TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

“Edison of India” G.D. Naidu నుంచి నేటి తరాలు ఏం నేర్చుకోవాలి.?

నేటి తరాలు G.D. Naidu జీవితంలో నుంచి ఏం నేర్చుకోవాలి? ఈరోజు మన దగ్గర దాదాపు అన్నీ ఉన్నాయి. Smartphones ఉన్నాయి. Google ఉంది. YouTube ఉంది. AI ఉంది. Online Courses ఉన్నాయి. ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న Knowledge అయినా మన చేతిలోకి వచ్చేస్తోంది. కానీ ఇంత Technology, ఇంత Information మన దగ్గర ఉన్నప్పుడు… మనం అంతే స్థాయిలో కొత్తగా ఏమైనా సృష్టిస్తున్నామా? ఇటీవల GDN Biopic చూస్తున్నప్పుడు నాకు G.D. Naidu గారి గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చింది. 100 సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తి… అప్పట్లో మనకు ఉన్న Technologyతో పోలిస్తే చాలా పరిమితమైన వనరులు… Formal Education కూడా పెద్దగా లేదు. అయినా Machines, Technology, Engineering, Innovation మీద ఆయనకు ఇంత ఆసక్తి ఎలా వచ్చింది? ఒక Machine చూసి… “ఇది ఎలా పనిచేస్తుంది?” అని ఆలోచించారు. ఒక సమస్య ఎదురైతే… “దీనికంటే మంచి పరిష్కారం తయారు చేయలేమా?” అని ఆలోచించారు. ఆ ఆలోచనలే ఆయనను ఒక Inventorగా, Industrialistగా, Innovatorగా తీర్చిదిద్దాయి. అందుకే G.D. Naidu జీవితంలో నుంచి నేటి తరాలు నేర్చుకోవాల్సిన అతిపెద్ద విషయం… Inventor ఎలా అవ్వాలి అనేది మాత్రమే కాదు. మళ్లీ Curiosityతో ఆలోచించడం ఎలా మొదలుపెట్టాలి అనేది. Technologyని కేవలం ఉపయోగించకండి… దాన్ని అర్థం చేసుకోండి ఈరోజు మనం Technologyని ప్రతి నిమిషం ఉపయోగిస్తున్నాం. Smartphone ఉపయోగిస్తున్నాం. కానీ అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఎంతమందికి ఉంది? AI ఉపయోగిస్తున్నాం. కానీ దాని వెనుక ఉన్న Technology ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నాం? ప్రతిరోజూ ఎన్నో Machines చూస్తున్నాం. కానీ వాటిని చూసి… “ఇది ఇంకా Betterగా చేయవచ్చా?” అని ఆలోచిస్తున్నామా? G.D. Naidu గారికి Technology అంటే కేవలం ఉపయోగించడానికి ఉన్న వస్తువు కాదు. అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయనకు Machine కనిపిస్తే దాని వెనుక ఉన్న పని విధానం తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ Curiosityనే ఆయనను Electrical, Mechanical, Automotive Technology లాంటి అనేక రంగాల్లో ప్రయోగాలు చేసేలా చేసింది. ఈరోజు Technology మన చుట్టూ ఎక్కడ చూసినా ఉంది. కానీ మనకు కావాల్సింది ఇంకొంచెం Technology కాదు. Technologyని అర్థం చేసుకోవాలనే Curiosity ఉన్న మనుషులు. మీ Degree… మీ Learningకి ముగింపు కాకూడదు G.D. Naidu గారికి Formal Education చాలా పరిమితంగానే ఉంది. కానీ ఆయన ఎప్పుడూ… “నాకు చదువు ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంతవరకే” అని ఆగిపోలేదు. Observation ద్వారా నేర్చుకున్నారు. Machines ద్వారా నేర్చుకున్నారు. Experiments ద్వారా నేర్చుకున్నారు. Travel ద్వారా నేర్చుకున్నారు. Experience ద్వారా నేర్చుకున్నారు. Mistakes ద్వారా నేర్చుకున్నారు. ముఖ్యంగా… చేసి నేర్చుకున్నారు. దీని అర్థం Formal Education అవసరం లేదని కాదు. దీని అర్థం… Classroomలో Learning మొదలవ్వాలి కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఈరోజు ఒక Student ప్రపంచంలోని గొప్ప Universitiesలోని Coursesని ఇంట్లో కూర్చొని నేర్చుకోగలడు. Knowledge మన చేతిలో ఉంది. Technology మన చేతిలో ఉంది. Opportunities కూడా ఉన్నాయి. అయితే ప్రశ్న ఒక్కటే… మనం వాటిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు… చేసి నేర్చుకోండి G.D. Naidu గారి ఆలోచనల్లో మనం తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం… Learning by Doing. ఏదో ఒక విషయం గురించి చదవడం మాత్రమే కాదు. ఇంకొకరు చేసి చూపిస్తే చూడటం మాత్రమే కాదు. మనమే చేయాలి. ఏదైనా Build చేయాలి. అది పనిచేయకపోతే ఎందుకు పనిచేయలేదో తెలుసుకోవాలి. Experiment చేయాలి. Mistake చేయాలి. మళ్లీ ప్రయత్నించాలి. అక్కడే నిజమైన Learning మొదలవుతుంది. ఒక పిల్లవాడికి Electricity గురించి Textbookలో చదివిస్తే ఒక రకమైన Knowledge వస్తుంది. అదే పిల్లవాడిని ఒక చిన్న Electrical Circuit స్వయంగా తయారు చేయమంటే… అది ఎందుకు పనిచేస్తుందో, ఎందుకు పనిచేయదో అతనికి అనుభవంతో అర్థమవుతుంది. ఈరోజు మన దగ్గర Laboratories ఉన్నాయి. Robotics Kits ఉన్నాయి. 3D Printers ఉన్నాయి. Coding Platforms ఉన్నాయి. AI ఉంది. Simulation Technology ఉంది. అంటే Hands-on Learning కోసం మనకు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రశ్న Resources ఉన్నాయా లేదా అనేది కాదు. వాటితో మనం Create చేస్తున్నామా? లేక… Technologyని కేవలం Consume చేస్తున్నామా? Perfect Resources కోసం ఎదురుచూడకండి Innovation అంటే మనకు ముందుగా ఒక పెద్ద Laboratory ఉండాలి… ఖరీదైన Machines ఉండాలి… పెద్ద Team ఉండాలి… చాలా Money ఉండాలి… అని మనం అనుకుంటుంటాం. కానీ G.D. Naidu గారి Journey చూస్తే Innovation అంతకంటే ముందే మొదలవుతుందని అర్థమవుతుంది. ఒక Machineతో. ఒక Problemతో. ఒక Questionతో. దానికి Answer కనుక్కోవాలనే పట్టుదలతో. ఆయన ప్రారంభ Journey కూడా ఎంతో ఆసక్తికరమైనది. Transport రంగంలోకి వెళ్లి ఒక Busతో ప్రారంభమైన ప్రయాణం, తరువాత పెద్ద Bus operationగా ఎదిగింది. అక్కడితో ఆగకుండా Manufacturing, Engineering, Technology రంగాల్లోకి కూడా ఆయన అడుగుపెట్టారు. అంటే… ఒక రంగంలో మొదలైన ప్రయాణం, కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తితో ఎన్నో రంగాలకు వెళ్లింది. ఈరోజు మనం చాలా సార్లు ఇలా అనుకుంటాం… “నా దగ్గర Equipment లేదు.” “Money లేదు.” “Laboratory లేదు.” “నాకు సరైన Degree లేదు.” “నాకు Opportunity రాలేదు.” కానీ Innovation ఎప్పుడూ Resourcesతోనే మొదలవ్వదు. కొన్నిసార్లు ఒక Questionతో మొదలవుతుంది. “ఎందుకు?” “ఎలా?” “ఇలా చేస్తే?” “దీన్ని ఇంకా Betterగా చేయలేమా?” అక్కడి నుంచే ఒక Innovator ప్రయాణం మొదలవుతుంది. ప్రపంచం నుంచి నేర్చుకోండి… కానీ India కోసం Build చేయండి G.D. Naidu గారు ప్రపంచంలో Technology ఎలా అభివృద్ధి చెందుతోందో తెలుసుకోవడానికి విదేశాలకు వెళ్లారు. Machines చూశారు. Technologyని అధ్యయనం చేశారు. కొత్త విషయాలు నేర్చుకున్నారు. కానీ అక్కడ చూసినదాన్ని చూసి ఆశ్చర్యపడి తిరిగి రావడం ఆయన లక్ష్యం కాదు. నేర్చుకున్నదాన్ని ఉపయోగించి Indiaలో ఏం చేయవచ్చు? అనే ఆలోచన ఆయనలో ఉంది. Technology, Machines గురించి ప్రజలకు, Studentsకి అవగాహన కల్పించడానికి Museum, Exhibitions ద్వారా కూడా ఆయన ప్రయత్నించారు. ఇది నేటి తరానికి చాలా ముఖ్యమైన Lesson. ప్రపంచం ఏం చేస్తుందో చూడాలి. వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. అవసరమైతే ఇంకా Betterగా చేయాలి. కానీ చివరికి మనం అడగాల్సిన ప్రశ్న… “ఈ Knowledgeతో India సమస్యలకు ఏం Solution ఇవ్వగలం?” ఈరోజు మన ముందు ఎన్నో పెద్ద Opportunities ఉన్నాయి. AI. Semiconductors. Electric Vehicles. Space Technology. Biotechnology. Robotics. Clean Energy. ఇక మన యువత కేవలం… “ప్రపంచం నుంచి మనం ఏం తీసుకోవచ్చు?” అని మాత్రమే కాకుండా… “ప్రపంచానికి మనం ఏం ఇవ్వగలం?” అని కూడా ఆలోచించాలి. Innovation అంటే కొత్తది తయారు చేయడం మాత్రమే కాదు… సమస్యకు పరిష్కారం చూపడం ఒక Technology చాలా Complicatedగా ఉందంటే అది గొప్ప Innovation అయిపోదు. అసలు ప్రశ్న… అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఒక మంచి Innovation ఒక నిజమైన సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఏదైనా పని Fasterగా చేయవచ్చు. Cheaperగా చేయవచ్చు. Saferగా చేయవచ్చు. Simplerగా చేయవచ్చు. ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావచ్చు. మన Indiaలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. Agriculture. Transportation. Water Management. Waste Management. Healthcare. Education. Energy. Manufacturing. Public Infrastructure. ప్రతి సమస్య వెనుక ఒక Opportunity ఉంది. ఈరోజు మన యువత ఒక Problemని చూసి… “ఇది ఎందుకు ఇలా ఉంది?” అని అడగడం మొదలుపెడితే? ఆ తర్వాత… “దీనికి నేను ఒక Solution తయారు చేయగలనా?” అని ఆలోచించడం మొదలుపెడితే? అదే Indiaని మార్చే ఆలోచన కావచ్చు. Millennials G.D. Naidu నుంచి ఏం నేర్చుకోవాలి? Millennials ఒక గొప్ప Technological Transitionని చూశారు. Landline Phones నుంచి Smartphones వరకు. Letters నుంచి Instant Messaging వరకు. Physical Maps నుంచి Google Maps వరకు. Limited Information నుంచి Unlimited Information వరకు. మన కళ్ల ముందే Technology మారిపోయింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన Lesson… మనకు ఇప్పటికే తెలిసిన Technologyనే చివరి Technology అనుకోకూడదు. నిన్న మనం నేర్చుకున్నది… రేపటికి మారిపోవచ్చు. అందుకే… Keep Learning. Keep Adapting. Keep Experimenting. Gen Z G.D. Naidu నుంచి ఏం నేర్చుకోవాలి? Gen Zకి Information అందుబాటులో ఉన్నంతగా బహుశా ఇంతకుముందు ఏ తరానికీ ఉండకపోవచ్చు. ఒక Smartphone ఉంటే… ఏ విషయం గురించైనా నేర్చుకోవచ్చు. కానీ Information ఒక్కటే Innovationని సృష్టించదు. తెలుసుకోవడం ఒకటి. అర్థం చేసుకోవడం ఒకటి. తయారు చేయడం ఇంకొకటి. అందుకే… Information → Knowledge → Skill → Idea → Product → Impact అనే ప్రయాణం మొదలవ్వాలి. Contentని Consume చేయడంలో మాత్రమే గొప్పవాళ్లు కాకుండా… Solutions Create చేయడంలో గొప్పవాళ్లు అవ్వాలి. Gen Alpha G.D. Naidu నుంచి ఏం నేర్చుకోవాలి? Gen Alpha ఒక పూర్తిగా కొత్త ప్రపంచంలో పెరుగుతోంది. AI వాళ్ల జీవితంలో సాధారణ విషయంగా మారబోతోంది. Machines ఇంకా Smartగా మారతాయి. Learning మరింత Personalized అవుతుంది. Technology మరింత Powerful అవుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది… Machines మన ప్రశ్నలకు ఎక్కువ Answers ఇవ్వగలిగితే… మనుషులు ఇంకా Better Questions అడగగలరా? భవిష్యత్తులో ఇది చాలా ముఖ్యమైన Skill కావచ్చు. Machines ఏం బాగా చేస్తాయో వాటితో పోటీ పడాల్సిన అవసరం లేదు. వాటిని ఉపయోగించాలి. వాటితో కలిసి పనిచేయాలి. వాటిని Question చేయాలి. ముఖ్యంగా… ఇప్పటివరకు లేనిదాన్ని ఊహించాలి. మరి G.D. Naidu గారు ఈరోజు Technologyని చూస్తే ఏం చేసేవారు? ఇది నాకు అన్నింటికంటే ఆసక్తికరంగా అనిపించే ప్రశ్న. ఒకసారి ఊహించండి… G.D. Naidu గారిని ఆయన కాలం నుంచి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలో ఉంచితే… ఆయన చేతిలో Smartphone ఇస్తే? Internet ఇస్తే? AI ఇస్తే? Modern Laboratory ఇస్తే? 3D Printer ఇస్తే? ప్రపంచంలోని Research మొత్తం ఆయన ముందుంచితే? ఈరోజు ఉన్న Manufacturing Technology అందుబాటులో ఇస్తే? ఆయన ఏం తయారు చేసేవారు? ఏ Problemని మొదట గుర్తించేవారు? ఏ Machineని పరిశీలించేవారు? ఏ Technologyని ఇంకా Betterగా చేయడానికి ప్రయత్నించేవారు? ఎలాంటి కొత్త Invention గురించి ఆలోచించేవారు? మనకు తెలియదు. కానీ… అదే ఈ ప్రశ్నలోని అసలు అందం. ఎందుకంటే ఆయన జీవించిన కాలంలో Technology చాలా తక్కువగా ఉండేది… కానీ Curiosity చాలా ఎక్కువగా ఉండేది. ఈరోజు మన దగ్గర Technology అపారంగా ఉంది. కాబట్టి మన ముందున్న అసలు Challenge… మన Curiosity మాత్రం తగ్గిపోకుండా చూసుకోవడం. G.D. Naidu గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం G.D. Naidu గారి గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్కువగా ఆయన Inventions గురించి మాట్లాడతాం. కానీ ఆయన జీవితంలో నాకు కనిపించే గొప్ప విషయం ఇంకొకటి. Learning అనేది ఒక Textbookతో ముగిసిపోదని ఆయన చూపించారు. Curiosity → Knowledge అవుతుంది. Knowledge → Skill అవుతుంది. Skill → Innovation అవుతుంది. Innovation → Societyకి ఉపయోగపడే అవకాశాలను సృష్టించగలదు. అందుకే G.D. Naidu గారి Story కేవలం Engineersకి సంబంధించినది కాదు. Inventorsకి మాత్రమే సంబంధించినది కాదు. Studentsకి మాత్రమే సంబంధించినది కాదు. ప్రతి Generationకి సంబంధించినది. ఎందుకంటే ప్రతి Generationకి ముందు Generation కంటే Better Technology వస్తోంది. కానీ Technology ఒక్కటే Progressని తీసుకురాదు. మనుషులే తీసుకువస్తారు. Question చేసే మనుషులు. Learn చేసే మనుషులు. Experiment చేసే మనుషులు. Build చేసే మనుషులు. Problemsకి Solutions వెతికే మనుషులు. ప్రపంచాన్ని చూసి… “ఇది ఇంకా Betterగా ఉండాలి.” అని ఆలోచించే మనుషులు. అదే G.D. Naidu గారి జీవితం నుంచి Millennials, Gen Z, Gen Alpha నేర్చుకోవాల్సిన అసలు Lesson కావచ్చు. మనందరం Inventors అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి Generationలో… ఒక Inventorలా ఆలోచించే Mindset ఉండాలి. Observe చేయాలి. Question చేయాలి. Learn చేయాలి. Experiment చేయాలి. Create చేయాలి. చివరికి… మనకు దొరికిన ప్రపంచాన్ని కేవలం ఉపయోగించకుండా… మన తర్వాతి Generationకి ఇంకొంచెం Better ప్రపంచాన్ని వదిలి వెళ్లాలి. G.D. Naidu గారు జీవించిన కాలంలో Technology తక్కువగా ఉండేది… కానీ Curiosity ఎక్కువగా ఉండేది. మనం జీవిస్తున్న కాలంలో Technology అపారంగా ఉంది. మరి… మన Curiosity కూడా అంతే అపారంగా ఉందా? — Sreekanth Damacharla ఆలోచనలు • సమాజం • దేశ నిర్మాణం

Published on: Thu Sep 10, 2026 12:09PM

political-news-img

రాజకీయం అంటే తొడలు చరిచి సవాళ్లు విసరడం కాదు.. చంద్రబాబు.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది. ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు. తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు. కానీ వాస్తవానికి తాను చేసే ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు, సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు. తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. [Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]

Published on: Thu Sep 10, 2026 11:17AM

political-news-img

ఒడిశా హాస్టల్‌లో దారుణం: సహవిద్యార్థి దాడిలో 9వ తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు!

ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్న బ్లాక్ పరిధిలో ఉన్న బాలిపేట సేవాశ్రమంలో ఒక తీవ్రమైన దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. షెడ్యూల్డ్ తెగలు మరియు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ నిర్వహించే ఈ బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై అతడి సహవిద్యార్థే దాడికి తెగబడ్డాడు. తలగుమాండి పంచాయతీ ఉపర్‌గుమాండి గ్రామానికి చెందిన జైరామ్ తాడింగి కుమారుడైన సీయారా తాడింగి అనే 9వ తరగతి విద్యార్థి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం ఉదయం పూట మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంతో హాస్టల్ ప్రాంగణానికి వచ్చిన మరొక 9వ తరగతి సహవిద్యార్థి, సీయారాపై ఉన్నపళంగా దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులైన ఇతర విద్యార్థులు తెలిపారు. ఈ దాడి కారణంగా సీయారా తలకు తీవ్రమైన లోతైన గాయమై, భారీగా రక్తంస్రావమైంది. హాస్టల్‌లో ఒక్కసారిగా రక్తసిక్తమైన ఈ దారుణ దృశ్యాన్ని చూసి తోటి విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తక్షణమే సమాచారాన్ని మెస్ ఇన్‌ఛార్జ్‌కు అందజేయడంతో, పాఠశాల అధికారులు వెంటనే స్పందించి గాయపడిన సీయారా తాడింగిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి వైద్యం అందించారు. వార్త తెలిసిన వెంటనే బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ర్యాగింగ్ కారణంగానే తమ కుమారుడిపై తోటి విద్యార్థి దాడి చేశాడని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపించారు. అయితే, పాఠశాల యాజమాన్యం మరియు అధికారులు మాత్రం ఈ సంఘటనకు ర్యాగింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న బ్లాక్ వెల్ఫేర్ ఆఫీసర్ బాధితుడి కుటుంబంతో, దాడికి పాల్పడిన విద్యార్థి కుటుంబంతో పాటు పాఠశాల అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని హెడ్ మాస్టర్ దేవబ్రత మిశ్రాకు సూచించారు. పాఠశాల హెడ్‌మాస్టర్ దేవబ్రత మిశ్రా మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు వెల్లడించారు. ఇది ర్యాగింగ్ కేస్ కాదని ఆయన స్పష్టం చేసినప్పటికీ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ఆవరణలోకి మత్తు పదార్థాలు ఎలా వస్తున్నాయనే దానిపై సహవిద్యార్థులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు క్రమంగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నా వార్డెన్, హాస్టల్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడంలేదని, వారి తీవ్ర అలసత్వమే ఈ ఘాతుకానికి కారణమని బాధితుడి కుటుంబం ఆరోపించింది. పోలీసులకు తక్షణమే సమాచారం అందించడంలో ఆలస్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడి బంధువులు, ఈ ఘటనపై పారదర్శకమైన, స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోరాపుట్ జిల్లా సంక్షేమ అధికారి సునీల్ కుమార్ తాండి స్పందిస్తూ, సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Class 9 student critically injured balipeta,odisha school hostel assault case.

Published on: Thu Sep 10, 2026 10:41AM

political-news-img

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలనం..!

ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..! బొల్లారం ఆర్మీకి చెందిన ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని, గత మూడు నెలలుగా ఒక్కొక్కటిగా దశలవారీగా మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బొల్లారంలోని ఆర్మీ ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన ఆయుధాల ఆడిట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి కనిపించకపోవడం వెలుగులోకి వచ్చింది. గత వారంలో చేపట్టిన ఆడిట్ సందర్భంగా అసలు విషయం బయటపడింది. మొత్తం నాలుగు ఏకే-47 రైఫిల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, తొమ్మిది పిస్టల్స్‌తో పాటు సుమారు 2,000 బుల్లెట్లు కనిపించకుండా పోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆయుధాలు, బుల్లెట్లు ఒకేసారి అదృశ్యం కాలేదని.. గత మూడు నెలలుగా దశలవారీగా ఒక్కొక్కటిగా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆయుధాల భద్రత, స్టాక్ నిర్వహణ, ఆయుధాల రాకపోకలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు కనిపించకుండా పోయిన తర్వాత వాటిని బయట వ్యక్తులు చోరీ చేసినట్లు కనిపించేలా ‘సీన్ క్రియేట్’ చేసినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసులో ‘బయటి వ్యక్తుల’ ప్రమేయం కంటే ఆర్మీకి సంబంధించిన అంతర్గత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించారు. మాయమైన ఆయుధాలు, బుల్లెట్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎవరు తరలించారు? ఎందుకు దశలవారీగా బయటకు తరలించారు? అనే కోణాల్లో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అదుపులో ఉన్న ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును మిలటరీ ఇంటెలిజెన్స్‌తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాయమైన ఆయుధాలు ఎక్కడికి చేరాయన్న అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. (Bollaram Army weapons theft case, NIA, Military Intelligence, indian army, PM MODI, Home minister amit shah, Telugu One, Telugu News)

Published on: Wed Sep 9, 2026 7:42PM

political-news-img

నందూస్ వరల్డ్ నందన బిగ్ బాస్ ఎంట్రీ డ్రామా: లండన్ వీసా కేసులో షాకింగ్ ట్విస్ట్!

యూట్యూబ్ ప్రపంచంలో 'నందూస్ వరల్డ్' ఛానెల్ ద్వారా అపారమైన ప్రాచుర్యం పొందిన నందన వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు మరియు లండన్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే తీవ్ర ఆరోపణలు ఆమెపై వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి సుదీర్ఘంగా విచారించారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాల్లో అసలు నందన పాత్ర ఏంటి అనే అంశంపై విజయవాడ పోలీస్ వర్గాలు తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాయి. మంగళవారం రోజున తన తల్లి మరియు న్యాయవాదితో కలిసి నందన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు ఆధ్వర్యంలో అధికారులు దాదాపు 4 గంటల పాటు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో నందన పోలీసులకు ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. లండన్ కేంద్రంగా నడుస్తున్న డెస్టినీ కన్సల్టెన్సీతో తనకేమీ సంబంధం లేదని, దాని ఆర్థిక, నిర్వహణ వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ మరియు అకౌంటెంట్ మాత్రమే చూసుకుంటారని ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. కన్సల్టెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలు, డైరెక్టర్ల సమాచారంపై పోలీసులు ప్రశ్నించగా ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. ఈ కేసు తీవ్రత వెనుక ఒక పెద్ద బాధితుల నెట్‌వర్క్ ఉంది. ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి తన వద్ద నుంచి లండన్ వీసా పేరిట రూ. 15 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. కేవలం ఆయనొక్కరే కాకుండా ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన పలువురు బాధితులు కూడా తాము నందన చేతిలో భారీగా డబ్బులు పోగొట్టుకున్నామని పోలీస్ స్టేషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆమె విచారణకు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విజయవాడ పోలీసులకు అప్పగించారు. nandana london visa fraud case police investigation,youtuber nandana questioned by vijayawada police.

Published on: Wed Sep 9, 2026 10:11AM

political-news-img

తెలుగు దేశం 3..o వెర్షన్.. నారా లోకేష్.!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు. సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు. చివరికి న్యాయస్థానాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్ పార్టీ, పర్సనల్, ప్రభుత్వం అనే 3-పీ మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు.. పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు. జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]

Published on: Wed Sep 9, 2026 10:09AM

political-news-img

ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్..!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..! తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)

Published on: Tue Sep 8, 2026 6:57PM

political-news-img

సోషల్ మీడియాను లైట్ తీసుకోవద్దు.. టీడీపీ నేతలకు లోకేష్ వార్నింగ్..!

టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. (Minister Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)

Published on: Tue Sep 8, 2026 3:25PM

political-news-img

విజయసాయి మరో బాల్ థాక్రే అనుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి. సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది. విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి. అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు పార్టీలోకి వచ్చి తన నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది. తనను తాను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. [Vijayasai Reddy Bal Thackeray Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]

Published on: Tue Sep 8, 2026 10:25AM

political-news-img

ఇసుక మాఫియాపై అధికారుల ఉక్కుపాదం: సర్వే నెంబర్ 134లో మెరుపు దాడులు!

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలో అక్రమంగా సాగుతున్న ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉక్కుపాదం మోపింది. కంది మండలం మరియు సంగారెడ్డి మండల శివారు ప్రాంతాల్లో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక నెట్‌వర్క్‌ను ఛేదించడానికి అధికారులు ఉమ్మడిగా రంగంలోకి దిగారు. ఇటీవల దిశ పత్రికలో ఇసుక దందాలో వేలంపాట . అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) తో పాటు స్థానిక రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో ఒకేసారి పలు ప్రాంతాలపై మెరుపు దాడులు నిర్వహించి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వివరాల్లోకి వెళ్తే, కంది మండల పరిధిలోని ఎర్ధనూర్ మరియు బ్యాతోల్ గ్రామాల శివారు ప్రాంతాల్లో విస్తృతంగా సాగుతున్న అక్రమ ఇసుక తయారీ కేంద్రాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఎర్ధనూర్ శివారులోని సర్వే నెంబర్ 134 లో నక్క వాగును ఆసరాగా చేసుకుని ఏకంగా 6 అక్రమ ఇసుక ఫిల్టర్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తనిఖీల్లో నిర్ధారించారు. స్థానిక పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, వాగు రూపురేఖలను మారుస్తున్న ఈ 6 ఇసుక ఫిల్టర్లను అధికారులు పొక్లెయిన్ల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేసి కూల్చివేశారు. సహజ వనరులను విచక్షణారహితంగా దోచుకుంటున్న అక్రమార్కులకు ఈ చర్యలు ఒక బలమైన హెచ్చరికగా నిలిచాయి. అయితే, ఇదే మండలంలోని ఆరుట్ల మరియు చిదురుప్ప ప్రాంతాల్లో కూడా అక్రమ ఇసుక ఫిల్టర్ల కార్యకలాపాలు సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో కూడా అధికారులు ఈ ప్రాంతాలపై దాడులు చేసి ఫిల్టర్లను కూల్చివేసినప్పటికీ, అధికారులు వెళ్లిపోగానే దందారాయుళ్లు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించడం పట్ల స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సంగారెడ్డి మండలం ఇస్మాల్ ఖాన్ పేట పరిధిలో కూడా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే అధికారుల రాకను ముందే పసిగట్టిన దందారాయుళ్లు అక్కడి నుంచి తమ టిప్పర్లు, ఎక్సవేటర్లు, ఇతర భారీ యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ కీలకమైన దాడుల్లో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజు, ఏడి మైన్స్ సంగారెడ్డి అధికారి డాక్టర్ విజయకుమార్, రెవెన్యూ ఆర్ఐ విజయ్ మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడి మైనింగ్ అధికారి డాక్టర్ విజయకుమార్ స్పందిస్తూ.. వాల్టా (WALTA) చట్ట నిబంధనలను ఉల్లంఘించి నక్క వాగు పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే వరుస దాడులు నిర్వహించడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తేనే ఈ అక్రమ దందాకు శాశ్వతంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. Telangana Mining Department sand raids, Sangareddy Walta Act sand crackdown.

Published on: Tue Sep 8, 2026 9:29AM