.webp)
పిల్లలంతా కలిసి శ్రీముఖి పరువు తీసేసారు!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి శివ శంకర వరప్రసాద్ మూవీలోని చిరు కొడుకుగా నటించిన చిన్నారి ఊహ వచ్చింది. ఈ ఎపిసోడ్ ని చిల్డ్రన్స్ స్పెషల్ ఎపిసోడ్ సమ్మర్ క్యాంపుగా రాబోతోంది. విశ్వా కొడుకు ర్యాన్, సమీరా భరద్వాజ్ కూతురు ఆద్య, అంజలి పవన్ కూతురు చందమామ, ఋద్వేద్ కూడా వచ్చారు. "రాబిట్ వచ్చిందిగా మాట్లాడదాం కూర్చో" అంటూ శ్రీముఖి ఋద్వేద్ కి చెప్పింది. "నేను కూర్చుంటే మళ్ళీ నేను లెగలేను" అన్నాడు. అంతే ఆ డైలాగ్ కి అందరూ నవ్వేశారు. తర్వాత అవినాష్ , శ్రీముఖి కలిసి సరిగమ అంటూ ఆద్య ముందు పాడారు. "నేను ఎలా పాడాను" అని అవినాష్ అడిగాడు. "నువ్వు అచ్చం కప్పలా నోరు తెరిచావ్ " అని పరువు తీసేసింది. తర్వాత ఊహని పిలిచి "అవినాష్ ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పు" అంటూ శ్రీముఖి అడిగింది. "చాలా బాడ్ గా ఉంది " అని చెప్పింది ఊహ. తర్వాత హరి తన అరచేతిని చూపిస్తూ "చిలకా నా ఫ్యూచర్ చెప్పు అన్నాడు".."ఈయనకు ప్రెసెంట్ లేదు ఇంకా ఫ్యూచర్ కూడా లేదు " అనేసింది. తర్వాత శ్రీముఖి పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టుకుని "నువ్వు చందమామ, మాయ ముగ్గురు కలిసి ఒక బోట్ లో వెళ్తున్నారు. మీ ముగ్గురు మునిగిపోతున్నారు . ఇక్కడ ఈ ముగ్గురిలో ర్యాన్ నీ ఒక్కడికే స్విమ్మింగ్ వచ్చు నువ్వు ఫస్ట్ ఎవరిని సేవ్ చేస్తావ్ " అని అడిగింది. "అసలు మీరు చెప్పింది రాంగ్ . మాయ స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్తోంది" అంటూ శ్రీముఖి పరువు తీసేసాడు ర్యాన్. ఇక శ్రీముఖి ఏమీ మాట్లాడలేక నవ్వి ఊరుకుంది.
Apr 28, 2026
ఎక్కడికీ పోదుమా ఫ్లో ఉంది...రోజా అదిరిపోద్ది
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో పేలబోతున్నాయి. డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ మాములుగా లేవు. ఇక జడ్జ్ నాగబాబు ఒక పర్సనల్ ఆఫర్ ని కూడా ఈ ప్రోమోలో ప్రకటించారు. బెస్ట్ పెర్ఫార్మర్ కి , బెస్ట్ స్కిట్ కి చెరో 5 వేలు అని చెప్పారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జడ్జెస్ ఇచ్చే గిఫ్ట్ . దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి అన్నాడు. మరి బెస్ట్ జడ్జ్మెంట్ కి ఎం లేదా సర్ అంటూ పక్కనుంచి ఇంద్రజ అడిగింది. తర్వాత కంటెస్టెంట్స్ స్కిట్స్ మొదలుపెట్టారు. కొన్ని పంచ్ డైలాగ్స్ చూస్తే ..శాంతి స్వరూప్ స్కిట్ లో "దీపం ఆరిపోవడం వలన చాలా లాభాలున్నాయి" అన్నాడు. వెంటనే నాగబాబు "ఇది పెద్ద పతివ్రత" అంటూ కౌంటర్ ఇచ్చారు. "నాన్న గారు డైలీ తాగి వస్తుంటే తాగొద్దని ఎందుకు చెప్పలేదమ్మా " అంటూ ఫైమా శాంతి స్వరూప్ ని అడిగింది. "అలా చెప్తే నేను తాగిన విషయం తెలిసిపోతుంది కాదమ్మా " అన్నాడు. దాంతో నాగబాబు పడీపడీ నవ్వాడు. రాంప్రసాద్ స్కిట్ లో శ్రీదేవికి భర్తగా నటించాడు. "పెళ్ళై వన్ వీక్ అయ్యింది రష్మీ నాకు నా వైఫ్ కి అస్సలు పడట్లేదు " అన్నాడు. ఇంతలో శ్రీదేవి వచ్చి "రాత్రి బల్లి మీదపడింది నీ పక్కలో పడుకున్న చూడవే" అంది. "నా పక్కన బల్లె పడుకుంది అనుకున్న అందుకే లేగలేదు " అన్నాడు. "మీరు లేగుత్తారేమో ఏమన్నా చేత్తారేమో అని చెప్పి ఎంత ఆశగా చూశానో తెలుసా" అంది. "నేను లేస్తే ఎం చేయాలా అన్న టెన్షన్ తో నేను పడుకున్నా " అన్నాడు రాంప్రసాద్. ఇక ఫైనల్ గా ధన్ రాజ్, రాకింగ్ రాకేష్, రోహిణి , పంచ్ ప్రసాద్ కలిసి స్కిట్ చేశారు. "ఆ ప్రేమ జంట ఎక్కడున్నారు " అన్నాడు ప్రసాద్. "ఏ ప్రేమ జంట నేను చాలామంది ప్రేమ జంటలతో మాట్లాడుతూ ఉంటాను " అన్నాడు ధన్ రాజ్. "మూడు నెలల క్రితం నువ్వేం చేసావ్ " అన్నాడు ప్రసాద్. "ఇదే స్టేజి మీద 10 స్కిట్స్ చేసాను వెళ్ళిపోమన్నారు..వెళ్ళిపోయి మళ్ళీ వచ్చా...సరే సెల్ తీసా ఏమేం చూద్దామో చెప్పండి " అన్నాడు ధన్ రాజ్. "నీ సినిమా పెట్టు ..నీ సినిమా నువ్వు చూడకపోతే ఇంకెవరు చూస్తారు " అంటూ లాగి ఒక్కటిచ్చాడు ప్రసాద్. ఇక స్కిట్స్ చూఆక ఎక్కడికీ పోదుమా జబర్దస్త్ కి ఫ్లో ఉంది అన్నాడు నాగబాబు. ఇక నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "వామ్మో జబర్దస్త్ మాములుగా ఉండదు బాస్ ఈస్ బాక్ నాగబాబు సార్..చమ్మక్ చంద్ర వస్తే ఇంకా సూపర్..పాత జబర్దస్త్ వచ్చినట్టు ఉంది. నవ్వుల నాగబాబు గారు రాకతో జబర్దస్త్ కి పాత కళ వచ్చింది ,అలాగే రెబెల్ రోజా గారు కూడా వస్థే ఇంకా జబర్దస్త్ కి తిరుగు ఉండదు .రాజకీయాలు పక్కన పెట్టి ఇద్దరు జడ్జెస్ కలిస్తే అదిరిపోతుంది షో" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Apr 28, 2026.webp)
Brahmamudi : రాజు-ఇందుల మధ్య చిగురిస్తున్న ప్రేమ పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1017 లో...రాజు, లక్కీ, ఇందు, నందు నలుగురు కలిసి వంటలు తమ బడ్జెట్ లో ఎలా చెయ్యాలో ప్లాన్ చేస్తారు. చికెన్ అంతమందికి పెడితే సరిపోదని రాజు అంటాడు. ప్లేట్ లో వేస్తే సరిపోదు కానీ కప్ లో వేసిస్తే సరిపోతుందని ఇందు అంటుంది. అలా ఏమేమి వండాలో డిసైడ్ అవుతారు. మనం వెళ్లి ఈ వీధిలో వాళ్ళని పిలుద్దామని ఇందు అంటుంది. ఆ తర్వాత ఇందు, రాజు కలిసి పక్కింటి వాళ్లని పిల్వడానికి వెళ్తారు. రాజుతో ఇందుని చూసి ఒరేయ్ నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావని అడుగుతారు. నేను పెళ్లి చేసుకోవడం కాదు మా అమ్మానాన్నల పెళ్లి రోజుకి భోజనాలు పెడుతున్నామని రాజు చెప్పగానే సరే తప్పకుండా వస్తామని వాళ్ళు చెప్తారు. మరొకవైపు నందు, వెంకీ వెళ్లి భోజనానికి రమ్మని పిలుస్తారు. ఆ తర్వాత మనకి ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు.. ఆ ఇందుని ఎలా బయటకు తీసుకొని వస్తామని రేఖతో భూషణ్ అంటాడు. ఆ మాటలు అపర్ణ విని కోపంగా.. ఏంటి ఇందుని ఎలా బయటకు తీసుకొని వస్తామని అంటున్నారు. ఇన్ని రోజులుగా బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు.. నా ఇందు ని తీసుకొని రాలేదంటే పోలీస్ వాళ్ళకి , మీడియా వాళ్ళకి ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తానని రేఖకి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందు పూజకి ఏర్పాట్లు చేస్తుంది. రాజు వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు దేవుడికి మొక్కుకుంటారు. ఆ తర్వాత రాజు, వెంకీ వాళ్ళ అమ్మనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వంటలకి సంబంధించిన కూరగాయలు కట్ చేస్తారు. అప్పుడే లక్కీ వస్తాడు. అక్కడ నందుని చూసి భయపడి రాజుకి సైగ చేస్తాడు. రాయితో కొడతాడు.. అలా కొట్టడం నందు చూసి లక్కీ వచ్చాడు వెళ్ళమని రాజుకి చెప్తుంది. తరువాయి భాగంలో రాజు కళ్లలో దుమ్ము పడుతుంది. ఇందు తనని పట్టుకొని తీసేస్తుంది. అది చూసి ఈ అమ్మాయి మన ఇంటికి కోడలు అయితే బాగుటుందని రాజు వాళ్ళ నాన్న తన భార్యతో అంటాడు. వాళ్ళ ఇద్దరికి బ్రహ్మముడి వేస్తే బాగుండు అని లక్ష్మీ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 28, 2026.webp)
Brahmamudi : రాజు-ఇందుల మధ్య చిగురిస్తున్న ప్రేమ పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1017 లో...రాజు, లక్కీ, ఇందు, నందు నలుగురు కలిసి వంటలు తమ బడ్జెట్ లో ఎలా చెయ్యాలో ప్లాన్ చేస్తారు. చికెన్ అంతమందికి పెడితే సరిపోదని రాజు అంటాడు. ప్లేట్ లో వేస్తే సరిపోదు కానీ కప్ లో వేసిస్తే సరిపోతుందని ఇందు అంటుంది. అలా ఏమేమి వండాలో డిసైడ్ అవుతారు. మనం వెళ్లి ఈ వీధిలో వాళ్ళని పిలుద్దామని ఇందు అంటుంది. ఆ తర్వాత ఇందు, రాజు కలిసి పక్కింటి వాళ్లని పిల్వడానికి వెళ్తారు. రాజుతో ఇందుని చూసి ఒరేయ్ నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావని అడుగుతారు. నేను పెళ్లి చేసుకోవడం కాదు మా అమ్మానాన్నల పెళ్లి రోజుకి భోజనాలు పెడుతున్నామని రాజు చెప్పగానే సరే తప్పకుండా వస్తామని వాళ్ళు చెప్తారు. మరొకవైపు నందు, వెంకీ వెళ్లి భోజనానికి రమ్మని పిలుస్తారు. ఆ తర్వాత మనకి ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు.. ఆ ఇందుని ఎలా బయటకు తీసుకొని వస్తామని రేఖతో భూషణ్ అంటాడు. ఆ మాటలు అపర్ణ విని కోపంగా.. ఏంటి ఇందుని ఎలా బయటకు తీసుకొని వస్తామని అంటున్నారు. ఇన్ని రోజులుగా బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు.. నా ఇందు ని తీసుకొని రాలేదంటే పోలీస్ వాళ్ళకి , మీడియా వాళ్ళకి ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తానని రేఖకి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందు పూజకి ఏర్పాట్లు చేస్తుంది. రాజు వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు దేవుడికి మొక్కుకుంటారు. ఆ తర్వాత రాజు, వెంకీ వాళ్ళ అమ్మనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వంటలకి సంబంధించిన కూరగాయలు కట్ చేస్తారు. అప్పుడే లక్కీ వస్తాడు. అక్కడ నందుని చూసి భయపడి రాజుకి సైగ చేస్తాడు. రాయితో కొడతాడు.. అలా కొట్టడం నందు చూసి లక్కీ వచ్చాడు వెళ్ళమని రాజుకి చెప్తుంది. తరువాయి భాగంలో రాజు కళ్లలో దుమ్ము పడుతుంది. ఇందు తనని పట్టుకొని తీసేస్తుంది. అది చూసి ఈ అమ్మాయి మన ఇంటికి కోడలు అయితే బాగుటుందని రాజు వాళ్ళ నాన్న తన భార్యతో అంటాడు. వాళ్ళ ఇద్దరికి బ్రహ్మముడి వేస్తే బాగుండు అని లక్ష్మీ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 28, 2026.webp)
Karthika Deepam2 : జ్యోత్స్నకు షాకిచ్చిన కార్తీక్.. నెల రోజుల్లో పెళ్లి అంటూ డెడ్ లైన్!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -655 లో.....కార్తీక్, దీప ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. నీకు దెబ్బ తగిలింది ఈ ఒక్కరోజు వెళ్లకుంటే ఏం కాదని కాంచన కోప్పడుతుంది. నువ్వు డ్రైవర్ వి ఇప్పుడు నీకు చేతికి గాయం అయింది ఎలా డ్రైవింగ్ చేస్తావని కాంచన అడుగుతుంది. అయినా వినకుండా వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు. మరొకవైపు వాళ్ళ రాక కోసం జ్యోత్స్న ఎదురుచూస్తుంది. కార్తీక్ ని ఎక్కించుకొని దీప స్కూటీ పై ఎంట్రీ ఇస్తుంది. అది జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది. నువ్వు వీరనారివి దీప అని జ్యోత్స్న క్లాప్స్ కొడుతుంది. నా కోసం ఎంత చేసావ్ బావ అంటుంది కానీ నువ్వు మా అత్త కోసం ఏం చేస్తున్నావ్.. అసలు నీకు ప్రేమే లేదని కార్తీక్ అంటాడు. ప్రేమ లేదని ఎవరు చెప్పారని జ్యోత్స్న అంటుంది. ఉంటే ఎందుకు ఆ వైరాతో చేతులు కలుపుతావని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ వైరా ఫోన్ చేసి అంతా చెప్పాడు అని కార్తీక్ చెప్తాడు. నీకు ఆసలు సిగ్గుందా అని దీప అంటుంది. జ్యోత్స్న, దీప ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను కచ్చితంగా బావ చేత్తో నా మెడలో తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న అనగానే నీ ముచ్చట నేను ఎందుకు కాదని అంటాను.. ఈ రోజు నుండి కచ్చితంగా నెల రోజులలో నీకు పెళ్లి జరిపిస్తాను.. మంచి అబ్బాయిని చూసి పెళ్ళి జరిపిస్తానని కార్తీక్ అంటాడు. కార్తీక్, దీప ఇద్దరు జ్యోత్స్న చెయ్ లో చెయ్ వేసి చెప్తారు. అప్పుడే పారిజాతం వచ్చి విజిల్ వేసి.. సూపర్ రా మనవడా అని అంటుంది. ఆ తర్వాత పారిజాతం, కార్తీక్, దీప ముగ్గురు చేతులు కలిపి ఎలాగైనా జ్యోత్స్న ప్లాన్ ని తిప్పికొట్టి తనకు పెళ్లి చెయ్యాలని అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంతులుని పిలిపిస్తాడు కార్తీక్. ఎందుకు పిలిచావని దశరథ్ అడుగుతాడు. జ్యోత్స్న పేరున ఎలా ఉందో తెలుసుకోవడానికి అని కార్తీక్ చెప్తాడు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీప నువ్వు వెళ్లి జ్యోత్స్నని తీసుకొనిరా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 28, 2026.webp)
Illu illalu pillalu : శ్రీవల్లి ప్రెగ్నెన్సీ వెనుక భాగ్యం మాస్టర్ ప్లాన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -456 లో.... శ్రీవల్లి నెలతప్పినందుకు రామరాజు ఇంట్లో సాయంత్రం గ్రాంఢ్ గా ఫంక్షన్ చేస్తుంటారు. దానికి సంబందించిన ఏర్పాట్లన్నీ రామరాజు బామ్మర్ది తిరుపతి చేస్తాడు. ఇక రామరాజు వచ్చి.. తొందరగా పనులు చేయిరా అని చెప్పి వెళ్తాడు. ఇక మరోవైపు శ్రీవల్లి ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక తికమకపడుతుంటే వేదవతి అడుగుతుంది. ఈ రెండు చీరలు వద్దు అని వేదవతి అంటుంది. మరి అనగానే అమూల్య వెళ్ళి తీసుకురా అని వేదవతి తనని లోపలికి పంపిస్తుంది. ఇక అమూల్య కొత్తచీర, నగలు తీసుకొస్తుంది. సాయంత్రం ఫంక్షన్ కి ఈ చీర, నగలు పెట్టుకోవాలని అనగానే శ్రీవల్లితో పాటు అందరు సంతోషిస్తారు. అయితే భాగ్యం మాత్రం.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని ఇంత చిన్న విషయం అని అంటుంది. ఇక అప్పుడే రామరాజు వచ్చి.. ఇది చిన్న విషయం కాదు.. మా వంశానికి సార్థకత రాబోతుంది.. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు.. నేను తాతని కాబోతున్నా అంటు రామరాజు గొప్పగా చెప్తుంటాడు. ఇక అది విని భాగ్యం జరిగింది గుర్తుచేసుకుంటుంది. శ్రీవల్లి హాస్పిటల్ లో ఉన్నప్పుడు డాక్టర్ ని రిక్వెస్ట్ చేసి తనతో శ్రీవల్లి నెలతప్పింది అని అబద్ధం చెప్పిస్తుంది భాగ్యం. వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉన్నారు అసలు నిజం తెలిస్తే నేను ఏమైపోతానో ఏమో అని భాగ్యం టెన్షన్ పడుతుంది. అది గమనిస్తుంది నర్మద. వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి.. ఏమైంది పిన్ని అని అడిగేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన భాగ్యం.. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఇక అందరు రెడి అవుతుంటారు . ఇక ప్రేమ మీద బల్లి పడిందని తన గదిలో నుండి బయటకి పరుగున వస్తుంది ప్రేమ. ఇక అందరు హాల్లోకి వస్తారు. ప్రేమని చూసి అందరు ఆటపట్టిస్తుంటే నర్మద తనకి సపోర్ట్ గా ఉంటూ భాగ్యం వాళ్ళకి పంచ్ లు వేస్తుంటుంది. అది గమనించిన ఆనందరావు.. భాగ్యంతో మన గురించే అంటున్నారని అంటాడు. సర్లే అని భాగ్యం వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అందులో శ్రీవల్లిని నర్మద, ప్రేమ ఆడుకుంటుంటే అప్పుడే అక్కడికి నర్మద వాళ్ళ అమ్మానాన్నలు వస్తారు. అదే సమయంలో రామరాజు అక్కడికి వస్తాడు. గొడవ అవుతుందేమోనని అందరు టెన్షన్ పడతారు. ధీరజ్ వచ్చి నేనే రమ్మన్నాను నాన్న.. మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే నర్మద వదిన సహకారం కూడా ఉంది.. అందుకే వదిన వాళ్ళ పేరెంట్స్ వస్తే తను సంతోషంగా ఉంటుందని రమ్మన్నాని ధీరజ్ అనగానే మీ అమ్మనాన్నలు వెళ్ళేవరకు వారికి జాగ్రత్తగా మర్యాదలు చేయమ్మా అని నర్మదతో చెప్పి రామరాజు వెళ్తాడు. ఇక వేదవతి వారిని మర్యాదగా ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 28, 2026.webp)
Podharillu : మాధవ-గాయత్రిల పెళ్లికి బ్రేక్ తాయారు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వర్కౌట్ అవుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -101 లో....తాయారు చెప్పినట్లు వినకుండా గాయత్రి, మాధవ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావే అని ఇంట్లో అందరు గాయత్రిపై కోప్పడతారు. బావ ఇన్ని రోజులు తల్లి చాటు బిడ్డలాగా ఉన్నాను.. తెల్లవారితే నా జీవితం వేరొకరి చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు కూడా మాట్లాడకుంటే నా బావకి నేను దూరం అవుతాను.. మొన్న మా అమ్మ పీకపై కత్తి పెట్టుకొని చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేసిందని జరిగిందంతా గాయత్రి చెప్తుంది. నీ మాటలు నమ్మడానికి లేదని చక్రి, కేశవ అంటాడు. నా బావపై ఉన్న ప్రేమ మాత్రం నిజం.. మావయ్య నీకు తెలుసు కదా అని గాయత్రి అంటుంది. ఇప్పుడు మావాడిని పెళ్లి చేసుకుంటావా అని నారాయణ అడగ్గానే చేసుకుంటానని గాయత్రి అంటుంది. మాధవని పెళ్లి కొడుకులాగా రెడీ చేస్తారు. మాధవకి ఏం జరుగుతుందో అర్ధం కాదు.. చక్రి వెళ్లి తాళి తీసుకొని వస్తాడు.. గాయత్రి మెడలో మాధవ తాళి కట్టబోతుంటే తాయారు, పురుషోత్తం వస్తారు. పెళ్లి అడ్డుకోబోతుంటే చక్రి, కేశవ ఇద్దరు కలిసి పురుషోత్తాన్ని ఆపుతారు. ఈ ఇంట్లోకి వచ్చి నువ్వు ఏం చేస్తావే అని గాయత్రిని తాయారు కొడుతుంది. ఇక తాయారు మాట వినకుండా మాధవని పెళ్లి చేసుకుంటానని గాయత్రి అంటుంది. ఆ తర్వాత గాయత్రి ఎంత బెదిరించినా అలా కఠినంగా మాట్లడుతుంటే.. తాయారు వాళ్ళు టెన్షన్ అవుతారు. ఇక మాధవని పక్కకి తీసుకొని వెళ్తారు తాయారు, పురుషోత్తం. మీకు మాకు ఎన్ని గొడవలున్నా అది ఈ పెళ్లితో ముడి పెట్టొద్దు.. నా పరువుపోతుంది.. దాని పెళ్లి కోసం తిండితిప్పలు లేకుండా కష్టపడ్డానని మాధవ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకోకని పురుషోత్తం అడుగుతాడు. తాయారు కూడా మాధవని రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తే అది బ్రతుకుతుందా అని మాధవ అడుగుతాడు. ఇక ఆ తర్వాత తాయారు, పురుషోత్తం బ్లాక్ మెయిల్ కి మాధవ కరిగిపోయి పెళ్లి చేసుకోనని అంటాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 28, 2026.webp)
Jayam serial : శకుంతల-ప్రమీల మధ్య తీరిన మనస్పర్థలు!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -254 లో.... శకుంతల అన్న మాటలకి ప్రమీల ఏడుస్తుంది. వీరు, ఇషిక ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటారు. అది గంగ గమనిస్తుంది ఇంట్లో అందరు ఎక్కడి వారు అక్కడికి వెళ్తారు. రుద్ర దగ్గరికి గంగ వెళ్తుంది. ఇంట్లో ఏం జరిగిన మీరు సైలెంట్ గా ఉంటారా.. ఆ వీరు దీనంతటికి కారణం అని తెలిసినా.. ఏం అనరా.. ఎందుకు అంటే మీ చెల్లి బాధపడుతుంది.. మీ పెద్దమ్మ బాధపడుతుంది.. కానీ ప్రమీల అక్క బాధపడ్డ పర్వాలేదా అని రుద్రతో గంగ అంటుంది. ఇప్పుడు ఏం చెప్పమంటావ్.. ఇప్పుడు వాడి గురించి చెప్తే ఇంట్లో గొడవలు తప్ప ఏం ఉండవు.. నేను వాడిని మంచిగా మార్చాలనుకుంటున్నానని రుద్ర అంటాడు. మరొకవైపు ప్రమీల సూపర్ మార్కెట్ కి రాలేదని మక్కమ్, కార్తీక్ మాట్లాడుకుంటారు. ప్రమీలకి కార్తీక్ ఫోన్ చేసి ఎందుకు మేడం ఈ రోజు సూపర్ మార్కెట్ కి రాలేదని అడుగుతాడు. నా ఇష్టం వర్కర్ వర్కర్ లాగే ఉండమని ప్రమీల కోప్పడి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో కార్తీక్ బాధపడతాడు. మరొకవైపు విశ్వ స్వీట్ తీసుకొని వచ్చి సుధకి ఇచ్చి మీ అన్నయ్య కుటుంబంలో ఏదో గొడవలంట అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. లక్ష్మీ దగ్గరికి సుధా వెళ్లి ఒకసారి గంగకి ఫోన్ చెయ్ అని చెప్పగానే తను ఫోన్ చేస్తుంది.. గంగతో సుధ ఫోన్ మాట్లాడుతుంది. ఇంట్లో గొడవలు అమ్మ అని గంగ చెప్పగానే అన్నిటికి ఆ దేవుడున్నాడని సుధ అంటుంది. మరుసటిరోజు గంగ పూజ చేసి హారతి ఇస్తుంది. ప్రమీల దగ్గరికి శకుంతల వచ్చి.. సారీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.. ఎక్కడ నాకు దూరం అవుతావోనని అలా మాట్లాడానని అనగానే అత్తయ్య మీరు నాకు సారీ చెప్పడమేంటి.. ఎప్పటికి నేను మీ కోడలినే ఇదే నా కుటుంబమని ప్రమీల అనగానే ప్రమీలని శకుంతల హగ్ చేసుకుంటుంది. హమ్మయ్య అంత సెట్ అయిందని పెద్దసారు అంటాడు. ఇషిక, వీరు డిస్సపాయింట్ అవుతారు. తరువాయి భాగంలో విశ్వ దగ్గరికి వెళ్ళి బాక్సింగ్ నేర్చుకుంటానని రుద్రకి గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 28, 2026
Jayam serial: గంగ కోసం సుధ పోరాటం.. ప్రమీల తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం!
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -253 లో.. సుధా, విశ్వ మాట్లాడుకుంటారు. మీరు గంగకి ట్రైనింగ్ ఇవ్వాలని విశ్వతో సుధా అంటుంది. నేను ఇవ్వనని విశ్వ అంటాడు. ఎందుకు ఇవ్వరు అని సుధా అడుగగా.. ఎలా ఇస్తానని అనుకున్నావ్.. ఒక ఆడది ఎలా ఉండాలో అలాగే ఉండాలి.. మగరాయుడిలా మారి ఇలాంటివి చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటానని అనుకున్నావ్.. తను మీ అన్నయ్య కోడలు అని ఇలా చేయమంటున్నావా అని విశ్వ అడుగుతాడు. లేదు తను నా మేనల్లుడి భార్య.. పైగా రుద్ర ట్రైనింగ్ కూడా ఇచ్చాడు.. మీరు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని సుధా అడుగుతుంది. నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావ్.. ఇలా తెగిపోయిన బంధాలని నువ్వు మళ్ళీ కలుపుకుంటావనే నేను నీకు ఆ ఫ్యామిలీని దూరంగా ఉంచాను..నేను ట్రైనింగ్ ఇవ్వనని విశ్వ అంటాడు. మరి నాకు మాటిచ్చారు కదా.. ఆ మాట నిలబెట్టుకోండి అని సుధా అంటుంది. ఇక చేసేదేమీ లేక విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అదే ఇంట్లో పనిచేసే లక్ష్మీ వచ్చి.. ఎందుకమ్మ గంగ గురించి అయ్యగారితో గొడవ అని అంటుంది. నేను గంగ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని సుధా అంటుంది. మరోవైపు ప్రమీల వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కార్ లో శకుంతల వాళ్ళ ఇంటికి వస్తారు. ఎలా వెళదామని ప్రమీల వాళ్ళ అమ్మ అనగానే ఇంతదూరం వచ్చాక ఇంట్లోకి వెళ్ళకుంటే ఎలా అని ప్రమీల వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే కార్ దగ్గరికి రుద్ర వచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇక ప్రమీల వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు ఇంటిలోపలికి వెళ్తారు. వాళ్ళని చూసి ప్రమీల ప్రేమగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ప్రమీల వాళ్ళ అమ్మానాన్నలని పెద్దసారు ఆప్యాయంగా పలకరిస్తుంటే శకుంత మాత్రం అవమానిస్తూ మాట్లాడుతుంది. ఇక ప్రమీల వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. నా కూతురు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తనకి ఇక్కడ మానసిక ప్రశాంతత లేదు అని చెప్తుంటాడు. అసలేం మాట్లాడాలని అనుకుంటున్నారో చెప్పండి అని శకుంతల అడుగుతుంది. సూటిగా విషయానికి వస్తాను.. తన భర్త చనిపోయాక ప్రమీలని తీసుకెళ్ళాలని అనుకుంటే మీరు వద్దని మీ కోడలు మీ దగ్గరే ఉండాలని పట్టుబట్టారు కానీ తను ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. తనకంటూ ఏ అచ్చటా ముచ్చటా తీరలేదని ప్రమీల వాళ్ళ నాన్న చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని అంటారు అడగగా.. నేను ప్రమీలని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానని ప్రమీల వాళ్ళ నాన్న అనగానే అందరు షాక్ అవుతారు. మరి ప్రమీలని శకుంతల ఇంట్లో నుండి పంపిస్తుందా.. రుద్ర ఏం చేయనున్నాడు.. ఈ నిర్ణయానికి ప్రమీల ఒప్పుకుంటుందా.. అసలు ప్రమీల వాళ్ళ అమ్మనాన్నలు రావడానికి కారణం రుద్రనేనా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026
Illu Illalu Pillalu: శ్రీవల్లి గుట్టు విప్పిన వేదవతి.. చందుకి దిమ్మతిరిగే షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -455 లో.. నా పెద్ద కోడలు కడుపులో పెరుగుతున్న పాప బాగుండాలి.. ఇకనైనా అందరు సంతోషంగా ఉండాలని రామరాజు మొక్కుకుంటాడు. అప్పుడే రామరాజుకి వల్లి గురించి నిజం చెప్పాలని చందు వస్తుంటే తనని లాక్కొని గదిలోకి వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా అని వేదవతి అడుగుతుంది. నీకు తన గురించి ఏం తెలియదు అమ్మ అని చందు అనగానే నాకు వల్లి గురించి తెలుసని వేదవతి అంటుంది. దాంతో చందు షాక్ అవుతాడు. నాకు శ్రీవల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన కుట్రల గురించి తెలుసు.. నీకు శ్రీవల్లి గురించి తెలిసినప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి తనని తన పుట్టింట్లో వదిలేసి వచ్చావ్ ఎందుకని వేదవతి అడుగుతుంది. తన కుటుంబ గౌరవం కాపాడే కోడలు దొరికిందని నాన్న మురిసిపోతున్నాడు.. నిజం తెలిస్తే నాన్న తట్టుకోలేడని అందుకే చెప్పలేదని చందు అంటాడు. మరి ఇప్పుడు చెప్తే తట్టుకుంటాడా అని వేదవతి అడుగుతుంది. అవును రా పెద్దోడ ఇప్పుడు వదినని మంచిగా మార్చుకోవడానికి ట్రై చెయ్ అని ధీరజ్ అంటాడు. అవును వల్లి గురించి నీకెలా తెలుసురా అని ధీరజ్ ని వేదవతి అడుగుతుంది. మాక్కూడా తెలుసని ప్రేమ, నర్మద ఎంట్రీ ఇస్తారు. ఇక మీదట శ్రీవల్లి తోక జాడించకుండా వార్నింగ్ ఇచ్చే తీసుకొని వచ్చానని వేదవతి చెప్తుంది. భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి భాగ్యం చెంప చెల్లుమనిపిస్తుంది వేదవతి. అందరికి వార్నింగ్ ఇచ్చి వచ్చినట్లు ప్రేమ, నర్మద వాళ్ళకి వేదవతి చెప్తుంది. మరొకవైపు శ్రీవల్లి, భాగ్యం ఆనందరావు ముగ్గురు మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టినం అని డాన్స్ చేస్తారు. మళ్ళీ ఈ కుటుంబం నీ మాట మీదే నడవాలి అంటూ వల్లికి భాగ్యం చెప్తుంటే.. ప్రేమ, నర్మద వచ్చి ఇక మీరు మారారు అని అంటారు. ధీరజ్ వచ్చి వదిన మీరు ఇక మీదట తప్పు చేస్తే మళ్ళీ ఇంట్లో ఎవరు క్షమించరని వల్లి తో ధీరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026
Karthika Deepam 2: కార్తీక్, దీపలకు అసలు నిజం చెప్పేసిన వైరా.. ఎంగేజ్మెంట్కు స్వప్న గ్రీన్ సిగ్నల్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -654 లో... శ్రీధర్ దగ్గరికి వసంత్ వస్తాడు. నువ్వు ఎక్కడికో క్యాంపుకి వెళ్ళావ్ అన్నావ్.. వెళ్లలేదా అని శ్రీధర్ అడుగుతాడు. లేదు మావయ్య స్వప్నకి సర్ ప్రైజ్ ఇద్దామని వచ్చానని అంటాడు. స్వప్నని నేను పిలుస్తానని పిలుస్తాడు. ఎల్లుండి మంచి రోజు అంట ఎంగేజ్మెంట్ చేసుకోమని పంతులు గారు చెప్పారని వసంత్ చెప్తాడు. ఏంటి నువ్వు.. మేం ఆలోచించుకోవాలి కదా అని కావేరి అంటుంది. అవును స్వప్న కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా అని కాశీ అంటాడు. నేను తీసుకున్నానని స్వప్న అంటుంది. నాకు ఏం ప్రాబ్లెమ్ లేదని స్వప్న అనగానే బ్రో నీకేమైనా ప్రాబ్లమా అని కాశీని వసంత్ అడుగుతాడు. నీకేం ఉంటుందిలే స్వప్నకే ఏం ప్రాబ్లమ్ లేదు.. నాకు ఏం ప్రాబ్లమ్ లేదని వసంత్ అంటాడు. మీరు అయినా చెప్పండి అని శ్రీధర్ తో కావేరి అంటుంది. నా కూతురు ఇష్టమే నా ఇష్టం అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత అందరు వెళ్ళాక నువ్వు ఏం బాధపడకు అల్లుడు.. నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని తనకి బుద్దివచ్చేలా చెయ్యమని కావేరి అంటుంది. తను నన్ను వద్దని అనుకుంటుంది.. నేను కాదని కాశీ అంటాడు. ఆ తర్వాత దాస్ డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఏంటి నాన్న అని మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్న పనులకి ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలి ఉంటే బాగుండేదని జ్యోత్స్న అంటుంది. ఎప్పటిలాగే దాస్ ని తిట్టి పంపిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత కార్తీక్ కి దీప షర్ట్ చేంజ్ చేస్తుంది. అప్పుడే వైరా ఫోన్ చేస్తాడు. ఒరేయ్ రెండుసార్లు నన్ను మోసం చేసావ్ రా అని వైరా అనగానే పోలీసులు వస్తారు జాగ్రత్త అని కార్తీక్ అంటాడు. నీ మరదలు కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది.. ఎందుకు అంటే ఇదంతా ఒక డ్రామా.. నీ మరదలు అంటే నాకు కోపమే కానీ డబ్బులు ఎక్కువ అడుగు, నాకు అందులో వాటా కావాలి.. ఎలా మాట్లాడాలి.. ఎంత అడగాలని.. అంతా నీ మరదలు ప్లాన్ అని వైరా అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. నా వల్ల మీకు డేంజర్ కాదురా నీ మరదలు వల్లే డేంజర్ అని వైరా చెప్తాడు. చూసావా బావ అది మారదని దీప అంటుంది. ఇక క్షమించేది లేదు ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ చేస్తుంది. బుద్ధి వచ్చేలా చెయ్యాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పారిజాతం కార్తీక్ తో కలిసి చేసిన పనికి రివార్డ్ గా తనకి యాభై వేలు ఇస్తాడు శివన్నారాయణ. దాంతో పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026
Brahmamudi: పెళ్లిరోజు వేడుకలో రాజుకు చుక్కలు చూపించిన ఇందు.. అపర్ణ సీరియస్ వార్నింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1016 లో... ఇందుని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు రాజు. ఇందుని చూసి అందరు షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఎవరు అని వాళ్ళ నాన్న అడుగుతాడు. పెళ్లి అని రాజు ఏదో చెప్పబోతుంటే రాజు పెళ్లి చేసుకొని వచ్చాడని ఇంట్లో అందరు అనుకుంటారు. నేను చెప్పేది పూర్తిగా వినండి అని రాజు అంటాడు. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా పెళ్లి రోజుని సింపుల్ గా చెయ్యడానికి వచ్చింది.. తను ఈవెంట్ మేనేజర్ అని రాజు చెప్తాడు. అవునులే నీ మొహానికి ఇంత అందమైన అమ్మాయి లవర్ గా ఉంటుందా అని వాళ్ళ నాన్న అనగానే ఇందు నవ్వుకుంటుంది. ఈ రోజు మీరు ఏం పనులు చెయ్యకండి.. అన్ని పనులు మీ అబ్బాయి వాళ్ళు చూసుకుంటారని ఇందు చెప్తుంది. రాజుతో ఇందు గిన్నెలు తోమిస్తుంది. మరొకవైపు వెంకీ చెట్టు ఎక్కి కొబ్బరి మట్టలు కొడుతాడు. అప్పుడే నందు వచ్చి నీతో మాట్లాడాలి బయటకు వెళదామని అంటుంది. నాకు చెట్టు ఎక్కడం వచ్చు కానీ దిగడం రాదని వెంకీ అంటాడు. అలాంటప్పుడు ఎందుకు ఎక్కావని ఇందు అంటుంది. ఇందుని చూసి నువ్వు ఏంటి అక్క అని నందు అడుగుతుంది. ఈవెంట్ ప్లానర్ అని రాజు చెప్తాడు. వెంకీని కిందకి దింపడానికి రాజు, ఇందు కింద ఒక చీర పట్టుకొని ఉంటారు. నందు వచ్చి నిచ్చెన వేస్తుంది. అది చూసి ఫ్రెండ్ అంటే నువ్వేనే అని వెంకీ అంటాడు. ఆ తర్వాత ఇందుని కిచెన్ లోకి తీసుకొని వెళ్తారు. వంట చేయడానికి కావల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తారు. తరువాయి భాగంలో ఇన్ని రోజులు బిజినెస్ లో లాభంగా వచ్చిన డబ్బులు ఏం చేశారు.. డబ్బులు కట్టి నా మనవరాలిని తీసుకొని రాకుంటే మీడియా వాళ్ళకి పోలీస్ వాళ్ళని ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తానని రేఖతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026.webp)
సుధీర్ నువ్వు నేను శీను ముగ్గురం ఫ్రెండ్స్ కానీ నా సపోర్ట్ మాత్రం విష్ణుప్రియకే!
సర్కార్ లో విష్ణు ప్రియా కో-హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన వాళ్లంతా విష్ణుప్రియను తెగ మెచ్చేసుకున్నారు. ఈ షోకి అవినాష్, రాఘవ, రాంప్రసాద్, రోహిణి వచ్చారు. ఇక రాగానే అవినాష్ విష్ణుప్రియను తెగ పొగిడేసాడు. "సర్కార్ అంటే విష్ణు విష్ణు అంటే సర్కార్. నేను పడుకుంటే విష్ణు లేస్తే విష్ణు ఇన్ని సీజన్స్ వేరు ఈ సీజన్ వేరు విష్ణు. యు ఆర్ బ్యూటిఫుల్ యు ఆర్ ఏంజెల్ అంటూ దిష్టి తీసాడు " అవినాష్. తర్వాత రాఘవ వచ్చాడు. "ఐనా నేను వచ్చింది అందం విష్ణు ప్రియా గురించి అసలు ఆ అందం ఏంటండీ. అందం అంటే ఇది"అన్నాడు. ఏంటి మీరు ఇంత ఫిట్ గా కనిపిస్తున్నారు జిమ్ కి వెళ్తున్నారా " అంది విష్ణు . "వెళ్లడం ఏంటండీ అసలు బయటకు వస్తే కదా " అన్నాడు రాఘవ. "పదండి సీట్ వరకు నేను తీసుకెళ్తాను " అంది విష్ణు. "మీరు తీసుకెళ్తానంటే అక్కడికేంటి అంటార్టికా కన్నా వస్తాను " అన్నాడు. ఇక రాంప్రసాద్ వచ్చి "సుధీర్ లేకపోయినా సర్కార్ సీజన్ మొత్తం నిన్ను పెట్టి నడిపించేయొచ్చు...ఐనా జోక్ వేస్తె నవ్వడేంటి...నాకు నచ్చిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి కానీ అవి చూడలేదు.సుధీర్ నువ్వు నేను శీను ముగ్గురం ఫ్రెండ్స్ కానీ నా సపోర్ట్ మాత్రం విష్ణుప్రియకే " అంటూ తెగ కౌంటర్లు వేసి నవ్వించాడు.
Apr 25, 2026.webp)
సర్కార్ లో సుధీర్ కి సన్మానం!
సర్కార్ షోలో హోస్ట్ సుధీర్ కి రామ్ ప్రసాద్, అవినాష్, రోహిణి, రాకెట్ రాఘవ కలిసి సన్మానం చేశారు. అవినాష్ ఐతే ఒక సన్మాన పత్రం కూడా రాసుకొచ్చాడు. అది చదువుతున్నంత సేపు సుధీర్ భయపడ్డాడు, బాధపడ్డాడు. ఇక రామ్ ప్రసాద్ సుధీర్ కోసం సన్మానం పోస్టర్ ని కూడా డిజైన్ చేసి చూపించాడు. "సుధీర్ అది ఒక పేరు కాదు డోలు. ఈయన పొదల్లో ఉదయించిన సూర్యుడు. చిన్నప్పుడు ఉంగా ఉంగా అన్నాడు. కానీ ఇప్పుడు గెలుపు కోసం బెంగా బెంగా అంటున్నాడు. పేకల నుంచి అభిమానుల కేకల దాకా అన్ని చూసారు. ఆయనకు అలుపు లేదు...ఆయన్ని ఆప్ తలుపు లేదు. ఆయన ఎల్లకాలం బాగుండాలని కోరుకుంటూ సుధీర్ ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు. ఐతే సుధీర్ ఫుల్ గా మోసం చేశారు. పూలు దండాలు తెచ్చి ఎవరికీ వాళ్ళు వేసుకున్నారు. ఈ స్కిట్ ఇంత బాగా రాసావు అంటూ రాంప్రసాద్ కి పూల దండ వేసింది రోహిణి. ఎవరికీ వాళ్ళు పూలు జల్లేసుకుని వాళ్ళను వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. అమ్మ సుధీర్ నువ్వు ఒక్కడివే సెల్ఫీ తీసుకో అంటూ రాంప్రసాద్ ఆట పట్టించాడు. "నా ఫ్రెండ్స్ వాళ్లంతా వాళ్లను నువ్వు కొనేసి నా మీద ఇలా చేయిస్తావా " అంటూ సుధీర్ విష్ణుప్రియను అడిగాడు ఫన్నీగా. ఇక విష్ణు ప్రియా ఐతే ఇంతా అవిమానించిన వాళ్ళను ఊరుకోను అంటూ చెప్పింది.
Apr 25, 2026.webp)
Illu illalu pillalu : వల్లి ప్రెగ్నెన్సీ వార్తతో ఇంటికి చేరుకున్న చందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -454 లో.. వల్లి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ప్రేమ, నర్మద ఇద్దరు వచ్చి తనకి కంగ్రాట్స్ చెప్తారు. చందు మాత్రం కోపంగా ఉంటాడు. బా ఇప్పుడు మనం తల్లిదండ్రలం కాబోతున్నామని వల్లి అంటుంది. నువ్వు చేసిన మోసం నేను మర్చిపోలేను.. ఈ విషయం వెంటనే నాన్న వాళ్ళకి చెప్పాలని చందు కోపంగా ఇంటికి వెళ్తాడు. నాన్న అని చందు పిలుస్తాడు. నాకు తెలుసురా నువ్వు ఏం చెప్పాలని వస్తున్నావో వల్లి ప్రెగ్నెంట్ కదా.. ఈ విషయం నిజంగా సంతోషకరమైన విషయమేనని రామరాజు అంటాడు. అది కాదు నాన్న.. నీకు వాళ్ళ గురించి తెలియదని చందు చెప్పాలని ట్రై చేస్తుంటే ధీరజ్ వాళ్ళు వద్దని సైగ చేస్తారు. అయినా చెప్పాలని ట్రై చేస్తాడు.. అప్పుడే వల్లిని తీసుకొని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. వాడేం చెప్పాలని అనుకుంటున్నాడో నాకు తెలుసు వల్లిని అమ్మ తీసుకొని రావాలని చెప్పబోతున్నాడని వేదవతి అనగానే అవునా అని రామరాజు అంటాడు. కాదండి.. వల్లి వాళ్ళు మోసం చేశారని చెప్పాలని అనుకుంటున్నాడని వేదవతి అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మరి ఏంటండి అన్ని వాడు ఏం చెప్పాలని అనుకుంటాడని వేదవతి నవ్వుతుంది. ప్రేమ, నర్మద ఇద్దరు వల్లికి హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ప్రేమ, నర్మద దగ్గరికి భాగ్యం వచ్చి.. నా కూతురిని ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వమని ఎవ్వరో అన్నారు కదా.. ఇప్పుడు ఏమైందని అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఓ అత్త ఎక్స్ ట్రాలు మాట్లాడితే కత్తిరించేస్తానని అంటాడు. అలా ధీరజ్ అనగానే వాళ్ళు ముగ్గురున్నారు పదవే అని భాగ్యాన్ని ఆనందరావు తీసుకొని వెళ్తాడు. అసలు అత్త సడెన్ గా ఎంట్రీ ఎందుకు ఇచ్చిందని ధీరజ్ ని ప్రేమ, నర్మద అడుగుతారు. అమ్మ వస్తున్నట్లు ముందే తెలుసు కానీ వదినని తీసుకొని రావడం మొత్తం వదిన ప్లాన్ అని ధీరజ్ అంటాడు. వేదవతికి జరిగింది చెప్పి వల్లిని తీసుకొని రమ్మని చెప్పినట్టు నర్మద చెప్తుంది. అక్క నువ్వు గ్రేట్ అందరి గురించి ఆలోచిస్తావని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026.webp)
Brahmamudi : ఇందు ప్లాన్తో అదిరిపోయిన రాజు తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1015 లో.... ఇందు చాలా హ్యాపీగా ఉంటుంది. రాజు తన చిన్నచిన్న సరదాలన్నీ తీరుస్తాడు. దాంతో ఇందు సంతోషానికి అవధులు లేకుండా పోతాయ్. రాజు పక్కన కూర్చొని నువ్వు ఏం చేస్తావ్ మీ ఫ్యామిలీ ఏంటని అడుగుతుంది. రాజు తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఏం చదువుకున్నావ్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈ రౌడీ పనులు ఏంటి అని ఇందు అంటుంది. మనకి ఎవడు జాబ్ ఇస్తాడని రాజు అంటాడు. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది.. ప్లీజ్ ఒక పాట పాడండి అని ఇందు అంటుంది.. రాజుకి ఇష్టం లేకున్నా ఇందు నిద్రపోయేవరకు పాట పాడుతాడు. రాజు ఒళ్ళో ఇందు నిద్రపోతుంది. మరొకవైపు చక్రి ఇంటికి రేఖ, భూషణ్ వెళ్తారు. మిగతా యాభై లక్షలు ఇవ్వమని రేఖ అడుగుతుంది. డబ్బులు లేవని చక్రి మొహం మీదే చెప్తాడు. ఇంతవరకు అన్ని డబ్బులు ఇచ్చాను.. ఒక్క పైసా అన్న తిరిగి ఇచ్చారా.. నేను ఇవ్వనని చక్రి అనగానే రేఖ, భూషణ్ డిస్సపాయింట్ తో ఇంటికి వెళ్తారు. మరొకవైపు రాజుకి వెంకీ ఫోన్ చేస్తాడు. అప్పుడే రాజు, ఇందు నిద్ర లేస్తారు. ఒరేయ్ ఈ రోజు అమ్మానాన్నల పెళ్లి రోజు అని వెంకి చెప్పాగానే సరే నేను చికెన్ కి డబ్బులు పంపిస్తానని రాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందని ఇందు అడుగుతుంది. ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు అని రాజు చెప్తాడు. పెళ్లి రోజు ఎవరైనా అలా సెలబ్రేట్ చేసుకుంటారా అని ఇందు అంటుంది. అంత డబ్బులు మా దగ్గర లేవని రాజు అంటాడు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను పెళ్లి రోజు జరిపిస్తానని ఇందు అంటుంది. వద్దని రాజు అనగానే మరి ఓనర్ కి చెప్తానని ఇందు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాజు సరే అంటాడు. ఎవరని.. ఏం చెప్పాలని రాజు అనగానే ఈవెంట్ ప్లానర్ అని చెప్పు అని ఇందు చెప్తుంది. తరువాయి భాగంలో రాజు పేరెంట్స్ ఇరవై అయిదో పెళ్లి రోజుని ఉన్నంతలో ఇందు సెలబ్రేట్ చేసి అందరికి భోజనాలు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



