
నందమూరి ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. మోక్షజ్ఞ డెబ్యూపై క్లారిటీ వచ్చేసింది!
నందమూరి అభిమానులకు శుభవార్త! మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారు! నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, ఏవో కారణాలతో అది పట్టాలెక్కలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? డైరెక్టర్ ఎవరు? అంటూ అప్పటినుంచి చర్చ జరుగుతూనే ఉంది. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడనుంది. (Nandamuri Mokshagna) క్లాసిక్ ఫిల్మ్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను బాలకృష్ణ తలపెట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్యే కథ రాసుకోవడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, కొంతకాలంగా మళ్ళీ ఎటువంటి చప్పుడు లేదు. అయితే త్వరలోనే సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Aditya 999) బాలకృష్ణ ఇచ్చిన స్టోరీ లైన్ ని తీసుకొని క్రిష్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఉగాది కానుకగా మార్చిలో అధికారికంగా ప్రకటించి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. కాగా, 'ఆదిత్య 999'లో మోక్షజ్ఞ హీరోగా నటించనుండగా, బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని వినికిడి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మొదటి సినిమాలోనే తండ్రితో కలిసి నటిస్తుండటం ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు. Also Read: 15 ఏళ్ళ ప్రేమ కావాలి.. ఇలాంటి డ్రీమ్ డెబ్యూకి అదృష్టం ఉండాలి!
Feb 25, 2026
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అక్కినేని హీరో!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ రంగంలోకి వివిధ భాషలకు చెందిన స్టార్స్ ప్రత్యేక పాత్రలో అక్కినేని హీరో! జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ కావడంతో 'డ్రాగన్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను పెంచే న్యూస్ వినిపిస్తోంది. ఇందులో అక్కినేని హీరో అఖిల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Akhil Akkineni) 'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టోవినో థామస్ విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. అలాగే 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కథకు కీలకమైన ప్రత్యేక పాత్రలో అఖిల్ కనిపించనున్నాడట. నిడివి తక్కువ అయినప్పటికీ ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్, అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ రోల్ అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా అఖిల్ ఓకే చెప్పినట్లు టాక్. కాగా, అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, జూన్ కి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. Also Read: 24 ఏళ్ళ క్రితం బండ్ల గణేష్ హీరోగా భారీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
Feb 24, 2026
నాగచైతన్య 25వ సినిమా.. రాజమౌళి కాదు.. రంగంలోకి సుకుమార్!
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నాగచైతన్య 25వ సినిమా దర్శకుడు రాజమౌళి అంటూ మొదట ప్రచారం సుకుమార్ కాంపౌండ్ అంటూ తెరపైకి కొత్త న్యూస్ అసలు చైతన్య 25వ సినిమా డైరెక్టర్ ఎవరు? అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తన 24వ సినిమా 'వృషకర్మ'ను కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాతో చైతన్య ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య 25వ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. హీరో కెరీర్ లో 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అందుకే చైతన్య 25వ సినిమాపై అక్కినేని కుటుంబం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) పేరు వినిపించింది. చైతన్య 25వ సినిమా దర్శకుడు రాజమౌళి అంటూ ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. నాగచైతన్య 25వ సినిమా సుకుమార్ కాంపౌండ్ లో తెరకెక్కునుందని తెలుస్తోంది. చైతన్య 25వ చిత్రానికి సుకుమార్(Sukumar) కథ అందించడంతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. ఇక ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడట. 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు(Buchi Babu Sana) మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తన రెండో సినిమా 'పెద్ది'(Peddi)ని ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది'పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. దీని తర్వాత ప్రతిష్టాత్మక నాగచైతన్య 25వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. కాగా, నాగ చైతన్య-సుకుమార్ కాంబినేషన్ లో గతంలో '100% లవ్' అనే విజయవంతమైన చిత్రం రావడం విశేషం. ఆ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయగా, ఇప్పుడు 25వ సినిమాకి కథ అందిస్తున్నాడని టాక్. మరి చైతన్య 25వ సినిమా కోసం సుకుమార్ ఎలాంటి కథను ఇస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే, నాగచైతన్యతో సినిమా చేయబోయే దర్శకుల లిస్టులో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, వెంకీ అట్లూరి, క్లాక్స్ వంటి దర్శకుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. Also Read: ఉదయ్పూర్ బయల్దేరిన విజయ్, రష్మిక
Feb 23, 2026‘వారణాసి’కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!
సూపర్స్టార్ మహేష్(Superstar Mahesh babu), ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli) కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబ్ ట్రాటింగ్ ఎడ్వంచరస్ మూవీ ‘వారణాసి’(Varanasi). ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్ప్పుడు వస్తున్న అప్డేట్స్ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచుతున్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనగానే సహజంగానే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమాకి అన్ని హంగులు కల్పించడానికి రాజమౌళి కషి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారనే వార్త వినిపిస్తోంది. నాని హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో విలన్గా సుదీప్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నటుడిగా అతన్ని ఎక్కడికో తీసుకెళ్లిందా సినిమా. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రంలో ఒక సీన్ చేశారు. ఇప్ప్పుడు ‘వారణాసి’ చిత్రంలో సుదీప్ కోసం రాజమౌళి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ను క్రియేట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో 30 నిమిషాల పాటు సుదీప్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అతనిదని చెబుతున్నారు. ఒక తెలుగు సినిమాలా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే సినిమాగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పథ్విరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప్పుడు సుదీప్ కూడా ఈ సినిమాలో భాగం కానుండడంతో మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. 1000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో రాజమౌళి చేసిన కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి నిర్మాణం జరుపుకున్నాయి. దానికి భిన్నంగా ‘వారణాసి’ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Feb 20, 2026‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్కి రంగం సిద్ధం.. డైరెక్టర్ ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chiranjeevi) కెరీర్ని టర్న్ చేసిన సినిమా ఖైదీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ని తిరుగులేని స్టార్గా నిలబెట్టిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మైల్స్టోన్గా నిలిచిన సినిమా అది. ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోందని గత కొన్ని సంవత్సరాలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Aswin) ఆ ప్రయత్నం చేయబోతున్నారనే సమాచారం అందుతోంది. 2024లో ప్రభాస్(Prabhas)తో ‘కల్కి 2898 ఎడి’ వంటి భారీ కమర్షియల్ హిట్ని రూపొందించిన నాగ్ అశ్విన్.. ఇప్ప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక ఎక్స్ట్రార్డినరీ కథను రెడీ చేశారని తెలుస్తోంది. ఇప్ప్పుడీ వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. పురాణాలను, ఫాంటసీని మిక్స్ చేసి అద్భుతాలు చెయ్యొచ్చు అని కల్కి చిత్రంతో ప్రూవ్ చేసిన నాగ్ అశ్విన్.. మరోసారి ఆ తరహా కథతో రాబోతున్నారని సమాచారం. అయితే చిరంజీవి కోసం సిద్ధం చేసిన కథ జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చిరంజీవిని కలిసి కథ వినిపించేందుకు నాగ్ అశ్విన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ కథ ఓకే అయితే చిరంజీవి కెరీర్లో మరో మైల్స్టోన్ లాంటి సినిమా వస్తుందని అభిమానులు ఆశించవచ్చు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని నిర్మించిన అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగఅశ్విన్ ‘కల్కి’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
Feb 20, 2026
కార్తీ సెకండ్ తెలుగు మూవీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
తెలుగు మార్కెట్ పై కన్నేసిన కోలీవుడ్ బ్రదర్స్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య మూవీ అన్న బాటలోనే తమ్ముడు కార్తీ ఆ కామెడీ డైరెక్టర్ తో కార్తీ మూవీ? కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య(Suriya), కార్తీ(Karthi)లకు తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ బ్రదర్స్ తెలుగులో తమ మార్కెట్ ని మరింత పెంచుకునే పనిలో పడిపోయారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తన 46వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. (Suriya 46) కార్తీ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో కామెడీ డైరెక్టర్ గా తనదైన ముద్రవేసిన కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. నాగవంశీ నిర్మించనున్న ఈ చిత్రం తెలుగులోనే తెరకెక్కనుందట. మరో రెండు మూడు నెలల్లో పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. కార్తీకి ఇది రెండో తెలుగు సినిమా. గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జునతో కలిసి 'ఊపిరి' అనే సినిమా చేశాడు. అది తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది. కార్తీ కామెడీ టైమింగ్ బాగుంటుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ ఒక మంచి ఎంటర్టైనర్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడంలో డౌట్ లేదు. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరు కూడా లాక్ చేశారని న్యూస్ వినిపిస్తోంది. సితార బ్యానర్ లో మీనాక్షి ఇప్పటికే 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్', 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు చేయడం విశేషం. Also Read: తెలుగు సినిమాకు కొత్త తలనొప్పి.. చిన్న సినిమాలకే ఈ పరిస్థితి ఎందుకు?
Feb 18, 2026
AA22: అల్లు అర్జున్ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్.. 2000 కోట్లు లోడింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇది అల్లు అర్జున్ కి 22వ సినిమా (AA22). సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవు, ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ అంచనాలు మాత్రం భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. 'AA22'లో రానా దగ్గుబాటి(Rana Daggubati) నటిస్తున్నాడట. కథకి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరో, విలన్, ప్రత్యేక పాత్ర అనే లెక్కలు వేసుకోకుండా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీగా ఉంటాడు రానా. తన 15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు 'AA22'లో కూడా ఒక పాత్ర చేయడానికి రానా ఓకే చెప్పాడన్న న్యూస్ వైరల్ గా మారింది. ఈ రోల్ తో రానా అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు. 'AA22'లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో రష్మికది నెగెటివ్ రోల్ అని టాక్. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'పుష్ప-2' తరువాత అల్లు అర్జున్, 'జవాన్' తరువాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో పాటు.. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కావడంతో పాజిటివ్ టాక్ వస్తే రూ.2000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. Also Read: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు!
Feb 17, 2026
Peddi: పెద్ది మూవీ స్టోరీ ఇదే!
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'(Peddi) సినిమా చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 'పెద్ది' రూపొందుతోంది. అయితే అసలు ఈ చిత్ర కథ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా సోషల్ మీడియాలో పెద్ది స్టోరీ ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు, ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళాడు అనే పాయింట్ తో 'పెద్ది' తెరకెక్కుతోందట. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయట. ముఖ్యంగా కామెడీ, లవ్ స్టోరీ ఆకట్టుకుంటాయట. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుందని, నటుడిగా రామ్ చరణ్ కి 'రంగస్థలం' స్థాయి పేరు రావడం ఖాయమని చెబుతున్నారు. 'పెద్ది'పై రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేడు(ఫిబ్రవరి 15) దర్శకుడు బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా చరణ్ చేసిన ట్వీట్.. ఆయన కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తోంది. "నా పెద్ది కెప్టెన్ బుచ్చిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిరుచి, ప్రతి చిన్న విషయంపై చూపించే శ్రద్ధ, రూటెడ్ స్టోరీ టెల్లింగ్.. ప్రతిరోజూ సెట్లో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మనిద్దరం కలిసి మరిన్ని మ్యాజికల్ స్టోరీలను సృష్టిద్దాం. ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం మీకు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. బుచ్చిబాబుతో మరిన్ని సినిమాలు చేయడానికి రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఆయన ట్వీట్ ని బట్టి అర్థమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ దీని గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది. బుచ్చిబాబు ప్రతిభకు ఫిదా అయిన చరణ్, మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని.. పెద్ది విడుదల సమయంలో ఈ కాంబినేషన్ లో రెండో సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్. https://x.com/AlwaysRamCharan/status/2022880527179772101?s=20
Feb 15, 2026విజయ్, రష్మికల పెళ్లి చూడాలంటే 60 కోట్లు కట్టాల్సిందేనా?
టాలీవుడ్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇక రష్మిక మందన్న నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకొని దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుబోతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట. అయితే అధికారికంగా ఈ జంట ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ వారిద్దరూ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయడం వంటివి సోషల్ మీడియాలో జరిగిపోతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం జరిగిందనే వార్త వచ్చింది. ఫిబ్రవరి 26 ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది అని ప్రచారం జరుగుతోంది. అయితే తమ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఈ జంట ఇప్పటివరకు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన స్టిల్స్ వైరల్ అయిపోయాయి. ఇక పెళ్లి కోసం వీరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్ప్పుడు మరో కొత్త వార్త వైరల్గా మారింది. ఫిబ్రవరి 26న జరగనున్న విజయ్, రష్మికల పెళ్లి వేడుక వీడియో రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందనేది ఆ వార్త. సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ వీడియో రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోవడం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే నెట్ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్తో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లిందని తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేసిన ఎమౌంట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వేడుక స్ట్రీమింగ్ కోసం 60 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైంది. విశేషం ఏమిటంటే.. అంత భారీ ఆఫర్ను కూడా విజయ్ దేవరకొండ తిరస్కరించారని తెలుస్తోంది. జీవితంలో జరిగే ముఖ్యమైన వేడుకను క్యాష్ చేసుకునేందుకు తాను సిద్ధంగా లేనని విజయ్ చెప్పినట్టు సమాచారం. ఆ మధురమైన క్షణాలను తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య జరుపుకోవాలని, ఆ జ్ఞాపకాలను ప్రైవేట్గానే ఉంచుకోవాలని తాను భావిస్తున్నానని తెలిపారట. పెళ్లి గురించి గానీ, ఈ వీడియో రైట్స్ గురించి గానీ ఈ జంట ఎక్కడా ప్రస్తావించకపోయినా న్యూస్ మాత్రం వైరల్ అయిపోతోంది.
Feb 13, 2026
మెగా ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ మారుతి!
డైరెక్టర్ మారుతికి హీరో దొరికేశాడా? మారుతితో సినిమాకి సై అంటున్న మెగా హీరో ఎవరు? 'ఈ రోజుల్లో', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి(Maruthi). అలాంటి మారుతికి 'ది రాజా సాబ్'(The Raja Saab) రూపంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశమొచ్చింది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ దారుణంగా నిరాశపరిచింది. దీంతో మారుతి నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఉంటుందనే ఆసక్తి నెలకొంది. 'ది రాజా సాబ్' హిట్ అయ్యుంటే.. ప్రభాస్ బాటలోనే పయనించి వేరే స్టార్లు కూడా మారుతికి అవకాశం ఇచ్చి ఉండేవారేమో. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్ళీ మారుతి మీడియం రేంజ్ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలకు సరిపోయేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ కథను మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)ను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ సైతం మారుతితో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్ లో గతంలో 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ ఫిల్మ్ వచ్చింది. మరోసారి అలాంటి ఎంటర్టైనర్ తో మంచి హిట్ కొట్టి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని మారుతి చూస్తున్నాడట. ప్రస్తుతం సాయి తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. దీని తర్వాత మారుతి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. Also Read: 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకి A సర్టిఫికెట్.. ఎందుకో తెలుసా?
Feb 11, 2026
బోయపాటి నెక్స్ట్ మూవీ.. అల్లు అర్జున్ డేట్స్ ఇచ్చాడా?
బోయపాటి శ్రీను నెక్స్ట్ మూవీ ఎవరితో? అల్లు అర్జున్ కి కథ వినిపించిన బోయపాటి? 'సరైనోడు' సీక్వెల్ కి బన్నీ సై అన్నాడా? గతేడాది డిసెంబర్ లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన 'అఖండ-2'తో ప్రేక్షకులను అలరించాడు బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఆయన తన తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొంది. నిజానికి 'అఖండ-2' విడుదల సమయంలో అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. గతంలో వీరి కాంబోలో 'సరైనోడు' సినిమా వచ్చింది. 'సరైనోడు-2' కోసం కానీ, లేదంటే ఆ తరహా ఒక మంచి యాక్షన్ సబ్జెక్టు కోసం కానీ.. వీరు మరోసారి చేతులు కలుపుతారని న్యూస్ వినిపించింది. (Allu Arjun) తాజాగా అల్లు అర్జున్ ని కలిసి బోయపాటి కథ వినిపించినట్లు, ఆ కథకు బన్నీ ఇంప్రెస్ అయినట్లు మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అనుమానమే. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ తరువాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు దర్శకుల ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే కనీసం రెండు మూడేళ్లు ఆగాలి. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకాలం ఎదురుచూడటం కష్టమే. ఈ క్రమంలోనే మరో ఇద్దరు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, తెలుగు హీరో రానా దగ్గుబాటి. 'ధురంధర్'తో సంచలన విజయాన్ని అందుకున్న రణ్వీర్.. త్వరలో 'ధురంధర్-2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే పలు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. దీంతో రణ్వీర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా టైం పడుతుంది. అందుకే రానా-బోయపాటి కాంబినేషన్ సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. (Rana Daggubati) వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా.. ఒక మంచి కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్నాడు. బోయపాటితో సినిమా చేస్తే రానా మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశముంది. ఇక బోయపాటికి కూడా రానాతో సినిమా చేయడం ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది. చూద్దాం మరి వీరి కాంబో త్వరలోనే పట్టాలెక్కుతుందేమో. Also Read: ఎవరూ ఊహించని దర్శకుడితో అకీరా నందన్ డెబ్యూ మూవీ!
Feb 10, 2026
పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ కాంబోలో భారీ మల్టీస్టారర్!
మరో మల్టీస్టారర్ చేస్తున్న పవన్ కళ్యాణ్! పవన్ సోదరుడి పాత్రలో విజయ్ దేవరకొండ! మల్టీస్టారర్స్ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా ఊహించని కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే ఆ కిక్కే వేరు. త్వరలో అలాంటి ఓ మల్టీస్టారర్ కి శ్రీకారం పడబోతున్నట్లు తెలుస్తోంది. ఒక క్రేజీ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఈ మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకులను పలకరించనున్న పవన్ కళ్యాణ్.. తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారని వినికిడి. అయితే ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు రెండో హీరోగా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్, విజయ్ అన్నదమ్ములుగా కనిపిస్తారట. విజయ్ ది సినిమా అంతా ఉండే పాత్ర కాగా.. పవన్ మాత్రం ఇంటర్వెల్ కి ముందు వచ్చి, దాదాపు గంటసేపు స్క్రీన్ పై కనిపిస్తారని టాక్. అదే నిజమైతే పవన్-విజయ్ కాంబో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కి మల్టీస్టారర్స్ కొత్తకాదు. గోపాల గోపాల, బ్రో వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు తన పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణంగా.. తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఉగాదికి ఈ మూవీని లాంచ్ చేసి, వెంటనే షూట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. Also Read: టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ బాక్సాఫీస్ ఫైట్.. ఎన్నిసార్లు తలపడ్డారు? ఎవరిది పైచేయి?
Feb 09, 2026సందీప్రెడ్డితో ముదిరిన వివాదం.. ‘స్పిరిట్’ నుంచి తప్ప్పుకున్న ప్రకాష్రాజ్!
- మరోసారి వార్తల్లోకి వచ్చిన ‘స్పిరిట్’! - ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి మధ్య రేగిన వివాదం ఏంటి? - ‘స్పిరిట్’ నుంచి ప్రకాష్ రాజ్ బయటికి రావడానికి అదే కారణమా? - ప్రకాష్ రాజ్ విషయంలో ‘స్పిరిట్’ మేకర్స్ డెసిషన్ ఏంటి? ఈమధ్యకాలంలో టాలీవుడ్లోని టాప్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న విషయం తెలిసిందే. అన్నింటి కంటే రెబల్స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల పైనే అందరి దష్టీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ సందీప్రెడ్డి వంగా వంటి విలక్షణ దర్శకుడితో ప్రభాస్ చేస్తున్న సినిమా అంటే దానికి ఓ ప్రత్యేకత ఏర్పడుతుంది. సందీప్రెడ్డి అంతకుముందు చేసిన అర్జున్రెడ్డి, యానిమల్ సినిమాలే దానికి కారణం. ఆ సినిమాల్లో హీరో ఎంత ఫెరోషియస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఇప్ప్పుడు ప్రభాస్, సందీప్ కాంబినేషన్లో రూపొందుతన్న ‘స్పిరిట్’ చిత్రం ఏ రేంజ్లో ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ను ఒక డిఫరెంట్ లుక్తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో చూపించబోతున్నాడు సందీప్. ఇక అతని సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. తాజాగా అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్రాజ్ తప్ప్పుకున్నారనేది ఆ వార్త. తన గత చిత్రాలకు భిన్నంగా ఎంతో ఫాస్ట్గా ‘స్పిరిట్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు సందీప్. అందులో భాగంగానే ప్రభాస్, ప్రకాష్రాజ్ మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఆమధ్య న్యూస్ వచ్చింది. అయితే సడన్గా ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్ప్పుకున్నారనే వార్త ఇప్ప్పుడు అందర్నీ షాక్కి గురి చేస్తోంది. అంత హైప్ ఉన్న భారీ సినిమా నుంచి ప్రధాన నటుడు తప్ప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెట్టేస్తే.. ముందు ఆ వార్త రావడంతోనే షూటింగ్లో ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది. గతంలో రిలీజ్ అయిన ‘స్పిరిట్’ వాయిస్ టీజర్లో ఒక జైలు అధికారిగా ప్రకాష్రాజ్ నటిస్తున్నారనే విషయం అర్థమైంది. ప్రత్యేకంగా టీజర్లో వాయిస్ ఉంది అంటే సినిమాలో అతని క్యారెక్టర్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రాధాన్యం ఉన్న నటుడు సినిమా నుంచి తప్ప్పుకోవడం అనేది ఇప్ప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి. మొదట అనుకున్న హీరోయిన్ దీపికా పదుకొనే. కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి యానిమల్లో నటించిన దీప్తి తిమ్రిని తీసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రకాష్రాజ్, సందీప్రెడ్డి మధ్య తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్ప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్రాజ్తో షూటింగ్ మొదలైన కొన్నిరోజులకే ఈ వార్త బయటికి రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సీన్స్ని సందీప్ తీస్తున్న విధానంతో ప్రకాష్రాజ్ ఏకీభవించకపోవడం వల్ల షూటింగ్కి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్ సినిమా నుంచి బయటికి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. ప్రకాష్రాజ్ విషయంలో సందీప్ టెన్షన్ పడుతున్నాడని, నెక్స్ట్ ఏం చెయ్యాలన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదని సమాచారం. ప్రకాష్రాజ్ స్థానంలో మరో నటుడ్ని తీసుకుంటారా లేక అతనితోనే కాంప్రమైజ్ అయి కంటిన్యూ అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ప్రకాష్రాజ్గానీ, చిత్ర యూనిట్గానీ స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. ‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని అఫీషియల్గా ఎనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా చేస్తున్నారు సందీప్రెడ్డి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Feb 09, 2026
మెగా షాక్.. సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్!
ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో భారీ విజయాన్ని అందుకొని, ఫుల్ జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఇదే రిజల్ట్ ని 2027 సంక్రాంతికి రిపీట్ చేయాలని చూస్తున్నారు. చిరంజీవి తన 158వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2027 సంక్రాంతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. గతేడాది 'ఓజీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టే ఈ వేసవిలో డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు వినికిడి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఉగాదికి మూవీని లాంచ్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రావడం ఖాయమే అంటున్నారు. దీంతో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకేసారి విడుదలవుతాయన్న వార్త ఆసక్తికరంగా మారింది.
Feb 08, 2026
మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!
ఒక్కోసారి ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి కాంబోనే సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదెని(Haneef Adeni) చేతులు కలుపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి సహా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది. రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మలయాళ సినిమాలలో 'మార్కో' ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయలెంట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి వయలెంట్ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ గతేడాది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ హీరోను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ లో నటించనున్న హీరో బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన మాస్ ఇమేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి బాలకృష్ణను వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నిజంగానే ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.
Feb 01, 2026
అక్కినేని హీరోల మల్టీస్టారర్.. మరో 'మనం' అవుతుందా?
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ తరంలో క్లాసిక్ మల్టీస్టారర్ అంటే మొదటగా గుర్తుకొచ్చే సినిమా 'మనం'. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఈ మూవీ.. 2014 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తండ్రీకొడుకులు నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు'(2022) కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil Akkineni) కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని నిర్మించనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ'(Vrushakarma) సినిమా చేస్తున్నాడు. దీనిని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అఖిల్ విషయానికొస్తే 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో 'లెనిన్'(Lenin) మూవీ చేస్తున్నాడు. ఇది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశముంది. Also Read: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!
Jan 29, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com









