
దిల్ రాజు బ్యానర్లో భారీ మల్టీస్టారర్.. 2027 సంక్రాంతి రిలీజ్ టార్గెట్!
టాలీవుడ్ లో ఒక క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు (Sree Vishnu) కలిసి ఒకే స్క్రీన్పై సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు ఎనర్జిటిక్ హీరోల కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించనున్నారు. 'రాజా రాజ చోర' వంటి వైవిధ్యమైన సినిమాలతో మెప్పించిన హసిత్ గోలి, ఈసారి ఈ ఇద్దరు హీరోల బాడీ లాంగ్వేజ్కు సరిపోయేలా ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోల కాంబో అనౌన్స్మెంట్ రాక ముందే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. దిల్ రాజు నిర్మాణ విలువలు, రవితేజ మాస్ అప్పీల్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్గా మార్చబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పక్కా ప్రణాళికతో మేకర్స్ షూటింగ్ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ సర్కిల్స్ నుండి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. చిత్రబృందం ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సంక్రాంతి రేసులో నిలపాలని ఫిక్స్ అయింది. ఈ మల్టీస్టారర్ మూవీని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలో విడుదల చేయడమే లక్ష్యంగా మేకర్స్ వర్క్ ప్లాన్ సెట్ చేసుకున్నారు. సాధారణంగానే టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే సినిమాల పండగ. అలాంటిది రవితేజ, శ్రీ విష్ణు కాంబినేషన్ లో ఎంటర్టైనర్ అంటే థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పక్కా కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను సైతం ఆకట్టుకునే విధంగా దర్శకుడు హసిత్ గోలి ఈ కథను మలిచారని, దిల్ రాజు సైతం ఈ ప్రాజెక్ట్ పై ఎంతో నమ్మకంగా ఉన్నారని టాక్.
Jun 30, 2026 4:23PM
NTRxTrivikram: బిగ్ సర్ప్రైజ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్!
కొన్ని కాంబినేషన్లు కేవలం రికార్డుల కోసమే కాకుండా, ప్రేక్షకులలో ఒక సరికొత్త ఊహల ప్రపంచాన్ని సృష్టించడానికి పుట్టుకొస్తాయి. అలాంటి ఒక మైలురాయి లాంటి కలయికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) లది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఈ క్రేజీ కాంబో మళ్లీ పట్టాలెక్కబోతోందని అధికారిక ప్రకటన రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది. అయితే ఈసారి త్రివిక్రమ్ కలానికి ఉన్న పదును కేవలం ఒక ఫ్యామిలీ డ్రామాకో లేదా కమర్షియల్ యాక్షన్ కో పరిమితం కావడం లేదు. సరిహద్దులు లేని ఒక భారీ కాన్వాస్ పై, దైవత్వంతో కూడిన ఒక అద్భుతమైన పౌరాణిక యుద్ధగాథను ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధభూమి నేపథ్యంలో లార్డ్ మురుగన్ ఆయుధమైన శక్తివంతమైన ఈటె, మానవ డిఎన్ఏ ఆకృతితో ముడిపడి ఉన్న దృశ్యం ప్రేక్షకులలో ఎన్నో సరికొత్త ఆలోచనలను రేకెత్తించింది. తాజాగా అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏకంగా రెండు విభిన్నమైన, అత్యంత శక్తివంతమైన దైవిక అవతారాలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తారక్ ఈ సినిమాలో ఒకేసారి తండ్రి మరియు కొడుకులైన పరమశివుడు (Lord Shiva), అలాగే కుమారస్వామిగా (Lord Muruga) ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. "ద సన్... ద ఫాదర్... ఒన్ ఎటర్నల్ లెగసీ" అనే కాన్సెప్ట్ తో నడిచే ఈ కథాంశం వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా మారబోతోంది. త్రివిక్రమ్ రాసుకున్న ఈ అద్భుతమైన కథాంశం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకునేలా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. "ఉత్తరాదిన జన్మించి, మధ్యభారతంలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్న దైవం" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ విజువల్ ఎపిక్ కు రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలలో చూపించిన విశ్వరూపాన్ని తలపిస్తూ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా లార్డ్ శివ, లార్డ్ మురుగన్ పాత్రలలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ రెండు దివ్య అవతారాలలో తారక్ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి!
Jun 30, 2026 9:22AM
Balakrishna: మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ ప్లాన్.. బాలయ్యతో భారీ మల్టీస్టారర్!
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఊహించని మలుపులు తిరుగుతోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి రకరకాల చర్చలు నడిచినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వైపు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. బాలయ్య మార్కెట్, ఆయనకున్న మాస్ ఇమేజ్ కు తగినట్లుగా వివేక్ ఆత్రేయ ఒక విభిన్నమైన లైన్ సిద్ధం చేసినట్లు టాక్. బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ రవితేజ (RaviTeja) చేతుల్లోకి వెళ్లినట్టు న్యూస్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, మళ్ళీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాలయ్య చేతికే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరో సెన్సేషనల్ అప్డేట్ ఏంటంటే, ఇందులో కేవలం బాలకృష్ణ మాత్రమే కాకుండా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్న మోహన్ లాల్, ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఆ మజానే వేరు. ఒకవైపు బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మరోవైపు మోహన్ లాల్ క్లాసిక్ పర్ఫార్మెన్స్ తో కూడిన ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ క్రేజీ కాంబినేషన్ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ మైత్రీ-వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ గనుక ఈ విధంగా బాలయ్య, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఫైనల్ అయితే, ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్ సెట్ అయిన పక్షంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మాస్ మహారాజా రవితేజ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ను లైన్ లోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది. రవితేజ ఎనర్జీకి, మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్కు మైత్రీ లాంటి పెద్ద బ్యానర్ తోడైతే ఆ ప్రాజెక్ట్ కూడా క్రేజీగా మారడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది.
Jun 29, 2026 4:31PM
Vishwambhara: 'విశ్వంభర' విషయంలో ఊహించని ట్విస్ట్.. చిరంజీవి సంచలన నిర్ణయం!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని, ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే చిత్రబృందం దృష్టి పెట్టబోతోందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర కథలో ఊహించని విధంగా ఒక కొత్త ఎపిసోడ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. సినిమాను మరింత నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు, ప్రేక్షకులకు థియేటర్లలో రోమాంచిత అనుభూతిని అందించేందుకు గానూ ఒక అద్భుతమైన కొత్త ఎపిసోడ్ను యాడ్ చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. దర్శకుడు వశిష్ట రాసుకున్న ఈ కొత్త సీన్ల స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవికి కూడా విపరీతంగా నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ షూటింగ్ కోసమే చిరంజీవి మరో 4 నుండి 5 రోజుల పాటు తన విలువైన కాల్షీట్లను ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు. ఈ కొన్ని రోజుల కొత్త షెడ్యూల్ గనుక విజయవంతంగా పూర్తయితే, ఇక విశ్వంభర సినిమా షూటింగ్కు అధికారికంగా పూర్తిగా పేకప్ చెప్పేసినట్లేనని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ కొత్త ఎపిసోడ్లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన అద్భుతమైన యాక్షన్ లేదా కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఉండబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం మేకర్స్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ అదనపు 4-5 రోజుల షూటింగ్ సినిమాకు చాలా కీలకంగా మారబోతోంది. ఇక మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై కూడా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ వసూళ్లకు ఎంతగానో కలిసి వస్తుందని భావిస్తున్నారు. గ్రాఫిక్స్ పనుల ఆలస్యం కాకుండా సకాలంలో పూర్తయితే దసరా రేసులో మెగాస్టార్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
Jun 29, 2026 2:58PM
Rashmika: మైండ్ బ్లోయింగ్ న్యూస్.. అల్లు అర్జున్పై పగబట్టిన రష్మిక మందన్న!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో రూపుదిట్టుకుంటున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘రాకా’(Raaka). సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ అప్డేట్ తెగ హల్చల్ చేస్తోంది. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో వెండితెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పండించి, అంతర్జాతీయంగా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) హిట్ కాంబో ఈ సినిమాతో మరోసారి రిపీట్ కాబోతోంది. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక మైండ్ బ్లోయింగ్ షాక్ను ఇవ్వబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బన్నీతో కేవలం రొమాన్స్ చేసి అలరించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఈ సినిమాలో మొదటిసారిగా పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. కథ ప్రకారం ఈ ప్రధాన విలన్ పాత్రను దర్శకుడు అట్లీ మొదట ఒక స్టార్ మేల్ యాక్టర్ కోసం రాసుకున్నప్పటికీ, కథలో మరింత ఇంటెన్సిటీ మరియు సరికొత్త ఎడ్జ్ తీసుకురావడం కోసం స్క్రిప్ట్లో జెండర్ ఫ్లిప్ చేసి, ఆ పవర్ఫుల్ అంటాగోనిస్ట్ పాత్రను రష్మిక మందన్నకు ఆఫర్ చేశారు. రష్మిక ఆ పాత్ర క్యారెక్టరైజేషన్కు పూర్తిగా ఫిదా అయిపోయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గుండుతో, కళ్లకు కాటుక పెట్టుకుని ‘వేర్-బీస్ట్’ (జంతువుగా మారే మనిషి) తరహా విభిన్నమైన అవతారంలో నటిస్తుండగా, రష్మిక మందన్న తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ మరియు డార్క్ రోల్లో బన్నీని ఢీకొట్టే పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ముంబై షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఎగురుతున్న ఫ్లైట్ నేపథ్యంలో వచ్చే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ను అట్లీ అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ఒక వీరనారి తరహా పాత్రలో ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027 వేసవి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Jun 27, 2026 4:48PM
హార్దిక్ పాండ్యాని వివాహం చేసుకున్న ప్రముఖ హీరోయిన్!.. పిక్స్ వైరల్
మహీకా శర్మ.. మోడల్ గా కెరీర్ సార్ట్ చేసి బాలీవుడ్ లో పలు చిత్రాల్లో చేసింది. ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మహీకా గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. 2025 సెప్టెంబర్లో మహీకా ఇన్స్టాగ్రామ్ పోస్టులలో హార్దిక్ కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాతి నెలలోనే అంటే 2025 అక్టోబర్లో ఈ జంట ముంబై విమానాశ్రయంలో తొలిసారిగా కలిసి కనిపిస్తూ తమ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి తరచుగా తమ ఫొటోలు, వీడియోలని పంచుకుంటున్నారు. ఇటీవలి ఐపీఎల్ 2026 సీజన్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్లలో కూడా హార్దిక్ను ఉత్సాహపరుస్తూ మహీకా స్టేడియంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఈ జంటకి సంబంధించిన ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఆధారంగా హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఆ ఫొటోలో మహీకా శర్మ సాంప్రదాయ రీతీలో సిందూరం, నుదుటిపై ఎర్రటి బొట్టు కనిపిస్తున్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా నుదుటిపై కూడా పూజా తిలకం ఉంది. వారిద్దరి పక్కపక్కనే ఒక వృద్ధురాలు నిల్చోగా, ఆ వృద్ధురాలు వీరిద్దరి చేతులని పట్టుకుని ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. ఈ ఫొటో బయటకు రావడంతో, వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి పీటలెక్కారని, అందుకే మహీకా సంప్రదాయబద్ధంగా సిందూరం ధరించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Also read: Venkatesh: వెంకటేష్ కి ఇంత డిమాండ్ ఎందుకు.. వరుసగా క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు! అయితే, ఈ వైరల్ వార్తల్లో మరియు ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వీరి వివాహం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ప్రచారంపై హార్దిక్ పాండ్యా గానీ, మహీకా శర్మ గానీ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. గత ఏడాది కాలంగా తమ బంధం గురించి చాలా బహిరంగంగా ఉంటూ వస్తున్న ఈ జంట, నిజంగా పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని కచ్చితంగా అభిమానులతో పంచుకునే వారని వారి సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. బహుశా ఏదైనా ప్రైవేట్ ట్రిప్ లేదా పూజా కార్యక్రమంలో భాగంగా వారు కలిసిన ఒక వృద్ధురాలితో ఈ ఫొటో తీసుకుని ఉండవచ్చని, అక్కడ పూజ ముగించుకున్న తర్వాతే మహీకా నుదుటిపై ఆ బొట్టు, సిందూరం వచ్చాయని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మహీకా వేలికి ఉన్న పెద్ద డైమండ్ రింగ్ చూసి నిశ్చితార్థం జరిగిందని ప్రచారం జరగగా, ఆమె కేవలం "నాకు మంచి జ్యువెలరీ ధరించడం ఇష్టం" అంటూ ఆ పుకార్లను కొట్టిపారేసింది. హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియన్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరు 2024 జులైలో తో విడాకులు తీసుకోగా ఇరువురికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.
Jun 27, 2026 3:10PM
'విశ్వంభర' డైరెక్టర్తో వెంకటేష్ భారీ మూవీ.. ఇప్పటివరకు టచ్ చేయని కొత్త జోనర్!
విక్టరీ వెంకటేష్ (Venkatesh) వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైనర్లతో అలరిస్తున్న వెంకీ మామ, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్నింటినీ చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' చేస్తున్నారు. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సంక్రాంతి టార్గెట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత వెంకటేష్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను డైరెక్టర్ వశిష్ట(Director Vassishta)తో చేయడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘బింబిసార’ వంటి టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ బ్లాక్బస్టర్తో టాలీవుడ్ను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న వశిష్ట, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ విజువల్ వండర్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్తో సుమారు 150 కోట్ల పైచిలుకు బడ్జెట్తో రూపొందుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వశిష్ట, విక్టరీ వెంకటేష్ తో చేతులు కలపబోతున్నట్లు వినికిడి. వెంకటేష్ కోసం వశిష్ట ఒక విభిన్నమైన లైన్ సిద్ధం చేశారట. వెంకటేష్ కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఒక కొత్త జోనర్లో, మైథాలజీ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక వినూత్న కథను వశిష్ట వినిపించగా, దానికి వెంకీ ఇంప్రెస్ అయి వెంటనే సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వెంకటేష్ నటుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే నల్లమలపు బుజ్జి నిర్మాణంలో వెంకటేష్ నటించిన ‘లక్ష్మి’, ‘చింతకాయల రవి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. సుదీర్ఘ విరామం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, నల్లమలపు బుజ్జి కలిసి వెంకటేష్తో ఈ భారీ బడ్జెట్ సినిమాను బ్యాంక్రోల్ చేయనుండటం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత, వశిష్ట కూడా చిరంజీవి సినిమా బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యాక ఈ కొత్త ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని తెలుస్తోంది.
Jun 26, 2026 1:19PM
అఖిల్ 'లెనిన్' మూవీలో ఊహించని సర్ప్రైజ్.. ఆ గెస్ట్ రోల్ ఎవరిదో తెలుసా?
అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin) ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుండి ఎంతో నమ్మకంగా చెబుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్లలో అక్కినేని అభిమానులకు గూస్బంప్స్ తెప్పించే రేంజ్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో పవర్ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా కథను మలుపు తిప్పే కీలకమైన సెకండాఫ్ లో ఈ సర్ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారం. దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు సాగే ఈ అతిథి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ గెస్ట్ రోల్ కి సంబంధించిన వివరాలను చిత్రబృందం ఎంతో రహస్యంగా ఉంచినప్పటికీ, అక్కినేని అభిమానుల్లో మాత్రం ఈ సర్ప్రైజ్ గెస్ట్ ఎవరై ఉంటారా అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఒక్క ఎలిమెంట్ సినిమా రేంజ్ ని మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా యూత్ ని ఆకట్టుకునే లవ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయట. సినిమా ఫైనల్ అవుట్పుట్పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ పవర్ఫుల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ తో అఖిల్ అక్కినేని ఈసారి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.
Jun 25, 2026 5:15PM
ప్రభాస్ డైరెక్టర్తో జతకట్టనున్న రవితేజ.. మారుతీతో మాస్ రాజా నెక్స్ట్ మూవీ!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద జాతర చేయడం ఆయన నైజం. ప్రస్తుతం రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి' (Irumudi) షూటింగ్లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ మూవీ లైనప్ను మరింత పవర్ఫుల్గా సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'ఇరుముడి' తర్వాత రవితేజ డైరెక్టర్ మారుతీ(Maruthi)తో జతకట్టబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మారుతీ ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్తో తెరకెక్కించిన భారీ హర్రర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 'రాజాసాబ్' తర్వాత మారుతీ తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే మారుతీ ఇటీవల రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లైన్ను వినిపించారట. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి సరిగ్గా సరిపోయేలా ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ స్క్రిప్ట్ ఉండబోతోందని టాక్. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని గత 3, 4 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం దొరకడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్తో పాటు రవితేజ లైనప్లో మరికొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా లైన్లో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో హాసిత్ గోలి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయతో మరో సినిమా చర్చల దశలో ఉన్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి కూడా రవితేజ కోసం ఒక పవర్ఫుల్ మాస్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఏదేమైనా 'ఇరుముడి' తర్వాత మారుతీ దర్శకత్వంలో రాబోయే సినిమా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ ఎనర్జీ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఖుషీ అవుతున్నారు.
Jun 22, 2026 4:57PMసీక్రెట్ లవ్కు సైలెంట్గా బ్రేకప్.. ధనుష్, మృణాల్ షాకింగ్ డెసిషన్?
సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వార్తలు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్లోనూ ఒక షాకింగ్ గాసిప్ తీవ్ర కలకలం రేపుతోంది. వైవిధ్యమైన నటనతో మెప్పించే స్టార్ హీరో ధనుష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తోందని ప్రచారం జరిగిన ప్రేమాయణం ఇప్పుడు ముగిసిందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా వినిపించిన ఊహాగానాలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధనుష్, మృణాల్ తమ బంధానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారట. ఎవరి కెరీర్పై వారు దృష్టి పెట్టేందుకు పరస్పర అంగీకారంతోనే ఈ క్రేజీ జంట సైలెంట్గా విడిపోయినట్లు ట్రెండ్ అవుతున్న వార్తల సారాంశం. అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, అప్పుడే విడిపోవడానికి దారితీసిన కారణాలు ఏంటనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉన్నాయి. ఈ విడిపోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఈ ప్రచారంపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. గతంలో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్లో ధనుష్ సందడి చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు తారలు పలుమార్లు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లి దుస్తుల ఏఐ ఫొటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Jun 20, 2026 8:01PM
'ది ప్యారడైజ్' మూవీకి ఓటీటీ టెన్షన్.. నాని, శ్రీకాంత్ ఓదెలపై నెట్ఫ్లిక్స్ ఒత్తిడి!
న్యాచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise). బ్లాక్బస్టర్ సినిమా 'దసరా' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్కు ఒక ఊహించని తలనొప్పి వచ్చి పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, మరోవైపు డిజిటల్ పార్ట్నర్ అయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) నుంచి రిలీజ్ డేట్ కోసం విపరీతమైన ఒత్తిడి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పరిస్థితితో అటు హీరో నాని, ఇటు నిర్మాత తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. నిజానికి, ఈ సినిమా షూటింగ్ను మొదట మార్చి 27న విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. కానీ, క్వాలిటీ విషయంలో రాజీపడని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరికొంత సమయం కావాలని కోరడంతో మేకర్స్ ఆగస్టు 21కి రిలీజ్ డేట్ను మార్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 21 నాటికి కూడా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అసాధ్యమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా దాదాపు 60 రోజుల షూటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ 60 రోజుల టాకీ, యాక్షన్ పార్ట్ పూర్తయిన తర్వాతే మొత్తం సినిమాను ఎడిటింగ్ టేబుల్పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆపై భారీ ఎత్తున పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలి. ఈ భారీ ఆలస్యం కారణంగా మేకర్స్ అనధికారికంగా ఆగస్టు 21 రిలీజ్ డేట్ను కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు డిసెంబర్ నెలను టార్గెట్గా పెట్టుకుని వర్క్ ప్లాన్ చేసుకుంటుండగా, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ మాత్రం దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం ముందుగా అనుకున్న విండోలోనే అంటే సెప్టెంబర్ నాటికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ అంతకంటే ఆలస్యమైతే ఓటీటీ రైట్స్ కోసం కుదుర్చుకున్న డీల్ ప్రైస్ను భారీగా తగ్గించాల్సి ఉంటుందని నెట్ఫ్లిక్స్ హెచ్చరించినట్లు సమాచారం. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో, ఓటీటీ రేట్ తగ్గితే నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆలస్యం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓటీటీ రైట్స్ అమౌంట్ తగ్గితే భరించడం కష్టం. గతంలో 'పెద్ది' సినిమా మేకర్స్ కూడా రీషూట్ల కోసం సమయం కావాలనుకున్నా, ఓటీటీ రైట్స్ ప్రెజర్ మరియు బడ్జెట్ ఇష్యూస్ వల్ల జూన్ 4వ తేదీనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 'ది ప్యారడైజ్' కూడా అదే తరహా సమస్యను ఎదుర్కొంటోంది. అందుకే కనీసం దసరా పండుగ కానుకగా అయినా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి సినిమాను సిద్ధం చేయాలని నిర్మాత దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెల ఈ డెడ్లైన్ను ఎలా అందుకుంటారో చూడాలి.
Jun 18, 2026 5:15PM
టాలీవుడ్లో ఊహించని ట్విస్ట్.. మారిన చిరంజీవి, వెంకటేష్ సినిమాల రిలీజ్ ప్లాన్స్!
టాలీవుడ్ లో ఎప్పుడు ఏ క్షణంలో సమీకరణాలు మారిపోతాయో ఊహించడం చాలా కష్టం. అగ్ర హీరోల ప్రాజెక్టుల లైనప్, వాటి షూటింగ్ వేగం ఆధారంగా రిలీజ్ డేట్స్ లో ఊహించని మార్పులు చోటుచేసుకోవడం ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెద్ద ప్రాజెక్టుల కంటే ముందే, ఈ స్టార్ హీరోలు లైన్ లో పెట్టిన ఇతర దర్శకుల సినిమాలు థియేటర్లలోలోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఈ పరిణామాలు మెగా ఫ్యాన్స్ తో పాటు విక్టరీ వెంకటేష్ అభిమానుల్లో కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రాజెక్టుల విషయానికి వస్తే, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ పనులను మేకర్స్ ఎంతో క్వాలిటీతో ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజా ట్రేడ్ టాక్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'మెగా 158', ‘విశ్వంభర’ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోందని సమాచారం. విశ్వంభర సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈ లోపు బాబీ డైరెక్షన్ లో చేసే ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి థియేటర్లలోకి దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా వినబడుతోంది. 'మెగా 158'ను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు విక్టరీ వెంకటేష్ (Venkatesh) లైనప్ లో కూడా ఇలాంటి ఆసక్తికరమైన మార్పులే కనిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' (Aadarsha Kutumbam House No: 47) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, జూన్ లోనే షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే ఈ కొత్త ప్రాజెక్ట్ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలోలోకి రానుంది. అనిల్ రావిపూడి మార్క్ స్పీడ్ తో ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తుండటంతో, త్రివిక్రమ్ తో వెంకీ చేయబోయే సినిమా కొంచెం ఆలస్యం కానుందని న్యూస్ వినిపిస్తోంది. ఇలా ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఒకదాని కంటే ఒకటి ముందుగా రిలీజ్ రేసులోకి రావడం బాక్సాఫీస్ వద్ద కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్, అలాగే వెంకటేష్-అనిల్ రావిపూడి ల సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల అఫీషియల్ రిలీజ్ డేట్స్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Jun 18, 2026 11:16AM
బుచ్చిబాబు కాదు.. ఆ సంచలన దర్శకుడితోనే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్పై ఉండగానే, మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ గట్టిగా నడుస్తోంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా సుదీర్ఘ కాలం పడుతుంది, ఆ తర్వాత మహేష్ బాబును అంతకంటే పవర్ఫుల్గా వెండితెరపై చూపించే దమ్మున్న దర్శకుడు ఎవరు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఈ రేసులోకి ఇప్పటికే 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో పాటు పలువురు టాప్ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు నెట్టేస్తూ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తన మార్క్ బోల్డ్, ఇంటెన్స్ మేకింగ్తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల రాత మార్చిన సందీప్ రెడ్డి వంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ ఆడియన్స్ చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్రేజీ వెయిటింగ్కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడిందని, ఈ మైండ్ బ్లోయింగ్ కాంబో దాదాపు ఖరారైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇమేజ్కు, సందీప్ రెడ్డి వంగా నయా టేకింగ్కు సరిపోయేలా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి 'వారణాసి' చిత్రం తర్వాత మహేష్ బాబు ఇమేజ్ గ్లోబల్ వైడ్గా మారిపోవడం ఖాయం కాబట్టి, దానికి తగ్గట్టుగానే సందీప్ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఈ కథను ప్లాన్ చేశారట. సూపర్ స్టార్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్కు, సందీప్ రెడ్డి వంగా మార్క్ అల్ట్రా వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి సినిమా ముగిసేలోపే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ మూవీ చేస్తున్నారు. 'స్పిరిట్' పూర్తి కాగానే, మహేష్ ప్రాజెక్ట్ పైకి సందీప్ రెడ్డి ఫోకస్ షిఫ్ట్ అయ్యే అవకాశముంది.
Jun 16, 2026 5:10PM
పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’లో ప్రభాస్.. గూస్బంప్స్ తెప్పించే క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంతటి ఒక భారీ ప్రకంపన సృష్టించే క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా 'OG' చిత్రానికి సీక్వెల్గా 'OG 2' రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ లోకి రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సరికొత్త లీక్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూమెంట్గా మిగిలిపోవడం ఖాయం. పవర్ స్టార్ మరియు రెబల్ స్టార్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాలర్స్ ఎగరేస్తున్నారు. ఈ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. ప్రస్తుతం విదేశాల్లో స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సుజీత్, మరో 10 రోజుల్లో ఇండియాకు తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే నేరుగా పవన్ కళ్యాణ్ను కలిసి 'OG 2' ఫుల్ స్క్రిప్ట్ ను నరేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫైనల్ నరేషన్ మాత్రమే పెండింగ్లో ఉందని, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం ప్రాజెక్ట్ అఫీషియల్గా ఎనౌన్స్ అవుతుందని సమాచారం. 'OG' పార్ట్ వన్ లోనే సుజీత్ తన గత చిత్రం 'సాహో' కథకు, ఈ 'ఓజీ' కథకు ఒక ఇంటర్లింక్ పెట్టేసాడనే టాక్ బలంగా నడుస్తోంది. ఇప్పుడు ఆ కనెక్షన్ను మరింత పెంచుతూ 'OG 2' లో ప్రభాస్ చేత ఒక పవర్ఫుల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇప్పించేందుకు సుజీత్ ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. ఈ భారీ 'సాహో' క్రాస్ ఓవర్ తో టాలీవుడ్ లోనే ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించిన టైమ్లైన్ కూడా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ టీమ్ ఈ సినిమా సీక్వెల్ను కన్ఫర్మ్ చేయగా, మేకర్స్ రాబోయే సెప్టెంబర్ నెలలో అధికారికంగా ఈ సినిమాను అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కేవలం రెండు నెలల గ్యాప్ లోనే, అంటే నవంబర్ నుంచి 'OG 2' రెగ్యులర్ షూటింగ్ను పట్టాలెక్కించేలా పక్కా ప్లానింగ్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లుక్ కు తోడు, ప్రభాస్ 'సాహో' క్యారెక్టర్ తో క్యామియో తోడైతే బాక్సాఫీస్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సుజీత్ సృష్టించబోయే ఈ బిగ్గెస్ట్ యాక్షన్ విజువల్ వండర్ కోసం ఇరు హీరోల అభిమానులు ఇప్పటి నుంచే వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Jun 16, 2026 3:30PM
Ram Charan: శ్రీకాంత్ ఓదెలతో రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్.. సుకుమార్ మూవీ పరిస్థితి ఏంటి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం నెక్ట్స్ లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, తాజాగా విడుదలైన 'పెద్ది' సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సూపర్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్లోనే తన భవిష్యత్తు చిత్రాల లైన్అప్ను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక ప్రాజెక్ట్ కమిటై ఉన్న రామ్ చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి కలయికలో సినిమా రాబోతోందనే టాక్ సినీ వర్గాల్లో ఒక రేంజ్ హల్చల్ సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ నానితో 'దసరా' వంటి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించి, మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఆయన అంతకుమించిన ఒక అత్యంత పవర్ఫుల్ మరియు ఊరమాస్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సెన్సెషనల్ డైరెక్టర్ నానితో 'ది ప్యారడైజ్' అనే సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాలు పూర్తిగా పూర్తి అయిన తర్వాతే, శ్రీకాంత్ ఓదెల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తన తదుపరి భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చూపించిన ఊరమాస్ పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అలాగే తాజాగా విడుదలైన 'పెద్ది' సినిమాలో కూడా చరణ్ నటనకు, ఆయన మాస్ లుక్కు అభిమానులతో సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటికీ మించి, మరింత ఊరమాస్ లుక్తో పాటు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టరైజేషన్ను శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో రామ్ చరణ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్టింగ్ స్టామినా తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. మెగా అభిమానులు ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, రామ్ చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన లీకులు అందుతున్నాయి. చిరంజీవి సినిమా తర్వాత చరణ్ ప్రాజెక్ట్ లైన్లోకి రానుండటంతో మెగా కాంపౌండ్లో ఈ కాంబో సరికొత్త సంచలనంగా మారింది. మరి ఈ క్రేజీ అండ్ సెన్సేషనల్ కాంబినేషన్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఒకవేళ ఈ మాస్ కాంబో అధికారికంగా సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట మొదలవడం ఖాయం.
Jun 16, 2026 12:02PM
చేతులు మారిన భారీ ప్రాజెక్ట్.. ఎన్టీఆర్ ప్లేస్లో సూర్య?
కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్లోనూ క్రేజీ కాంబినేషన్లకు సంబంధించిన గాసిప్స్ ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతుంటాయి. తాజాగా తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), బ్లాక్బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతోందనే వార్త నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ మీడియా ఈ ఇద్దరి కలయికపై రకరకాల ఆసక్తికరమైన కథనాలను ప్రచురిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరు అగ్రశ్రేణి దిగ్గజాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెరవెనుక ఒక సాలిడ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) చిత్రాన్ని సితార సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్య 50వ చిత్రం కోసం ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేయడానికి ప్రొడ్యూసర్ నాగవంశీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ ఇదివరకే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ ప్రాజెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తారని కూడా గతంలో నాగవంశీ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇదే బ్యానర్ లో నెల్సన్ డైరెక్ట్ చేయబోయే సినిమా కోసం సూర్య రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ తో అనుకున్న కథలోకి సూర్య వస్తున్నాడా లేక ఇది వేరే కథనా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల 'కరుప్పు' (Karuppu) సినిమాతో భారీ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న సూర్య, ప్రస్తుతం ఒక ఇంటెన్స్ సినిమా తర్వాత పూర్తిస్థాయి లైట్-హార్టెడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నారట. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ సూర్య బాడీ లాంగ్వేజ్కు పక్కాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ను కుదర్చడానికి నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నారని, నెల్సన్ కూడా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హీరో సూర్య ప్రస్తుతం 'ఆవేశం' చిత్ర దర్శకుడు జితు మాధవన్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత ఆయన '5 రూపీ డాక్టర్' (5 Rupee Doctor) బ్యాక్డ్రాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న జ్ఞానవేల్ చిత్రంలో జాయిన్ కావలసి ఉంది. ఆ ఇంటెన్స్ స్టోరీ పూర్తయిన తర్వాతే నెల్సన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు దర్శకుడు నెల్సన్ కూడా తన తదుపరి కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో 'జైలర్ 2' (Jailer 2) చిత్రంతో పాటు, రజనీ-కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ను కూడా ఆయన లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన 'డ్రాగన్' (Dragon) సినిమాను పూర్తి చేయడంతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ లోగా నెల్సన్ డేట్స్ ని వాడుకుంటూ, సూర్యతో 50వ సినిమాను సితార ప్రొడక్షన్స్ బ్యానర్లో పట్టాలెక్కించడానికి నాగవంశీ స్కెచ్ వేసినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ గనుక అధికారికంగా అనౌన్స్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
Jun 15, 2026 5:21PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)


