
డ్రాగన్లో లవ్ సాంగ్: ఎన్టీఆర్ కోసం రూట్ మార్చిన నీల్.. ఫ్లాష్బ్యాక్ ట్విస్ట్ లీక్.!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు గుర్తుకొస్తున్నాయి. 'డ్రాగన్' కూడా అలాగే ఉండబోతుందని గ్లింప్స్ తో అర్థమైంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందట. ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ శైలికి భిన్నంగా.. ఎన్టీఆర్ కోసం ఒక లవ్ ట్రాక్ ని, ముఖ్యంగా ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని డిజైన్ చేశారట. 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ప్రెజెంట్ టైమ్లైన్లో ఒక క్రూరమైన అస్సాసిన్గా సాగుతుంది. అంతర్జాతీయ ఓపియం మాఫియా బ్యాక్డ్రాప్లో నడిచే ఈ పాత్ర పేరు 'లూగర్'. ఈ లూగర్ పాత్ర మొత్తం ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ అండ్ గ్రే షేడ్స్లోనే, రక్తం ఉడికిపోయే సీన్స్, వైలెంట్ ఎలివేషన్లతో నెవర్ బిఫోర్ రేంజ్లో ఉండబోతోంది. ఒక మామూలు మనిషి, ఇంత క్రూరమైన 'లూగర్' అనే అస్సాసిన్గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు అతనికి ఎదురైన ఆ ఘోరమైన ట్రాజెడీ ఏంటి? అనేదే ఈ సినిమాలో మేజర్ హైలైట్ కాబోతోంది. ఈ గతాన్ని చూపించే ఫ్లాష్బ్యాక్ పోర్షన్స్ కోసం నీల్ ఒక సరికొత్త కలర్ఫుల్ వరల్డ్ని క్రియేట్ చేశారట. ఈ ఫ్లాష్బ్యాక్లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా కూల్గా, క్లాస్గా, లవ్లీగా ఉండబోతోంది. హీరోయిన్ రుక్మిణి వసంతతో కలిసి ఒక వింటేజ్ అండ్ క్లాసిక్ లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్. అంతేకాదు, ప్రశాంత్ నీల్ సినిమాల్లో మనం ఇప్పటివరకు చూడని విధంగా.. రిచ్ లొకేషన్స్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో ఒక మైండ్ బ్లోయింగ్ మెలోడీ లవ్ సాంగ్ని కూడా డిజైన్ చేశారట. కన్నులవిందు చేసే విజువల్స్తో ఈ సాంగ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. ఆ ప్రశాంతమైన, అందమైన రంగుల ప్రపంచం.. ఒక ఊహించని ఘోరమైన సంఘటన వల్ల ఒక్కసారిగా చీకటి మయంగా మారిపోతుంది. ఆ పగ, ప్రతీకారం వల్ల రూపుదిద్దుకున్న భయంకరమైన రూపమే ఈ 'లూగర్'... అదే మన 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ మార్క్ పీక్ ఎమోషన్స్, మాస్ గూస్బమ్స్ మూమెంట్స్, దానికి తోడు ఎన్టీఆర్ నటన... ఇవన్నీ థియేటర్లలో విజువల్ ఫీస్ట్ని అందించబోతున్నాయి. [Dragon Movie Love Song, Dragon Movie Flashback, NTR Luger Character, NTR Dragon Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth, Telugu Film News, Telugu News]
Sep 18, 2026 4:58PM
మహేష్ బాబుతో భన్సాలీ భారీ ప్లాన్: ఆ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా.?
సూపర్స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయనతో ఒక్క సినిమానైనా తెరకెక్కించాలని ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ దాకా ఎందరో మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్లో బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలను అందించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ చేయాలని భన్సాలీ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఆయన చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ రేసులోకి మహేష్ బాబు పేరు వచ్చి చేరింది. ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. తాజాగా భన్సాలీ స్వయంగా మహేష్ బాబును కలిసి ఓ పవర్ ప్యాక్డ్ కథను వినిపించారట. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఫ్యాన్స్ అయితే ఈ కాంబో నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో ఫుల్ బిజీగా ఉన్నారు. జక్కన్న సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ‘వారణాసి’ పూర్తయిన తర్వాతే, భన్సాలీ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భన్సాలీ చెప్పిన కథ మహేష్కు నచ్చిందా? రాజమౌళి సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? లేదా ఇదంతా కేవలం రూమర్గానే మిగిలిపోతుందా? అన్న దానిపై రాబోయే రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. [Mahesh Babu Sanjay Leela Bhansali Movie, Mahesh Babu Next Movie, Superstar Mahesh Babu, Sanjay Leela Bhansali, Varanasi Movie, SS Rajamouli, Telugu Movie News, Telugu News, Tollywood]
Sep 16, 2026 2:26PM
ఫౌజీ కొత్త రిలీజ్ డేట్: ఊహించని డేట్ లాక్ చేసిన మేకర్స్.!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఫౌజీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వంటి కారణాలతో 'ఫౌజీ' వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'ఫౌజీ' వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుతుందని, కాదు మార్చిలో అని రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండూ కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనవరిలో సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. మార్చి లోనేమో ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' ఉంది. అందుకే ఫిబ్రవరి మంచి ఆప్షన్ అని భావిస్తున్నారట. 'ఫౌజీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మేకర్స్, కొత్త రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నారట. డేట్ ఫైనల్ అయితే, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. [Prabhas Fauzi Movie, Fauzi New Release Date, Fauzi February Release, Fauzi Movie 2027, Fauzi vs Spirit, Prabhas, Hanu Raghavapudi, Telugu Film News, Telugu News]
Sep 15, 2026 3:32PM
అల్లు అర్జున్ ఫ్యాన్స్కి షాక్: 2028కి వాయిదా పడిన 'రాకా'.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న 'రాకా' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 'పుష్ప' లాంటి ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అసలు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ ఏడాది దసరా నాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, 2027 క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. షూటింగ్ షెడ్యూల్స్లో తీవ్రమైన జాప్యం జరగడంతో, 'రాకా' మూవీ రిలీజ్ ఏకంగా 2028కి వాయిదా పడిందని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు 2027 మార్చి లేదా ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది. డైరెక్టర్ అట్లీ తన సినిమాల్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాడు. 'రాకా'లో భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆయనకు చాలా ఎక్కువ సమయం కావాల్సి వస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతోనే 2027 క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకోవాలని టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి 2028 రిపబ్లిక్ డే కానుకగా ఈ విజువల్ వండర్ను గ్రాండ్గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ డెడ్లైన్ కూడా మిస్ అయితే, 2028 సమ్మర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే అఫీషియల్ రిలీజ్ డేట్ను లాక్ చేసి అనౌన్స్ చేయనున్నారట. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్లో కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ చిత్రంలో దీపికా పడుకోణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వాయిదా పడిందన్న వార్త ఫ్యాన్స్కు కాస్త నిరాశ కలిగించినా.. అవుట్పుట్ మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేసేలా ఉండబోతోందట. [Raaka Postponed, Allu Arjun, Raaka Movie, Raaka 2028 Release, Director Atlee, Allu Arjun, Telugu Film News, Tollywood News]
Sep 12, 2026 3:54PM
మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్: సమంత భర్తతో సూపర్స్టార్ బిగ్ ప్రాజెక్ట్.!
సూపర్స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' మూవీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయింది. వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో చేతులు కలుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సహా ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా దర్శక ద్వయం రాజ్-డీకే తెరపైకి వచ్చారు. వారణాసి మూవీ షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఇప్పటి నుంచే కథలను వినడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సంచలనం సృష్టించిన మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఇటీవల మహేష్ బాబును కలసి ఒక సాలిడ్ స్టోరీ లైన్ నరేట్ చేశారట. ఈ దర్శక ద్వయంలో రాజ్ నిడిమోరు ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత భర్త కావడం విశేషం. రాజ్ అండ్ డీకే ప్రెజెంటేషన్ అనగానే.. స్టైలిష్ విజువల్స్, డార్క్ హ్యూమర్, రా యాక్షన్, సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. ఇప్పటివరకు తెలుగులో మహేష్ బాబు ఎన్నో మాస్, క్లాస్, యాక్షన్ రోల్స్ చేశారు. కానీ, రాజ్-డీకే మార్క్ రా అండ్ రియలిస్టిక్ డార్క్ హ్యూమర్ యాక్షన్ థ్రిల్లర్లో మహేష్ బాబును ఊహించుకుంటేనే ఫ్యాన్స్కి పూనకాలు వస్తున్నాయి. రాజ్-డీకే చెప్పిన డిఫరెంట్ అండ్ నోవెల్ కాన్సెప్ట్కి మహేష్ పాజిటివ్గా స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రైమరీ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా పట్టాలెక్కితే.. ఇది మహేష్ బాబు కెరీర్లో 30వ సినిమాగా రాబోతోంది. గతంలో కూడా రాజ్-డీకే, మహేష్ బాబు కాంబో గురించి పలు వార్తలు వినిపించినా, ఈసారి మాత్రం స్టోరీ డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లడం విశేషం. రాజమౌళితో గ్లోబల్ ప్రాజెక్ట్ ముగిశాక, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మేకర్స్తో మహేష్ జతకడితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. [Mahesh Babu, Varanasi Movie, SS Rajamouli, Raj and DK, SSMB30 Movie, Raj Nidimoru, Telugu Film News, Telugu Movie News, Telugu News]
Sep 10, 2026 11:08AM
ప్రభాస్ ఫ్యాన్స్కి బిగ్ షాక్: మూడు భారీ సినిమాలు వెనక్కి.!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. హను రాఘవపూడితో తెరకెక్కుతున్న 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగాతో తీస్తున్న 'స్పిరిట్', నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'కల్కి-2'.. ఇలా ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. అయితే, ఫిలిం సర్కిల్స్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, 'ఫౌజీ' చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి 'ఫౌజీ' మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా, వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఫౌజీ సినిమా సమ్మర్ రేస్లోకి దిగితే.. ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ పై ప్రభావం పడనుంది. ఎందుకంటే 'ఫౌజీ' వస్తే.. అదే సమ్మర్ స్లాట్పై కన్నేసిన సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా అక్కడ నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న 'స్పిరిట్' మూవీ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ, ఫౌజీ డేట్స్ అడ్జస్ట్మెంట్ వల్ల స్పిరిట్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫౌజీ, స్పిరిట్ పోస్ట్పోన్ అయితే, ఆ ప్రభావం నేరుగా సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి-2' పై పడుతుంది. కల్కి పార్ట్-1 తెచ్చిపెట్టిన భారీ విజయం తర్వాత పార్ట్-2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం చూస్తే.. 2028లో కల్కి-2 సినిమా వస్తే అదే గొప్ప విషయం అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. [Prabhas Lineup, Prabhas Movies, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Nag Ashwin, Telugu Film News]
Sep 9, 2026 6:28PM
క్రేజీ కాంబో: ‘ఇరుముడి’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. హీరో ఎవరో తెలిస్తే షాకవుతారు.!
'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత, ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్లోనూ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఇరుముడి' ప్రాజెక్ట్ తెచ్చిపెట్టిన సక్సెస్ జోరులో ఉన్న శివ నిర్వాణ, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ ధనుష్తో శివ నిర్వాణ ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా కథను ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు సడన్గా అనుకున్నది కాదట. 'ఇరుముడి' సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ధనుష్తో శివ నిర్వాణ కథా చర్చలు జరిపారట. శివ చెప్పిన విభిన్నమైన లైన్ ధనుష్కి బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్పై ఇద్దరి మధ్య ప్రాథమికంగా డీల్ ఓకే అయిందనే వార్తలు సినీ సర్కిల్స్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు హ్యూమన్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను ఎంతో హృద్యంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ, మరోవైపు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్ ధనుష్. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద ఎమోషన్స్ ఏ స్థాయిలో పండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్కు ఇప్పటికే 'సార్', 'రఘువరన్ B.Tech' వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ చాలా బలమైన మార్కెట్ ఉంది. సరైన ఎమోషనల్ కథ పడితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ, త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 'ఇరుముడి' సక్సెస్ ఇచ్చిన బూస్ట్తో శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నారట. [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Dhanush, Telugu Film News, Telugu News, Tollywood]
Sep 4, 2026 9:57AM
శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్: టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు.!
గుజరాతీ సినిమాలు అంటే తక్కువ బడ్జెట్, పరిమిత మార్కెట్ అని అందరూ అనుకుంటారు. కానీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' అనే సినిమా ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. శ్రీకృష్ణుడి ఆధ్యాత్మికతకు, సర్వైవల్ డ్రామాను జోడించి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో తీస్తే.. 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించి, ఏకంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇప్పుడు సౌత్ మేకర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా 'లాలో' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాదు, ఈ తెలుగు రీమేక్లో శ్రీకృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్ను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్గా మారిన చరణ్, డివైన్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఆ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గతంలో 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో బాబాయ్ బాటలోనే అబ్బాయ్ కూడా కృష్ణుడిగా మారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించబోతున్నారా అనే చర్చ మొదలైంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్కి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. విభిన్నమైన కథలను తనదైన మార్క్ స్క్రీన్ప్లేతో చెప్పే కార్తీక్ సుబ్బరాజ్ హ్యాండిల్ చేస్తే ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర కోసం నటుడు సత్యదేవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. మేకర్స్ నుంచి కానీ, రామ్ చరణ్ టీమ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒక చిన్న బడ్జెట్ డివైన్ హిట్ మూవీ.. చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ వైపు చూడటం నిజంగానే ఆసక్తికరమైన విషయం. ఒకవేళ రామ్ చరణ్ నిజంగానే కృష్ణుడిగా కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. [Ram Charan as Krishna, Laalo Remake Telugu, Laalo Krishna Sada Sahayate, Ram Charan, Karthik Subbaraj, Pawan Kalyan, Gopala Gopala, Telugu Film News, Telugu News]
Sep 2, 2026 11:58AM
ఆల్ టైం రికార్డ్: 'AA23'కి అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైం!
సౌత్ ఇండియన్ సినిమాలో ఒక హీరోనో లేక డైరెక్టరో పదుల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మనం పెద్దగా ఆశ్చర్యపోం. కానీ.. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా 23 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే నిజంగా ఆశ్చర్యకర విషయమే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంగీత దర్శకుడు తీసుకోబోతున్న బిగ్గెస్ట్ పే-చెక్స్ లో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ రికార్డు క్రియేట్ చేసిన ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరో కాదు.. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 23 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడలేదు? దీనికి ఒకటే కారణం.. అనిరుధ్ ఇచ్చే ఆ బీజీఎమ్స్ అండ్ చార్ట్బస్టర్ సాంగ్స్. ఈరోజుల్లో ఒక సినిమా బాక్సాఫీస్ విజయంలో మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బిజీఎమ్తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించే సత్తా అనిరుధ్కి ఉంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లా మారిపోతుంది. 'విక్రమ్', 'లియో' సినిమాల్లో వారి కాంబో తెచ్చిన మాస్ సునామీని మనం చూశాం. అటు అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్ అండ్ స్టైల్తో పాటలకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చే కెపాసిటీ ఆయన సొంతం. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియా వండర్ కోసం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అనిరుధ్ అడిగిన భారీ అమౌంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఈ స్థాయిలో పారితోషికం లభించడం నిజంగానే ఒక హిస్టారికల్ బెంచ్మార్క్. [AA23 Movie, Anirudh Ravichander, 23 Crore Remuneration, Allu Arjun, Lokesh Kanagaraj, Telugu Cinema News, Tollywood, Telugu News]
Aug 31, 2026 3:47PM
భయం భయం: రూట్ మార్చిన మేర్లపాక గాంధీ.. తాప్సీతో కలిసి రచ్చ రచ్చ.!
మొదట్లో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్', 'ఎక్స్ప్రెస్ రాజా' లాంటి కామెడీ సినిమాలతో అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఇటీవల 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ ఫిల్మ్ తో ఆకట్టుకున్నారు. అయితే తన నెక్స్ట్ మూవీ కోసం కంప్లీట్ రూట్ మార్చబోతున్నారు. కామెడీ పక్కన పెట్టి, ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే ఒక మైండ్ బ్లోయింగ్ సీరియస్ హారర్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్లో ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను లీడ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ గతంలో 'ఆనందో బ్రహ్మ' లాంటి హార్రర్ కామెడీతో నవ్వించి భయపెట్టారు. కానీ ఈసారి కాన్సెప్ట్ పూర్తిగా వేరు. ఇది కామెడీ కాంబినేషన్ అసలే కాదు.. పక్కా డార్క్, సీరియస్ అండ్ ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ అని సమాచారం. దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న ఈ స్క్రిప్ట్లో ఉండే సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తాప్సీని బాగా ఆకట్టుకున్నాయట. కథ వినగానే తాప్సీ ఎంతో ఎక్సైట్ అయి వెంటనే ప్రాజెక్ట్కి ఒకే చెప్పేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఒక వైపు కంటెంట్ బేస్డ్ రోల్స్ ఎంచుకునే తాప్సీ, మరోవైపు డిఫరెంట్ టేకింగ్ ఉన్న గాంధీ జతకడితే బాక్సాఫీస్ వద్ద విజిల్స్ పడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. [Merlapaka Gandhi, Taapsee Pannu, Horror Film, Korean Kanakaraju, Telugu Horror Movie, Telugu Cinema, Tollywood, Telugu News]
Aug 29, 2026 6:43PM
సూర్య తెలుగు జపం: 'ఇరుముడి' డైరెక్టర్తో అదిరిపోయే స్కెచ్.!
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు శివ నిర్వాణ తీసిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఎమోషనల్ థ్రిల్లర్గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా, శివ నిర్వాణ మేకింగ్ సత్తాను మరోసారి చాటిచెప్పింది ఈ చిత్రం. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాల తర్వాత 'ఇరుముడి' అందించిన భారీ విజయంతో ఇప్పుడు శివ నిర్వాణ పేరు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్గా మారింది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత ఒక సౌత్ స్టార్ ప్రత్యేకంగా స్పందించడమే కాదు.. డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఏకంగా చర్చలు కూడా మొదలుపెట్టేశారు. ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. 'కరుప్పు', 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలతో రెండు వరుస విజయాలను అందుకొని జోష్ లో ఉన్న సూర్య.. శివ నిర్వాణ టాలెంటెడ్ కి ఫిదా అయిపోయారట. 'ఇరుముడి'లో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ శివ నిర్వాణ ఎంత బ్యాలెన్స్ చేశారో చూసి సూర్య ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు, "నా బాడీ లాంగ్వేజ్కు సరిపోయే ఒక సాలిడ్ స్ట్రెయిట్ తెలుగు స్క్రిప్ట్ సిద్ధం చెయ్.. కలిసి పనిచేద్దాం" అని సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. Also Read: కింగ్ 100: ఐడెంటిటీ కోసమే ఇదంతా.. బాలకృష్ణకు పోటీగా నాగార్జున.! సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో 'విశ్వనాథ్ & సన్స్' చేసినప్పటికీ, అది తమిళ్ లోనే తెరకెక్కింది. అయితే ఈసారి మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సూర్య లాంటి ఇంటెన్స్ యాక్టర్.. శివ నిర్వాణ లాంటి ఎమోషనల్ డైరెక్టర్ తో జతకడితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు. [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Suriya, Telugu Movie, Vishwanath and Sons, Telugu Cinema News, Tollywood, Telugu News]
Aug 29, 2026 12:40PM
వైరల్ గా మారిన న్యూస్
మరికొన్ని గంటల్లో యష్ తన వన్ మాన్ షో 'టాక్సిక్' తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ కాబోతున్నాడు. కేజిఎఫ్ సిరీస్ వచ్చిన నాలుగేళ్ళ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ , ప్రేక్షకులు టాక్సిక్ ని వీక్షించడం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా సోషల్ మీడియాలో యష్ ఫ్యూచర్ లో రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే రూమర్ హల్ చల్ చేస్తుంది. ఈ రూమర్ వినిపించడానికి కూడా కారణం ఉంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో యశ్ తమిళ స్టార్ హీరో ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ గురించి మాట్లాడుతు 'విజయ్ ప్రయాణం నిజంగా నాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయనలోని క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు, విపరీతమైన ప్యాషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను. నటుడిగా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమాభిమానాలని తిరిగి సమాజానికి సేవ రూపంలో అందించే బాధ్యతాయుతమైన ఘట్టానికి విజయ్ చేరుకున్నారు. ప్రజలు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టారంటే దానికి ఆయన పడిన కష్టమే కారణం. కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ఆయన పయనం మునుముందుకు విజయవంతంగా సాగాలని యశ్ ఆకాంక్షించారు. దీంతో విజయ్ దారిలోనే యష్ రాజకీయాల్లోకి వస్తాడనే రూమర్ చిరు మందహాసంతో షికారు చేస్తుంది. ఏది ఏమైనా యష్ రాజకీయాల్లో రావడం తన సినీ హక్కు. Also Read: శ్రియ ఇనిస్టాగ్రమ్ పిక్ వైరల్.. ఆ స్టార్ హీరోతో హ్యాపీ డే Yash, Vijay, Toxic, Geetu Mohandas
Aug 25, 2026 1:03PM
మెగాస్టార్ లీక్ వల్లనే టైటిల్ మారిపోయిందా?
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి 'కాకా'తో జనవరి 13 న రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ మూవీకి 'కదిరి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని, రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాబోయే కథ కాబట్టి ఆ ఏరియాలోనే ఉన్న కదిరి సరైన పేరు అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపించాయి. కానీ టైటిల్ 'కాకా'గా మారిపోయింది. దీంతో 'కదిరి' నుంచి 'కాకా'గా పేరు మారిందా! దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి చేసిన లీక్ కారణమా అనే గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ 'బాబీ'తో చేస్తున్న మూవీ 'కదిరి' అనే పేరును బయటకు చెప్పేశారు . సాధారణంగా పెద్ద హీరోలు ఏదైనా వేదికపై ఒక సినిమా టైటిల్ను ముందే ప్రస్తావిస్తే, దానికి ఉండే సస్పెన్స్ లేదా హైప్ కొంతవరకు తగ్గిపోతుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ స్వయంగా ఈ పేరును రివీల్ చేయడంతో, సోషల్ మీడియాలో 24 గంటల్లోనే ఆ పేరుతో వేలాది మీమ్స్, ట్రెండ్స్ వచ్చేసాయి. దాంతో సర్ ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అయిందని భావించిన దర్శకుడు మరియు నిర్మాతలు, చివరి నిమిషంలో తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని టాక్. దాదాపు 100 శాతం డిఫరెంట్ అప్పీల్ ఉండాలనే ఉద్దేశంతోనే 'కదిరి' స్థానంలో మాస్ అండ్ రా లుక్ ఉన్న 'కాకా' అనే టైటిల్ను ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల టాక్. Also Read: 2027 సంక్రాంతి సమరం షురు.. గెలిచేది ఆ సినిమానే అంటున్న ఫ్యాన్స్ అయితే మరికొందరు విశ్లేషకులు మాత్రం ఈ ప్రచారాన్ని కేవలం ఒక రూమర్ లేదా గాసిప్గానే కొట్టిపారేస్తున్నారు. దర్శకుడు కథను మరింత పదును పెట్టే క్రమంలో క్యారెక్టరైజేషన్కు 'కాకా' అనే పదమే సరైన న్యాయం చేస్తుందని భావించి ఉండవచ్చని అంటున్నారు. సినిమాలో హీరో పాత్ర యొక్క మాస్ ఆటిట్యూడ్, నటన మరియు డైలాగ్ డెలివరీ ఆధారంగా మార్పులు చేసి, చివరకు 'కాకా' వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, చిరంజీవి లీక్ వల్లనే టైటిల్ మారిందా లేదా కథా అవసరాల రీత్యా మార్చారా అనే విషయం పక్కన పెడితే, కాకా మెగాస్టార్ ఇమేజ్ కి నూటికి నూరు శాతం కరెక్ట్ టైటిల్. Chiranjeevi, Kaaka, Kadiri, Tollywood
Aug 22, 2026 11:50AM
విజయసాయి రెడ్డి కొత్త పార్టీలో చేరబోతున్న నటులు వీళ్ళే!
తెలుగు నాట మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడానికి సిద్దమయ్యింది. మాజీ ఎం పి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి ఆ కొత్త రాజకీయ పార్టీ సారధి. దీంతో సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో సినీ రంగానికి చెందిన పలువురు నటులు చేరబోతున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఇప్పటికే ఆయనతో టచ్లో ఉన్నారని, పార్టీ ఆవిర్భావ వేదికపై వారందరూ కనిపిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే అంశాన్ని పరిశీలిస్తే, ఇవన్నీ కేవలం నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. విజయసాయి రెడ్డి వైపు నుంచి కానీ, లేదా ఆయా సినీ నటుల వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా సినీ రంగానికి చెందిన పలువురితో ఆయనకు మంచి సంబంధాలు ఉండటం, పైగా టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకున్న పాత పరిచయాల కారణంగానే ఈ తరహా ప్రచారాలు పుట్టుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రాజకీయం, సినిమా అనేవి ఒకే తల్లి కడుకున పుట్టిన ట్విన్స్. Also Read: రామ్ పోతినేనికి విలన్గా మారిన ఆ స్టార్ హీరో!. Telugu Cinema, Tollywood
Aug 19, 2026 12:41PM
ప్రొడ్యూసర్ గా ఎన్టీఆర్: 'NTRTAIN' వెనుక అసలు రహస్యం.!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో కీలక అడుగు వేయబోతున్నారు. హీరోగా పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్న తారక్.. ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి సొంతంగా ఒక నయా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తారక్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఎంతలా వైరల్ అయిందో మనందరం చూశాం. అయితే ఇప్పుడు అంతకు మించిన ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఒక బ్రాండ్ న్యూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట. ఎన్టీఆర్ (NTR) అనే పేరులోని పవర్, ఎంటర్టైన్ (ENTERTAIN) అనే పదంలోని మ్యాజిక్ను కలుపుతూ.. 'ఎన్టీఆర్ టైన్' NTRTAIN అనే బ్యానర్ నేమ్ను కూడా ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తారక్ నటిస్తున్న ప్రాజెక్ట్స్ అన్నింటికీ తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్కి చెందిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మరి అలాంటప్పుడు తారక్ సొంతంగా ఈ కొత్త బ్యానర్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నట్లు? ఈ 'NTRTAIN' బ్యానర్ కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' ను రీప్లేస్ చేయబోతుందా? లేక తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చే యంగ్ టాలెంట్ను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ ఈ ప్రత్యేకమైన అడుగు వేస్తున్నారా? అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. మరి ఎన్టీఆర్ నిజంగానే నిర్మాతగా మారబోతున్నారా? ఒకవేళ నిజమైతే 'NTRTAIN' బ్యానర్ నుంచి వచ్చే మొదటి సినిమా ఏంటి? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. Jr NTR, New Banner, NTRTAIN
Aug 19, 2026 12:10PM
కియారా అద్వానీకి షాక్: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ.!
'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #RC17 తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపికకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది. 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాల తర్వాత చరణ్-కియారా కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతోందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. హీరోయిన్ విషయంలో ఊహించని బిగ్ చేంజ్ జరిగిందని తెలుస్తోంది. సుకుమార్ అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీని పక్కన పెట్టి, ఒక సరికొత్త ఫ్రెష్ పెయిరింగ్ కోసం అన్వేషిస్తున్నారట. ఇందులో భాగంగానే 'ధురంధర్' సినిమాలో 'యలీనా' పాత్రలో తన నటనతో, క్యూట్నెస్తో మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టి, అందరి దృష్టినీ ఆకర్షించిన సారా అర్జున్ పేరును సుకుమార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లు కేవలం గ్లామర్కే పరిమితం కావు.. కథను నడిపించేంత పవర్ఫుల్ ఎమోషన్ వాళ్ల పాత్రల్లో ఉంటుంది. అందుకే ఒక యంగ్ అండ్ ప్రామిసింగ్ ఫేస్తో రామ్ చరణ్ని స్క్రీన్ పై పెయిర్ చేస్తే, ఆ ఫ్రెష్నెస్ సినిమాకే పెద్ద ప్లస్ అవుతుందని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. RC17 Movie, Ram Charan, Sara Arjun, Sukumar, Kiara Advani
Aug 18, 2026 6:55PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com











