
Jayam serial: గంగ కోసం సుధ పోరాటం.. ప్రమీల తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం!
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -253 లో.. సుధా, విశ్వ మాట్లాడుకుంటారు. మీరు గంగకి ట్రైనింగ్ ఇవ్వాలని విశ్వతో సుధా అంటుంది. నేను ఇవ్వనని విశ్వ అంటాడు. ఎందుకు ఇవ్వరు అని సుధా అడుగగా.. ఎలా ఇస్తానని అనుకున్నావ్.. ఒక ఆడది ఎలా ఉండాలో అలాగే ఉండాలి.. మగరాయుడిలా మారి ఇలాంటివి చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటానని అనుకున్నావ్.. తను మీ అన్నయ్య కోడలు అని ఇలా చేయమంటున్నావా అని విశ్వ అడుగుతాడు. లేదు తను నా మేనల్లుడి భార్య.. పైగా రుద్ర ట్రైనింగ్ కూడా ఇచ్చాడు.. మీరు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని సుధా అడుగుతుంది. నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావ్.. ఇలా తెగిపోయిన బంధాలని నువ్వు మళ్ళీ కలుపుకుంటావనే నేను నీకు ఆ ఫ్యామిలీని దూరంగా ఉంచాను..నేను ట్రైనింగ్ ఇవ్వనని విశ్వ అంటాడు. మరి నాకు మాటిచ్చారు కదా.. ఆ మాట నిలబెట్టుకోండి అని సుధా అంటుంది. ఇక చేసేదేమీ లేక విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అదే ఇంట్లో పనిచేసే లక్ష్మీ వచ్చి.. ఎందుకమ్మ గంగ గురించి అయ్యగారితో గొడవ అని అంటుంది. నేను గంగ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని సుధా అంటుంది. మరోవైపు ప్రమీల వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కార్ లో శకుంతల వాళ్ళ ఇంటికి వస్తారు. ఎలా వెళదామని ప్రమీల వాళ్ళ అమ్మ అనగానే ఇంతదూరం వచ్చాక ఇంట్లోకి వెళ్ళకుంటే ఎలా అని ప్రమీల వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే కార్ దగ్గరికి రుద్ర వచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇక ప్రమీల వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు ఇంటిలోపలికి వెళ్తారు. వాళ్ళని చూసి ప్రమీల ప్రేమగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ప్రమీల వాళ్ళ అమ్మానాన్నలని పెద్దసారు ఆప్యాయంగా పలకరిస్తుంటే శకుంత మాత్రం అవమానిస్తూ మాట్లాడుతుంది. ఇక ప్రమీల వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. నా కూతురు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తనకి ఇక్కడ మానసిక ప్రశాంతత లేదు అని చెప్తుంటాడు. అసలేం మాట్లాడాలని అనుకుంటున్నారో చెప్పండి అని శకుంతల అడుగుతుంది. సూటిగా విషయానికి వస్తాను.. తన భర్త చనిపోయాక ప్రమీలని తీసుకెళ్ళాలని అనుకుంటే మీరు వద్దని మీ కోడలు మీ దగ్గరే ఉండాలని పట్టుబట్టారు కానీ తను ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. తనకంటూ ఏ అచ్చటా ముచ్చటా తీరలేదని ప్రమీల వాళ్ళ నాన్న చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని అంటారు అడగగా.. నేను ప్రమీలని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానని ప్రమీల వాళ్ళ నాన్న అనగానే అందరు షాక్ అవుతారు. మరి ప్రమీలని శకుంతల ఇంట్లో నుండి పంపిస్తుందా.. రుద్ర ఏం చేయనున్నాడు.. ఈ నిర్ణయానికి ప్రమీల ఒప్పుకుంటుందా.. అసలు ప్రమీల వాళ్ళ అమ్మనాన్నలు రావడానికి కారణం రుద్రనేనా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026
Illu Illalu Pillalu: శ్రీవల్లి గుట్టు విప్పిన వేదవతి.. చందుకి దిమ్మతిరిగే షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -455 లో.. నా పెద్ద కోడలు కడుపులో పెరుగుతున్న పాప బాగుండాలి.. ఇకనైనా అందరు సంతోషంగా ఉండాలని రామరాజు మొక్కుకుంటాడు. అప్పుడే రామరాజుకి వల్లి గురించి నిజం చెప్పాలని చందు వస్తుంటే తనని లాక్కొని గదిలోకి వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా అని వేదవతి అడుగుతుంది. నీకు తన గురించి ఏం తెలియదు అమ్మ అని చందు అనగానే నాకు వల్లి గురించి తెలుసని వేదవతి అంటుంది. దాంతో చందు షాక్ అవుతాడు. నాకు శ్రీవల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన కుట్రల గురించి తెలుసు.. నీకు శ్రీవల్లి గురించి తెలిసినప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి తనని తన పుట్టింట్లో వదిలేసి వచ్చావ్ ఎందుకని వేదవతి అడుగుతుంది. తన కుటుంబ గౌరవం కాపాడే కోడలు దొరికిందని నాన్న మురిసిపోతున్నాడు.. నిజం తెలిస్తే నాన్న తట్టుకోలేడని అందుకే చెప్పలేదని చందు అంటాడు. మరి ఇప్పుడు చెప్తే తట్టుకుంటాడా అని వేదవతి అడుగుతుంది. అవును రా పెద్దోడ ఇప్పుడు వదినని మంచిగా మార్చుకోవడానికి ట్రై చెయ్ అని ధీరజ్ అంటాడు. అవును వల్లి గురించి నీకెలా తెలుసురా అని ధీరజ్ ని వేదవతి అడుగుతుంది. మాక్కూడా తెలుసని ప్రేమ, నర్మద ఎంట్రీ ఇస్తారు. ఇక మీదట శ్రీవల్లి తోక జాడించకుండా వార్నింగ్ ఇచ్చే తీసుకొని వచ్చానని వేదవతి చెప్తుంది. భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి భాగ్యం చెంప చెల్లుమనిపిస్తుంది వేదవతి. అందరికి వార్నింగ్ ఇచ్చి వచ్చినట్లు ప్రేమ, నర్మద వాళ్ళకి వేదవతి చెప్తుంది. మరొకవైపు శ్రీవల్లి, భాగ్యం ఆనందరావు ముగ్గురు మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టినం అని డాన్స్ చేస్తారు. మళ్ళీ ఈ కుటుంబం నీ మాట మీదే నడవాలి అంటూ వల్లికి భాగ్యం చెప్తుంటే.. ప్రేమ, నర్మద వచ్చి ఇక మీరు మారారు అని అంటారు. ధీరజ్ వచ్చి వదిన మీరు ఇక మీదట తప్పు చేస్తే మళ్ళీ ఇంట్లో ఎవరు క్షమించరని వల్లి తో ధీరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026
Karthika Deepam 2: కార్తీక్, దీపలకు అసలు నిజం చెప్పేసిన వైరా.. ఎంగేజ్మెంట్కు స్వప్న గ్రీన్ సిగ్నల్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -654 లో... శ్రీధర్ దగ్గరికి వసంత్ వస్తాడు. నువ్వు ఎక్కడికో క్యాంపుకి వెళ్ళావ్ అన్నావ్.. వెళ్లలేదా అని శ్రీధర్ అడుగుతాడు. లేదు మావయ్య స్వప్నకి సర్ ప్రైజ్ ఇద్దామని వచ్చానని అంటాడు. స్వప్నని నేను పిలుస్తానని పిలుస్తాడు. ఎల్లుండి మంచి రోజు అంట ఎంగేజ్మెంట్ చేసుకోమని పంతులు గారు చెప్పారని వసంత్ చెప్తాడు. ఏంటి నువ్వు.. మేం ఆలోచించుకోవాలి కదా అని కావేరి అంటుంది. అవును స్వప్న కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా అని కాశీ అంటాడు. నేను తీసుకున్నానని స్వప్న అంటుంది. నాకు ఏం ప్రాబ్లెమ్ లేదని స్వప్న అనగానే బ్రో నీకేమైనా ప్రాబ్లమా అని కాశీని వసంత్ అడుగుతాడు. నీకేం ఉంటుందిలే స్వప్నకే ఏం ప్రాబ్లమ్ లేదు.. నాకు ఏం ప్రాబ్లమ్ లేదని వసంత్ అంటాడు. మీరు అయినా చెప్పండి అని శ్రీధర్ తో కావేరి అంటుంది. నా కూతురు ఇష్టమే నా ఇష్టం అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత అందరు వెళ్ళాక నువ్వు ఏం బాధపడకు అల్లుడు.. నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని తనకి బుద్దివచ్చేలా చెయ్యమని కావేరి అంటుంది. తను నన్ను వద్దని అనుకుంటుంది.. నేను కాదని కాశీ అంటాడు. ఆ తర్వాత దాస్ డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఏంటి నాన్న అని మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్న పనులకి ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలి ఉంటే బాగుండేదని జ్యోత్స్న అంటుంది. ఎప్పటిలాగే దాస్ ని తిట్టి పంపిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత కార్తీక్ కి దీప షర్ట్ చేంజ్ చేస్తుంది. అప్పుడే వైరా ఫోన్ చేస్తాడు. ఒరేయ్ రెండుసార్లు నన్ను మోసం చేసావ్ రా అని వైరా అనగానే పోలీసులు వస్తారు జాగ్రత్త అని కార్తీక్ అంటాడు. నీ మరదలు కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది.. ఎందుకు అంటే ఇదంతా ఒక డ్రామా.. నీ మరదలు అంటే నాకు కోపమే కానీ డబ్బులు ఎక్కువ అడుగు, నాకు అందులో వాటా కావాలి.. ఎలా మాట్లాడాలి.. ఎంత అడగాలని.. అంతా నీ మరదలు ప్లాన్ అని వైరా అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. నా వల్ల మీకు డేంజర్ కాదురా నీ మరదలు వల్లే డేంజర్ అని వైరా చెప్తాడు. చూసావా బావ అది మారదని దీప అంటుంది. ఇక క్షమించేది లేదు ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ చేస్తుంది. బుద్ధి వచ్చేలా చెయ్యాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పారిజాతం కార్తీక్ తో కలిసి చేసిన పనికి రివార్డ్ గా తనకి యాభై వేలు ఇస్తాడు శివన్నారాయణ. దాంతో పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026
Brahmamudi: పెళ్లిరోజు వేడుకలో రాజుకు చుక్కలు చూపించిన ఇందు.. అపర్ణ సీరియస్ వార్నింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1016 లో... ఇందుని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు రాజు. ఇందుని చూసి అందరు షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఎవరు అని వాళ్ళ నాన్న అడుగుతాడు. పెళ్లి అని రాజు ఏదో చెప్పబోతుంటే రాజు పెళ్లి చేసుకొని వచ్చాడని ఇంట్లో అందరు అనుకుంటారు. నేను చెప్పేది పూర్తిగా వినండి అని రాజు అంటాడు. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా పెళ్లి రోజుని సింపుల్ గా చెయ్యడానికి వచ్చింది.. తను ఈవెంట్ మేనేజర్ అని రాజు చెప్తాడు. అవునులే నీ మొహానికి ఇంత అందమైన అమ్మాయి లవర్ గా ఉంటుందా అని వాళ్ళ నాన్న అనగానే ఇందు నవ్వుకుంటుంది. ఈ రోజు మీరు ఏం పనులు చెయ్యకండి.. అన్ని పనులు మీ అబ్బాయి వాళ్ళు చూసుకుంటారని ఇందు చెప్తుంది. రాజుతో ఇందు గిన్నెలు తోమిస్తుంది. మరొకవైపు వెంకీ చెట్టు ఎక్కి కొబ్బరి మట్టలు కొడుతాడు. అప్పుడే నందు వచ్చి నీతో మాట్లాడాలి బయటకు వెళదామని అంటుంది. నాకు చెట్టు ఎక్కడం వచ్చు కానీ దిగడం రాదని వెంకీ అంటాడు. అలాంటప్పుడు ఎందుకు ఎక్కావని ఇందు అంటుంది. ఇందుని చూసి నువ్వు ఏంటి అక్క అని నందు అడుగుతుంది. ఈవెంట్ ప్లానర్ అని రాజు చెప్తాడు. వెంకీని కిందకి దింపడానికి రాజు, ఇందు కింద ఒక చీర పట్టుకొని ఉంటారు. నందు వచ్చి నిచ్చెన వేస్తుంది. అది చూసి ఫ్రెండ్ అంటే నువ్వేనే అని వెంకీ అంటాడు. ఆ తర్వాత ఇందుని కిచెన్ లోకి తీసుకొని వెళ్తారు. వంట చేయడానికి కావల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తారు. తరువాయి భాగంలో ఇన్ని రోజులు బిజినెస్ లో లాభంగా వచ్చిన డబ్బులు ఏం చేశారు.. డబ్బులు కట్టి నా మనవరాలిని తీసుకొని రాకుంటే మీడియా వాళ్ళకి పోలీస్ వాళ్ళని ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తానని రేఖతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 26, 2026.webp)
సుధీర్ నువ్వు నేను శీను ముగ్గురం ఫ్రెండ్స్ కానీ నా సపోర్ట్ మాత్రం విష్ణుప్రియకే!
సర్కార్ లో విష్ణు ప్రియా కో-హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన వాళ్లంతా విష్ణుప్రియను తెగ మెచ్చేసుకున్నారు. ఈ షోకి అవినాష్, రాఘవ, రాంప్రసాద్, రోహిణి వచ్చారు. ఇక రాగానే అవినాష్ విష్ణుప్రియను తెగ పొగిడేసాడు. "సర్కార్ అంటే విష్ణు విష్ణు అంటే సర్కార్. నేను పడుకుంటే విష్ణు లేస్తే విష్ణు ఇన్ని సీజన్స్ వేరు ఈ సీజన్ వేరు విష్ణు. యు ఆర్ బ్యూటిఫుల్ యు ఆర్ ఏంజెల్ అంటూ దిష్టి తీసాడు " అవినాష్. తర్వాత రాఘవ వచ్చాడు. "ఐనా నేను వచ్చింది అందం విష్ణు ప్రియా గురించి అసలు ఆ అందం ఏంటండీ. అందం అంటే ఇది"అన్నాడు. ఏంటి మీరు ఇంత ఫిట్ గా కనిపిస్తున్నారు జిమ్ కి వెళ్తున్నారా " అంది విష్ణు . "వెళ్లడం ఏంటండీ అసలు బయటకు వస్తే కదా " అన్నాడు రాఘవ. "పదండి సీట్ వరకు నేను తీసుకెళ్తాను " అంది విష్ణు. "మీరు తీసుకెళ్తానంటే అక్కడికేంటి అంటార్టికా కన్నా వస్తాను " అన్నాడు. ఇక రాంప్రసాద్ వచ్చి "సుధీర్ లేకపోయినా సర్కార్ సీజన్ మొత్తం నిన్ను పెట్టి నడిపించేయొచ్చు...ఐనా జోక్ వేస్తె నవ్వడేంటి...నాకు నచ్చిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి కానీ అవి చూడలేదు.సుధీర్ నువ్వు నేను శీను ముగ్గురం ఫ్రెండ్స్ కానీ నా సపోర్ట్ మాత్రం విష్ణుప్రియకే " అంటూ తెగ కౌంటర్లు వేసి నవ్వించాడు.
Apr 25, 2026.webp)
సర్కార్ లో సుధీర్ కి సన్మానం!
సర్కార్ షోలో హోస్ట్ సుధీర్ కి రామ్ ప్రసాద్, అవినాష్, రోహిణి, రాకెట్ రాఘవ కలిసి సన్మానం చేశారు. అవినాష్ ఐతే ఒక సన్మాన పత్రం కూడా రాసుకొచ్చాడు. అది చదువుతున్నంత సేపు సుధీర్ భయపడ్డాడు, బాధపడ్డాడు. ఇక రామ్ ప్రసాద్ సుధీర్ కోసం సన్మానం పోస్టర్ ని కూడా డిజైన్ చేసి చూపించాడు. "సుధీర్ అది ఒక పేరు కాదు డోలు. ఈయన పొదల్లో ఉదయించిన సూర్యుడు. చిన్నప్పుడు ఉంగా ఉంగా అన్నాడు. కానీ ఇప్పుడు గెలుపు కోసం బెంగా బెంగా అంటున్నాడు. పేకల నుంచి అభిమానుల కేకల దాకా అన్ని చూసారు. ఆయనకు అలుపు లేదు...ఆయన్ని ఆప్ తలుపు లేదు. ఆయన ఎల్లకాలం బాగుండాలని కోరుకుంటూ సుధీర్ ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు. ఐతే సుధీర్ ఫుల్ గా మోసం చేశారు. పూలు దండాలు తెచ్చి ఎవరికీ వాళ్ళు వేసుకున్నారు. ఈ స్కిట్ ఇంత బాగా రాసావు అంటూ రాంప్రసాద్ కి పూల దండ వేసింది రోహిణి. ఎవరికీ వాళ్ళు పూలు జల్లేసుకుని వాళ్ళను వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. అమ్మ సుధీర్ నువ్వు ఒక్కడివే సెల్ఫీ తీసుకో అంటూ రాంప్రసాద్ ఆట పట్టించాడు. "నా ఫ్రెండ్స్ వాళ్లంతా వాళ్లను నువ్వు కొనేసి నా మీద ఇలా చేయిస్తావా " అంటూ సుధీర్ విష్ణుప్రియను అడిగాడు ఫన్నీగా. ఇక విష్ణు ప్రియా ఐతే ఇంతా అవిమానించిన వాళ్ళను ఊరుకోను అంటూ చెప్పింది.
Apr 25, 2026.webp)
Illu illalu pillalu : వల్లి ప్రెగ్నెన్సీ వార్తతో ఇంటికి చేరుకున్న చందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -454 లో.. వల్లి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ప్రేమ, నర్మద ఇద్దరు వచ్చి తనకి కంగ్రాట్స్ చెప్తారు. చందు మాత్రం కోపంగా ఉంటాడు. బా ఇప్పుడు మనం తల్లిదండ్రలం కాబోతున్నామని వల్లి అంటుంది. నువ్వు చేసిన మోసం నేను మర్చిపోలేను.. ఈ విషయం వెంటనే నాన్న వాళ్ళకి చెప్పాలని చందు కోపంగా ఇంటికి వెళ్తాడు. నాన్న అని చందు పిలుస్తాడు. నాకు తెలుసురా నువ్వు ఏం చెప్పాలని వస్తున్నావో వల్లి ప్రెగ్నెంట్ కదా.. ఈ విషయం నిజంగా సంతోషకరమైన విషయమేనని రామరాజు అంటాడు. అది కాదు నాన్న.. నీకు వాళ్ళ గురించి తెలియదని చందు చెప్పాలని ట్రై చేస్తుంటే ధీరజ్ వాళ్ళు వద్దని సైగ చేస్తారు. అయినా చెప్పాలని ట్రై చేస్తాడు.. అప్పుడే వల్లిని తీసుకొని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. వాడేం చెప్పాలని అనుకుంటున్నాడో నాకు తెలుసు వల్లిని అమ్మ తీసుకొని రావాలని చెప్పబోతున్నాడని వేదవతి అనగానే అవునా అని రామరాజు అంటాడు. కాదండి.. వల్లి వాళ్ళు మోసం చేశారని చెప్పాలని అనుకుంటున్నాడని వేదవతి అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మరి ఏంటండి అన్ని వాడు ఏం చెప్పాలని అనుకుంటాడని వేదవతి నవ్వుతుంది. ప్రేమ, నర్మద ఇద్దరు వల్లికి హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ప్రేమ, నర్మద దగ్గరికి భాగ్యం వచ్చి.. నా కూతురిని ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వమని ఎవ్వరో అన్నారు కదా.. ఇప్పుడు ఏమైందని అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఓ అత్త ఎక్స్ ట్రాలు మాట్లాడితే కత్తిరించేస్తానని అంటాడు. అలా ధీరజ్ అనగానే వాళ్ళు ముగ్గురున్నారు పదవే అని భాగ్యాన్ని ఆనందరావు తీసుకొని వెళ్తాడు. అసలు అత్త సడెన్ గా ఎంట్రీ ఎందుకు ఇచ్చిందని ధీరజ్ ని ప్రేమ, నర్మద అడుగుతారు. అమ్మ వస్తున్నట్లు ముందే తెలుసు కానీ వదినని తీసుకొని రావడం మొత్తం వదిన ప్లాన్ అని ధీరజ్ అంటాడు. వేదవతికి జరిగింది చెప్పి వల్లిని తీసుకొని రమ్మని చెప్పినట్టు నర్మద చెప్తుంది. అక్క నువ్వు గ్రేట్ అందరి గురించి ఆలోచిస్తావని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026.webp)
Brahmamudi : ఇందు ప్లాన్తో అదిరిపోయిన రాజు తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1015 లో.... ఇందు చాలా హ్యాపీగా ఉంటుంది. రాజు తన చిన్నచిన్న సరదాలన్నీ తీరుస్తాడు. దాంతో ఇందు సంతోషానికి అవధులు లేకుండా పోతాయ్. రాజు పక్కన కూర్చొని నువ్వు ఏం చేస్తావ్ మీ ఫ్యామిలీ ఏంటని అడుగుతుంది. రాజు తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఏం చదువుకున్నావ్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈ రౌడీ పనులు ఏంటి అని ఇందు అంటుంది. మనకి ఎవడు జాబ్ ఇస్తాడని రాజు అంటాడు. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది.. ప్లీజ్ ఒక పాట పాడండి అని ఇందు అంటుంది.. రాజుకి ఇష్టం లేకున్నా ఇందు నిద్రపోయేవరకు పాట పాడుతాడు. రాజు ఒళ్ళో ఇందు నిద్రపోతుంది. మరొకవైపు చక్రి ఇంటికి రేఖ, భూషణ్ వెళ్తారు. మిగతా యాభై లక్షలు ఇవ్వమని రేఖ అడుగుతుంది. డబ్బులు లేవని చక్రి మొహం మీదే చెప్తాడు. ఇంతవరకు అన్ని డబ్బులు ఇచ్చాను.. ఒక్క పైసా అన్న తిరిగి ఇచ్చారా.. నేను ఇవ్వనని చక్రి అనగానే రేఖ, భూషణ్ డిస్సపాయింట్ తో ఇంటికి వెళ్తారు. మరొకవైపు రాజుకి వెంకీ ఫోన్ చేస్తాడు. అప్పుడే రాజు, ఇందు నిద్ర లేస్తారు. ఒరేయ్ ఈ రోజు అమ్మానాన్నల పెళ్లి రోజు అని వెంకి చెప్పాగానే సరే నేను చికెన్ కి డబ్బులు పంపిస్తానని రాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందని ఇందు అడుగుతుంది. ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు అని రాజు చెప్తాడు. పెళ్లి రోజు ఎవరైనా అలా సెలబ్రేట్ చేసుకుంటారా అని ఇందు అంటుంది. అంత డబ్బులు మా దగ్గర లేవని రాజు అంటాడు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను పెళ్లి రోజు జరిపిస్తానని ఇందు అంటుంది. వద్దని రాజు అనగానే మరి ఓనర్ కి చెప్తానని ఇందు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాజు సరే అంటాడు. ఎవరని.. ఏం చెప్పాలని రాజు అనగానే ఈవెంట్ ప్లానర్ అని చెప్పు అని ఇందు చెప్తుంది. తరువాయి భాగంలో రాజు పేరెంట్స్ ఇరవై అయిదో పెళ్లి రోజుని ఉన్నంతలో ఇందు సెలబ్రేట్ చేసి అందరికి భోజనాలు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026.webp)
Karthika Deepam2 : బుల్లెట్ గాయంతో ఇంటికి కార్తీక్.. జ్యోత్స్న హగ్ చూసి దీప షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -653 లో...జ్యోత్స్నని కిడ్నాప్ చేసింది వైరా అని తెలిసి శివన్నారాయణ పట్టరాని కోపంతో గన్ తీసుకొని వెళ్తుంటే.. కార్తీక్ ఆపుతాడు. వాడిని చట్టపరంగా శిక్షించాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడ నుండి వెళ్తారు. ఇంట్లోకి వస్తే ఎక్కడ శివన్నారాయణ తిడతాడోనని పారు బయటే ఉండి శ్రీధర్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో పరుగున శ్రీధర్ ఇంటికి వస్తాడు. కార్తీక్ ఎలా ఉన్నావ్ రా ఇప్పుడే అత్తయ్య ఫోన్ చేసి జరిగింది చెప్పిందని శ్రీధర్ అంటాడు. ఎందుకు ఇంత రిస్క్ చేశారు పోలీస్ మాత్రమే వెళ్లి ఉంటే డబ్బు అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చేవి అని శివన్నారాయణ అంటాడు. తాత డబ్బులు అవి వాడి పాలు కాకుండా చాలా ట్రై చేశానని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు డబ్బులు బ్యాగ్ చూస్తూ వైరా తన మేనేజర్ మురిసిపోతాడు. అప్పుడే బ్యాగ్ ఓపెన్ చేస్తారు.. అందులో ఇటుకలు ఉంటాయి అవి చూసి వైరా షాక్ అవుతాడు. మళ్ళీ ఆ కార్తీక్ మోసం చేసాడని అనుకుంటాడు. ఆ తర్వాత డబ్బులు మార్చమని అసలు డబ్బులు ఇవ్వని పారిజాతం డబ్బుల మూటని తీసుకొని వస్తుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు నిన్ను ఎక్కడ కిడ్నాప్ చేశారు జ్యోత్స్న అని కార్తీక్ అడుగుతుంటే.. ఇప్పుడు బావని డైవర్ట్ చేయపోతే ఇంకా డౌట్ వస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. జరిగిందంతా ఒక కలలా మర్చిపోదాం బావ అని కార్తీక్ ని జ్యోత్స్న హగ్ చేసుకొని చాలా థాంక్స్ బావ అని అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. దీపకి కోపం వస్తుంది. కార్తీక్ ని హగ్ చేసుకొని దీప వంక జ్యోత్స్న పొగరుగా చూస్తుంది. ఆ తర్వాత కార్తీక్ ని తీసుకొని దీప ఇంటికి వెళ్తుంది. నువ్వు ఆ జ్యోత్స్నకి అడ్డువెళ్లడం ఏంట్రా అని కార్తీక్ పై కాంచన కోప్పడుతుంది. నీకు బుల్లెట్ తగిలిందని పారిజాతం అత్తయ్య చెప్పగానే నిన్ను చూసేవరకు టెన్షన్ అయిందని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026
Podharillu : గాయత్రి మెడలో మాధవ తాళి కడతాడా? షాకిచ్చిన తాయారు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో..... మహాని తీసుకొని చక్రి సర్టిఫికేట్స్ అప్లై చెయ్యడానికి కాలేజీకి వస్తాడు. అక్కడ మేడమ్ తో తను మహా.. నా భార్య.. మేం లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చక్రి చెప్తుంటే మహా కోపంగా చూస్తుంది. కాసేపటికి చక్రితో ఆ మేడమ్ క్లోజ్ గా ఉండడం చూసి మహా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఏంటి అలా చూస్తుంది.. కొంపదీసి జెలస్ గా ఫీల్ అవుతుందా ఏంటని చక్రి అనుకుంటాడు. మీరు అప్లై చేశారు కదా పదిహేను రోజుల్లో మీ సర్టిఫికేట్స్ మీ చేతుల్లో ఉంటాయని మేడమ్ అనగానే మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కొత్తగా కన్పిస్తున్నారని చక్రి అనగానే అంటే ఏమైనా మొటిమలు అయ్యాయా అని మహా అంటుంది. కాదండి.. ఇంత హ్యాపీగా చూడడం ఇదే మొదటిసారి అని చక్రి అంటాడు. మరొకవైపు గాయత్రి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. గాయత్రి వాళ్ళ ఇంటి ముందు నుండే మాధవ, చక్రి వెళ్తుంటే.. గాయత్రి వాళ్ళ నాన్న కావాలనే అటుగా వెళ్లి ఎవరినో పెళ్లికి పిలుస్తూ.. నా అల్లుడికి జాబ్ ఉంది అంటూ గొప్పగా చెప్తాడు. అదంతా కిటికీలో నుండి గాయత్రి చూస్తుంది. ఆ తర్వాత చక్రికి మహా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి మీరు పార్టీ అడిగారు కదా ఇదే పార్టీ అని ఇస్తుంది. ఆ తర్వాత మహా, చక్రి ఇంటికి వచ్చేసరికి మాధవ డల్ గా కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత గాయత్రి పెళ్లిపత్రిక పట్టుకొని ఒకతను వచ్చి వీళ్ళ ఇల్లు ఎక్కడ అని నారాయణని అడుగుతాడు. పెళ్లికూతురు తల్లి బావిలో దూకింది.. పెళ్లి ఆగిపోయిందని నారాయణ చెప్తాడు. అప్పుడే మాధవ వచ్చి అదేం లేదని చెప్పి ఎదురు ఇల్లు వాళ్ళది.. వెళ్ళండి అని మాధవ అంటాడు. ఆ పెళ్లిపత్రిక చూస్తూ మాధవ బాధపడతాడు. మరొకవైపు గాయత్రికి తాయారు భోజనం తీసుకొని వస్తుంది. నాకు వద్దని గాయత్రి కోప్పడుతుంది. నాకు బావ కావాలి అంటుంది. మీకు ఏం కావాలో.. ఏం వద్దో.. మాకు తెలుసని తాయారు అంటుంది. ఆ తర్వాత మాధవ డల్ గా నేలపై పడుకొని ఉంటాడు. అతన్ని చూసి ఇంట్లో అందరు బాధపడతారు. ఆ తర్వాత మహా డోర్ వెయ్యబోతుంటే గాయత్రి ఇంటికి వస్తుంది. మహా లోపలకి పిలుస్తుంది. ఎందుకు వచ్చావే అని ఇంట్లో అందరు కోప్పడతారు. తరువాయి భాగంలో గాయత్రి మెడలో మాధవ తాళి కట్టబోతుంటే తాయారు, పురుషోత్తం వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026.webp)
Jayam serial : స్నేహ విషయంలో వీరు ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. రుద్ర ఎంట్రీతో సీన్ రివర్స్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -252 లో.....స్నేహ ఇంట్లో లేదన్న విషయం వీరుకి ఇషిక చెప్తుంది. దాంతో శకుంతలకి తెలిసేలా చేసి ఇంట్లో గొడవ చెయ్యాలని వీరు, ఇషిక అనుకుంటారు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తారు. స్నేహ రాకపోవడంతో స్నేహని తీసుకొని వస్తానని పైకి వెళ్తుంది ఇషిక. స్నేహ ఇంట్లో లేదన్న విషయం తెలిసి గొడవ జరుగుతుందని ఇందుమతి వాళ్ళు భయపడుతారు. పైకి వెళ్ళిన ఇషిక కిందకి వచ్చి.. స్నేహ ఇంట్లో లేదు అత్తయ్య గారు అంతా వెతికానని అంటుంది. అందరు షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది.. ఈ ఇంట్లో ఒక ఆడపిల్ల వెళ్ళిపోయి పరువు తీసింది.. ఇప్పుడు మరొక ఆడపిల్ల కూడా అలాగే చేసిందా ఏంటని శకుంతల కోప్పడుతుంది. అప్పుడే రుద్ర ఏమైందంటూ ఎంట్రీ ఇస్తాడు. అయ్యో మీకు తెలియదు కదా బావ.. స్నేహ ఇంట్లో లేదని వీరు అంటాడు. ఇప్పుడు ఎవరన్నారు స్నేహ లేదని.. అన్నయ్య తలనొప్పిగా ఉంది నాకు టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్పింది స్నేహ అని రుద్ర చెప్తాడు. స్నేహ అని రుద్ర పిలవగానే పైనుండి స్నేహ వస్తుంది. తనని చూసి ఇషిక, వీరు షాక్ అవుతారు. నేను వచ్చినప్పుడు నువ్వు లేవు కదా అని ఇషిక అనగానే అప్పుడు స్నానం చేస్తున్నాను వదిన అని స్నేహ చెప్తుంది. ఈ ఇంట్లో అందరికి తొందరపాటు ఎక్కువ అయిందని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత అసలు ఏమైందని వీరు, ఇషిక తల పట్టుకుంటారు. మరొకవైపు గంగకి బాక్సింగ్ నేర్పించడానికి అయ్యగారిని ఒప్పిస్తానని అమ్మగారు చెప్పారని పైడిరాజుకి లక్ష్మీ చెప్తుంది. ఆ తర్వాత చాలా థాంక్స్ అన్నయ్య.. నేను ఏ తప్పు చెయ్యలేదని రుద్రతో స్నేహ అంటుంది. నాకు తెలుసు అమ్మా అని రుద్ర అంటాడు. ఎవరో కావాలనే రైడ్ జరిపించారని స్నేహ చెప్తుంది. పార్టీలు వద్దని అనడం లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 25, 2026.webp)
నేను ఒకళ్ళతో లివింగ్ రిలేషన్లో ఉన్నాను... ఒక మిస్టేక్ జరిగింది!
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రేమ గురు ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక హార్ట్ సింబల్ లో గులాబీ రేకులు అమరుస్తూ తొలి పరిచయం , తొలి అనుభూతి, మొదటిసారి చూసినప్పుడు ఎం అనిపించింది , మీ మొదటి మాటలు, ఇన్ని కోట్లమంది ఉన్నా ఈ లైఫ్ పార్టనర్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయాలు మాట్లాడాలని చెప్పాడు. ఇక నటరాజ్ మాష్టర్ - నీతూ జోడి వచ్చి వాళ్ళ లవ్ స్టోరీని చెప్పారు. ఐతే నీతూ సిగ్గుపడిపోయి చెప్పలేకపోయింది. ఇక నటరాజ్ మాష్టర్ మొత్తం చెప్పాడు. "ఒక ఛానెల్ లో డాన్స్ షో నడుస్తోంది. నేను సెలక్షన్ ప్యానెల్ లో ఉన్నా. ఒక్కొక్కరు వచ్చి పెర్ఫార్మ్ చేస్తున్నారు. నాయనా అని రాసి ఉంది . అబ్బాయి వస్తాడేమో అనుకున్నా తీరా చూస్తే పింక్ డ్రెస్ వేసుకుని పింక్ లిప్స్ తో తెల్లటి ముఖంతో ఉన్న అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయేదో బాగుంది అనిపించింది. తర్వాత వేరే షోలో డాన్స్ పెర్ఫెర్మెన్సు ఉంది అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడించింది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ అవుతుంటే నీతూ రాలేదు వెళ్లి చూస్తే చీర కట్టుకోవడం రాక అలాగే ఉండిపోయింది. దాంతో నేనే చీర కట్టేసాను.. ఆమె షాకైపోయింది. అలా మేమిద్దరం కలిసి పెర్ఫార్మ్ చేసాం. ఒక బేకరీకి తీసుకెళ్లి చెప్పాను ఆమె అంటే ఎంత ఇష్టమో. ఆమె చాలా అమాయకంగా ఉండేది. అలాంటి నన్ను ఒక ఏడేళ్లు మాట్లాడకపోయినా మళ్ళీ కలిసినప్పుడు అదే ప్రేమతో నాతో మాట్లాడింది. నేను ఒకళ్ళతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను. అది ఆమెకు తెలుసు. మళ్ళీ నేను రెండో సారి వచ్చినా కూడా నా మీద అదే ప్రేమతో చూసేది. ఒక టైములో ఒక అమ్మాయితో హార్ష్ గా మాట్లాడి తర్వాత నేను నీతూకు కనెక్ట్ అయ్యాను. తర్వాత పెళ్లయ్యింది. ఆ తర్వాత కూడా ఒక మిస్టేక్ జరిగింది. ఐనా కూడా నన్ను యాక్సెప్ట్ చేసింది. ఇలాంటి మూర్కుడికి ఇలాంటి అదృష్టం ఎలా దొరుకుతుంది. నా గురించి ఇన్ని తెలిసినా నన్ను ఇలా ప్రేమించే అమ్మాయి దొరకడం ఇలాంటి భార్య దొరకడం అదృష్టం" అని చెప్పాడు నటరాజ్ మాష్టర్. "నేను ఆయన్ని ప్యానెల్ లో చూసినప్పుడు ఉంగరాల జుట్టు, బుగ్గ మీద సొట్ట చూసి ఆయన్నే నా భర్త అని అనుకున్నా . మా అమ్మతో ఎన్ని సార్లో దెబ్బలు తిన్నాను. మా అమ్మ నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేసింది. చాలా గొడవలు అయ్యాయి. ఐనా కూడా నేను ఈయనే కావాలని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాను " అని చెప్పింది నీతూ.
Apr 24, 2026
Brahmamudi : తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుకకు సిద్ధమైన రాజు.. ఇందు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1014 లో..... రాజు ఓనర్ కి వంట చేసిపెట్టాలని అడిగినందుకు ఇందు తనని బయటకు తీసుకొని వెళ్లాలని ఆర్డర్ వేస్తుంది. దాంతో చేసేదేమీ లేక రాజు తనని బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ దొంగతనం చేసి తినాలని ఉందని రాజుతో ఇందు అంటుంది. దాంతో రాజు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఐస్ క్రీమ్ ఇందు దొంగిలించి తింటుంది. పక్కకు వెళ్లి ఐస్ క్రీమ్ తింటూ మళ్ళీ ఐస్ క్రీమ్ దొంగతనం చేసిన దగ్గరికి వెళ్లి తింటుంది ఇందు. అప్పుడు ఐస్ క్రీమ్ బండి అతను చూసి.. ఈ ఐస్ క్రీమ్ మీరు కొనలేదు కదా ఎక్కడిది అని అడుగుతాడు. ఇతనే దొంగతనం చేసాడని రాజు పై తోసేస్తుంది ఇందు. ఏంటి అయ్యా.. ఈ దొంగబుద్ది అని రాజు పై ఐస్ క్రీమ్ షాప్ బండి అతను కోప్పడతాడు. ఏంటి నా పేరు చెప్పావని రాజు అడుగుతాడు. నేను దొంగతనం చెయ్యాలనుకున్నా కానీ అతన్ని మోసం చెయ్యాలనుకోలేదు డబ్బులు ఇవ్వాలి కదా అని ఇందు అంటుంది. ఇప్పుడు నాకూ స్ట్రీట్ ఫుడ్ తినాలని అనిపిస్తుందని ఇందు అంటుంది. దాంతో రాజుకి కోపం వచ్చి పక్కకి వెళ్లి డ్రింక్ లో బీర్ కలుపుతాడు. అది ఇందు తాగుతుంది. తాగిన మైకంలో ఇందు డాన్స్ చేస్తుంది. చూడు రాజు.. ఆ చందమామ ఎంత బాగుందో కదా.. చాలా థాంక్స్ రాజు నాకు ఇంత హ్యాపీ నెస్ ఇచ్చావని రాజుని ఇందు గట్టిగా హగ్ చేసుకుంటుంది. అటు చూడు అక్కడ స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్స్ కి పేర్లు పెట్టుకుంటున్నారంట.. ఇప్పుడు నీ సాక్షి గా ఆ స్టార్ కి ఇందు అని పేరు పెడుతున్నానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజుకి వెంకీ ఫోన్ చేసి ఈ రోజు అమ్మనాన్నల పెళ్లి రోజు అని చెప్తాడు. సర్లే నేను చికెన్ తెస్తానని రాజు అంటాడు. అలా పెళ్లి రోజు ఎవరైనా సెలబ్రేట్ చేస్తారా అని ఇందు అంటుంది. మరి డబ్బులు లెవ్వు అని రాజు అంటాడు. నేను ఒక్క పైసా ఖర్చు కాకుండా నేను సెలబ్రేట్ చేస్తాను అని ఇందు అనగానే తనని తీసుకొని రాజు ఇంటికి వస్తాడు. ఎవరు ఈ అమ్మాయి అని వాళ్ళ నాన్న అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 24, 2026
Karthika Deepam2 : ప్రాణాలకు తెగించి జ్యోత్స్నను కాపాడిన కార్తీక్.. హై టెన్షన్ డ్రామా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -652 లో..... దశరథ్ దగ్గరున్న డబ్బులు తీసుకొని వైరా మనిషి వెళ్ళిపోతాడు. అది చూసి దశరథ్ షాక్ అవుతాడు. దాస్, పోలీసులు అక్కడికి వస్తారు. ఇలా డబ్బులు తీసుకొని వెళ్లారు జ్యోత్స్నను వదిలేస్తారో లేదో అని దశరథ్ టెన్షన్ పడుతడు. మరొకవైపు వాళ్ళని ఫాలో అవుతూ.. పారిజాతం, కార్తీక్ వెళ్తారు. అదంతా చూసి ఇప్పుడు మనం ప్లాన్ మార్చాలని ఇద్దరు ఎక్కడికో బయల్దేరతారు.ఆ తర్వాత రౌడీ డబ్బులు తీసుకొని వైరా దగ్గరికి వెళ్తాడు. ముందు ఆ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయో లేదో చూడమని జ్యోత్స్న అంటుంది. బ్యాగ్ ఓపెన్ చేసేసరికి అందులో డబ్బులు ఉంటాయి.. అవి చూసి వైరా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా వాటా నాకు ఇచ్చి నన్ను వదిలెయ్యండి అని జ్యోత్స్న అనగానే అందరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడు నిన్ను మోసం చేసామని వైరా అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఇలా మోసం చెయ్యొచ్చా అని జ్యోత్స్న అనగానే నువ్వు ఆడపిల్లవి కాదు కిలాడీ పిల్లవి అని వైరా అంటాడు. ఆ తర్వాత అక్కడికి పారు, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. అప్పటికే వైరా వాళ్ళు మాస్క్ వేసుకొని ఉంటారు. ఎవర్రా మీరు అని వైరా మాస్క్ ని కార్తీక్ తీసేస్తాడు. వైరాని చూసి కార్తీక్ షాక్ అవుతాడు.రౌడీలని కార్తీక్ కొడుతుంటే డబ్బులు తీసుకొని పారిపోవాలని వైరా అనుకుంటాడు. జ్యోత్స్న అడ్డుపడడంతో తన తలపై గన్ పెడుతాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. వైరా గన్ షూట్ చేస్తాడు ఆ తర్వాత జ్యోత్స్న ఇంటికి వెళ్తుంది. తనని చూసి సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న చేతికి రక్తం ఉంటుంది. ఏమైందని సుమిత్ర అడుగుతుంది. బావని షూట్ చేశారు అనగానే అందరు షాక్ అవుతారు. బావకి ఏమైందని దీప టెన్షన్ పడుతుంటే కార్తీక్ చేతికట్టుతో ఇంటికి వస్తాడు. తనతో పోలీసులు కూడా వస్తారు. అసలు ఏం జరిగిందో కార్తీక్ చెప్తాడు. కార్తీక్ లేకపోతే ఈ రోజు మీ మనవరాలు ఉండేది కాదని పోలీసులు అంటారు. అవును బావ రావడం వల్లే నేనున్నాను.. నన్ను షూట్ చేశారు.. బావ అడ్డు వచ్చాడని జ్యోత్స్న చెప్తుంది. ఎందుకు రిస్క్ చేసావ్ పారిజాతం కూడా వచ్చిందా అని శివన్నారాయణ అంటాడు. పారిజాతం భయంతో బయటే ఉంటుంది. డబ్బుల కోసం ఇదంతా అని దశరథ్ అనగానే లేదు మావయ్య ఇదంతా పగ కోసం ఆ వైరా చేసాడని కార్తీక్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇక కోపంగా శివన్నారాయణ గన్ తో వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 24, 2026.webp)
Illu illalu pillalu : రామరాజు ఇంట వారసుడి రాక? వేదవతి ఎంట్రీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కొత్త మలుపు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -453 లో..... చందుకి ఆక్సిడెంట్ చేసిన రౌడీ కనపడగానే ధీరజ్, నర్మద అతన్ని వెంబడిస్తారు. రౌడీని పట్టుకొని కొడుతుంటే ఎవరు చేయించారో చెప్తానని రౌడీ అంటాడు. భాగ్యం వాళ్ళు చేయించారని అతను చెప్పగానే ధీరజ్ వాళ్ళు షాక్ అవుతారు. ఇంత కుట్ర చేస్తారా.. ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్దామని ప్రేమకి కాల్ చెయ్ అని నర్మద అనగానే ప్రేమకి కాల్ చేసి రప్పిస్తాడు. మరొకవైపు ఆ రౌడీ గాడు మన పేరు చెప్పి ఉంటాడని భాగ్యం వాళ్లు టెన్షన్ పడుతారు. ఇదంతా మీ వల్లే అని భాగ్యం వాళ్లపై శ్రీవల్లి కోప్పడుతుంది. అప్పుడే ప్రేమ, ధీరజ్, నర్మద వాళ్ళ దగ్గరికి వస్తారు. కూతురు కాపురం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని అత్తింటికి పంపేవాళ్లని చూసాను కానీ ఇలా ప్రాణం తీసే వాళ్లని మిమ్మల్ని చూసానని నర్మద అనగానే భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు. అంటే మేము ఏదో డమ్మీ ఆక్సిడెంట్ చేయిస్తే అల్లుడికి సేవలు చెయ్యడానికి కూతురిని తీసుకొని వెళ్తాడని ప్లాన్ చేసామని భాగ్యం అనగానే తన చెంప చెల్లుమనిపిస్తుంది నర్మద. నాది తప్పు చెల్లి.. మా అమ్మ మాటలు విని ఇలా చేసానని శ్రీవల్లి అనగానే తన చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. ఆ తర్వాత ఆనందరావుని ధీరజ్ కొడతాడు. మీరు పెళ్లి చెయ్యడానికి చేసిన మోసాలు అమూల్య విషయంలో చేసిన మోసం అంతా మావయ్య గారికి చెప్తామని నర్మద అంటుంది ముగ్గురు వెళ్లిపోతుంటే శ్రీవల్లి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. అంతా యాక్టింగ్ అని అనుకుంటారు కానీ నిజంగానే వల్లి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడికి చందు వస్తాడు. వల్లి అక్క కళ్ళు తిరిగి పడిపోయిందని నర్మద చెప్తుంది. అదంతా యాక్టింగ్ అని చందు అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్మద, ప్రేమ ఇద్దరు వల్లికి కంగ్రాట్స్ చెప్తారు. చందు మాత్రం కోపంగా ఉంటాడు. తరువాయి భాగంలో వల్లి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వల్లిని తీసుకొని వద్దాం పదా అని రామరాజు అంటుంటే అసలు వల్లి గురించి ఏం తెలుసని అని చందు అంటాడు. అప్పుడే వల్లిని తీసుకొని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 24, 2026.webp)
Podharillu : తమ్ముళ్ల కోసం పెళ్లిని వదులుకున్న మాధవ.. చక్రి సర్ ప్రైజ్తో మహా ఫిదా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -99 లో.....చక్రి, మాధవ గొడవపడతారు. అప్పుడే మహా వచ్చి వాళ్ళు అలా తయారు కావడానికి కారణం మీరే అని మాధవతో మహా అంటుంది. మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతానని మహా అనగానే కన్నా ఏడవడం మొదలుపెడుతాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ రా అని మహా అనగానే మీరు వెళ్ళిపోతానని అంటున్నారు కదా అని కన్నా అనగానే అదేం లేదు వాళ్లని బెదిరించడానికి అలా చెప్పానని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ తన వర్క్ చేస్తాడు. అప్పుడే కవిత ఫోన్ చేసి మాట్లాడుతుంది. మిమ్మల్ని కలవాలని అంటుంది. మాధవకి ఇష్టం లేకున్నా సరే అంటాడు. ఆ తర్వాత కవితని మాధవ కలుస్తాడు. కాఫీ ఆర్డర్ చేస్తుంది పెళ్లికి ముందే నా ఇష్టానికి విలువ ఇచ్చారు.. చాలా థాంక్స్ అని కవిత అంటుంది. మాధవకు ఏం అర్థం కాదు. ఆ తర్వాత మనం ఇల్లు ఎక్కడ తీసుకుందామని మాధవని కవిత అడుగుతుంది ఎందుకు మా ఇల్లు ఉంది కదా అని మాధవ అంటాడు. మీరు ఏం తెలియనట్లు మాట్లాడతారేంటి.. మనం సపరేట్ గా ఉంటాం అంటేనే కదా మా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుందని కవిత అనగానే మళ్ళీ వస్తానని మాధవ అక్కడ నుండి ఇంటికి కోపంగా వెళ్తాడు. లోపలకి వెళ్లి బ్యాగ్ తీసుకొని వస్తాడు. అదంతా చూసి మహా వాళ్ళు ఏమైందని అడుగుతారు. మీరు ఇదే కదా కోరుకుంది అని మాధవ అంటాడు. తన దగ్గర పెళ్లి తర్వాత సపరేట్ ఉండాలన్న విషయం దాచి ఉంచినందుకు మాధవ కోపంగా ఉంటాడు. నాతో మీకు అవసరం అయిపోయిందా అంటూ ఎమోషనల్ అవుతాడు మాధవ. అప్పుడే కవిత ఫోన్ చేస్తుంది. ఇప్పుడే కాదు నా తమ్ముళ్ళని ఎప్పటికి వదిలి రానని కవితతో మాధవ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.ఆ తర్వాత తమ్ముళ్ళని ఎలా పెంచాడో మాధవ చెప్తుంటే ముగ్గురు తమ్ముళ్లు కాళ్ళు పట్టుకొని ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు మాధవ దగ్గరికి మహా వస్తుంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది అని మహా అనగానే ఇందులో కథానాయిక నువ్వే అని తెలుసు అని మాధవ అంటాడు. మరి కోపం రాలేదా అని మహా అడుగుతుంది. మీరు నా గురించి ఆలోచించారు కదా అని మాధవ అంటాడు. ఆ తర్వాత మహాకి సర్ ప్రైజ్ అంటూ చక్రి తనని తీసుకొని యూనివర్సిటికి వెళ్తాడు. మీరు ఇక్కడ మీ సర్టిఫికెట్స్ గురించి అప్లికేషన్ చేసుకోవచ్చు.. అదే మీకు సర్ ప్రైజ్ అని మహాతో చక్రి అనగానే మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహా లోపలికి వెళ్తుంటే అక్కడ కొంతమంది అమ్మాయిలు చక్రిని చూస్తారు. ఆ అమ్మాయిలు ఏంటి నిన్ను చూస్తున్నారని మహా అడుగుతుంది. నాకేం తెలుసు అని చక్రి అంటాడు. షర్ట్ బటన్స్ విప్పుకొని వస్తుంటే చూడరా అని మహా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 24, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



