
టాలీవుడ్ డైరెక్టర్ స్కెచ్.. భారీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లో సాయి పల్లవి.!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెప్పే ఈ లేడీ పవర్ హౌస్, ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో క్లాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు తిరుమల కిషోర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక భారీ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. దర్శకుడు తిరుమల కిషోర్ ఈ కథను ప్రత్యేకంగా సాయి పల్లవి ఇమేజ్ను, ఆమె అద్భుతమైన నటనా ప్రతిభను దృష్టిలో ఉంచుకునే రాసుకున్నారట. ఇటీవల సాయి పల్లవిని కలిసి ఆయన ఈ విభిన్నమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో సానుకూలంగా స్పందించారని తెలిసింది. సాధారణంగా కథల ఎంపికలో బాగా జాగ్రత్తలు తీసుకునే సాయి పల్లవి, ఈ స్క్రిప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మొగ్గు చూపడం చూస్తుంటే కథ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి పల్లవికి ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది. Sai Pallavi, Lady Oriented Movie, Kishore Tirumala, Tollywood, Telugu Cinema
Jul 23, 2026 3:21PM
అల్లు అర్జున్ సరసన మళ్లీ బుట్టబొమ్మ.. హాట్ టాపిక్గా మారిన న్యూస్.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్ట్లతో దూసుకుపోతున్నారు. 'పుష్ప' సిరీస్ తెచ్చిన కనీవినీ ఎరుగని విజయం తర్వాత, బన్నీ ఎంచుకునే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నారనే వార్త సినీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది. కోలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా లోకేష్కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో ఉండే ఎఫెక్టివ్ స్క్రీన్ప్లే, డార్క్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే అల్లు అర్జున్ కింగ్ సైజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలోనే సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సంచలన కలయికకు సంబంధించి ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, వీరిద్దరూ కలిసి నటించబోతున్న మూడో సినిమా ఇది అవుతుంది. గతంలో 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో బన్నీ, పూజాల మధ్య పండిన కెమిస్ట్రీ, 'బుట్టబొమ్మ' పాటలో వారి డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ కాంబినేషన్ తెచ్చిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే హిట్ పెయిర్ తెరపైకి రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ గత చిత్రం 'కూలీ'లో మోనికా సాంగ్ తో పూజ మెస్మరైజ్ చేయడం విశేషం. పైగా, లోకేష్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను డిజైన్ చేసే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కేవలం గ్లామర్కే పరిమితం చేయకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలుగా తీర్చిదిద్దడం ఆయన శైలి. అలాంటి విలక్షణమైన టేకింగ్లో పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ కాంబినేషన్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే మూవీ టీమ్ దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. AA23, Allu Arjun, Lokesh Kanagaraj, Pooja Hegde
Jul 22, 2026 9:34AM
ఊహించని లేడీ విలన్ ని సెట్ చేసారా..ప్రెజెంట్ అదిరిపోయే హీరోయిన్ కదా!
రికార్డులే లక్ష్యంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(koratala siva)మూవీ తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే. అధికారకంగా లాంచ్ అయిన ఈ మూవీ గురించి అభిమానుల్లో, మూవీ లవర్స్ లో అయితే రోజు డిస్కర్షన్ జరుగుతూనే ఉందంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. NBK 112 గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర న్యూస్ హల్ చల్ చేస్తుంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న ఐశ్వర్య రాజేష్NBK 112 లో కీలక రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకే పరిమితమయ్యే భామలు నెగిటివ్ షేడ్స్ వైపు చూడటం చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కేవలం ఒక గ్లామర్ డాల్ లాగానో లేదా సాధారణ హీరోయిన్గానో కాకుండా, కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ లేడీ విలన్ రోల్లో కనిపించనుందని టాక్. కొరటాల శివ మార్క్ సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు పాత్రల మధ్య ఉండే బలమైన ఘర్షణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ పాత్రతో తలపడేలా, కథలో 100 శాతం ప్రాధాన్యత ఉండేలా ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ని కొరటాల శివ అత్యంత పవర్ఫుల్గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య నటనలోని రౌద్ర రసానికి, ఐశ్వర్య రాజేష్ చూపించే నెగిటివ్ షేడ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. also read: నేషనల్ అవార్డు రాగానే ఆ మూవీ కోసం నెటిజన్స్ వెతుకులాట..ఎంతైనా ప్రేక్షకులు కదా! ఐశ్వర్య రాజేష్ ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో విలక్షణమైన రోల్స్ పోషిస్తూ వస్తుంది. అలాంటిది ఐశ్వర్యకి ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి కానుంది. గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ చేసిన 'నీలాంబరి' లాంటి పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా సైకో క్యారెక్టర్లు చేయాలని బలంగా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. సరిగ్గా ఇప్పుడు కొరటాల శివ అలాంటి ఒక డ్రీమ్ రోల్ని ఆఫర్ చేసినట్లు వార్తలు రావడం చూస్తుంటే, ఐశ్వర్య ఆశ నెరవేరేలా కనిపిస్తోంది. కాకపోతే ప్రస్థుతానికి అయితే ఈ న్యూస్ రూమర్ హోదాలో హల్ చల్ చేస్తుంది.
Jul 20, 2026 5:58PM
సుకుమార్ సెంటిమెంట్.. రామ్ చరణ్ సినిమాతో ఆ రికార్డు బ్రేక్ అవుతుందా.?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకుడు సుకుమార్ కెరీర్ లో కూడా ఒక సెంటిమెంట్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. అదేమిటంటే ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ ను కూడా తన తదుపరి సినిమాల్లో రిపీట్ చేయలేదు. 'ఆర్య' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన సుకుమార్, నిన్నమొన్నటి 'పుష్ప' సిరీస్ వరకు ప్రతి సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ను ఎంచుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్ 'RC17'తో ఈ హీరోయిన్ సెంటిమెంట్ బ్రేక్ కాబోతుందా అనే ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సుకుమార్ ఎప్పుడూ ఒక హీరోయిన్ తో రెండోసారి పని చేయలేదు. కానీ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప' సిరీస్ లో రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ 'RC17'లో ఆమె ఫైనల్ అయితే.. సుకుమార్ తన కెరీర్ లోనే మొదటిసారి హీరోయిన్ ను రిపీట్ చేసినట్లు అవుతుంది. మరి సుకుమార్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రష్మికకే జై కొడతారా, లేక ఎప్పటిలాగే సరికొత్త ముద్దుగుమ్మను రంగంలోకి దించుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Ram Charan, Sukumar, RC17 Update, Rashmika Mandanna
Jul 20, 2026 11:46AM
రామ్ చరణ్కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే!
రంగస్థలంతో తెలుగు సినిమాకి సరికొత్త సొగసుని అద్దారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్. దీంతో ఆ ఇద్దరు కలిసి చేస్తున్న RC17 (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే కథగా ప్రచారం జరుగుతుండగా అక్టోబర్ లో లాంచింగ్ ఉంటుందనే టాక్ వినపడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బలంగా, రా అండ్ రస్టిక్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే తెలంగాణ బ్యాక్డ్రాప్ రూటెడ్ స్టోరీకి భాగ్యశ్రీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి సుకుమార్ భావిస్తున్నట్టుగా ఏ క్యారక్టర్ లో అయినా ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇవ్వగలదని భాగ్యశ్రీ నిరూపిస్తూ ఉంది. ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కి విజయదుందుభి మోగిస్తున్న లెనిన్. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి భాగ్యశ్రీ బోర్సే కనుక చరణ్ మూవీలో ఫైనలైజ్ అయితే, ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లడం ఖాయం. Also read: జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే! ఈ వార్త విన్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో #RC17 కాస్టింగ్ పై జోరుగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. భాగ్యశ్రీ గ్లామర్, చరణ్ మాస్ ఇమేజ్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వెర్షన్స్ ని లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులని 90% పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ram charan, Bhagyashri Borse, sukumar, mythri movie makers
Jul 17, 2026 3:54PM
ప్రభాస్ వల్ల ప్లాన్ మార్చిన బాలయ్య.!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘NBK 111’ విడుదలపై చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ సినిమాను విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, ఇప్పుడు బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మారడంతో సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా డిసెంబర్ మొదటి వారంలో వస్తుండటంతో.. థియేటర్ల లభ్యత, కలెక్షన్ల పరంగా ఎలాంటి క్లాష్ రాకూడదని ‘NBK 111’ మేకర్స్ భావించారు. అందుకే బాలయ్య మాస్ జాతరను డిసెంబర్ చివరి వారంలో వచ్చే క్రిస్మస్ పండుగ సెలవుల కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. పండగ సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు తరలివస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. దసరా పండుగ కంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను ముగించాలని గోపీచంద్ మలినేని టార్గెట్గా పెట్టుకున్నారు. దసరా లోపు షూటింగ్ పూర్తయితే, డిసెంబర్ క్రిస్మస్ రేస్కు సినిమాను పర్ఫెక్ట్గా సిద్ధం చేయడానికి వీలవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. గతంలో బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమా చేసిన గోపీచంద్ మలినేని, ఈసారి ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘NBK 111’ మాస్ ప్రాజెక్ట్ను పూర్తి చేసిన వెంటనే బాలయ్య.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సెన్సేషనల్ పొలిటికల్ డ్రామా షూటింగ్ను ప్రారంభించనున్నారు. Nandamuri Balakrishna, NBK 111, Christmas Release, Prabhas, Fauzi
Jul 17, 2026 10:28AM
ఆగిపోయిన అక్కినేని భారీ మూవీ.!
అక్కినేని అభిమానులకు ఒక భారీ షాకింగ్ న్యూస్ వినబడుతోంది. కింగ్ నాగార్జున తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ తో కలిసి ఒక అద్భుతమైన మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా అక్కినేని ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్ ఆశలపై ఈ తాజా వార్త గట్టి దెబ్బే కొట్టింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. అంతా సవ్యంగా సాగితే ఈ ఏడాది జూలై నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాదు, వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ ఒక పక్కా ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్తో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించేందుకు జీ స్టూడియోస్ సిద్ధమైంది. అయితే, సరిగ్గా షూటింగ్ ప్రారంభం కావాల్సిన తరుణంలో ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్ వెర్షన్ విషయంలో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ పూర్తిగా సంతృప్తి చెందలేదట. తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కథ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పాటు ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి ఆసక్తి చూపించకపోవడంతో నాగార్జున కూడా వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కుమారులకు నచ్చని ప్రాజెక్ట్తో బలవంతంగా ముందుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని భావించిన నాగార్జున, ఈ మల్టీస్టారర్ను ప్రస్తుతానికి పక్కన పెట్టేయడానికే మొగ్గు చూపారని సమాచారం. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి గతంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, ఇప్పుడు సినిమా రద్దు కావడంపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవచ్చు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ ఆగిపోవడంతో అక్కినేని హీరోలు తమ తదుపరి సొంత ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమా చేస్తున్నారు. అలాగే తన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్ "దూత 2"తో పాటు, దర్శకుడు క్లాక్స్తో ఒక సినిమా, మసూద డైరెక్టర్ సాయి కిరణ్ తో మరొక భారీ హారర్ ఫిల్మ్ను లైన్లో పెట్టారు. అటు అఖిల్ అక్కినేని కూడా ఖాళీగా ఉండకుండా ఇప్పటికే రెండు కొత్త స్క్రిప్ట్లను లాక్ చేసుకోగా, అందులో ఒక ప్రాజెక్ట్ను ఈ నెలలోనే ఫైనలైజ్ చేయనున్నారు. తన ఇద్దరు కుమారులు తమ సరికొత్త ప్రాజెక్ట్లతో బిజీ అయిపోవడంతో, నాగార్జున సైతం తన ల్యాండ్మార్క్ చిత్రం "కింగ్ 100" (King 100) పై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. Nagarjuna, Naga Chaitanya, Akhil Akkineni, Multistarrer, Shelved
Jul 16, 2026 4:24PMజక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఎవరూ ఊహించని క్రేజీ హీరోతో రాజమౌళి నెక్స్ట్ మూవీ.!
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాతరాలు దాటించి, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మన సినిమా సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఘనత జక్కన్నది. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును పక్కా ప్రణాళికతో, అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి అండ్ టీమ్ శ్రమిస్తోంది. అయితే, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహేష్బాబుతో చేస్తున్న 'వారణాసి' తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును ఏ హీరోతో చేయబోతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో జక్కన్న నెక్స్ట్ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఉండబోతుందని ఫిలిం నగర్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ వార్తలపై అల్లు అర్జున్ కానీ, రాజమౌళి టీమ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఆ సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉంటే, తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక సరికొత్త కాంబినేషన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియా వర్సటైల్ స్టార్ హీరో సూర్యతో కలిసి రాజమౌళి ఒక భారీ సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరికీ సౌత్ తో పాటు నార్త్ బెల్ట్లో కూడా ఊహించని రేంజ్లో మార్కెట్, క్రేజ్ ఉన్నాయి. నిజానికి సూర్య మరియు రాజమౌళి కాంబినేషన్పై ఇలాంటి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందంటూ పలుమార్లు వార్తలు హల్చల్ చేశాయి. రాజమౌళి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన 'మగధీర' చిత్రంలో హీరోగా మొదట సూర్య పేరునే పరిశీలించినట్లు అప్పట్లో ఒక బలమైన టాక్ నడిచింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఒకరికొకరు కథలు అనుకున్నట్లు వార్తలు వచ్చినా, అవి ఎప్పుడూ అధికారిక ప్రకటన వరకు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత జక్కన్న-సూర్య కాంబో తెరపైకి రావడంతో సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి రాజమౌళి లేదా సూర్య కాంపౌండ్ నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాకపోయినప్పటికీ, ఈ క్రేజీ గాసిప్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ కేకులా ప్రచారమవుతోంది. 'వారణాసి' ముగిసే సమయానికి ఈ కాంబోపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Jul 15, 2026 7:25PM
వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులని ఆ అగ్ర నిర్మాత ఎంత అమౌంట్ కి అడిగాడో తెలుసా!
విజయాలే తన లక్ష్యంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని 'ది ప్యారడైజ్' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. 'దసరా' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో ప్యారడైజ్' తెరకెక్కతుండటంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ప్రచార చిత్రాలతో అయితే సెల్యులాయిడ్ పై సరికొత్త ప్రపంచం కనిపించడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉంది. తాజాగా ఈ సినిమా బిజినెస్ వర్గాల నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు 'ది ప్యారడైజ్' ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులని సొంతం చేసుకోవడం కోసం 110 కోట్ల భారీ ఆఫర్ని మేకర్స్ ముందు ఉంచినట్లు టాక్ నడుస్తోంది. ఈ న్యూస్ నిజమైతే నాని కెరీర్లోనే అత్యంత భారీ థియేట్రికల్ డీల్ అని చెప్పాలి. Also read: నన్ను తిట్టారు,కొట్టారు, తన్నారు.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్ 'ప్యారడైజ్' ని మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే అనుకున్న అంచనాలను దాటి ఏకంగా 160 కోట్ల మార్కు తాకినట్లు టాలీవుడ్ ఇన్సైడర్స్ సమాచారం.దీంతో నాని కెరీర్లోనే ఇదే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అసిరియా, గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఈ ప్రయత్నం ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. nani, the paradise, dil raju, srikanth odela
Jul 15, 2026 5:24PMసమంత ఇంట్లో పండగ వాతావరణం.. ఘనంగా సీమంతం వేడుక!
టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత మధురమైన, అందమైన క్షణాలను ఆస్వాదిస్తోంది. త్వరలోనే ఆమె తల్లి కాబోతుందనే వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారగా, తాజాగా సమంతకు సంబంధించిన మరో అద్భుతమైన విశేషం బయటకు వచ్చింది. మంగళవారం రోజున సమంత నివాసంలో సీమంతం వేడుక అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని అపురూపమైన ఫొటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు ఈ విజువల్స్ చూసి ఎంతగానో మురిసిపోతున్నారు. ప్రముఖ ఫిల్మ్మేకర్ రాజ్ నిడిమోరును సమంత 2025 చివరి భాగంలో కోయంబత్తూరు వేదికగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన ఏడాది తిరక్కుండానే ఈ జంట తమ జీవితంలోకి సరికొత్త అతిథిని ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. వచ్చే డిసెంబర్ నెలలో సమంత తన తొలి బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మరియు సన్నిహితుల సమక్షంలో ఈ సీమంతం వేడుకను చాలా ప్రైవేట్గా, అంతే సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకలో సమంత ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లో స్పష్టంగా కనిపించింది. పసుపు, ఆకుపచ్చ రంగుల కాంబినేషన్లో మెరిసిపోతూ ఎంతో ప్రకాశవంతంగా, ఉల్లాసంగా ఆమె దర్శనమిచ్చింది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలలో సమంత తన అత్తగారితో పంచుకున్న కొన్ని భావోద్వేగపూరితమైన క్షణాలు అందరి హృదయాలను టచ్ చేస్తున్నాయి. అత్తగారు సమంతను ఆశీర్వదిస్తూ, దిష్టి తీస్తున్న విజువల్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత జూన్ నెలలో విడుదలైన 'మా ఇంటి బంగారం' చిత్ర విజయోత్సవ వేడుకలో సమంత మొదటిసారిగా బేబీ బంప్తో పబ్లిక్గా కనిపించింది. ఆ సమయంలోనే ఆమె గర్భవతి అనే వార్తలు తెగ ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత చిత్ర దర్శకుడు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి సమంత సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన మధురమైన విశేషాలను, బేబీ బంప్ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. ఈ సీమంతం వేడుకపై సమంత మరియు రాజ్ నిడిమోరు దంపతులు అధికారికంగా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, వేడుకకు సంబంధించిన ఇన్సైడ్ వీడియోలు బయటకు రావడంతో ఇంటర్నెట్ ఊగిపోతోంది. ఈ అద్భుతమైన వీడియోలు చూసిన సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు మరియు లక్షలాది మంది అభిమానులు సమంత దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత డిసెంబర్లో క్షేమంగా బిడ్డకు జన్మనివ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
Jul 15, 2026 2:34PM
'లెనిన్' డైరెక్టర్కు లక్కీ ఛాన్స్.. పిలిచి అవకాశమిచ్చిన స్టార్ హీరో.!
న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త దర్శకులను, వినూత్నమైన కథలను ప్రోత్సహించడంలో ముందుంటారు. స్క్రిప్ట్ విషయంలో నానికి ఉన్న మంచి అవగాహన, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న దర్శకులను వెతకడంలో అతనికి ఎంతో సహాయపడుతుంది. తాజాగా, ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే, 'లెనిన్' సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరును హీరో నాని సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు గురించి చెప్పాలంటే, ఆయన మొదటి సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఆ సినిమాతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్న మురళీ కిషోర్ కు.. ఏకంగా అన్నపూర్ణ స్టూడియోస్ అఖిల్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలా వచ్చిన ప్రాజెక్టే 'లెనిన్'. ఒక భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి.. ఈ సినిమా ఎంతో ఊరటనిచ్చింది. అలాగే, దర్శకుడిగా మురళీ కిషోర్ ప్రతిభపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో పలువురు హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నాని కూడా మంచి కథ ఉంటే చెప్పమని దర్శకుడు మురళీ కిషోర్ ను కోరినట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత 'బ్లడీ రోమియో' లైన్ లో ఉంది. మురళీ కిషోర్ మంచి కథతో మెప్పిస్తే.. నాని తదుపరి ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశముంది. ఏదేమైనా, ఈ ఇద్దరి కలయిక గురించి వినిపిస్తున్న ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. Lenin Movie, Murali Kishore Abburu, Nani, TeluguOne
Jul 14, 2026 6:34PMటాలీవుడ్లో హాట్ టాపిక్.. నాగార్జున 101వ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్.?
టాలీవుడ్లో ఒక్క విజయం దర్శకుడి తలరాతను మార్చేస్తుంది, అలాగే ఒక పెద్ద స్టార్ హీరో ఇచ్చే అవకాశం ఆ దర్శకుడి కెరీర్కు సరికొత్త ఊపిరి పోస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే తరహా ఆసక్తికర చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీనియర్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 101వ సినిమాను ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో, ఈ ప్రాజెక్ట్కు క్రేజీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కాంబినేషన్ గనుక నిజమైతే, ఇది భాస్కర్కు కేవలం ఒక సాధారణ సినిమా మాత్రమే కాదు, ఆయన కెరీర్ను మళ్లీ గాడిలో పెట్టే ఒక అద్భుతమైన మైలురాయి కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడు భాస్కర్ తన తొలి చిత్రం 'బొమ్మరిల్లు'తోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చారు. వెండితెరపై మానవ సంబంధాలను, సున్నితమైన కుటుంబ భావోద్వేగాలను అత్యంత సహజంగా ఆవిష్కరించగల ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ బ్లాక్బస్టర్ విజయం తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. కథల్లో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో వెనుకబడటంతో, ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ దర్శకుల జాబితాలో నిలిచిన భాస్కర్, ప్రస్తుతం మళ్లీ ఒక భారీ కమ్బ్యాక్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో కింగ్ నాగార్జున 101వ చిత్రానికి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ భాస్కర్ తలుపు తట్టిందనే వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడిగా ఎన్నో వైవిధ్యమైన ప్రయోగాలు చేసిన నాగార్జున కోసం భాస్కర్ ప్రస్తుతం ఒక అదిరిపోయే ఫ్యామిలీ ఎమోషనల్ లైన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ స్టోరీకి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే జరిగాయని, కథ పూర్తిగా నచ్చితేనే కింగ్ నాగార్జున ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అయితే కేవలం నాగార్జున వంటి స్టార్ హీరో అవకాశం ఇవ్వడం మాత్రమే భాస్కర్ కెరీర్ను మార్చేయదు, ఆ లభించిన అరుదైన అవకాశాన్ని ఆయన ఎంత బలంగా, సృజనాత్మకంగా ఉపయోగించుకుంటారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నాగార్జున ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుంటూనే, ప్రస్తుత తరం ప్రేక్షకుల మారుతున్న టేస్ట్కు అనుగుణంగా సరికొత్త స్క్రీన్ప్లేతో, హృదయాన్ని కట్టిపడేసే బలమైన భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. సాధారణంగా నాగార్జున కెరీర్ను గమనిస్తే, ఆయన కొత్త కథలను, ప్రతిభ గల దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. దర్శకుడి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కథలో దమ్ముంటే చాలు అవకాశం ఇచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున తన మైల్స్టోన్ 100వ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే 101వ సినిమాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ కాంబినేషన్పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, అక్కినేని అభిమానుల్లో మాత్రం ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు మరియు ఆసక్తి నెలకొన్నాయి.
Jul 13, 2026 3:53PMఅనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నవంబర్ 12న?.. ఎక్కడో తెలుసా?
కోలీవుడ్ రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని కోలీవుడ్ మీడియా సర్కిల్స్ గట్టిగా చెప్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం... వీరి వివాహ వేడుకలు ఈ ఏడాది నవంబర్ 11, 12, 13 తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా నవంబర్ 12న వీరి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ వెడ్డింగ్ కోసం ఒక విభిన్నమైన లొకేషన్ను ఎంచుకున్నారట. ఇండియాలో కాకుండా, ప్రకృతి అందాలకు నిలయమైన సౌత్ ఆఫ్రికాలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ను ప్లాన్ చేసినట్లు సమాచారం. గతంలో వీరిద్దరిపై ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ... ఇటీవల అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో వీరి పెళ్లిని కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని టాక్. అయితే, ఈ మూడు రోజుల వివాహ వేడుకలు మరియు సౌత్ ఆఫ్రికా డెస్టినేషన్ వెడ్డింగ్ వార్తలపై అటు మారన్ ఫ్యామిలీ కానీ, ఇటు అనిరుధ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం సస్పెన్స్గా ఉన్న ఈ మెగా వెడ్డింగ్పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఇరు వర్గాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Jul 11, 2026 6:43PM
తెలంగాణ నేటివిటీతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ.. సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా.!
'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ కెరీర్ లో 17వ సినిమాగా రానుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో ఒక సెన్సేషనల్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో, రూటెడ్ నేటివిటీతో సాగే పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. గత కొన్ని కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నేటివిటీ కథలకు, ముఖ్యంగా తెలంగాణ మట్టి వాసనతో కూడిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'బలగం', 'దసరా' వంటి భారీ విజయాలే అందుకు ఉదాహరణ. 'ఎల్లమ్మ', 'ఇడుపు కాయితం' వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. గత కొన్నేళ్లలో విడుదలైన ఎన్నో తెలంగాణ బేస్డ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రికార్డులను సృష్టించాయి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, రా అండ్ రస్టిక్ ఇంటెన్సివ్ కథలకు గ్లోబల్ వైడ్గా ఆదరణ పెరుగుతుండటంతో మేకర్స్ కూడా ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. సుకుమార్ ఇప్పటికే అల్లు అర్జున్తో 'పుష్ప' సిరీస్ను ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు శేషాచలం అడవుల నేపథ్యంలో ఎంతో క్వాలిటీగా చూపించారు. ఇప్పుడు చరణ్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ తెలంగాణ రూటెడ్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సుకుమార్ ప్రతి స్క్రిప్ట్పై చాలా సమయం తీసుకుని, ప్రతి పాత్రను ఎంతో సహజంగా మలుస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మూడు విభిన్నమైన ఐడియాలను పరిశీలించి, చివరికి ఒక అద్భుతమైన లైన్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇటీవల స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి రూరల్ కథలో నటించనున్నారని టాక్. ఏదేమైనా చరణ్ మాస్ యాసతో తెలంగాణ నేపథ్యంలో సుక్కు మార్క్ టేకింగ్లో వస్తే థియేటర్లు బద్దలైపోవడం గ్యారెంటీ. దీనిపై అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Ram Charan, Sukumar, RC17 Movie, Telangana
Jul 10, 2026 4:05PM
అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? తెరవెనుక పీకే వ్యూహాలు.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారా అనే చర్చ రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వెండితెరపై తనదైన నటన, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేసేందుకు బలమైన పునాది వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అందరిలా కాకుండా అత్యంత వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం దళపతి విజయ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం. విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువై, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఈ క్రమంలోనే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(PK)తో అల్లు అర్జున్ అంతర్గత సంప్రదింపులు జరిపారనే న్యూస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సినీ గ్లామర్ మాత్రమే రాజకీయాల్లో గెలుపును తెచ్చిపెట్టదని బాగా నమ్మే బన్నీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకునేందుకు పీకే టీమ్ సహాయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు ఏమిటి? భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అనే అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం భావోద్వేగాలతో కాకుండా, పక్కా డేటా, నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికల ఆధారంగానే బన్నీ తన పొలిటికల్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ భారీ పొలిటికల్ ప్లాన్ వెనుక అల్లు అర్జున్ మామగారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నుంచి లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా మారాయని తెలుస్తోంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆయన, తన అల్లుడిని ఒక పవర్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయాణంలో ఎక్కడా తొందరపాటు పనికిరాదని, సరైన సమయం చూసి జనాల్లోకి వెళ్లాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత? అల్లు అర్జున్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? ప్రశాంత్ కిశోర్తో సంప్రదింపులు నిజమేనా? త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. Allu Arjun, Political Entry, Prashant Kishor, Andhra Pradesh
Jul 10, 2026 10:02AM
Chiranjeevi: చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్? పూర్తి డిటైల్స్ ఇవే!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),కింగ్ నాగార్జున(Nagarjuna).. తెలుగు సినీ రంగాన్ని ఏలిన, ఏలుతున్న హీరోలు. ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనే రూమర్స్ ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రూమర్ అయినా సరే న్యూస్ మాత్రం మెగా అభిమానులకి, అక్కినేని అభిమానులకి పూనకాలు తెప్పిస్తోంది. ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఈ ఇద్దరికి సంబంధించిన స్క్రిప్ట్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కథాంశం ఇద్దరు మెచ్యూర్డ్ వ్యక్తుల మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందట. చిరంజీవి మాస్ ఇమేజ్కు, నాగార్జున క్లాస్ అండ్ స్టైలిష్ లుక్కు సరిగ్గా సరిపోయేలా ఈ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారని టాక్. టాలీవుడ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక నిర్మాణ సంస్థ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకూ సమానమైన ప్రాధాన్యత, స్క్రీన్ టైమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఏ ఒక్కరి క్యారక్టర్ తగ్గినా అభిమానులు నిరాశ చెందుతారు కాబట్టి, ఇద్దరికీ 50-50 బ్యాలెన్స్ కుదిరేలా డైరెక్టర్ స్క్రిప్ట్ని పక్కాగా లాక్ చేశారని సమాచారం. Also read: Lenin: రిలీజ్ కి ముందే 34 కోట్లు వసూలు చేసిన లెనిన్ . దట్ ఈజ్ అఖిల్ ఈ క్రేజీ మల్టీస్టారర్ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ కాంబినేషన్ క్రేజ్ సంపాదిస్తోంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఈ సినిమా గనుక అధికారికంగా ప్రకటిస్తే, కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో మరో 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే వీలుంది. అంటే సినిమా షూటింగ్ మొదలుకాకముందే 250 కోట్ల టర్నోవర్ క్లియర్ గా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్, 'ఆచార్య'లో రామ్ చరణ్ కనిపించినప్పటికీ, నాగార్జున లాంటి సమకాలీన స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. అటు నాగార్జున కూడా రీసెంట్గా మల్టీస్టారర్ కథలపై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ మెగా-అక్కినేని కాంబోపై ఒక అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది, అప్పటివరకు ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. chiranjeevi, nagarjuna
Jul 7, 2026 4:04PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)




