
Jayam serial: దీప్తి వెంటపడిన రౌడీలు.. బాక్సింగ్ పోటీలో పాల్గొనేదెవరు!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -201 లో... రుద్ర అకాడమీ తరపున దీప్తి బాక్సింగ్ పోటీలో పాల్గొంటుంది. తనని ఆపాలని పారు ఇంకా వాళ్ళ అన్నయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తారు. తనతో ఎక్కువ వర్క్ఔట్స్ చేపిస్తారు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు. పారు మనిషి దీప్తి దగ్గరికి భోజనం తీసుకొని వస్తాడు. అందులో ఏదో కలిపి తీసుకొని వస్తాడు. దాంతో దీప్తికి డౌట్ వచ్చి ఫుడ్ తినదు. రుద్ర తన మనిషి ద్వారా భోజనం తెప్పించి దీప్తికి ఇస్తాడు. మరొకవైపు బాక్సింగ్ పోటీలో దీప్తి పార్టిసిపేట్ చేస్తుందని రుద్ర త్వరగా రెడీ అవుతాడు. గంగ తనకి కాఫీ తీసుకొని వస్తుంది. నువ్వు కూడా రా అక్కడ దీప్తికి తోడుగా ఉండొచ్చని రుద్ర అంటాడు. పెద్దమ్మకి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని అబద్ధం చెప్తానని రుద్ర అంటాడు. ఇద్దరు రెడీ అయి హాల్లోకి వస్తారు. ఎక్కడికి అని శకుంతల అడుగుతుంది. గంగ పుట్టినరోజుకి అంటుంది. రుద్ర పెళ్లికి అని అంటాడు. మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి రోజు.. వాళ్ళ పాప బర్త్ డే అని రుద్ర కవర్ చేస్తాడు. దాంతో శకుంతల సరే త్వరగా రమ్మని చెప్తుంది. ఇషిక, వీరుకి డౌట్ వస్తుంది. దాంతో శకుంతల దగ్గరికి వెళ్లి వాళ్ళు అకాడమీకి వెళ్తున్నారు. మీతో అబద్ధం చెప్పారు. కావాలంటే నాతో రండి అని శకుంతలతో వీరు, ఇషిక అంటారు. శకుంతల వాళ్ళతో వెళ్తుంది. రుద్ర కార్ ని ఫాలో అవుతూ వెళ్తారు. అలా వాళ్ళు వెనకాల రావడం గంగ చూసి రుద్రకి చెప్తుంది. దాంతో రుద్ర ఒక పెళ్లి దగ్గర డైవర్ట్ అవుతాడు. అది చూసిన శకుంతల.. చూసారా వాళ్ళు పెళ్లికి వెళ్లారు. అనవసరంగా నన్ను తీసుకొని వచ్చారని వీరూతో అంటుంది. మరొకవైపు దీప్తి వెంట రౌడీలు పడుతారు. రుద్ర, గంగ ఇద్దరు వీరు వాళ్ళ కార్ ని డైవర్ట్ చేసి అకాడమీకి వెళ్తుంటే దీప్తి ఎదురుగా వచ్చి పడిపోతుంది. దాంతో రౌడీలు వెళ్ళిపోతారు. దీప్తిని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలని గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 24, 2026
Podarillu: మహా సర్టిఫికేట్స్ కాల్చేసిన ప్రతాప్.. మోస్ట్ ఎమోషనల్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -56 లో... మహాని సర్టిఫికెట్స్ ఇస్తానని పిలిచి శాశ్వతంగా ఇంట్లోనే ఉంచాలని ప్రతాప్, ఆది, లలిత ప్లాన్ చేస్తారు. మహా సర్టిఫికెట్స్ కోసం ఆశగా వాళ్ళ ఇంటికి వస్తుంది. కన్నా ఇంటి ముందు ఉంటాడు. మహా ఒక్కతే లోపలికి వెళ్తుంది. సర్టిఫికెట్స్ తో ఏం చేస్తావ్ ఇక్కడే ఉండిపో.. ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావని లలిత అంటుంది. నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తే వెళ్ళిపోతానని మహా అంటుంది. కుదరదని ప్రతాప్ అంటాడు. అదేంటీ ఇస్తాను అంటేనే కదా వచ్చిందని మహా అంటుంది. నిన్ను ఇక్కడే ఉంచడానికి పిలిచామని ఆది అంటాడు. దాంతో హారిక షాక్ అవుతుంది. ఇదంతా నాకు తెలియదు మహా అని హారిక అంటుంది. నువ్వు ఇక్కడే ఉండిపోమని భూషణ్ కెనడాకి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నాడని ఆది అనగానే మహా కోప్పడుతుంది. నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి అని మహా అనగానే.. అది అవసరం లేదు.. దానికి సంబంధించినవి ఏం ఉన్నా తీసుకొని రారా అని ఆదితో ప్రతాప్ అంటాడు. దాంతో ఆది తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఈ సర్టిఫికెట్స్ కావాలా.. ఈ ఇంట్లో ఉండడం కావాలా అని ప్రతాప్ అనగానే నాకు సర్టిఫికెట్స్ కావాలి.. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయని మహా అనగానే ఈ సర్టిఫికెట్స్ మేం చదివించినవి అని ప్రతాప్ సర్టిఫికెట్స్ ని కాలుస్తుంటే మహాని ఆది ఆపుతాడు. హారికని లలిత ఆపుతుంది. కాలిపోయిన సర్టిఫికెట్స్ చూసి మహా ఏడుస్తుంది. ఇంకా బయటకు వెళ్లి ఏం చేస్తావని ప్రతాప్ అంటాడు. నువ్వు కాల్చేసింది కేవలం సర్టిఫికెట్స్ మాత్రమే నా జ్ఞానాన్ని కాదని మహా అంటుంది. లలిత నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని నమ్మి వచ్చానని మహా ఏడుస్తుంది. నాతో మీకు ఇక ఎలాంటి సంబంధం లేదు.. నేను గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీరే నా గురించి గొప్పగా చెప్పుకుంటారని మహా అక్కడ నుండి బయటకు వస్తుంటే.. ఆది అడ్డుపడతాడు. దాంతో ఆదిపై మహా కోప్పడుతుంది. కన్నాపై ఆది కోప్పడుతుంటే వాడిని ఏం అనొద్దని మహా అడ్డుపడుతుంది. ఆ తర్వాత మహా, కన్నా కొంచెం దూరం వస్తారు. మహా ఏడుస్తుంటే ఏమైంది వదిన అని కన్నా అడుగుతాడు. దాంతో మహా జరిగింది చెప్తుంది. తన బాధ పోగొట్టడానికి నాకు ఆకలిగా ఉందని కన్నా అంటాడు. ఇక దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి కన్నాని మహా తీసుకొని వెళ్తుంది. నాకు ఆకలిగా లేదు వదిన కానీ మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియక ఇలా చెప్పాను. మీరు ఏడిస్తే నాకూ ఏడుపొచ్చింది. మీరు వదినమ్మ కదా అంటే అమ్మ అని అమ్మ ఏడిస్తే ఏడుపు రాదా అని కన్నా అంటాడు. అప్పుడే చక్రి ఫోన్ చేసి మాట్లాడతాడు. వస్తున్నామని మహా, కన్నా అనగానే చక్రి కూల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 24, 2026
Karthika Deepam 2: కన్నకూతురికి దిష్టి తీయించి లోపలికి తీసుకొచ్చిన దశరథ్.. షాక్ లో పారిజాతం, జ్యోత్స్న!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-601 లో.. దీపే తన కన్నకూతురు అనే నిజం దశరథ్ కి తెలుస్తుంది. దాంతో దీప, కార్తీక్ ఇద్దరిని తీసుకొని ఇంటికి వస్తాడు దశరథ్. అదే సమయంలో జ్యోత్స్న, పారిజాతం బయటకు వస్తుంటారు. దశరథ్ ని చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఎక్కడికి అమ్మా వెళ్తున్నావని దశరథ్ అడుగగా ఫ్రెండ్ దగ్గరికి అని జ్యోత్స్న అంటుంది. ఏం వద్దులే నీతో చాలా పని ఉంది అమ్మ అని దశరథ్ అంటాడు. నాన్న ఏంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. నా కూతురు, అల్లుడు వచ్చారు. వారికి దిష్టి తీయడానికి కర్పూరం హారతి తీసుకొని రా పిన్ని అని పారిజాతంతో దశరథ్ అనగానే.. తను షాక్ అవుతుంది. ఇక సుమిత్ర, శివన్నారాయణలని పిలుస్తాడు దశరథ్. పారిజాతం దిష్టి తీయటానికి రెడీ అవుతుంటే సుమిత్ర నువ్వు తియ్ అని దశరథ్ అనగానే తను షాకింగ్ గా చూస్తుంది. మళ్లీ దిష్టి తీయమని దశరథ్ అనగానే ఇక తేరుకొని సుమిత్ర దిష్టి తీస్తుంది. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. స్వీట్స్ తీసుకొచ్చి పారిజాతానికి ఇస్తాడు దశరథ్. నా కూతురికి తినిపించు పిన్ని అని పారిజాతంతో దశరథ్ అనగానే.. ఎవరికి తినిపించాలో తనకి అర్థం కాదు. నాకు కన్ఫూజన్ గా ఉంది నువ్వే తినిపించు అని స్వీట్స్ దశరథ్ కి ఇస్తుంది పారిజాతం. ఇక అవి తీసుకొని మొదటగా దీపకి తినిపిస్తున్నట్టుగా చేసి తర్వాత జ్యోత్స్నకి తినిపిస్తాడు దశరథ్. ఏం అయిందండి మీకు ఎందుకు ఇలా చేస్తున్నారని సుమిత్ర అడుగుతుంది. నేను గుడికి వెళ్ళాను.. అక్కడ దేవుడు నాకు ఒక సర్ ప్రైజ్ విషయం చెప్పాడని దశరథ్ అంటాడు. ఏంటని అడుగగా నా కూతురు జ్యోత్స్న ఉండగా నీకు టెన్షన్ ఎందుకని అని దశరథ్ అంటాడు. అవునని అందరు హ్యాపీగా ఉంటారు. అంతా ఒకే గానీ మరి దీపకి ఎందుకు దిష్టి తీయించావని దశరథ్ ని శివన్నారాయణ అడుగుతాడు. తనకి నేను కన్యాదానం చేసాను కదా దీప కూడా నా కూతురే కదా.. తన భాద్యతలు నేను తీసుకోవాలి కదా అని దశరథ్ అనగానే అవునని శివన్నారాయణ అంటాడు. ఇంతకి నాన్నకి నిజం తెలిసిందా లేదా అఅని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరి దాస్ ఎక్కడ అని పారిజాతం అనగానే ఇంటికే వస్తున్నాడని దశరథ్ అంటాడు. ఇక కార్తీక్, దీప కిచెన్ లోకి వెళ్తారు. కార్తీక్ ని దీప హగ్ చేసుకొని ముద్దు పెడుతుంది. థాంక్స్ బావ.. నాన్నకి నేను కూతురిని అని తెలిసాక ఎంత హ్యాపీగా ఉన్నాడో.. నాకు చాలా సంతోషంగా ఉందని దీప అంటుంది. నేనే కన్నకూతురు అని నాన్న ఎక్కడ చెప్తాడోనని టెన్షన్ పడ్డానని దీప అంటుంది. మరి పుట్టబోయే బిడ్డ గురించి తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడోనని దీప అనగానే అత్త కోసం మామయ్య ఏం అనలేడని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 24, 2026
Illu Illalu Pillalu: వనజకి డబ్బులు ఇచ్చేసిన సాగర్, నర్మద.. వాళ్ళిద్దరూ షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-402 లో.... నర్మద, సాగర్ కలిసి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొవాలని మార్వాడి షాప్ కి వెళ్తారు. వెళ్లి గోల్డ్ మొత్తం అతని ముందు పెట్టి డబ్బు ఎంత వస్తుందో అడుగుతారు. అన్నింటికి కలిపి తొమ్మిది లక్షలు మాత్రమే వస్తుందని అతను అనగానే మాకు ఇరవై లక్షలు కావాలని అడుగుతారు. మిగతా పదకొండు లక్షలకి ఇంట్రెస్ట్ ఇస్తామని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో మీరు రామరాజు గారి అబ్బాయి కదా.. మీరు శ్రీనివాసరావు అమ్మాయి కదా.. మీ మీద నమ్మకంతో డబ్బు ఇస్తానని డాక్యుమెంట్స్ పై మార్వాడి సంతకం తీసుకొని మొత్తం ఇరవై లక్షల డబ్బు ఇస్తాడు. అదంతా ఆనందరావు చూసి ఈ విషయం ఎలాగైనా భాగ్యానికి చెప్పాలని అనుకుంటాడు. మరొక వైపు ప్రేమ, ధీరజ్ ఇంటికి వస్తారు. ధీరజ్ కోపంగా లోపలికి వెళ్తాడు. తన వెనకాలే ప్రేమ వెళ్తుంది. ఏంట్రా నీకు ఉద్యోగం ఇచ్చిన అతన్ని కొట్టడానికి వెళ్తున్నావ్.. మనం ఒకరికి ఎప్పుడు సంజాయిషీ కాకుండా సమాధానం చెప్పేలా ఉండాలి. నువ్వు ఇక్కడే ఆగిపోతావా.. నువ్వు ఏది సాధించాలి అనుకున్నావో అది సాధించమని ధీరజ్ ని ప్రేమ మోటివేట్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేది శ్రీవల్లి చాటుగా వింటుంది. అప్పుడే ప్రేమ వచ్చి.. నీ బుద్ధి ఇక మారదా అని కోప్పడుతుంది. ఆ తర్వాత నర్మద, సాగర్ ఇద్దరు వనజ ఇంటికి వెళ్లి డబ్బు ఇస్తారు. లోపలికి రండి అని వనజ అనగానే.. మేం రాము.. మీరు మా మావయ్యని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అప్పుడే మీపై ఉన్న గౌరవం పోయింది. నువ్వు కాలేజీలో ఎవరిని ప్రేమించలేదా అని వనజ వాళ్ళ అబ్బాయిని నర్మద అడుగుతుంది. అతను సైలెంట్ గా ఉండడంతో.. చూసారా మీ అబ్బాయి కూడా ప్రేమించాడు.. పిల్లలు చేసిన తప్పుకి పెద్దవాళ్ళని మాటలు అనడం కరెక్ట్ కాదు.. మా మావయ్య ఎప్పుడు తప్పు చెయ్యడని వనజకి నర్మద కౌంటర్ ఇస్తుంది. పదా సాగర్ మా ఇంటికి వెళ్ళు అక్కడ తేల్చుకోవల్సినవి చాలా ఉన్నాయని సాగర్ తో నర్మద అంటుంది. ఆ తర్వాత భాగ్యం దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. ఆ ధీరజ్ ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్తుంటే అప్పుడే భాగ్యంకి ఫోన్ వస్తుంది. నేను ఫోటో పంపినా కదా అందులో ఉన్న అతను ఎవరో కనుక్కోమన్నాను కదా అని భాగ్యం అనగానే.. కనుక్కున్నాను, అతను జాబ్ లు ఇప్పించే బ్రోకర్ అని ఆవిడ చెప్తుంది. బ్రోకర్ తో సాగర్ కి పనేంటి అని భాగ్యం అంటుంది. అప్పుడే ఆనందరావు వచ్చి నర్మద నగలు తాకట్టు పెట్టి ఇరవై లక్షలు తీసుకొని వనజకి ఇచ్చారని చెప్పగానే భాగ్యం, శ్రీవల్లి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 24, 2026
Brahmamudi: కావ్య వెళ్తున్న వెహికల్ లో బాంబ్ పెట్టిన రుద్రాణి.. రాజ్ ఏం చేయనున్నాడు?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -963 లో... రాహుల్, రేఖ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి బ్యాగ్ తో కిందకి వస్తారు. ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. ఇంట్లో నుండి వెళ్ళిపోతాం రాజ్.. మా మమ్మీ చేసిన పనికి మేం మీ ముందు ఉండలేమని రాహుల్ అంటాడు. స్వప్న నువ్వు నాతో పాటురా అని రాహుల్ అనగానే.. ఎక్కడికిరా వెళ్ళేది తప్పు చేసింది తను మీరు కాదని రాజ్ అంటాడు. తప్పుకి శిక్ష అనుభవిస్తుందని ఇందిరాదేవి అంటుంది. ముగ్గురు అక్కా చెల్లెల్లు ఒక దగ్గర ఉండాలని అనుకున్నాం.. ఇప్పుడు మమ్మల్ని విడదియ్యకు రాహుల్ అని కావ్య అంటుంది. ఎక్కడికి వెళ్ళేది లేదని రాజ్ వాళ్ళని లోపలికి వెళ్ళమంటాడు. ఆ తర్వాత ట్రస్ట్ బాధ్యతలు పూర్తయ్యాక ఇద్దరి పిల్లలకి బారసాల, ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. మరొకవైపు మన ప్లాన్ లు అన్ని వాళ్ళకి సక్సెస్ అవుతున్నాయని రుద్రాణితో రేఖ అంటుంది. ఇప్పుడు వాళ్ళు ట్రస్ట్ మొదలు పెడుతున్నారు. బారసాల చేస్తున్నారు. అందరు కలిసి శ్రీశైలం ట్రిప్ కి కూడా ప్లాన్ చేసారని రేఖ చెప్తుంది. మంచి న్యూస్ చెప్పావ్ వాళ్ళు అందరు వెళ్లే వెహికల్ లో బాంబ్ పెట్టిస్తాను. ఎవరికి డౌట్ రాకుండా స్వప్నని, రేఖని తీసుకొని నువ్వు వేరే వెహికల్ లో వెళ్ళమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. దాంతో రాహుల్ సరే అంటాడు. ఆ తర్వాత రాత్రి కావ్య తన బిడ్డని పట్టుకొని ముద్దాడుతుంటే.. నా కూతురు పుట్టాక నన్ను పట్టించుకోవడం లేదు.. నాకు ఒక్క ముద్దు కూడా ఇవ్వడం లేదని కావ్యతో రాజ్ అంటాడు. దాంతో రాజ్ కి కావ్య ముద్దు ఇస్తుంది. మరుసటి రోజు దుగ్గిరాల ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తవుతాయి. అప్పుడే మినిస్టర్ తనతో పాటు ఒకరిని తీసుకొని వస్తారు. ట్రస్ట్ బాధ్యతలు వీళ్ళు చూసుకుంటారని రాజ్ ఇంట్లో వాళ్లకు చెప్తాడు. మన ఫ్యామిలీ తరపున అయితే కావ్య చూసుకుంటుందని రాజ్ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో రుద్రాణి అనుకున్నట్లుగానే అందరు వెళ్లే వెహికల్ లో బాంబ్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 24, 2026
Jayam serial: వీరు నిజస్వరూపాన్ని తెలుసుకున్న రుద్ర.. సూపర్ ట్విస్ట్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -200 లో.... లక్ష్మి, పైడిరాజు ఇద్దరు నా కూతురిది తప్పు అని వీరు కాళ్లపై పడబోతుంటే అప్పుడే గంగ వచ్చి ఆపుతుంది. ఏ కూతురు అయిన తల్లిదండ్రులని తలెత్తుకునేలా చెయ్యాలి కానీ ఇలా తలదించుకునేలా కాదు.. తప్పు చేసింది నేను.. శిక్ష కూడా నాకే అందుకే నేనే క్షమాపణ అడగాలని వీరు కాళ్లపై పడి క్షమాపణ అడుగుతుంది గంగ. అయ్యో గంగ నువ్వు నాకు సారీ చెప్పాలని ఏం అనుకోలేదు.. నాకు ఈ కుటుంబం మాత్రమే కోసమే ఏది చేసినా కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్.. ఇకనుండి జరిగిందంతా మర్చిపోండి హ్యాపీగా ఉందామని వీరు అంటాడు. ఆ తర్వాత గంగ బయటకు వెళ్తుంటే.. వీరు ఎదురుపడతాడు. ఏదో ఛాలెంజ్ చేసావ్ కదా.. నా జోలికి వస్తే ఏం అవుతుందో తెలిసిందా భానుని నేనే చంపానని నిరూపిస్తాను అన్నావ్.. అది నీ వల్ల కాదు నాకు ఈ కుటుంబ నాశనం కావాలి.. ఇది గుర్తుపెట్టుకోమని వీరు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అదంతా రుద్ర వింటాడు. ఇక తన గదిలో బెడ్ పై కూర్చొని గంగ ఏడుస్తుంటే రుద్ర వెళ్లి సారీ గంగ అని చెప్తాడు. మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి కూడా నమ్మలేదని గంగ అంటుంది. జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నాకు తెలుసు.. నువ్వు వీరుని ప్రతీసారీ ఎందుకు అంటున్నావని డౌట్ వచ్చి కాల్స్ చేక్ చేశాను. ఇందాక నీకు వార్నింగ్ ఇవ్వడం చూసానని రుద్ర చెప్తాడు. నాకు వీరు గురించి తెలుసు కానీ తెలియనట్లు ప్రవర్తించి వాడి దారిలోనే వెళ్లి వాడి నోటితోనే నిజం చెప్పిస్తాను.. దానికి నీ సపోర్ట్ కావాలని గంగని రుద్ర అడుగుతాడు. అయ్యో తప్పకుండా సర్ అని గంగ చెప్తుంది. మరొకవైపు బాక్సింగ్ పోటీ నుండి దీప్తిని తప్పించాలని పారు వాళ్ళ అన్న తనకి డబ్బు ఇస్తాడు కానీ దీప్తి తీసుకోదు. అదే విషయం అక్కడున్న రుద్ర మనిషి రుద్రకి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో గంగ దగ్గరికి రుద్ర వచ్చి.. అక్కడ దీప్తిని ఇబ్బంది పెడుతారనుకుంటా.. అకాడమీలోకి వెళ్ళడానికి నీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది.. నువ్వు నాతో రా గంగ అని రుద్ర అనగానే లేదు సర్ అమ్మగారు వద్దని చెప్పారని గంగ అంటుంది. దాంతో రుద్ర ఒక్కడే వెళ్లి అకాడమీలో ఏం జరుగుతుందో అతని మనిషి ద్వారా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 22, 2026
Illu Illalu Pillalu: నగలు తాకట్టు పెట్టిన నర్మద, సాగర్.. ఆనందరావు చూస్తాడా!
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -401 లో.. అమూల్యతో ప్రేమ మాట్లాడుతుంది. ఏదైనా తెలియాల్సిన టైమ్ లో తెలుస్తుంది కానీ నువ్వు ఏ విషయం ఆ వల్లికి చెప్పకని అమూల్యతో ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ ఫ్రెండ్స్ కార్ తీసుకొని వెళ్లి ఆక్సిడెంట్ చేసారని ధీరజ్ కి ఫోన్ చేసి చెప్తారు. దాంతో ధీరజ్ టెన్షన్ పడుతాడు. ప్రేమ తన దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. ధీరజ్ విషయం చెప్తాడు. నీతో పాటు నేను వస్తానని ప్రేమ అనగానే వద్దని ధీరజ్ అంటాడు. నేను వస్తాను.. లేదంటే ఇంట్లో చెప్తానని ప్రేమ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో ప్రేమని తన వెంట తీసుకొని వెళ్తాడు ధీరజ్. మరొకవైపు లెక్కల్లో రెండు వేలు తేడా వచ్చిందని రామరాజుతో చందు చెప్తాడు. రామరాజు లెక్కలు మళ్ళీ చూస్తాడు. అదంతా మన చేతివాటం అని వాళ్ళకి తెలియదని భాగ్యంతో ఆనందరావు అంటాడు. శ్రీవల్లి అల్లుడు గారు ఏంటి లెక్కలు గుచ్చి గుచ్చి చేస్తున్నాడని భాగ్యం అంటుంది. నేను వెళ్లి డైవర్ట్ చేస్తానని శ్రీవల్లి వెళ్లి మావయ్య గారు ఈ రోజు వనజ గారికి డబ్బు ఇవ్వాలని గుర్తుచేస్తుంది. అవును మంచిగా గుర్తు చేసావని రామరాజు అంటాడు. ఇక అప్పుడే సాగర్ ని శ్రీవల్లి పిలుస్తుంది. డబ్బు వనజకి ఇవ్వమని చెప్పు బుజమ్మ అని రామరాజు అంటాడు. సరే అని సాగర్ అంటాడు. సాగర్ మర్చిపోతాడు పాస్ బుక్ ఇస్తే మీరే తీసుకోవచ్చు కదా అని శ్రీవల్లి అనగానే అవునని రామరాజు అంటాడు. మావయ్య గారు మీ అబ్బాయి మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్లి తెచ్చుకోండి అని నర్మద అనగానే మా కొడుకు మీద మాకు నమ్మకం లేకపోవడమేంటి.. మీరే వెళ్లి డబ్బు విత్ డ్రా చేసి తీసుకొని రండి అని వేదవతి అంటుంది. ఆ తర్వాత నర్మద నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని రావాలని నిర్ణయం తీసుకొని అన్ని బ్యాగ్ లో పెడుతుంది. నర్మద సాగర్ వెళ్లడం ఆనందరావు చూసి భాగ్యం, శ్రీవల్లికి విషయం చెప్తాడు. వెంటనే వాళ్ళని ఫాలో అవ్వమని భాగ్యం చెప్తుంది. మరొకవైపు ధీరజ్ కార్ ఓనర్ ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కార్ ఇచ్చినందుకు తిడతాడు. మీ ఫ్యామిలీలో మీ చెల్లి కూడా లేచిపోయింది అంట కదా అని అనగానే ధీరజ్ తనపై సీరియస్ అవుతాడు. దాంతో ప్రేమ ఆపుతుంది. మరొకవైపు నర్మద, సాగర్ నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తారు. వాళ్ళని ఆనందరావు చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 22, 2026
Brahmamudi: దుగ్గిరాల కుటుంబాన్ని లేపెయ్యాలని చూస్తున్న రుద్రాణి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-962 లో... కావ్య తన చేతులతో తులసి పాపని ఉయ్యాలలో వేస్తుంది. చాలా థాంక్స్ కావ్య నీ చేతులు మీదుగా వేసినందుకని తులసి చెప్తుంది. మీ బిడ్డ అయినా నా దగ్గర కొన్ని రోజులు పెరిగిందని కావ్య అంటుంది. నా బిడ్డని మీరు అపురూపంగా చూసుకున్నారని కావ్య అంటుంది. ఆ తర్వాత అందరం భోజనం చేద్దాం పదండి అని మినిస్టర్ అంటాడు. అప్పుడే రుద్రాణి వస్తుంది. నువ్వు ఏంటే ఇక్కడ అని ఇందిరాదేవి తిడుతుంది. నేను మినిస్టర్ కి తెలుసు నన్ను పిలిచాడు.. మీరు వస్తున్నారని తెలిసి మిమ్మల్ని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చానని రుద్రాణి అనగానే నీ క్షమాపణ మాకేం అవసరం లేదని ఇందిరాదేవి అంటుంది. బయటకు వెళ్ళాక మీ విలువ తెలిసింది.. నాకు బ్రతకాలని లేదు మీరు నన్ను క్షమించనంటే హాయిగా చచ్చిపోతానని రుద్రాణి అంటుంది. అప్పుడే ఆపు నీ నాటకాలు అంటూ అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరికి చిన్న చిన్న గాయలవుతాయి. ఏమైందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఈ రుద్రాణి మమ్మల్ని చంపెయ్యాలని చూసిందని జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. అసలు మినిస్టర్ గారికి పిల్లలని మార్చేయాలని సలహా ఇచ్చింది రుద్రాణి అని అప్పు చెప్తుంది. మినిస్టర్ గారు మారిపోయి తన బిడ్డని తను కాపాడుకున్నాడని అప్పు చెప్పగానే ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రుద్రాణిని ఇంట్లో అందరు తలొక మాట అంటారు. కావ్య మాత్రం ఏకంగా చెప్పుతో కొడుతుంది. నువ్వు ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తామని అందరు వార్నింగ్ ఇస్తారు. నువ్వు వెళ్ళిపో నీ కడుపులో పుట్టినందుకు సిగ్గుగా ఫీల్ అవుతున్నామని రుద్రాణిని బయటకు నెట్టేస్తాడు రాహుల్. ఆ తర్వాత రుద్రాణి వెళ్ళిపోయి జరిగింది తలుచుకోని అవమానం గా ఫీల్ అవుతుంది. కత్తితో పొడుచుకోబోతుంటే రాహుల్, రేఖ వస్తారు. ఏంటి మమ్మీ మా జీవితాలు చక్కదిద్దుతా అన్నావ్ ఇలా చేస్తున్నావని రుద్రాణి మనసు మారుస్తారు. దుగ్గిరాల కుటుంబం మొత్తం లేకుండా చెయ్యాలని ముగ్గురు ప్లాన్ చేస్తారు. మరొకవైపు రుద్రాణి చేసిన దాని గురించి ఇంట్లో డిస్కషన్ చేస్తారు. రాహుల్, రేఖ వాళ్ళ ప్లాన్ లో భాగంగా బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 22, 2026
Karthika Deepam 2: దీప, కార్తీక్ ల పేరు మీద అర్చన చేయించిన దశరథ్.. జ్యోత్స్న టెన్షన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-600 లో.... దీప, బావ ఇంకా ఎందుకు రాలేదు.. నాన్న ఎక్కడికి వెళ్ళాడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. గ్రానీ నాకొక హెల్ప్ చేయాలి.. దీప, బావ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని జ్యోత్స్న అంటుంది. సరే అని కాంచనకి పారిజాతం ఫోన్ చేసి దీప వాళ్ళు ఇంకా పనికి ఎందుకు రాలేదని అడుగుతుంది. గుడికి వెళ్లారని కాంచన చెప్తుంది. ఇంట్లో మీ నాన్న కుడా లేడని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోట ఉన్నారా అని జ్యోత్స్న భయపడుతుంది. మరొకవైపు అసలు నిజం తెలుసుకొని జ్యోత్స్న సంగతి చెప్తానంటూ వెళ్తున్న దశరథ్ ని కార్తీక్ ఆపుతాడు. ఇప్పుడు సమయం కాదని అంటాడు. అవును నాన్న.. ముందు అమ్మ ప్రాణాలు కాపాడాలని దీప అంటుంది. మీరు ఒక దీప గురించి ఆలోచిస్తున్నారు కానీ అత్త గురించి ఎందుకు ఆలోచించడం లేదని కార్తీక్ అంటాడు. నిజం నేను చెప్పేవరకు మీరు చెప్పొద్దూ.. నా మీద ఒట్టే అని దశరథ్ చేయి తన తలపై పెట్టుకుంటుంది దీప. ఆ తర్వాత దాస్ మాట్లాడుతుంటే నువ్వు నాతో మాట్లాడకు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టావు నువ్వు అని దాస్ పై దశరథ్ కోప్పడుతాడు. మావయ్య మీరు దాస్ మావయ్యని తప్పుగా అర్ధం చేసుకున్నారు.. మీకు నిజం చెప్పాలని ట్రై చేసిన ప్రతీసారి జ్యోత్స్న ఆపింది.. ఒకసారి చంపాలని చూసింది.. మొన్న కిడ్నాప్ చేసింది తప్పించుకొని వచ్చాడని కార్తీక్ అనగానే సారీరా అని దాస్ ని దశరథ్ దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత మనల్ని కలిపిన ఆ దేవుడికి థాంక్స్ చెప్పాలని కార్తీక్ అంటాడు. మరొకవైపు శ్రీధర్, శివన్నారాయణ లెక్కలు చూస్తారు. జ్యోత్స్న వాళ్ళని చూసి ఆగిపోయి.. ఇప్పుడు ఎలాగైనా బయటకు వెళ్ళాలని పారిజాతం సాయం తీసుకుంటుంది. ఇద్దరు వెళ్తుంటే జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళకు మీ నాన్న వచ్చేవరకు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వొద్దు అన్నాడని శివన్నారాయణ అనగానే జ్యోత్స్నకి ఇంకా టెన్షన్ అవుతుంది. మరొకవైపు కార్తీక్, దీపల పేరు మీద దశరథ్ అర్చన చేయిస్తాడు. నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉండాలని దశరథ్ అనగానే కార్తీక్ ని దీప పక్కకి తీసుకొని వెళ్లి నాన్నకి నా కడుపులో బిడ్డ సంగతి చెప్తే ఎంత బాధపడుతాడో అని అంటుంది. ఇప్పుడే నిజం చెప్పేస్తా అని కార్తీక్ అంటాడు. వద్దు.. నాన్న చాలా సంతోషంగా ఉన్నాడని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 22, 2026
రామ్ చరణ్ మనసు చాల గొప్పది
బిబి జోడి ఈ వీక్ సూపర్ స్టార్స్ స్పెషల్ గా ఈ వారం శనివారం ఎపిసోడ్ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో డెమోన్ పవన్ - రీతూ కలిసి రామ్ చరణ్ సాంగ్స్ కి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రాంచరణ్ గురించి శేఖర్ మాష్టర్ ని అడిగాడు. "మీరు ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది" అనేసరికి. "రామ్ చరణ్ గారితో నేను ఫస్ట్ చేసింది డింపుల్ పింపుల్, మెగా మీటర్. మెగా మీటర్ కి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. చాల మంచి మనిషి. ఇప్పటికీ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్లినా ఎప్పుడు పలకరించినా ఒక క్లోజ్ ఫీలింగ్ వస్తుంది. మొన్న కూడా సెలంబుల సాంగ్ చేసినప్పుడు అది మదరాసి మూవీలో సర్ మెసేజ్ పెట్టారు. సాంగ్ చాల బాగుంది మూవ్మెంట్స్ ఫ్రెష్ గా ఉన్నాయి అన్నారు. హీరో అయ్యుండి కూడా సాంగ్ కోసం నాకు మెసేజ్ పెట్టి చెప్పడం కూడా చాలా గ్రేట్. అది అందరికీ రాదు. ఇంకోటేంటంటే ఆచార్య మూవీ జరుగుతున్నప్పుడు సర్ వచ్చి మాష్టర్ మీ రీల్స్ చూస్తూ ఉంటాను. చాల బాగున్నాయి మీ ఫామిలీ పిల్లలతో. పాప, బాబు బాగున్నారా అని ఆయన అడిగారు. ఒక రోజు తీసుకురండి చూడాలనుండి అంటే నేను తీసుకెళ్ళాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది." అంటూ శేఖర్ మాష్టర్ చెప్పారు. "నేను ఆయన్ని చాల సార్లు కలిసాను. నాకు ఆయన్ని కలిసినప్పుడాల్లా ఒక బ్రదర్ అన్న ఫీలింగ్ వస్తుంది. మా సినిమా ప్రమోషన్ కోసం అడిగినప్పుడు ఇంటికి పిలిచి మాతో పాటు కూర్చుని సరదాగా మాతో స్కిట్ చేసి టికెట్ లాంచ్ చేసారు అదొక వన్దర్ ఫుల్ మూమెంట్ నాకు..ఎప్పుడు కాల్ చేసిన ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇలా ఇన్స్టెంట్ గా రియాక్షన్ వస్తుంది.లవ్ యు చరణ్ గారు " అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. "నటుడిగా కంటే ఒక మనిషిగా ఆయన చాల గొప్ప వ్యక్తి. ఆయన ఆడవాళ్లను చాలా బాగా గౌరవిస్తారు. అందరినీ ఈక్వల్ గా చూసుకుంటారు. ఆయనలో ఈ విషయం నాకు బాగా నచ్చుతుంది" అంటూ జడ్జ్ శ్రీదేవి చెప్పుకొచ్చింది.
Feb 21, 2026
Brahmamudi : అప్పు, కళ్యాణ్ లకి యాక్సిడెంట్.. రుద్రాణిని చెప్పుతో కొట్టిన కావ్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -961 లో.. అప్పుకి ఇన్స్పెక్టర్ ధనుంజయ్ కాల్ చేసి రౌడీలు ఎంత అడిగినా నిజం చెప్పడం లేదని చెప్తాడు. దాంతో సరే మేం వస్తున్నామని అప్పు చెప్తుంది. ఇంట్లో హాల్లో అందరు కూర్చొని ఉంటారు. కావ్య పాపకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తారు. ఇందిరాదేవి ఎలా ఉందని రాజ్ అంటాడు. నా పేరా వద్దు అది.. పెద్దయ్యాక ముసలిదాని పేరు పెట్టారని నన్ను తిట్టుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. నీ పేరులో సగం ఇందు ఎలా ఉందని రాజ్ అంటాడు. బాగుందని ఇంట్లో అందరు అంటారు. అప్పు, కళ్యాణ్, పాపని తీసుకొని వెళ్తుంటే.. ఎక్కడికి రా బారసాల ఫంక్షన్ కి రావడం లేదా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వస్తాము కానీ గుడికి వెళ్లి వస్తామని కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణికి రేఖ ఫోన్ చేసి.. మమ్మీ ఆ అప్పు వాళ్ళు రౌడీల దగ్గరికి వెళ్తున్నారు. అప్పు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా నిజం చెప్తారు. నీ పేరు చెప్తారని రేఖ చెప్తుంది. అప్పు, కళ్యాణ్, రౌడీల దగ్గరికి వెళ్తారు. అప్పు వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో రౌడీలలో ఒకడు తన ఫోన్ లో ఉన్న రుద్రాణి ఫోటో చూపించి ఈవిడే డబ్బు ఇచ్చి పాపని చంపమని చెప్పిందని అంటాడు. నాకు ముందు నుండి రుద్రాణి మీద డౌట్ ఉందని కళ్యాణ్ తో అప్పు అంటుంది. అప్పు, కళ్యాణ్ మినిస్టర్ ఇంటికి బయల్దేర్తారు. మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా కావ్య వాళ్ళు రాలేదేంటని తులసి అడుగుతుంది. వాళ్ళు తప్పకుండా వస్తారని మినిస్టర్ చెప్తాడు. అంతలోనే కావ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. వచ్చినందుకు థాంక్స్ అని మినిస్టర్ చెప్తాడు. మాకు రావడం ఇష్టం లేదు కానీ మా అబ్బాయి ఏం అన్నాడో తెలుసా.. మినిస్టర్ గారు తన భార్య మీద ప్రేమతో అది చేశారు కానీ అలా చెయ్యడం అతని ఉద్దేశ్యం కాదని చెప్పాడని అపర్ణ, సుభాష్ చెప్తారు. దాంతో రాజ్ ని మినిస్టర్ గొప్పగా పొగుడుతాడు. కావ్య పాపని నీ చేత్తో ఉయ్యాలలో వెయ్యమని తులసి అనగానే దానికి కావ్య సరే అని వేస్తుంది. మరొక వైపు అప్పు, కళ్యాణ్ ఇద్దరు నిజం తెలుసుకున్నారని రుద్రాణి వాళ్ళని ఆక్సిడెంట్ చేసి చంపాలని రౌడీలకి చెప్తుంది. అప్పు, కళ్యాణ్ వెళ్తుంటే ఆక్సిడెంట్ చేయిస్తుంది రుద్రాణి. తరువాయి భాగంలో రుద్రాణి మినిస్టర్ ఇంటికి వచ్చి ఇందిరాదేవిని మళ్ళీ ఇంటికి వస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ చిన్న గాయలతో మినిస్టర్ ఇంటికి వచ్చి అన్ని నిజాలు చెప్తారు. దాంతో రుద్రాణిని కావ్య తన చెప్పుతో కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 21, 2026
Podharillu : సర్టిఫికెట్ల కోసం వాళ్ళ నాన్న పెట్టిన షరతుకి మహా అంగీకరిస్తుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -55 లో.... మాధవ దగ్గరికి గాయత్రీ వస్తుంది. ఒసేయ్ నువ్వు నాకొక చిన్న హెల్ప్ చెయ్యాలని మాధవ అడుగుతాడు. నువ్వు అడుగకూడదు ఆర్డర్ వేయాలని గాయత్రీ అంటుంది. ఇంట్లో అందరు మగవాల్లే అవ్వడంతో మహాకి ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి తనతో మాట్లాడమని గాయత్రితో మాధవ చెప్తాడు. తోటికోడలు కాస్త తోడుగా ఉండమంటావ్ అంతే కదా సరే బావ అమ్మ లేనప్పుడు వచ్చి ఉంటానని గాయత్రి చెప్తుంది. మరొకవైపు హారిక, మహా వాళ్ళ అమ్మ లలిత మాట్లాడుకుంటారు. సర్టిఫికెట్ల కోసం మహా నీకు ఫోన్ చేసిందని అన్నావ్ కదా తనకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను తన మనసు మార్చి ఇక్కడే ఉంచకోవచ్చని హారికతో లలిత అంటుంది. మహాకి హారిక ఫోన్ చేసి మహా సర్టిఫికెట్లు కోసం ఇంటికి రా ఇంట్లో మావయ్య మీ అన్నయ్య లేడని చెప్తుంది. పక్కనున్న లలిత తనతో పాటు ఎవరిని తీసుకొని రావద్దని చెప్పమని చెప్తుంది. హారిక ఫోన్లో అలాగే చెప్తుంది. మా వదిన ఫోన్ చేసి సర్టిఫికెట్లు కోసం ఇంటికి రమ్మంది వెళ్తానని మహా చెప్తుంది అప్పటికే చక్రికి డౌట్ వస్తుంది. వద్దని చక్రి అంటాడు. నా డ్రీం కోసం సర్టిఫికెట్లు అవసరం అని మహా అంటుంది. నీకు తోడుగా అయినా వస్తానని చక్రి అనగానే వద్దు గొడవ అవుతుందని మహా అంటుంది. లేదంటే కన్నా ని తీసుకొని వెళ్ళమని మాధవ చెప్తాడు. అందుకు మహా సరే అంటుంది. మాధవ ఆటో తీసుకొని వస్తాడు. మహాతో కన్నాని పంపిస్తాడు మాధవ. మరొకవైపు మహాని అక్కడే ఉంచుతారని భయంతో కేశవ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు చక్రి. అంత మంచి అమ్మాయి నీకెలా పడింది రా ఆని కేశవ అనగానే చక్రి కి కోపం వస్తుంది. మరొక వైపు మహా, కన్నా ఇంటికి దగ్గరగా వెళ్లి హారికకి ఫోన్ చేస్తారు. ఇంట్లోకి రమ్మని హారిక చెప్తుంది. గేట్ లోపలికి వెళ్ళగానే హారిక, లలిత ఉంటారు. ఇతను ఎవరు అని లలిత, కన్నాను ఉద్దేశ్శించి అంటుంది. తను మా వదినమ్మ అని కన్నా అంటాడు. అతన్ని గేట్ బయటే ఉండమనని లలిత అనగానే పర్వాలేదు బయట ఉంటానని చెప్పి కన్నా గేట్ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత మహా లోపలికి వెళ్తుంది. వెళ్లేసరికి వాళ్ళ నాన్న, అన్నయ్య ఉంటారు. ఇంట్లో ఎవరు లేరని వాళ్ళ వదిన చెప్పిన మాటలు మహా గుర్తుచేసుకుంటుంది. వాళ్ళ నాన్నని చూసి ఎమోషనల్ అవుతుంది మహా. అయింది ఏదో అయింది ఇక్కడే ఉండమని లలిత అంటుంది. నా డ్రీం నెరవేరాలంటే నేను అక్కడే ఉండాలని మహా అంటుంది. నీకు సర్టిఫికెట్లు కావాలంటే ఇక్కడే ఉండాలని మహా వాళ్ళ నాన్న షరతు పెడతాడు. మరి మహా ఏ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 21, 2026
Jayam serial : వీరుకి గంగ క్షమాపణలు చెప్పనుందా.. రుద్ర ఏం చేయనున్నాడు!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -199 లో... ఇంటి అల్లుడిని గంగ అవమానించిందని రుద్ర కోపంగా గంగని తన పుట్టింట్లో వదిలేసి వెళ్తాడు. మరొకవైపు ఇషిక, వీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవైపు సెంటిమెంట్ మరొకవైపు సింపథీతో గంగని ఇంట్లో నుండి పంపించేలా చేసావ్ బ్రో అని వీరుని ఇషిక మెచ్చుకుంటుంది. నా జోలికి వస్తే అలాగే ఉంటుంది. రుద్రని సైడ్ చేస్తే ఇక ఆస్తి, అధికారం రెండు నా గుప్పిట్లో ఉన్నట్లే .. ఎలాగూ అత్తయ్య నా గుప్పిట్లో ఉంది.. ఇక విజయంద్రప్రతాప్ కుటుంబం నా కాలికింద ఉండేలా చేస్తానని వీరు అంటాడు. మరొకవైపు గంగ ఇంట్లో ఏడుస్తూ జరిగింది మొత్తం లక్ష్మి, పైడిరాజులకి చెప్తుంది. వీరు ఎలాంటి వాడో చెప్తుంది. నీ కుటుంబాన్ని ఆ రాక్షసుడి బారి నుండి నువ్వే కాపాడాలి.. అందుకోసం వాడికి క్షమాపణ చెప్పాలి.. నీతో కాదంటే మేం చెప్తాము పదా అని గంగని వెంటపెట్టుకొని లక్ష్మి, పైడిరాజు వెళ్తారు. మరొకవైపు గంగని తీసుకొని రుద్ర ఎక్కడికి వెళ్ళాడు. మీరు అయినా ఆపాల్సింది మావయ్య అని వీరు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. గంగ ఎక్కడ అని పెద్దసారు అడుగుతాడు. వాళ్ళింట్లో వదిలేసానని రుద్ర చెప్తాడు. వదిలేసావా.. వదిలించుకొని వచ్చావా అని పెద్దసారు అంటాడు. ఎప్పుడు కుటుంబం బాగుండాలని అనుకుంటాను. అలాంటప్పుడు తన వల్ల కుటుంబంలో డిస్టబెన్స్ వస్తే నేను ఎలా ఊరుకుంటానని రుద్ర అంటాడు. కుటుంబం కోసం భార్యని వదిలేసి వస్తావా అని పెద్దసారు అంటాడు. అదంతా యాక్టింగ్.. ఇక్కడ ఉంటే భార్యని తిడుతారని అక్కడికి పంపించాడని శకుంతల అంటుంది. లేదు పెద్దమ్మ గంగ తరుపున నేను వీరుకి సారీ చెప్తానని రుద్ర కాళ్ళు పట్టుకోబోతుంటే అప్పుడే లక్ష్మి, పైడిరాజు వచ్చి.. మీరు కాదు సర్ సారీ చెప్పేది మేం అని లక్ష్మి,పైడి రాజు ఇద్దరు వీరు కాళ్ళ పై పడుతుంటారు. అప్పుడే గంగ వచ్చి వద్దని చెప్తుంది. మీరు కాదు నేను చేయాలి అని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 21, 2026
Karthika Deepam2 : దీప, శౌర్యలని చంపాలని చూసింది జ్యోత్స్న.. నిజం చెప్పేసిన దశరథ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -599 లో.. కాశీ, పారిజాతం మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న వస్తుంది. నువ్వు నాతో మాట్లాడకని జ్యోత్స్నపై కాశీ సీరియస్ అవుతాడు. నేను చెప్పింది పూర్తిగా విని ఉంటే బాగుపడేవాడివి అని జ్యోత్స్న అనగానే.. నువ్వు చెప్పింది పూర్తిగా విని ఉంటే జైల్లో ఉండేవాడిని అని కాశీ కోప్పడతాడు. నా భార్య నాకు దూరం అయిందని కాశీ అంటాడు. అయితే ఏంటి నువ్వు మరొకపెళ్లి చేసుకోమని జ్యోత్స్న అంటుంది. నీలాగా బంధాలని సులువుగా వదులుకోనని కాశీ అంటాడు. మరొకవైపు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు.. నా కూతురు జ్యోత్స్న కాదన్న విషయం ఎందుకు దాచారని కార్తీక్ పై దశరథ్ కోప్పడతాడు. నా కూతురు ఎక్కడ ఉందని దశరత్ అడుగుతాడు. దీపాలు వెలిగిస్తున్న దీపని చూపించి తనే మీ కూతురు అని కార్తీక్ చూపిస్తాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు. దీప దగ్గరికి దశరథ్ వెళ్తాడు. ఏంటి చిన్నయ్య గారు ఇలా వచ్చారని దీప అడుగుతుంది. చిన్నయ్య గారు వస్తున్నట్లు చెప్పలేదు బావ అని దీప అంటుంది. చిన్నయ్య గారు కాదు నాన్న అని పిలవాలని దశరథ్ అనగానే మావయ్యకి నిజం తెలిసిందని కార్తీక్ చెప్పగానే దీప ఎమోషనల్ అవుతుంది. దశరథ్ కాళ్ళపై పడి ఏడుస్తుంది. నాన్న అంటూ దశరథ్ ని హత్తుకొని ఏడుస్తుంది. నా కూతురు నా కళ్ల ముందే ఉంది అయినా చెప్పలేదని దశరథ్ అంటాడు. దీపని శౌర్యని చంపాలని చూసింది జ్యోత్స్ననే.. ఎందుకు జ్యోత్స్న అలా చేసిందో మీకు అర్ధం అయిందా.. ఎక్కడ తను అసలైన వారసురాలు కాదని తెలుస్తుందోనని భయంతో అంతా చేసింది. దీప కడుపులో బిడ్డని కూడా చంపాలని ట్రై చేసింది. అత్త కాపాడిందని కార్తీక్ చెప్తాడు. దశరథ్ జరిగింది గుర్తుచేసుకుంటాడు. మావయ్య ఎప్పటికప్పుడు చెప్దామనుకున్న కానీ ఏదో ఒక అడ్డంకి అని కార్తీక్ చెప్తాడు. ఆ జ్యోత్స్నని వదలనని దశరథ్ కోపంగా బయల్దేరతాడు. మరొకవైపు బావని కలవడానికి దాస్ వెళ్ళాడని కాశీ చెప్తాడు. అసలు ఎందుకు వెళ్ళాడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్. అసలైన వారసురాలివి నువ్వే కదా అని పారిజాతం అంటుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 21, 2026
Illu illalu pillalu : ఇరవై లక్షల కోసం భార్య కాళ్ళు పట్టుకున్న భర్త.. ప్రేమ ప్లాన్ అదేనా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -400 లో.... ఇరవై లక్షలు ఎక్కడ సాగర్ అని నర్మద అడుగుతుంది. సాగర్ సంబంధం లేకుండా సమాధానం చెప్తుంటే నర్మద తన ఫ్రెండ్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. రమ్య నా భర్త బ్యాంకు నుండి ఇరవై లక్షలు డ్రా చేసాడు అంటున్నావ్ తనేమో చెయ్యలేదంటున్నాడని అడుగుతుంది. లేదే చేసాడు కావాలంటే ప్రొద్దున డీటెయిల్స్ పంపిస్తానని తన ఫ్రెండ్ చెప్తుంది. నా ఫ్రెండ్ బ్యాంకు లో జాబ్ చేస్తుంది. నువ్వు డబ్బు తీసుకోవడం తను చూసిందని సాగర్ తో నర్మద చెప్తుంది. ఇప్పుడు చెప్పు సాగర్ లేదంటే నా మీద ఒట్టే అని నర్మద అంటుంది. నాకు ఎగ్జామ్ రాస్తే జాబ్ రాలేదు. మిల్ నుండి అయిదు లక్షలు వనజ గారు ఇచ్చిన ఇరవై లక్షలు లంచం ఇచ్చి జాబ్ కొన్నానని సాగర్ చెప్పగానే తన చెంపచెల్లుమనిపిస్తుంది నర్మద. ఇప్పటికే ఇంట్లో అంత నా వల్లే జాబ్ చేస్తున్నావని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇది కూడా నా వల్లే అంటారు. కనీసం మీ నాన్న గురించి ఆలోచించావా అని నర్మద కోప్పడుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనని నర్మద బట్టలన్నీ సర్దుకుంటుంది. ప్లీజ్ నర్మద అని సాగర్ తన కాళ్ళు పట్టుకొని వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నాకు నువ్వే సాయం చెయ్యాలి లేదంటే చావే అని సాగర్ అంటాడు. దాంతో నర్మద ఆగిపోతుంది. మరొకవైపు ధీరజ్ దగ్గర నుండి తన ఫ్రెండ్స్ హాస్పిటల్ కి అని కార్ అడిగి తీసుకొని వెళ్తారు కానీ వాళ్ళు ఎంజాయ్ చెయ్యడానికి తీసుకొని వెళ్తారు. ధీరజ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యరు. అప్పుడే ధీరజ్ దగ్గరికి ప్రేమ వస్తుంది. అన్ని ప్రశ్న లు అడుగుతుంది. ప్రేమ చిరాకు తెప్పిస్తుంటే ప్రేమకి దగ్గరగా ధీరజ్ వెళ్తాడు. తన నడుం మీద చెయ్ వేసి ధీరజ్ మాట్లాడుతుంటే.. ప్రేమ వెనక్కి వెళ్తుంది. అక్కడే పడుకొని ఉన్న తిరుపతి కాలుపై అడుగువేస్తారు. దాంతో తిరుపతి గట్టిగా అరుస్తాడు. ఇక్కడ తప్ప వేరే ప్లేస్ లేదా మీరు రొమాన్స్ చేసుకోవడానికి మీ రూమ్ లేదా అని తిరుపతి అంటాడు. దాంతో ధీరజ్, ప్రేమ ఏం మాట్లాడలేకపోతారు. మరుసటి రోజు అమూల్యకి రేవతి ముగ్గు వెయ్యడం నేర్పిస్తుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి నేను నేర్పిస్తాను. మీరు వెళ్ళండి అని రేవతిని లోపలికి పంపిస్తుంది. అసలు మీ పెళ్లి ఎలా జరిగింది.. నీ వెనకాల ఎవరున్నారని అమూల్యని శ్రీవల్లి అడుగుతుంది. అసలు నువ్వు వాడి దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్ళావని శ్రీవల్లిపై అమూల్య కోప్పడుతుంది ప్లీజ్ ఆ విషయం ఎవరితో అనకు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. వల్లి అక్క ఏం చేస్తున్నావని కోప్పడి లోపలికి పంపిస్తుంది ప్రేమ. అమూల్య ఆ వల్లికి ఏం విషయం చెప్పకు.. ఏదైనా ఆ టైమ్ వచ్చినప్పుడు అందరికి తెలుస్తుందని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 21, 2026
Brahmamudi: అప్పుకి పాప.. మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -960 లో.. అప్పు, కళ్యాణ్ ని కిడ్నాప్ చేసింది కావ్య రాజ్ అనుకొని ధాన్యలక్ష్మి వాళ్ళని తిడుతుంది. కానీ వాళ్లే ప్రాణాలకి తెగించి కాపాడారని కళ్యాణ్ చెప్పగానే ధాన్యలక్ష్మి పశ్చాత్తాపపడుతుంది. కాసేపటికి రాజ్, కావ్యలకి ధాన్యలక్ష్మి సారీ చెప్తుంది. అప్పుకి ఆపరేషన్ చేస్తారు. తనకి పాప పుడుతుంది. అదే విషయం డాక్టర్ వచ్చి చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అప్పు డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. అప్పు పాపని వాళ్ళ నానమ్మ ధాన్యలక్ష్మి చూసుకుంటుంది. కావ్య పాపని అపర్ణ చూసుకుంటుంది. ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే మినిస్టర్ వస్తాడు. నా కూతురికి బారసాల ఫంక్షన్ చేస్తున్నాం.. మీరు తప్పకుండా రావాలని చెప్తాడు. మీరు నాకు ఆప్తులు.. ఖచ్చితంగా ఫ్యామిలీతో రావాలని మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తాడు. రాజ్, కావ్య వస్తామని మాటిస్తారు. మినిస్టర్ వెళ్ళాక నేను రానని ఇందిరాదేవి అంటుంది. వాడు చేసింది నువ్వు మర్చిపోయావా అని అంటుంది. అవన్నీ మర్చిపోమని రాజ్ అంటాడు. మరొకవైపు రేఖ, రాహుల్ ఇద్దరు రుద్రాణి దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు. అన్ని ప్లాన్ వేసారు.. అన్నీ ఫెయిల్ అయ్యాయని రుద్రాణి మీద రాహుల్, రేఖ కోప్పడతారు. రేపు మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికి రాజ్ ఫ్యామిలీతో వస్తాడు. నేను కూడా వస్తాను. అక్కడ అందరు నన్ను తిడతారు. మీరు కూడా నన్ను తిట్టండి. అప్పుడు సొంత పిల్లలే ఛీ కొడుతున్నారని సింపతీతో ఆ ఇంట్లోకి మళ్ళీ అడుగుపెడతానని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు బారసాల ఫంక్షన్ కి వెళ్ళడానికి అందరు రెడీ అవుతారు. అప్పుకి ఇన్స్పెక్టర్ కాల్ చేసి రౌడీలని ఏం చెయ్యమంటారని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Feb 20, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com









