమైందని అడుగుతుంది. నా కూతురి బర్త్ డే ఈ రోజు.. కనీసం ఒక్కపూట అయినా తనకి కడపు నిండా భోజనం పెట్టలేకపోతున్నానని రేవతి ఎమోషనల్ గా అంటుంది. నా మేనకోడలు అంటే నాకు ఇష్టం ఉండదా.. నువ్వు కన్నావ్ అంతే నేను గుండెల మీద మోసానని.. త్వరలోనే మన ఇంటికి వచ్చేస్తుందని భద్రవతి చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు విశ్వని లాక్కొని ధీరజ్ వెళ్తాడు. అప్పుడే రామరాజు ఫ్యామిలీ, భద్రవతి ఫ్యామిలీ వస్తారు. ఏంట్రా నా మేనల్లుడిని ఎందుకు కొడుతున్నావని భద్రవతి అడుగుతుంది. వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని కామాక్షి అనగానే అందరు షాక్ అవుతారు. వీడు వేరే అమ్మాయితో తిరుగుతుంటే నేను అక్కడి నుండి కొట్టుకొని వచ్చానో లేదో అడగండి అని ధీరజ్ అనగానే రేయ్ విశ్వ వాడు చెప్పేది నిజమేనా అని భద్రవతి అంటుంది. నేను వాడికే చెప్తానని ధీరజ్ దగ్గరికి విశ్వ వెళ్తాడు. అవునురా తిరిగానని విశ్వ చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 15, 2026
Karthika Deepam 2: కాంచన ఎమోషనల్.. అసలు నిజం కార్తీక్ బయటపెడతాడా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-618 లో.... కార్తీక్, దీప ఇద్దరూ బిడ్డని వద్దనుకుంటున్నారని కాంచనకి తెలిసి ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. ఈ విషయం శివన్నారాయణకి తెలిసి కోప్పడుతాడు. ఈ విషయం మీ అన్నయ్యకి కుడా తెలుసు.. అందరు కలిసి ఈ విషయం దాచారని పారిజాతం అనగానే ఇంక కాంచన పట్టరాని కోపంతో ఊగిపోతుంది. ఇన్నిరోజులు నిన్ను నమ్మాను అన్నయ్య, ఇంత మోసం చేస్తావని ఊహించలేదని కాంచన ఎమోషనల్ అవుతుంది. నాకు ఎవరు కనిపించకుండా నన్ను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని కాంచన ఏడుస్తుంది. పాపం సుమిత్ర ఇవన్నీ వింటే చచ్చిపోయేదని శివన్నారాయణకి వినపడేలా కావాలనే పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్, దశరథ్ మాట్లాడుకుంటారు. అసలు ఇదంతా పారిజాతం పిన్ని ఎప్పుడు వింది అని మాట్లాడుకుంటారు. నిజం ఎప్పుడు తెలిసినా.. రియాక్షన్ ఇదే అని మనం ఉహించుకున్నాం కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి వింటుంది. జ్యోత్స్న వచ్చి వింటుందని కార్తీక్ వాళ్ళు గమనించి సైలెంట్ అయిపోతారు. నేను వచ్చానని వాళ్లకి అర్థం అయినట్లు ఉంది.. నేను వెళ్లిపోవడం మంచిది అని జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు స్వప్న దగ్గరికి కాశీ వచ్చి మాట్లాడతాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తాడు. నాకు ఎక్కడ హ్యాపీ ఉందని చెప్తున్నావని స్వప్న వాదిస్తుంది. అయినా తన మాట లెక్క చేయకుండా మరొకసారి విషెస్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. అసలు వాళ్ళు మన గురించి ఏం అనుకుంటాన్నారు. ఏం జరుగుతుందని కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 15, 2026
Brahmamudi: పబ్ లో ఇందు.. రాకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -980 లో... ఇందు పబ్ లో రాకీ దగ్గరికి వచ్చి జాబ్ గురించి మాట్లాడుతుంది. తన మాటలు ఎందుకో తనకి తేడాగా అనిపించినా జాబ్ తప్పనిసరి అని మౌనంగా ఉంటుంది. నేను జ్యూస్ తీసుకొని వస్తానని రాకీ అక్కడ నుండి వెళ్తాడు. మరొకవైపు భ్రమరాంబ, రేఖ దుగ్గిరాల ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు. ఇంత ఆస్తి కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చెయ్యడంలో తప్పు లేదు కానీ, ఇప్పుడు ఇందు సంతకం పెడుతుందా అని భ్రమరాంబ అడుగుతుంది. పెట్టదు ఎందుకంటే అది సంతకం చెయ్యదు కదా వేలిముద్ర కదా అని రేఖ అంటుంది. మరొకవైపు మీ అమ్మ, ఆ రేఖ రోజు ఈ టైమ్ కల్లా పడుకునేవాళ్ళు అయినా ఇంకా పడుకోలేదు. అదే టెన్షన్ అవుతుందని స్వాతితో అపర్ణ అంటుంది. ఒసేయ్ ఇందు వాటర్ తీసుకొనిరా అని రేఖ పిలుస్తుంది. దాంతో అపర్ణ టెన్షన్ పడుతూ వాటర్ తీసుకొని వస్తుంది. నీ మనవరాలు ఎక్కడికి వెళ్ళింది. నువ్వు తీసుకొని వచ్చావని రేఖ అనగానే ఇందు పడుకుందని అపర్ణ అంటుంది. అది ఉంటే నిన్ను పని చెయ్యనివ్వదని రేఖ అంటుంది. అవును అసలు అది ఇంట్లోనే ఉందా అని భ్రమరాంబ అంటుంది. అవును వదిన దాన్ని నమ్మడానికి లేదు. నువ్వు వెళ్లి ఒకసారి చూసిరా అని రేఖ అంటుంది. దాంతో భ్రమరాంబ మెల్లగా వెళ్లి చూస్తుంది. లోపలికి వెళ్లేసరికి అక్కడ స్వాతి పడుకొని ఉంటుంది. తనని చూసి ఇందు అనుకొని భ్రమరాంబ బయటకి వచ్చి నిజంగానే ఇందు పడుకొని ఉందని రేఖతో చెప్తుంది. మరొకవైపు రాజు, ఐశ్వర్య పబ్ లో మాట్లాడుకుంటారు. రాజు మాటలకి ఐశ్వర్య ఇంప్రెస్ అవుతుంది. మీ నెంబర్ ఇవ్వొచ్చు కదా అని రాజు అనగానే ఐశ్వర్య ఇస్తుంది. తరువాయి భాగంలో ఇందు కోసమని రాకీ జ్యూస్ తీసుకొని వస్తాడు. అందులో ఏదో కలిపి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 15, 2026
ముగ్గుతో నిన్ను ఫాలో అవుతా.. అందుకే మా ఆయన్ని చంపేస్తాను!
ఉగాది స్పెషల్ గా ఢీ 20 రాబోతోంది. అందులో ఫైమా, ఆది, పూజ, బిన్నీ మాష్టర్ వేసిన ఫైమా ప్రశ్నలు ఆది పంచులు మాములుగా లేవు. పూజ కన్నీళ్లు పెట్టేసుకుంది. ఫైమా స్టేజి మీదకు రాగానే ఫైమా ఆది కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. "గురువుగారు మా ఆయన గురక పెడుతున్నాడు.. అందుకే మా ఆయన్ని చంపేద్దామనుకుంటున్నా. " అని ఫైమా అనేసరికి "గురక పెడితే దాని చెవిలో దూది పెట్టాలి వాడి ముక్కులో దూది పెట్టకూడదు" అంటూ పరిష్కారం చూపించాడు. "ఈ సంవత్సరం నాకెలా ఉండబోతోందో చెప్పండి " అని హోస్ట్ నందు అడిగాడు. "నీదే రాశి" అన్నాడు "కుంభ రాశి" అన్నాడు నందు. "అబ్బే కుంభ రాశి గురించి తెలీదు " అన్నాడు ఆది. "నాది మకరం రాశి " అంటూ ఫైమా ఎగబడి చెప్పింది. "మకరం గురించి ఎందుకు పైన పోయిన ఎకరం గురించి ఆలోచించు " అంటూ ఫైమాని ఎగతాళి చేసాడు. "నా మీద ఏ నర దృష్టి పడకుండా ఉండాలంటే ఎం చేయవలెను " అని డాన్సర్ పూజ అడిగింది. "నేనొక మంత్రించిన ముగ్గు ఇస్తాను. ఆ ముగ్గును నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు చల్లుకుంటూ వెళ్ళు" అన్నాడు ఆది. ఇంతలో ఫైమా మధ్యలోకి వచ్చేసింది. "మొన్న అడ్రెస్స్ అడిగితే ఇవ్వాలా ఆ ముగ్గురు ఫాలో ఐతే " అంటూ కామెంట్ చేసాడు. తర్వాత పూజ చేసిన డాన్స్ కి బిన్నీ మాష్టర్ ఫిదా ఐపోయాడు. "పూజ నువ్వు క్లాసికల్ డాన్సరా..ఎక్కడా అలా అనిపించలేదు పూజా చాల చాల బాగా చేసావు " అని బిన్నీ మాష్టర్ అడిగేసరికి "లేదు మాష్టర్ నేను నాన్ క్లాసికల్ డాన్సర్. నేను ఢీకి చాలా చాలా రుణపడి ఉంటాను. నేను ఇంటికి వెళ్ళిపోయినా, వేరే ఏదైనా పెద్ద స్టేజికి వెళ్లినా ఢీకి థ్యాంక్ ఫుల్ గా ఉంటాను" అని చెప్పింది.
Mar 14, 2026.webp)
బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఇప్పుడు జనాలు అది మర్చిపోతారు!
ఢీ షో అంటే కంటెస్టెంట్స్ అంత ఒక వైపు ఉంటారు పండు ఒక్కడే ఒక వైపు ఉంటాడు. ఎందుకంటే అందరూ జస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తారు పండు పెర్ఫార్మెన్స్+ స్కిట్ + కామెడీ + ఎక్స్ప్రెషన్స్ వాట్ నాట్ అనే టైపులో చేసి ఆడియన్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడు. ఇక నెక్స్ట్ వీక్ షో ప్రోమో చూస్తే పండు అనకుండా ఉండలేరు. పండు గెటప్ తో పడేసాడు బిన్నీ మాష్టర్ ని. "చికు చికు బండి దానికి దూకుడెక్కువండి ..ఖిలా ఖిలా ఖిలా ఖిలాడీ నేను ప్రేమించిన పిల్ల మరీ ఖిలాడీ " అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. "ఈ సీజన్ లో ఇటుక ఇటుక మీద సాంగ్ గుర్తుంది . ఇప్పుడు జనాలు అది మర్చిపోతారు పండు. బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సాంగ్ " అంటూ బిన్నీ మాష్టర్ చెప్పేసాడు. "రిచ్చెస్ట్ చిల్లర గై ఈజ్ బ్యాక్ " అంటూ పండు తన మీద తానే కామెంట్ చేసుకున్నాడు. ఇక పండుతో పాటు స్టేజి మొత్తం ఊగిపోయింది. ప్రతీ ఒక్కళ్ళూ వచ్చి పండుతో కలిసి డాన్స్ చేశారు. ఇక బిన్నీ మాష్టర్ ఐతే ఓజి పెర్ఫెర్మెన్స్ అని చెప్పేసాడు. పండు పెర్ఫార్మెన్స్ కి నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ " మా అమ్మ వండిన పప్పులో ఉప్పు లేదు పండు అన్నకి తిరుగు లేదు జై పండన్న... పండు అన్న ఇచ్చి పడేసాడు. మా ఆడియన్స్ కి పండు ఒక్కడే 100 టైటిల్స్ తో సమానం ...పండు దుమ్ము లేపావు" అంటూ వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Mar 14, 2026
Brahmamudi:ఆ రౌడీ నుండి ఇందు తప్పచుకుంటుందా.. నందు ఏం చేయనుంది!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -979 లో.......రాజు, లక్కీ కలిసి వెంకీని బ్లాక్ మెయిల్ చేసి పర్సు తీసుకొని వెళ్తారు. మరొకవైపు అక్క నువ్వు జాబ్ అన్నావ్ కదా నా ఫ్రెండ్ సంతోష్ కి నీ గురించి చెప్పాను .. వాళ్ళ బాస్ వచ్చాడంట లొకేషన్ పంపించాడు. నువ్వు వెళ్ళు అక్క అని ఇందుతో స్వాతి చెప్తుంది. ఇప్పుడు వెళ్తే రేఖ ఏదైనా అంటుందేమోనని అపర్ణ అంటుంది. ఎలాగైనా వెళ్ళాలి నానమ్మ.. ఇప్పుడు నాకు జాబ్ అవసరమని ఇందు అంటుంది. అక్క నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని స్వాతి చెప్పగానే ఇందు బయల్దేర్తుంది. మరొకవైపు పబ్ కి ఐశ్వర్య తన ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తుంది. అదే పబ్ కి కొంతమంది స్మగ్లర్స్ ని పట్టుకోవడానికి ఇన్ఫార్మర్ గా నందు కూడా వస్తుంది. ఐశ్వర్య నందు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. సారీ అని నందు చెప్తుంది అయినా ఐశ్వర్య వినిపించుకోకుండా పొగరుగా మాట్లాడుతుంది. ఇందు కూడా లొకేషన్ చూస్తూ అదే పబ్ కి వస్తుంది. అక్కడ వాతావరణం చూస్తే ఇందుకి నచ్చదు. ఇందు దగ్గరికి సంతోష్ వచ్చి తన బాస్ రాకీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తనని చూసి రాకీ భలే ఉందని తేడాగా చూస్తాడు.. తనని కూర్చొపెట్టి మాట్లాడతాడు. సంతోష్ ని రాకీ అక్కడ నుండి పంపిస్తాడు. ఇందు ఇబ్బందిపడుతుంది..అదే పబ్ లో లక్కీ బేరర్ తో గొడవ పెట్టుకుంటాడు. రాజు వచ్చి ఆపుతాడు. మరొకవైపు నందు ఇన్ఫార్మర్ గా వచ్చి అక్కడున్న స్మగ్లర్ ను చూసి వాళ్లకు డౌట్ రాకుండా అటుగా వెళ్తున్న వెంకీతో కలిసి డాన్స్ చేస్తుంది. నువ్వు బొకే అమ్మాయివి కదా అని వెంకీ అంటాడు. అదే కానీ ఇప్పుడు నాతో డాన్స్ చేసినట్లు యాక్టింగ్ చెయ్యమని నందు అంటుంది. మరొకవైపు ఇందు పబ్ లో ఇబ్బందిపడుతుంది. రాకీ చూపు ప్రవర్తన బట్టి ఇందుకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 14, 2026
Podharillu:హారిక చెప్పినట్టుగా చక్రికి మహా విడాకులు ఇస్తుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -70 లో.... తప్పు కంప్లైంట్ ఇచ్చి మాధవ కుటుంబాన్ని అరెస్ట్ చెయ్యమన్నారని పురుషోత్తంపై కోప్పడతాడు ఎస్ఐ. ఇంకొకసారి ఆ కుటుంబం జోలికి పోతే మర్యాదగా ఉండదని ఎస్ఐ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత పురుషోత్తం ఇంటికి వెళ్లి అందరి ముందు పరువుతీసావని గాయత్రిపై పురుషోత్తం కోప్పడ్డతాడు. నీ కోసం దుబాయ్ లో కష్టపడి పైసా పైసా కూడబెడితే నువ్వు వాడి చుట్టూ తిరుగుతావ్ ఏంటని గాయత్రిపై తాయారు కోప్పడుతుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నామని చెప్తారు. మరొకవైపు మాధవ వాళ్ళు స్టేషన్ నుండి ఇంటికి వస్తారు. మాధవని మహా బయటే ఉండమని చెప్పి దిష్టి తీసుకొని వస్తుంది. దాంతో మాధవ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది.. ఇక ఆ విషయం గురించి వదిలెయ్యండి.. వాళ్ళ ఇంటివైపు కన్నెత్తి చూడకూడదని మాధవ అందరికి చెప్తాడు. ఆ తర్వాత గాయత్రిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. గాయత్రిని తన పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లిచూపులకి ఒప్పిస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చుతుంది. గాయత్రికి ఇష్టం లేకున్నా సరే అంటుంది. ఇరుకుటుంబాలు తాంబులాలు పుచ్చుకుంటారు. ఆ తర్వాత మహా హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి చక్రి వస్తాడు. అప్పుడే గాయత్రి వస్తుంది. నాకు పెళ్లి కుదిర్చారని ఏడుస్తుంది. నువ్వు దైర్యం చేసి బయటకు వస్తే తన తమ్ముళ్లు దగ్గర ఉండి పెళ్లి చేస్తారని మహా అంటుంది. అదంతా నారాయణ విని ఎన్నిరోజులు భయపడుతావ్..ఎన్నిరోజులు పిరికిదానిలా ఉంటావనుకుంటే దొడ్డిదారిన వెళ్ళు.. దైర్యం చేసి ముందడుగు వేస్తానంటే గుమ్మం గుండా వెళ్ళమని నారాయణ అనగానే గాయత్రి ఏడుస్తూ దొడ్డి దారిన వెళ్తుంది. దాంతో నారాయణ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత వర్క్ ఉందని మహా ఇంట్లో నుండి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందని చక్రి తనని ఫాలో అవుతాడు. మహా తన వదిన హారికని కలిసి మాట్లాడుతుంది. అసలు ఏ పరిస్థితిలో చక్రిని పెళ్లి చేసుకుందో చెప్తుంది. చక్రి వాళ్ళకి దూరంగా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ట్రై చేస్తాడు. తరువాయి భాగంలో చక్రికి మహా విడాకులు ఇస్తానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 14, 2026.webp)
Jayam serial:గంగ అమ్మనాన్నల గురించి రంగాకి డౌట్.. అసలు నిజమేంటి!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -216 లో....రుద్రకి నాపై డౌట్ వచ్చింది. నా గురించి నిజం తెలిసినట్లు ఉంది కానీ నాకు తెలిసిందని అతనికి తెలియదని ఇషికతో వీరు అంటాడు. మరొకవైపు నాకు అతనికి గురించి తెలియలేదని అనుకుంటున్నాడు కానీ నాకు అంతా తెలుసు అన్న విషయం వీరుకి తెలియదని గంగతో రుద్ర అంటాడు. గంగ దగ్గరికి రంగా వస్తాడు. ఈ రోజు మన బస్తీ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్లినంతసేపు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తువచ్చాయి కానీ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండే దానివో అర్థం అవడం లేదు. ఒకసారి చిన్నప్పటి ఫోటో చూపించమని రంగా అనగానే గంగ చూపిస్తుంది. అందులో గంగ అమ్మనాన్న లతో ఉంటుంది. రంగా అంతకు ముందు చూసిన ఫోటోలో గంగ వెనకాల తన పేరెంట్స్ స్థానంలో వేరే ఉన్నారు ఎవరని రంగాకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత గంగకి లక్ష్మి ఫోన్ చేసి రంగా వచ్చాడు కానీ మేమ్ సరిగ్గా మాట్లాడలేదు. ఏం అన్నాడని అడుగుతుంది. నా చిన్నప్పటి ఫోటో చూపించమని చెప్పాడు. చూపించానని గంగ చెప్తుంది. ఆ తర్వాత లక్ష్మీ, పైడిరాజు టెన్షన్ పడతారు. రంగాకి డౌట్ వచ్చింది. గంగకి నిజం తెలియకముందే మనం చెప్తే బెటర్ అని పైడిరాజు అనగానే ఇన్ని రోజులు చెప్పలేదని మనల్ని అసహ్యించుకుంటుందని లక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇందుమతి బిజినెస్ ఉమెన్ లాగా రెడీ అవుతుంది. తనని చూసి స్నేహ, వంశీ, సూర్య, రాఘవ షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. బిజినెస్ నేనే చూసుకుంటాను. ఎందుకంటే మావయ్యకి సూర్యకి హాఫ్ నాలెడ్జ్ అని ఇషిక అనగానే ఇందుమతికి కోపం వస్తుంది. రేపటి నుండి నా భర్త, సూర్య ఆఫీస్ కి వెళ్తారని ఇందుమతి చెప్తుంది. సూపర్ మార్కెట్ లో చాలా కష్టపడ్డావ్ అక్క నేనే వడ్డీస్తాను.. మీరు కూర్చోండి అని ప్రమీలతో గంగ అంటుంది. తరువాయి భాగంలో ప్రమీల తన జీవితం మళ్ళీ మొదలు పెట్టాలని నేను, రుద్ర సర్ అనుకున్నామని ప్రమీలతో గంగ చెప్పగానే ప్రమీల షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 14, 2026
Karthika Deepam2:పిల్లల్ని వద్దనుకున్నామని చెప్పిన కార్తీక్, దీప.. షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-617 లో.. కార్తీక్, దీప, జ్యోత్స్న, పారిజాతం, కాంచన, శివన్నారాయణ, శ్రీధర్ , దశరథ్ అంతా కలిసి మాట్లాడుకుంటారు. రిపోర్ట్స్ ని బట్టి కార్తీక్, దీప అబద్ధం ఆడారని అందరికి తెలుస్తుంది. ఇక దీప, కార్తీక్ లని అందరు నిలదీస్తుంటే దశరథ్ నిజం చెప్పేసినట్టు కలగంటాడు. వెంటనే నో అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఏం అయింది డాడీ. దీపని అడిగితే నువ్వు ఎందుకు కంగారుపడుతున్నావని జ్యోత్స్న అంటుంది. ఏం అయిందని శివన్నారాయణ అడుగగా ఇంకా నిజం చెప్పకపోవడమే మంచిది అయిందని దశరథ్ అనుకొని ఏం లేదని అంటాడు. జ్యోత్స్న చెప్పినా నేను నమలేదు.. కానీ రిపోర్ట్స్ చూసాక నాకు మీ మీద నమ్మకం పోయిందని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. అడుగు అత్త.. నీకు ఆ భాద్యత ఉందని జ్యోత్స్న అనగానే నేను ఆ భాద్యత తీసుకోవడం లేదని కాంచన అంటుంది. తాత ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కార్తీక్ అనగానే.. నాకు ఇప్పుడు నిజం తెలియాలని కాంచన అరుస్తుంది. బావని ఏం అనొద్దు అని దీప అనగానే కార్తీక్ నువ్వు నిజం చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే అని కాంచన అంటుంది. దాంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కార్తీక్ అంటాడు. బావ నిజం చెప్పలేడు అత్త..ఎందుకు అంటే నేను బిడ్డని వద్దని అనుకుంటున్నానని దీప అనగానే అందరు షాక్ అవుతారు. మరోవైపు దాస్, కావేరి, స్వప్న, కాశీ మాట్లాడుకుంటారు. అసలు మీకు మీ పెళ్ళిరోజు అని జ్ఞాపకం ఉందా అని దాస్ అడుగుతాడు. గుర్తుంచుకునేంత గొప్ప రోజేం కాదని స్వప్న అనగానే అలవాటులో పొరపాటుగా నుదుటిపై సింధూరం దిద్దుకున్నావ్ కదా.. అది తుడిపేసెయ్ అని కావేరి అనగానే స్వప్న షాక్ అవుతుంది. ఎంత సంపాదించిన నిజాయితీని నమ్మకాన్ని పొందుతామా అని కాశీ గురించి స్వప్న అనగానే నా భర్త తప్పు చేయలేదా నేను సర్దుకొని కాపురం చేయడం లేదా అని కావేరి అంటుంది. వాళ్ళకి ప్రైవెసీ ఇద్దామని కావేరి అంటుంది. పెళ్ళిరోజు నుండి ఇప్పటి వరకు మీ లైఫ్ లో జరిగినవన్నీ గుర్తుచేసుకొని కలిసిపోండి అని దాస్ చెప్పి వెళ్తాడు. మరోవైపు దీప, కాంచన, జ్యోత్స్న, కార్తీక్ , మాట్లాడుకుంటారు. నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని దీప అనగానే ఎందుకు ఇష్టం లేదో చెప్పవే, అసలు నాకు ఎందుకు మాట ఇచ్చావో కూడా చెప్పవే అని దీపతో కాంచన అంటుంది. ఒక్కనిమిషం అత్తా డాక్టర్ ఇప్పుడే ఒక వాయిస్ మెసెజ్ పంపించింది. అది కూడా విన్నాక మనం మాట్లాడుదామని జ్యోత్స్న అంటుంది. దీపకి ఈ కాన్పు తర్వాత ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అంటే ఇప్పుడు దీప పిల్లల్ని కనాలని అనుకోవడం లేదు కాబట్టి నీ కొడుకు పిల్లల్ని నువ్వు చూడాలనుకునే నీ కల ఎప్పటికి కలగానే మిగిలిపోతుందని జ్యోత్స్న అంటుంది. దీప ఈ విషయం నీకు ముందుగానే తెలుసా అని శ్రీధర్ అనగానే తెలుసని దీప అంటుంది. ఇలాంటి బుద్ది లేని నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావని శ్రీధర్ అనగానే దీపని ఏం అనొద్దని ఈ నిర్ణయం మా ఇద్దరిది అని కార్తీక్ అంటాడు. రేయ్ కార్తీక్ అలా ఎలా మాట్లాడుతున్నావ్ రా అని కాంచన అనగానే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ నిర్ణయం నాదే అని కార్తీక్ అంటాడు. సుమిత్ర ప్రాణం కాపాడాలని ఇక్కడ ఇంతమంది చూస్తుంటే మీరేమో ఒక ప్రాణాన్ని అలా ఎలా వద్దనుకుంటార్రా కార్తీక్ అని శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. దశరథా అడుగు దీపని నీ కన్నకూతురులాగా చూసుకున్నావ్ కదా అని శివన్నారాయణ అనగానే అడుగలేడు అని పారిజాతం అంటుంది. ఎందుకని శివన్నారాయణ అడగగా దీప వద్దనుకుంటుంసని తనకి ముందే తెలుసు అని పారిజాతం అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. వాళ్ళు వద్దనుకుంటున్నారని నీకు ఎప్పుడు తెలుసు అని శివన్నారాయణ అడుగగా ఎప్పుడో తెలుసని పారిజాతం అంటుంది. ఎప్పుడో తెలిసినదానివి అప్పుడే ఎందుకు చెప్పిసావలేదని పారిజాతంపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 14, 2026
Illu illalu pillalu : విశ్వకి ప్లాన్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఏం చేయనున్నాడు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -418 లో.....ప్రేమ తన బర్త్ డే అని పాయసం తీసుకొని వెళ్లి బయటున్న అమూల్యకి ఇస్తుంది. మీ అమ్మ చేసిందని నర్మద, ప్రేమ అనగానే అమూల్య ఎమోషనల్ అవుతుంది. అప్పుడే విశ్వ వచ్చి ఏంటే ఇక్కడ ఉన్నావని కోప్పడతాడు. అమూల్య చెంపచెల్లుమనిపిస్తాడు. అప్పుడే ప్రేమ వచ్చి విశ్వ చెంపచెల్లుమనిపిస్తుంది. దాంతో ప్రేమపై విశ్వ కోప్పడతాడు. నా భార్యపై చెయ్ లేపుతావా అని ధీరజ్ గొడవకి దిగుతాడు. ప్రేమ, నర్మద ఇద్దరు గొడవ సద్దుమణిగేలా చేస్తారు. ప్రేమ, ధీరజ్ బయటకు వెళ్తారు.ఆ తర్వాత విశ్వని శ్రీవల్లి కలుస్తుంది. మీరు పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు కానీ దానికి కారణం ఎవరో తెలుసుకునే ప్లాన్ చెప్తానని విశ్వకి శ్రీవల్లి ఏదో చెప్తుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరు కలిసి కార్ కొనడానికి డౌన్ పేమెంట్ కోసం కామాక్షి దగ్గరికి వస్తారు. కామాక్షి నిండుగా నగలు వేసుకొని ఉంటుంది. అక్క నాకు డబ్బు కావాలని ధీరజ్ అడుగుతాడు. దాంతో కామాక్షి లోపలికి వెళ్లి నగలు తీసి వచ్చి నాకు డబ్బు ఎక్కడిదిరా అవన్నీ గిల్టీ నగలు.. నా దగ్గర డబ్బు లేదని కామాక్షి యాక్టింగ్ చేస్తుంది. దాంతో ధీరజ్, ప్రేమ డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ బయటకి వస్తారు. కామాక్షి కూతురు కలర్ తీసుకొని వచ్చి మావయ్య హోలీ ఆడండి అని అంటుంది. వాళ్లకు ఎదురుగా కావాలనే విశ్వ ఒకమ్మాయిని తీసుకొని వచ్చి నేను చెప్పినట్లు చెయ్ అని తనతో క్లోజ్ గా ఉంటాడు. తరువాయి భాగం లో ప్రేమ, ధీరజ్ హోలీ ఆడతారు. విశ్వతో అమ్మాయి క్లోజ్ గా ఉండడం ప్రేమ, ధీరజ్ చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 14, 2026
ఇమ్ముని సెక్సీగా చూడాలనుంది... బ్యూటీ విత్ నో బ్రెయిన్ రీతూ
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీముఖి ఇమ్ము ఫోటో చూపిస్తూ వెనక రాసిన కామెంట్ చదివింది. "తినేదంతా వాగడానికే సరిపోతుంది. కానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు" అని చెప్పి ఆ కామెంట్ ని ఎవరు రాసారో గెస్ చేయమంది టాస్క్ ఇచ్చింది. "అంత తెలుగు గౌరవ్ కి రాదు. అంత తెలివి రీతుకి లేదు. ఇది రాసింది దమ్ము శ్రీజ రాసింది అనుకుంటున్నా " అని చెప్పాడు ఇమ్మానుయేల్. వెంటనే శ్రీముఖి " శ్రీజ ఎందుకు ఇలా రాయాలనిపించింది" అని అడిగింది. "నాకు ఇమ్ముని సెక్సీగా చూడాలనిపిస్తోంది." అంటూ నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ చాల పోష్ గా చెప్పింది. "ఫస్ట్ అద్దాలు తీస్తే కనబడుతుంది" అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వేశారు. తర్వాత కళ్యాణ్ పడాల పిక్ చూపించి "వీడు చాల కంత్రి గాడు" అని శ్రీముఖి చదివే లోపే "వాడే రాసుకుని ఉంటాడు" అంటూ ఇమ్మానుయేల్ క్లారిటీ ఇచ్చాడు. తర్వాత సాయి శ్రీనివాస్ ఫోటో చూపించి "నువ్వు నాకు నచ్చావ్ " అంటూ మూడు హార్ట్స్ వేశారు అంటూ శ్రీముఖి చెప్పి ఆ పిక్ ని చూపించింది. "శ్రీజ రాసింది " అంటూ ఇమ్ము అనేసరికి "ఏ ఛి నేను రాయల " అంది శ్రీజ. తర్వాత రీతూ పిక్ చూపించి "బ్యూటీ విత్ నో బ్రెయిన్ " అంటూ వెనక ఉన్న కామెంట్ ని చదివింది శ్రీముఖి. "కళ్యాణ్ పడాల" అయ్యుంటాడు అంటూ ప్రియా ఆన్సర్ ఇచ్చింది. ఐతే ఈ కామెంట్ రాసింది ఇమ్మానుయేల్ అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసేసరికి రీతూ ఇమ్ము వెంటబడింది. "నువ్వు ఇలా రాస్తావని నేను అనుకోలేదు" అంది. "నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిన్ను బ్యూటీ అని రాస్తానని " అంటూ ఇమ్ము చెప్పాడు. బిబి కామనర్స్ వెర్సెస్ బిబి సెలబ్రిటీస్ థీమ్ తో ఈ వీక్ ఎపిసోడ్ రాబోతోంది.
Mar 13, 2026
Brahmamudi:ఇందు తీసుకున్న నిర్ణయం విని షాకైన అపర్ణ.. పబ్ లో రాజ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-978 లో.. అపర్ణ, ఇందు, రేఖ అందరు కలిసి మాట్లాడుకుంటారు. గొప్ప బిజినెస్ మ్యాన్ ఇంట్లో వంట చేయడానికి ఇందు ఒప్పుకుందని అపర్ణతో రేఖ అనగానే తను షాక్ అవుతుంది. అది నిజం కాదు.. తను ఎప్పుడూ అలా అనదు అని అపర్ణ అంటుంది. అందరి చెవులు పగిలిపోయేలా, ఎవరికి భయపడకుండా నిజం చెప్పమని అపర్ణ అడుగగా నేను ఒప్పుకున్నానని ఇందు అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఎందుకు ఇలా చేశావని అపర్ణ అనగానే నేను మాట్లాడతాను పదా అని అపర్ణని గదిలోకి తీసుకొని వెళ్ళి మాట్లాడుతుంది ఇందు. అతను నాకు ముందే తెలుసు అని ఇందు చెప్తుంది. అవునా ఎలాగా అని అపర్ణ అడుగగా.. నేను దారిలో వస్తుంటే అతడి కార్ యాక్సిడెంట్ అయింది. నేను కాపాడాను అని ఇందు జరిగింది మొత్తం చెప్తుంది. అయితే మరి వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావని అపర్ణ అడుగగా నేను జాబ్ చేయడానికి ఒక అవకాశం దొరికింది అని కావ్య చెప్తుంది. మరోవైపు రాజ్ , అతడి ఫ్రెండ్ కలిసి మందు తాగడానికి పబ్ కి వస్తారు. కానీ వారి దగ్గర డబ్బు ఉండదు. అప్పుడే రాజ్ ఫ్రెండ్ కి ఒక ఐడియా వస్తుంది. మీ తమ్ముడి వీక్ నెస్ నాకొకటి తెలుసు.. దాన్ని నేను క్యాష్ చేసుకుంటున్నానని అతడు అనగానే అలా వద్దు అని రాజ్ అంటాడు. మరి మనం పార్టీ చేసుకోవడానికి డబ్బులు ఎలా అని రాజ్ ని వాళ్ళ ఫ్రెండ్ అనగానే సరే అని అంటాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ళ ఫ్రెండ్ వెంకీకి కాల్ చేసి.. మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది తొందరగా రా అని అంటాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ళ తమ్ముడు వెంకీ పబ్ కి వస్తాడు. ఇక రాజ్ వచ్చి వైన్ గ్లాస్ వెంకీ చేతిలో పెట్టి ఒక సెల్ఫీ తీస్తాడు. అందులో వెంకీ చేతిలో వైన్ గ్లాస్ ఉంటుంది. దాంతో పర్స్ ఇక్కడ పెడతావా.. ఈ ఫోటో నాన్నకి పెట్టమంటావా అని రాజ్ అనగానే వెంకీ భయపడి పర్స్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు మందు ఆర్డర్ ఇచ్చి తాగుతుంటారు. ఇక జాబ్ ఇప్పిస్తానని ఇందుకి ఒకడు చెప్పడంతో తను పబ్ కి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 13, 2026
Podharillu:గాయత్రి మాటతో స్టేషన్ నుండి బయటకి వచ్చిన ఆ నలుగురు.. మహాలక్ష్మి ముందడుగు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-69 లో.. కేశవ, చక్రి, మాధవ, కన్నా అందరు పోలీస్ స్టేషను లో ఉంటారు. వారిని విడిపించడానికి మహాలక్ష్మి ప్రయత్నిస్తుంది. ఇక జరిగిందంతా ఎస్ఐ కి చెప్తుంది మహా. కానీ అతను నమ్మడు. దాంతో గాయత్రీకి కాల్ చేస్తుంది మహా. బావ తీసుకెళ్ళినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నానని గాయత్రీ అనగానే నువ్వు ఏడిస్తే పెద్ది బయటకు రాడు..నువ్వు స్టేషన్ కి వచ్చి నిజం చెప్తే బయటకు వస్తాడని మహా కాల్ లో అడుగుతుంది. అయితే ఎస్ఐ నమ్మాలంటే నువ్వు వీడియో కాల్ లో మాట్లాడమని చెప్తుంది. సరేనని గాయత్రీ అంటుంది. ఇక మహా వీడియో కాల్ చేసినప్పుడే గాయత్రీ వాళ్ళ అమ్మ తాయారు వచ్చి ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంది. దాంతో ఎందుకు వీడియో కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఎస్ఐ అడుగుతాడు. వాళ్ళ అమ్మ భయపెట్టి ఫోన్ లాగేసుకున్నట్టుందని మహా అంటుంది. ఇక పోలీసులని వెంటబెట్టుకొని గాయత్రీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మహా. ఇక తాయారు, వాళ్ళ ఆయన పురుషోత్తం , వాళ్ళ అన్నయ్య ఉంటారు. ఎస్ఐ వచ్చి గాయత్రీని బయటకి పిలవండి మాట్లాడాలి అని అంటాడు. తను రాదని తాయారు అంటుంది. తనతో మాట్లాడనివ్వకపోతే మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళాల్సి వస్తుందని ఎస్ఐ అనగానే గాయత్రీని తీసుకురావడానికి తాయారు వెళ్తుంది. గాయత్రీ దగ్గరికి వచ్చిన తాయారు.. బయట పోలీసులు ఉన్నారు. వాళ్ళకి నిజం చెప్పావో.. నేను, మీ నాన్న చచ్చిపోతామని బెదిరిస్తుంది. దాంతో బయటకి వచ్చిన గాయత్రీ ఎస్ఐ ఏం అడిగినా మౌనంగా ఉంటుంది. నువ్వే పెద్ది దగ్గరికి వచ్చావని, నిన్ను ఎవరు బలవంతం చేయలేదని చెప్పు , చక్రి కేశవ గొడవకి వెళ్తే అందులో పెద్ది, కన్నాలని చేర్చారు. నువ్వు చెప్పే సమాధానం మీద ఆ నలుగురి భవిష్యత్తు ఆధారపడి ఉంది అని మహా ఎంత మోటివేట్ చేసినా ఎస్ఐ అడిగినా వాళ్ళ అమ్మకి భయపడి గాయత్రీ మౌనంగా ఉంటుంది. ఇక మహా, పోలీసులు వెళ్తుంటే.. మహా అని పిలుస్తుంది గాయత్రీ. ఇక పరుగెత్తుకుంటూ వచ్చి గాయత్రీ అన్ని నిజాలు చెప్తుంది. మా అమ్మ, నాన్న కావాలనే ఇలా చేశారు. మా బావ అంటే నాకు ఇష్టం.. ఏదో సంబంధం తీసుకొచ్చారు. అది నాకు ఇష్టం లేదు.. వాళ్ళు అమాయకులు వారిని విడిచిపెట్టండి అని ఎస్ఐ కి గాయత్రీ జరిగిందంతా చెప్తుంది. దాంతో కంప్లైంట్ ఇచ్చిన పురుషోత్తంని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తారు. ఇక స్టేషన్ కి వెళ్ళాక మహాని ఎస్ఐ మెచ్చుకుంటాడు. మాధవ, చక్రి, కేశవ, కన్నాలని వదిలేస్తాడు ఎస్ఐ. ఇక బయటకి వచ్చాక అందరు మహాకి థాంక్స్ చెప్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 13, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




