
AA23: షాకింగ్ న్యూస్.. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీ క్యాన్సిల్?
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్! - ఆగిపోయిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్? - డైరెక్టర్ తో విభేదాలే కారణమా? టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ 'AA23' ఆగిపోయే ప్రమాదం ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ కాంబినేషన్, షూటింగ్ దశకు చేరకముందే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న లీకులు ఇరు హీరో, దర్శకుల అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్.. ప్రకటన వచ్చిన రోజున సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన '23 థీమ్' మ్యూజిక్ ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండ్ అయి రికార్డు సృష్టించింది. అంతగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అటకెక్కనుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మధ్య తలెత్తిన కొన్ని అభిప్రాయ బేధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. కథా చర్చల సమయంలో ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉండటం, క్యారెక్టరైజేషన్ విషయంలో ఇద్దరి మధ్య ఒక స్పష్టమైన అవగాహన కుదరకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ ల మధ్య ఉన్న ఈ విభేదాలు సద్దుమణిగి, చర్చలు సఫలం కాకపోతే ఈ బిగ్గెస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అధికారికంగా షెల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ వార్తలపై ఇటు మైత్రీ మూవీ మేకర్స్ కానీ, అటు హీరో, దర్శకులు కానీ స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ సస్పెన్స్కు తెరపడదు.
Jun 2, 2026 2:31PM
Simbu: శింబు టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!
కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu)కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆయన నటించిన 'మన్మథ', 'వల్లభ' వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఆ సినిమాలతో టాలీవుడ్లో కూడా శింబు అప్పట్లోనే మంచి గుర్తింపు, బలమైన మార్కెట్ సంపాదించుకున్నారు. అయితే, తెలుగు ప్రేక్షకులకు ఇంతగా దగ్గరైనప్పటికీ, శింబు ఇప్పటివరకు నేరుగా ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు, సినీ ప్రియులు ఎన్నాళ్ల నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ శింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి రంగం సిద్ధమైందనే క్రేజీ వార్త ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు తమిళ స్టార్ హీరోలు నేరుగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడ భారీ విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో, శింబు కూడా ఇప్పుడు అదే బాటలో నడవాలని పక్కా ప్లాన్తో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'డ్యూడ్' ఫేమ్ కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మొదట ఈ క్రేజీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉందని, అయితే ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ చేతుల్లోకి వెళ్లినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది.
Jun 1, 2026 9:48AMనందమూరి బాలకృష్ణ లైనప్లోకి క్రేజీ డైరెక్టర్: అదిరిపోయే మాస్ కాంబో ఫిక్స్!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్లో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ సీనియర్ స్టార్ హీరో ఖాతాలో మరో క్రేజీ కాంబినేషన్ చేరబోతోందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కమర్షియల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ త్వరలోనే బాలయ్యను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన నటసింహాన్ని కలిసి ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను వినిపించారట. బాలకృష్ణ ఇమేజ్కు, బాడీ లాంగ్వేజ్కు పక్కాగా సరిపోయేలా ఉన్న ఈ స్క్రిప్ట్ లైన్ నచ్చడంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. నిజానికి అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తమిళ టాప్ స్టార్ అజిత్ కుమార్తో 'AK64'గా తెరకెక్కించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆ పవర్ఫుల్ స్టోరీ లైన్ను బాలయ్య ఇమేజ్కు తగినట్లుగా మార్పులు చేసి అధిక్ ఇక్కడ ఓకే చేయించుకున్నట్లు వినికిడి. ఈ భారీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK111’ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. దీని తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ‘NBK112’ కూడా జూన్ నెల నుంచే పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుల మధ్యలోనే అధిక్ రవిచంద్రన్ సినిమా వార్త బయటకు రావడం విశేషం. కోలీవుడ్లో ‘మార్క్ ఆంటోని’, ‘గుడ్ బాడ్ అగ్లీ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మెప్పించిన అధిక్, బాలకృష్ణ లాంటి మాస్ లీడర్ను ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో పెరిగిపోయింది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో నందమూరి అభిమానులకు అసలైన మాస్ జాతర గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
May 31, 2026 2:57PMటాలీవుడ్ టు బాలీవుడ్: విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీపై నయా అప్డేట్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలపై ఫిలిం నగర్ సర్కిల్స్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సౌత్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో, మరోసారి బాలీవుడ్పై కన్నేసినట్లు సమాచారం. హిందీ చిత్రసీమలో విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడక్ ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారనే సరికొత్త రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత దినేష్ విజన్కు చెందిన ‘మ్యాడక్ ఫిల్మ్స్’ ఇటీవల కాలంలో వరుస హారర్ కామెడీలు, సోషల్ డ్రామాలతో భారీ విజయాలను అందుకుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ క్రేజ్, ఇమేజ్కు సరిపోయే ఒక అద్భుతమైన కథను ఈ బ్యానర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిశాయని, విజయ్ కూడా స్క్రిప్ట్ పట్ల సానుకూలంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయం. గతంలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, బాలీవుడ్ వర్గాల్లో విజయ్ మార్కెట్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలోని యువతలో, మహిళా ఆడియన్స్లో రౌడీ హీరోకు ఉన్న ఫాలోయింగ్ చూసి మ్యాడక్ ఫిల్మ్స్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అలాగే రవికిరణ్ కోలా లైనప్లో సినిమాలు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు దిల్ రాజు నిర్మాణంలో రాబోయే చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ ఆఫర్ విజయ్ ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్పై సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. మ్యాడక్ ఫిల్మ్స్ మార్క్ కంటెంట్కు విజయ్ దేవరకొండ అటిట్యూడ్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం హిందీలోనే ఉంటుందా లేక పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుందా అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
May 29, 2026 12:27PM
టాలీవుడ్ క్రేజీ కాంబో.. అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో ఎవరో తెలిస్తే షాక్!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక మోస్ట్ అవేటెడ్ క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కలయికలో ఓ ప్రాజెక్ట్ ఖరారైందని సమాచారం. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన 'రాజా ది గ్రేట్' చిత్రం నిజానికి రామ్ పోతినేనితోనే చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మిస్ అయినప్పటికీ, సరిగ్గా 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిందనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాను 2027 దసరా పండుగ కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రామ్ పోతినేని ఎనర్జీకి, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ అప్కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ పోతినేని తన కెరీర్లో 23వ చిత్రాన్ని (RAPO23) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తానే దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రం డిసెంబర్ 2026 నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ పోతినేని పూర్తి స్థాయిలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్పై దృష్టి పెట్టనున్నారు. రామ్ తన కెరీర్లో మునుపెన్నడూ చేయని సరికొత్త గెటప్ అండ్ బాడీ లాంగ్వేజ్తో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం. మరోవైపు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ (VenkyAnil5/ NkrAR2) రూపకల్పనలో బిజీగా ఉన్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి 2027 రేసులో నిలిచింది. ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన అనంతరం, అనిల్ రావిపూడి రామ్ పోతినేని సినిమాను ప్రారంభించనున్నారని టాక్.
May 27, 2026 6:37PM
Mahesh Babu: మహేశ్, ప్రశాంత్ నీల్ ఊహించని కాంబో.. క్రేజీ అప్డేట్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని, ఇండస్ట్రీ వర్గాలని ఊపేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటివరకు ఈ కాంబో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినీ ప్రియులు, అభిమానులు మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్, అద్భుతమైన స్టోరీ నరేషన్, మహేశ్ వన్ మ్యాన్ షో స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో చేస్తున్న 'డ్రాగన్'(Dragon)తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్తో 'సలార్ 2' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ టోన్, నియో నాయర్ యాక్షన్ సినిమాలకి కొంత విరామం ఇచ్చి, మైథాలజికల్ లేదా డిఫరెంట్ జానర్ వైపు అడుగులు వేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రయోగంలో భాగంగానే మహేశ్ బాబు కోసం ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహేశ్ ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్వ రల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 'వారణాసి' తర్వాత మహేశ్ బాబు, సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి వచ్చిన సరికొత్త ప్రపోజల్ మహేశ్ బాబుని ఆలోచనలో పడేసిందని, మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. Also read: VIJay: సీఎం విజయ్పై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు..ఏం అర్హత ఉందో ఇప్పుడు అర్థమైందా! అయితే ఈ ఊహించని కాంబో పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే మహేశ్ బాబు 'వారణాసి' ప్రాజెక్ట్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ కూడా 'డ్రాగన్', 'సలార్ 2', మరియు హోంబాలే ఫిలిమ్స్తో ఉన్న ఒప్పందాల ప్రకారం 'కేజీఎఫ్ 3' లాంటి భారీ కట్టుబాట్లని పూర్తి చేయాలి. ఒకవేళ వీరద్దరి షెడ్యూల్స్ అన్నీ అనుకూలించి, కథ లాక్ అయితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం.
May 26, 2026 3:30PM
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా రాబోతోందనే వార్త గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని ఊపేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను రెండు భాగాలుగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించడానికి పూనుకుంది. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీస్ను ప్రారంభించాలని మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు నందమూరి అభిమానులకు ఒక ఊహించని షాకింగ్ న్యూస్ వినబడుతోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ సినిమా పూర్తిగా అటకెక్కింది (Shelved). ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పటికీ బయటకు రానప్పటికీ, ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఆయన ఇటీవల మాస్ మహారాజా రవితేజను కలిసి ఒక అద్భుతమైన లైన్ వినిపించారు. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ రవితేజకు విపరీతంగా నచ్చేయడంతో, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విశేషం ఏంటంటే, బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఇప్పుడు రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబో ప్రాజెక్ట్ను కూడా బ్యాంక్రోల్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' (Irumudi) అనే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తిగా పూర్తయిన తర్వాత, అంటే ఈ ఏడాది చివర్లో వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
May 23, 2026 4:02PM
Peddi: మెగా-నందమూరి కలయిక.. 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా బాలయ్య!
టాలీవుడ్లో సరికొత్త సంచలనానికి తెర లేవబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (PEDDI) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే సెన్సేషనల్ న్యూస్ నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది. జూన్ 4న ఈ 'పెద్ది' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, చిత్ర బృందం ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇప్పటికే రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఈ భారీ హైప్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు జూన్ 2న హైదరాబాద్లో అత్యంత భారీ స్థాయిలో అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను నిర్వహించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా వేరే హీరోల ఈవెంట్లకు బాలకృష్ణ హాజరు కావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ 'పెద్ది' చిత్రానికి బాలయ్య రావడం వెనుక ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి. గతంలో 'అన్స్టాపబుల్ విత్ NBK' టాక్ షోలో బాలకృష్ణ, రామ్ చరణ్ మధ్య ఉన్న అద్భుతమైన బాండింగ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా చూశారు. కేవలం చరణ్పై ఉన్న ఆ ఆప్యాయతతోనే నటసింహం ఈ ఈవెంట్కు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు బాలయ్యకు 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్బస్టర్ హిట్ అందించిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ 'పెద్ది' చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం కూడా మరో ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా-నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగలాంటి ఈ అరుదైన కలయిక గనుక జూన్ 2న స్టేజ్ పైన సాకారమైతే, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరిగే అనవసరపు వార్స్కు పూర్తిగా చెక్ పడినట్లే అని సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబోపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
May 22, 2026 3:40PM
SRH ఓనర్ కావ్య మారన్తో అనిరుధ్ పెళ్ళి.. ముహూర్తం ఫిక్స్!
మ్యూజిక్ డైరెక్టర్ రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కో-ఓనర్, సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ (Kavya Maran) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొంతకాలంగా ప్రేమలో ఉన్న అనిరుధ్, కావ్య మారన్.. ఈ ఏడాది నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా తమ వివాహ బంధాన్ని ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు అటు సినీ ప్రియులను, ఇటు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి ఈ క్రేజీ కాంబినేషన్పై రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్షిప్పై పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిచ్చాయి. ఆ సమయంలో అనిరుధ్, కావ్య మారన్ ఇద్దరూ న్యూయార్క్ నగరంలో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారంటూ కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, గతంలో తన పెళ్లిపై వచ్చిన ఇలాంటి వార్తలపై అనిరుధ్ రవిచందర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా చాలా కూల్గా స్పందించారు. "lol .. Chill out guys" (నవ్వుతూ.. కాస్త ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్) అంటూ ఒక చిన్న ట్వీట్తో ఆ రూమర్స్ను చాలా తేలికగా కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు మరోసారి వీరిద్దరి పెళ్లి అంశం తెరపైకి రావడంతో ఈసారి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. ఈ పవర్ఫుల్ జోడీపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ అనిరుధ్ నిజంగానే కావ్య మారన్ను పెళ్లాడితే, భవిష్యత్తులో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆడే ప్రతి ఐపీఎల్ (IPL) మ్యాచ్లకు అనిరుధ్ లైవ్ మ్యూజిక్ అందిస్తాడేమోనని కొందరు జోకులు పేలుస్తున్నారు. అంతేకాకుండా, అనిరుధ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు పెద్ద అభిమాని కావడంతో, ఐపీఎల్ ప్రత్యర్థుల మధ్య ఈ సరికొత్త లవ్ స్టోరీ ఎలా సాధ్యమంటూ క్రికెట్ ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
May 21, 2026 3:49PMక్రేజీ రూమర్: స్టార్ క్రికెటర్ ప్రేమలో టాలీవుడ్ క్యూటీ శ్రీలీల!
టాలీవుడ్ లో తన డ్యాన్స్ లతో, క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచుకున్న సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల లవ్ లైఫ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో క్రేజ్ పీక్స్ లో ఉన్న హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే అయినా, ఈ అమ్మడి విషయంలో రోజుకో కొత్త లింక్ వెలుగులోకి రావడం విశేషం. నిన్నటివరకు ముంబై సర్కిల్స్ లో వినిపించిన ఈమె ప్రేమాయణం, ఇప్పుడు పిచ్ పైకి షిఫ్ట్ అయి సరికొత్త రచ్చకు దారితీస్తోంది. కొంతకాలంగా ఈ కన్నడ కస్తూరి బాలీవుడ్ యంగ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందంటూ గట్టిగా ప్రచారం సాగింది. వీరిద్దరూ ముంబైలో జరిగిన పలు ఈవెంట్లలో జంటగా సందడి చేయడమే కాకుండా, కార్తీక్ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు శ్రీలీల తన తల్లితో కలిసి వెళ్లడం ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతానికి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కుతోంది. అయితే బాలీవుడ్ హీరోతో లవ్ స్టోరీ ముచ్చట సద్దుమణగక ముందే, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలెంటెడ్ హైదరాబాదీ క్రికెటర్, టీమిండియా యంగ్ స్టార్ తిలక్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందంటూ నెటిజన్లు సరికొత్త కథనాలు అల్లేస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని ఆధారాలను కూడా సోషల్ మీడియా వేదికగా తెరపైకి తెస్తున్నారు. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీలీల ఫ్యామిలీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడే, తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో అక్కడికి రావడం తొలి క్లూగా భావిస్తున్నారు. అంతేకాకుండా, ఐపీఎల్ మ్యాచ్ లలో శ్రీలీల మాతృమూర్తి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కనిపించడం, శ్రీలీల పర్సనల్ స్టాఫ్ లో ఒకరు 'తిలక్' పేరున్న జెర్సీ ధరించడం వంటివన్నీ నెటిజన్ల కంటికి చిక్కాయి. దీనికి తోడు, ఇటీవల టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఒక సరదా వీడియోలో తిలక్ వర్మను ఉద్దేశించి "నువ్వు ప్రేమలో ఉన్నావు" అని ఆటపట్టించడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో ఆ లవ్ ఇంట్రెస్ట్ మరెవరో కాదు మన టాలీవుడ్ లక్కీ చార్మ్ శ్రీలీలనే అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ప్రపంచంలో ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ రూమర్స్ పై శ్రీలీల కానీ, అటు తిలక్ వర్మ కానీ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
May 17, 2026 3:03PM
Vijay Deverakonda: క్రేజీ కాంబో.. బేబీ దర్శకుడితో విజయ్ దేవరకొండ మూవీ!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్, ఇప్పుడు మరో సెన్సేషనల్ డైరెక్టర్తో జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'బేబీ' సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh), విజయ్ దేవరకొండ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం. గతంలో విజయ్తో 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి చిత్రాలను నిర్మించిన మైత్రీ సంస్థ, ఇప్పుడు సాయి రాజేష్తో కలిసి మరో డిఫరెంట్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. సాయి రాజేష్ చెప్పిన కథ విజయ్కు బాగా నచ్చిందని, ముఖ్యంగా అందులోని ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'రణబాలి', రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన' సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే సాయి రాజేష్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయి రాజేష్ తన సినిమాల్లో ఎమోషన్స్ను చాలా సహజంగా, బోల్డ్గా చూపిస్తుంటారు. అటు విజయ్ దేవరకొండ కూడా ఇంటెన్స్ పాత్రలు చేయడంలో సిద్ధహస్తుడు. ఈ ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందా లేక సీరియస్ డ్రామానా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
May 15, 2026 4:48PMవరస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డేని గట్టెక్కించేందుకు రెడీ అవుతున్న అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, బన్నీ లైనప్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘AA23’లో హీరోయిన్గా బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు ‘డిజె: దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ వంటి మాస్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు రావడంతో, ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ తనదైన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాను ఊపేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూజా హెగ్డే కెరీర్ కూడా ప్రస్తుతం మళ్ళీ పుంజుకుంటోంది. ఈ భామ బాలీవుడ్ మరియు సౌత్ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే బన్నీతో రెండు హిట్లు అందుకున్న పూజా, మూడోసారి కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే, హీరోయిన్ ఎంపికపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇందులో బన్నీ విభిన్నమైన గెటప్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మార్క్ స్టైల్, లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ బుట్టబొమ్మ ఎంట్రీపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉండనున్నాయి.
May 13, 2026 12:19PMమాస్ డైరెక్టర్ మార్క్ యాక్షన్లో కార్తీ.. ఫిలిం నగర్ లేటెస్ట్ అప్డేట్!
టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను. ఆయన తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్స్, హీరోలకు ఇచ్చే పవర్ఫుల్ ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. తాజాగా ఈ మాస్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఇద్దరి కలయికలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. నిజానికి బోయపాటి తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పట్టాలెక్కలేదు. ఈ క్రమంలోనే బోయపాటి తన పదునైన కథకు కార్తీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతారని భావించి, ఆయనను సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న కార్తీ, బోయపాటి చెప్పిన లైన్ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.నటుడిగా కార్తీకి ఉన్న వైవిధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'యుగానికొక్కడు' నుంచి మొన్నటి 'పొన్నియిన్ సెల్వన్', 'సర్దార్' వరకు ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేశారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ను మెప్పించడంలో ఆయన దిట్ట. ఇప్పుడు బోయపాటి మార్క్ ఊర మాస్ యాక్షన్ తోడైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారు. గతంలో బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల వచ్చిన ఆయన చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఈసారి కార్తీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని బోయపాటి కసిగా ఉన్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం కార్తీ తన కమిట్మెంట్లను పూర్తి చేసే పనిలో ఉండగా, బోయపాటి స్క్రిప్ట్ వర్క్ను ఫైనలైజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒక భారీ మాస్ జాతర మొదలైనట్టే! మరి ఈ కొత్త కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
May 10, 2026 3:31PM
Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మహేష్ తర్వాత మళ్ళీ 'ఆర్ఆర్ఆర్' హీరోలతోనేనా?
- 'వారణాసి' తర్వాత రాజమౌళి మూవీ ఏ హీరోతో? - ఎన్టీఆర్, రామ్ చరణ్ వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నాడా? - మరో మల్టీస్టారర్ చేసే సాహసం చేస్తాడా? - ఆ రెండు స్టోరీలతో దర్శకధీరుడు వేస్తున్న స్కెచ్ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' (Varanasi) సినిమా చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది అనే చర్చ మొదలైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అలాగే, రాజమౌళితో వారికున్న బాండింగ్ కూడా చాలా ప్రత్యేకమైనది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం విడివిడిగా రెండు పవర్ఫుల్ కథలను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏ కథ ముందుగా కొలిక్కి వస్తే.. ఆ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసిన రాజమౌళి.. ఈసారి మాత్రం విడివిడిగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం ఆయన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలాగే రామ్ చరణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని మరో భారీ కథపై కసరత్తు జరుగుతోందట. ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో ముందుగా సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బహుశా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో కలిసి ఈ రెండు స్క్రిప్టులపై సమాంతరంగా చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు సినిమాపైనే ఉంది. 'వారణాసి' మూవీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పూర్తి కాగానే తన తదుపరి హీరో ఎవరనే దానిపై జక్కన్న అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
May 9, 2026 10:57AM
'జాతి రత్నాలు' అనుదీప్ నెక్స్ట్ మూవీ.. హీరో ఎవరో తెలిస్తే షాక్!
కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్ (Nithiin), వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖర్ టి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ(Anudeep KV)తో నితిన్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనుదీప్ తనదైన శైలిలో సిల్లీ అండ్ హిలేరియస్ కామెడీని పండించడంలో దిట్ట. నితిన్ కూడా 'భీష్మ' వంటి సినిమాలతో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో వినోదం రెట్టింపు అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' (People Media Factory) నిర్మించనుందని సమాచారం. అనుదీప్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగా కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది. అనుదీప్ గత చిత్రం 'ఫంకీ' నిరాశపరిచింది. ఇప్పుడు ఈ సినిమాతో తాను హిట్ కొట్టడమే కాకుండా, నితిన్ ను కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి.
May 8, 2026 6:28PM
Allu arjun: మాటలు మారాయి.. రాకా తాజా న్యూస్ నిజమేనా!
పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి కట్ అవుట్ ని పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రెజెంట్ 'రాకా'(Raaka)తో ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో అయితే చిన్నప్పుడు మనం చెప్పుకొని మర్చిపోయిన చందమామ కథల్ని రాకా కథ గురించి చెప్పుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్ గా రాకా గురించిన ఒక ఫ్రెష్ రూమర్ నన్నెవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం తన బర్త్ డే సందర్భంగా సంవత్సరానికి రెండు చిత్రాలని చేస్తాన ని అల్లు అర్జున్ ప్రకటించాడు. ఈ నేపధ్యంలో రాకా కి ఎక్కువ టైంని స్పెండ్ చేయకూడదని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది వేసవి కంటే ముందే రాకా రావచ్చనే మాటలు వినపడుతున్నాయి.లోకేష్ కనగరాజ్ తో కూడా అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాను ఇచ్చిన మాట ప్రకారం రెండు సినిమాలు రావాలంటే రాకా ని త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడనే రూమర్స్ మొదలయ్యాయి. Also read: VIjay: పీచే ముడ్.. విజయ్ పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ రాకా మాత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత హై బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండనున్నాయి. ఏ విషయంలోను అట్లీ(Atlee)కాంప్రమైజ్ కావడం లేదు. దీపికా పదుకునే పై కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరణ జరుపుకున్న రాకాని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.
May 7, 2026 2:38PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com





.webp)

