
CM కి తమ పవర్ ఏంటో చూపించిన SPG కమాండోస్
తెలుగు సినిమా చరిత్రలో పొలిటికల్ డ్రామాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ కోవలోనే ఒక జర్నలిస్ట్ ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రిగా మారితే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విలక్షణమైన కథాంశంతో తెరకెక్కిన మూవీ 'ఒకే ఒక్కడు'.(Oke okkadu)యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు నాట ఎన్నో థియేటర్స్ లో వంద రోజులు జరుపుకున్న ఈ మూవీ ఎప్పటికీ మర్చిపోలేని పొలిటికల్ థ్రిల్లర్. మూవీలోని ప్రతి సీన్ దేనికవే వైవిధ్యంతో ఉంటాయి. గూస్బంప్స్ రావడం కూడా పక్కా. అలాంటి గూస్బంప్స్ వచ్చే సన్నివేశం ఈ వీడియోలో ఉంది ఒక్క రోజు సిఏం గా ఉన్న జర్నలిస్ట్ పురుషోత్తం( అర్జున్) తన ప్రేయసి(మనీషా కొయిరాలా) ని కలుసుకోవాలని అనుకుంటాడు. కానీ సెక్యూరిటీ చీఫ్ ఒప్పుకోడు. దీంతో మారు వేషంలో తన ప్రేయసి గ్రామానికి వెళ్తాడు. మార్గ మధ్యంలో ప్రేయసికి పూలు కొంటాడు. కానీ డబ్బులు ఉండవు. దీంతో పూలు అమ్మే ఆవిడకి తనెవరో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వచ్చే డైలాగ్స్, సీన్స్ సూపర్ గా ఉంటాయి. ఆ తర్వాత పురుషోత్తం తన ప్రేయసిని కలవడం, ఇద్దరి మధ్య లవ్ సీన్స్ బాగుంటాయి. కానీ అశాంఘిక శక్తులు పురుషోత్తంని కనిపెట్టి దాడి చేస్తారు. ఈ సందర్భంగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ తర్వాత మరో దాడిలో పురుషోత్తం తన తల్లి తండ్రులని కోల్పోతాడు. ఇన్నేళ్లయినా సదరు సన్నివేశాలని చూసినప్పుడు ప్రేక్షకులకి అదే స్థాయి ఉద్వేగం, గూస్బంప్స్ రావడం విశేషం.యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ఈ చిత్రంలో ఆయన నటన అద్వితీయం. ముఖ్యంగా టీవీ జర్నలిస్ట్గా ముఖ్యమంత్రి రఘువరన్ని ఇంటర్వ్యూ చేసే సీన్ సినిమా మొత్తానికి హైలైట్గా నిలుస్తుంది. అవినీతి, రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యంపై అర్జున్ సంధించే ప్రశ్నలు, దానికి ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానాలు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించాయి.సరిగ్గా ఆ ఇంటర్వ్యూలోనే ఒకరోజు ముఖ్యమంత్రిగా సవాల్ స్వీకరించే ఘట్టం ప్రేక్షకుడిని కథలోకి పూర్తిగా లాగేసుకుంటుంది. ఆ ఒక్క రోజులో అర్జున్ తీసుకునే సంచలన నిర్ణయాలు, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం వంటి సన్నివేశాలను శంకర్ ఎంతో గ్రిప్పింగ్గా మలిచారు.ఈ చిత్రంలో మనీషా కోయిరాల కథానాయికగా నటించగా, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం పొలిటికల్ డ్రామాగానే కాకుండా, మధ్యలో వచ్చే లవ్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో కుదిరిన క్లాసిక్ ఇది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి కూడా ఈ మూవీలోని సంభాషణలు, ఐడియాలజీ ఎంతో రెలవెంట్గా అనిపిస్తాయి. అందుకే యూట్యూబ్లో ఈ చిత్రానికి సంబంధించిన అల్టిమేట్ సీన్స్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మిలియన్ల కొద్దీ వ్యూస్తో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.ఇలాంటి కాలాతీత చిత్రాలు మళ్లీ మళ్లీ రావాలని, నేటి తరం దర్శకులకి కూడా ఈ సినిమా ఒక పాఠ్యపుస్తకం లాంటిదని నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Jun 1, 2026 4:20PM
కొడుకు కోసం స్టేజ్పై ఎమోషనల్ అయిన సింగర్ సునీత..!
తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సింగర్ సునీత (Singer Sunitha) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ ఆమె ఎంతోమంది స్టార్ హీరోయిన్లకు ప్రాణం పోశారు. సునీత కుమారుడు ఆకాష్ 'సర్కారు నౌకరి' సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆకాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’ (Kotha Malupu). ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సునీత.. తన కొడుకు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. సునీత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గిరిబాబు గారి వంటి గొప్పవారితో తనను తాను పోల్చుకునేంత పెద్దదాన్ని కాకపోవచ్చు అంటూనే, తన కుమారుడి భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికి వెళ్లినా కేవలం "సునీత కొడుకు" అనే ట్యాగ్తో కాకుండా, పరిశ్రమలో తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ఆకాంక్షించారు. "ఆకాష్ సమాజంలో, సినీ ఇండస్ట్రీలో ఒక ఇండివిడ్యువల్ పర్సన్గా ఎదగాలి" అని మనసారా కోరుకుంటున్నట్లు సునీత చెప్పారు. తన కొడుకు వ్యక్తిత్వం, కష్టం గురించి చెబుతూ ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆకాష్ ఎంచుకున్న రంగంలో ఎంతో కష్టపడతాడని, ప్రతి విషయంలోనూ చాలా సిన్సియర్గా ఉంటాడని సునీత పేర్కొన్నారు. ఆ సిన్సియారిటీనే అతడిని ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. తన కష్టాన్ని నమ్ముకుని పరిశ్రమలో ఒక మంచి స్థాయికి చేరుకోవాలని, భవిష్యత్తులో గొప్ప ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని ఒక తల్లిగా ఆకాంక్షిస్తున్నట్లు భావోద్వేగంతో పంచుకున్నారు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సులభంగా దొరుకుతుంది కానీ, ప్రతిభతోనే నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ను సునీత నొక్కి చెప్పారు. తన పేరు ప్రఖ్యాతులు కొడుకు ఎదుగుదలకు కేవలం ఒక ప్రారంభం మాత్రమే కావాలని, ఆ తర్వాత ఆకాష్ తన స్వయంకృషితోనే ఒక గొప్ప నటుడిగా ఎదగాలని ఆమె ఆశపడటం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. సునీత మాట్లాడిన ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాతో ఆకాష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి.
Jun 1, 2026 2:49PM
Peddi: ‘పెద్ది’లో ఆ రోల్ రిజెక్ట్ చేశా.. ‘బలగం’ సంజయ్ సంచలన ఇంటర్వ్యూ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాపై టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో ‘బలగం’ ఫేమ్ నటుడు సంజయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘తెలుగువన్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజయ్ ‘పెద్ది’ ప్రాజెక్ట్లోకి తాను ఎలా వచ్చారో, ఆ సినిమా కోసం పడ్డ కష్టాలేంటో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (Balagam Sanjay Interview) నిజానికి ‘పెద్ది’ సినిమాలో సంజయ్కు దాదాపు ఏడాదిన్నర క్రితమే ఆఫర్ వచ్చింది. కన్నడ స్టార్ శివరాజ్కుమార్ కాంబినేషన్లో ఉండే ఒక మంచి క్యారెక్టర్ కోసం మేకర్స్ మొదట సంజయ్ను సంప్రదించారు. లుక్ టెస్ట్ కూడా పూర్తయిన తర్వాత.. ఆ పాత్ర కంటే హీరోతో వన్-టు-వన్ ఉండేలా, ఇంకాస్త పవర్ఫుల్ ఆపోజిట్ రోల్ అయితే బాగుంటుందని సంజయ్ భావించారు. దీంతో ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించి, మరో మంచి క్యారెక్టర్ ఉంటే చూడమని దర్శకుడిని రిక్వెస్ట్ చేసి వెనక్కి తగ్గారు. మొదట వచ్చిన ఆఫర్ను వదులుకున్నాక, సినిమా షూటింగ్ మొదలై సాంగ్స్ విడుదలవుతున్న సమయంలో తాను ఒక పెద్ద సినిమాను మిస్ అయ్యాననే రిగ్రెట్ సంజయ్లో మొదలైంది. "ఏదో పెద్ద ప్రాజెక్ట్ మిస్ అవుతున్నా" అని తన మేనేజర్తో రోజు చెబుతూ, మేకర్స్తో టచ్లోనే ఉన్నారు. కరెక్ట్ టైమ్లో సినిమాలో మరో పవర్ఫుల్ రోల్ కోసం వెతుకుతున్నప్పుడు సంజయ్కు మళ్లీ పిలుపు వచ్చింది. డైరెక్టర్ బుచ్చిబాబు సంజయ్ను చూడగానే ఆ పాత్రకు పక్కాగా సెట్ అవుతాడని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఆ పాత్రకు మంచి ఫిజిక్ అవసరం పడింది. షూటింగ్ ప్రారంభం కావడానికి కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో సంజయ్ కఠినమైన వర్కవుట్స్ చేయాల్సి వచ్చింది. ఆ 10 రోజుల పాటు ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి, ఉదయం 4:30 నుండి 7:30 వరకు నిర్విరామంగా జిమ్లో చెమటోడ్చారు. బాడీపై అంత ప్రెజర్ పెట్టి కష్టపడటం వల్లే స్క్రీన్ మీద ఆ లుక్ పర్ఫెక్ట్గా తీసుకురాగలిగానని సంజయ్ చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సంజయ్ చేయబోయే ఈ వన్-టు-వన్ సీన్స్ థియేటర్లలో ఫ్యాన్స్కు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదట వద్దనుకున్నా.. చివరకు అంతకంటే పవర్ఫుల్ రోల్తో ‘పెద్ది’ లైనప్లోకి రావడం తన అదృష్టమని సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు మార్క్ టేకింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ పవర్తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Jun 1, 2026 2:28PM
Peddi: రామ్ చరణ్ సాక్షాత్తూ హనుమంతుడిలా కనిపించారు.. ఆ షాట్ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఒక చిన్న అబ్బాయి రామ్ చరణ్కు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తూ కనిపించాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు.. సయ్యద్ గఫూర్. ‘తెలుగువన్’(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గఫూర్ ‘పెద్ది’ మరియు జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్ విశేషాలను, తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను పంచుకున్నాడు. (Actor Sayed Gafur Interview) సయ్యద్ గఫూర్ చిన్నతనంలోనే (ఐదేళ్ల వయసులో) తల్లిదండ్రులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. కర్నూలు జిల్లా దొన్నిపాడు గ్రామానికి చెందిన గఫూర్ను వాళ్ల అమ్మమ్మ, మామయ్య పెంచారు. నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చి, అన్నపూర్ణ స్టూడియోస్ యాక్టింగ్ అకాడమీలో శిక్షణ పొందాడు. గతంలో ‘అఖండ’ సినిమాలో నటించినప్పటికీ కొన్ని ముఖ్యమైన సీన్స్ ఎడిటింగ్లో పోవడంతో నిరాశ చెందాడు. కానీ ఇప్పుడు ‘పెద్ది’, ‘డ్రాగన్’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో కీలక పాత్రలు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘పెద్ది’ ఆడిషన్స్ అనుభవాన్ని చెప్తూ.. దాదాపు 300 మందిలో బుచ్చిబాబు గారు తనను సెలెక్ట్ చేశారని గఫూర్ తెలిపాడు. అయితే, వేరే వెబ్ సిరీస్ షూటింగ్ వల్ల తను తెల్లగా మారిపోవడంతో, ‘పెద్ది’ షూటింగ్ సెట్లో బుచ్చిబాబు గారు గుర్తుపట్టలేదని అన్నాడు. విలేజ్ బాయ్ లుక్ కోసం వెంటనే టాన్ కావలసి రావడంతో.. సమయం లేక బాత్రూం పక్కన ఉన్న మట్టిని ఒంటికి, మొహానికి రాసుకుని అండర్వేర్తోనే మానిటర్ ముందుకు వెళ్లానని ఆనాటి కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. రామ్ చరణ్ సార్ షాట్ కోసం ఎదురుచూస్తున్న ఆ సమయంలో, తను సింగిల్ టేక్లోనే ఆ ఎలివేషన్ డైలాగ్ చెప్పి బుచ్చిబాబు గారిని మెప్పించానని సంతోషంగా చెప్పాడు. సెట్లో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ గురించి గఫూర్ అద్భుతంగా వివరించాడు. చరణ్ సార్ పూర్తిగా వెజిటేరియన్ బాడీని మెయింటైన్ చేస్తున్నారని, ఆయన మజిల్స్ చూస్తే సాక్షాత్తూ హనుమంతుడిని చూసినట్లు అనిపించిందని అన్నాడు. చేతికి గాయమైనా లెక్కచేయకుండా ప్రతి షాట్కు ముందు డిప్స్ కొడుతూ ఎంతో కష్టపడ్డారని శ్లాఘించాడు. ‘రంగస్థలం’ కంటే ముందు వచ్చిన రామ్ చరణ్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ‘పెద్ది’ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అని.. బుచ్చిబాబు గారు చరణ్ సార్ను నటనలో పిండేశారని గఫూర్ అన్నాడు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ అనుభవాలను కూడా గఫూర్ పంచుకున్నాడు. ఒక సీన్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు స్వయంగా తన వైట్ ట్రాక్ ప్యాంటును కూడా లెక్కచేయకుండా బొగ్గుల మట్టిలో మోకాళ్లపై కూర్చుని తనకు నటన నేర్పించారని చెప్పాడు. ఆ తర్వాత తన షాట్ చూసి క్యారవాన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సార్ ఎంతో అప్రిషియేట్ చేశారని ఆనందం వ్యక్తం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గఫూర్ పూర్తి ఇంటర్వ్యూతో పాటు మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Jun 1, 2026 12:09PM
Peddi: రామ్ చరణ్ యాక్టింగ్ చిరంజీవి గారిలా ఉంది .. 'పెద్ది' మూవీపై కంచరపాలెం కిషోర్ క్రేజీ లీక్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi). ఈ చిత్రంపై మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో భాగమైన ప్రముఖ నటుడు కంచరపాలెం కిషోర్ తాజాగా 'తెలుగువన్' (TeluguOne) ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (Kancharapalem Kishore Interview) ఈ సినిమాలో తన పాత్ర గురించి కిషోర్ మాట్లాడుతూ, తాను స్క్రీన్ మీద కనిపించే దానికంటే తన వాయిస్ చాలా పవర్ఫుల్గా వినిపిస్తుందని తెలిపారు. సినిమాలో ఒక ముఖ్యమైన మరియు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్కు తాను డబ్బింగ్ చెప్పానని, ఆ సమయంలో కొన్ని సీన్స్ చూసి తాను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని పేర్కొన్నారు. డబ్బింగ్ చెప్తున్నప్పుడే సినిమా రేంజ్ ఏంటో తనకు అర్థమైందని ఆయన అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు రైటింగ్ స్కిల్స్పై కిషోర్ ప్రశంసల వర్షం కురిపించారు. బుచ్చిబాబు ఎంత అద్భుతమైన కథా రచయితో ఈ సినిమాతో మరోసారి నిరూపితం కానుందని, ముఖ్యంగా ఈ చిత్రంలో డ్రామా మరియు ఎమోషనల్ సీన్స్ తారాస్థాయిలో ఉంటాయని చెప్పారు. సినిమా క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, కథనంలో ఉన్న డెప్త్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ నటన మరియు మేకోవర్ గురించి కిషోర్ వివరిస్తూ, ఈ చిత్రంలో చరణ్ నటన ఫైర్ లాంటిదని ప్రశంసించారు. ఒక నటుడిగా ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం, చూపించిన ట్రాన్స్ఫార్మేషన్ అద్భుతమని కొనియాడారు. స్పోర్ట్స్ లుక్ నుండి రస్టిక్ బాడీ బిల్డింగ్ వరకు చరణ్ చూపించిన వేరియేషన్స్ చూస్తే థియేటర్లలో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని అన్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో రామ్ చరణ్ నటన చూస్తుంటే సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినట్లే అనిపించిందని కిషోర్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. చరణ్ తన యాక్టింగ్తో ఈ సినిమాకు ప్రాణం పెట్టారని, ఈ చిత్రంలో ఆయన చేసిన నటనకు గాను భవిష్యత్తులో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని ఆకాశానికెత్తేశారు. కేవలం 'పెద్ది' చిత్రమే కాకుండా రాబోయే రోజుల్లో తాను నటిస్తున్న ఇతర పెద్ద ప్రాజెక్టులైన రవితేజ 'ఇరుముడి', ప్రభాస్ 'ఫౌజీ', విజయ్ దేవరకొండ 'రణబాలి', గోపీచంద్ 'భరతవర్ష' చిత్రాల గురించి కూడా కిషోర్ ఈ ఇంటర్వ్యూలో పలు విశేషాలను పంచుకున్నారు. ప్రతి సినిమాలోనూ తన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని చెప్పారు. మొత్తానికి కంచరపాలెం కిషోర్ ఇచ్చిన ఈ హై-వోల్టేజ్ అప్డేట్స్తో 'పెద్ది' సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక బెస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మూవీగా నిలిచిపోనుందని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jun 1, 2026 11:46AMసూపర్స్టార్ కృష్ణ సినిమా వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం జరిగింది!
(మే 31 సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా..) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్స్టార్' అనే పదానికి నిలువెత్తు రూపం ఘట్టమనేని కృష్ణ. సాహసాలకు మారుపేరైన ఆయన టాలీవుడ్లో సృష్టించిన రికార్డులు, టెక్నికల్ విప్లవాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా, ఆయన తీసుకున్న కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ఇండస్ట్రీ స్వరూపాన్నే మార్చేశాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగేశ్వరరావు 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపన వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం. కృష్ణ తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. అందులో భాగంగా ఆయన 'కొత్త దేవదాసు' సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఏఎన్నార్ 'దేవదాసు'గా ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనంగా మారింది. కృష్ణ ఈ నిర్ణయం అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ వారికి మధ్య చిన్నపాటి వివాదానికి కారణమైంది. అప్పట్లో నవయుగ సంస్థకు చెందిన సారథి స్టూడియోస్ కృష్ణ 'కొత్త దేవదాసు' చిత్రంలో పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో ఏఎన్నార్ పాత దేవదాసు హక్కులను కొనుగోలు చేసి, కొత్త ప్రింట్లతో కృష్ణ సినిమా రిలీజ్ టైమ్లోనే పోటీగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. నవయుగ సంస్థతో భాగస్వామ్యం ఉన్న ఏఎన్నార్, తమ పెట్టుబడి ఉన్న సినిమాకు పోటీగా రావడంపై సారథి స్టూడియోస్ అధినేతలు తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్లిందంటే, ఏఎన్నార్ సినిమాలకు ఇకపై సారథి స్టూడియోస్ను ఇవ్వకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఏఎన్నార్ తన ప్రొడక్షన్లో ఉన్న సినిమాల షూటింగ్స్ కోసం బెంగళూరులోని కంటీరవ స్టూడియోస్కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇబ్బందుల నుంచే సొంతంగా ఒక స్టూడియో ఉండాలనే ఆలోచన ఏఎన్నార్కు బలంగా కలిగింది. అలా యుద్ధప్రాతిపదికన హైదరాబాద్లో 'అన్నపూర్ణ స్టూడియోస్' రూపుదిద్దుకుంది. కృష్ణ కనుక ఆనాడు 'కొత్త దేవదాసు' నిర్ణయం తీసుకోకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ అంత వేగంగా వచ్చేది కాదనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి వివాదాలు నడిచినప్పటికీ కృష్ణ ఎప్పుడూ వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత కూడా ఏఎన్నార్తో కలిసి విజయనిర్మల గారి దర్శకత్వంలో 'హేమాహేమీలు' సినిమాలో నటించి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీసినా, తన 300వ సినిమా ముహూర్తపు షాట్కు ఎన్టీఆర్తోనే క్లాప్ కొట్టించడం కృష్ణ ప్రత్యేకత. మూడు తరాల హీరోలతో (ఎన్టీఆర్, ఏఎన్నార్ నుండి శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వరకు) కలిసి అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఏకైక హీరో కృష్ణ. టెక్నీషియన్ల పట్ల ఆయన చూపించే ఆప్యాయత, మహాకవి శ్రీశ్రీ జాతీయ అవార్డును తాకట్టు పెట్టినప్పుడు దాన్ని విడిపించి అండగా నిలబడిన తీరు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. మే 31న వచ్చే ఆయన జయంతి సందర్భంగా అభిమానులు ఈ అరుదైన జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకుంటున్నారు.
May 31, 2026 1:21PM
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్ హీరోలు.. బివిఎస్ రవి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్థాయి ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన తెలుగు సినిమా, నేడు పాన్ ఇండియా మార్కెట్ను దాటి గ్లోబల్ వైడ్గా తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి (BVS Ravi) తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోల స్టామినా మరియు పాన్ ఇండియా సినిమాల మేకింగ్ విధానంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తెలుగువన్ (TeluguOne) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా ఇండస్ట్రీలోని ప్రస్తుత ట్రెండ్తో పాటు స్టార్ హీరోల డెడికేషన్ గురించి పలు సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మోజులో పడ్డారని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన సినిమాల కోసం వారు చూపిస్తున్న నిబద్ధత నిజంగా అభినందనీయమన్నారు. ఒక సినిమా కోసం హీరోలు ఏకంగా రెండు సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయిస్తున్నారని, పాత్రలకు తగ్గట్టుగా జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకుంటూ, మొహానికి బూడిద రాసుకునేందుకు సైతం వెనుకాడటం లేదని ఆయన పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమా అంటే కేవలం భారీ టైటిల్స్ వేయడం మాత్రమే కాదని, వెండితెరపై నటీనటుల ఒళ్లు హూనమైపోయేలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. యాక్షన్ సీన్స్ లో పిల్లిమొగ్గలు వేయిస్తూ, గాలిలో కాసేపు వైర్లతో కట్టేసి ఉంచినా సరే, హీరోలు ఎంతో ఓపికగా కష్టపడుతున్నారని, వారు భోజనానికి వెళ్లే సమయాన్ని కూడా లెక్కచేయకుండా సీన్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు శ్రమిస్తున్నారని వెల్లడించారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో తనకున్న అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఇద్దరు అగ్ర హీరోల కాంబినేషన్ లోనూ యాక్టింగ్ చేశానని చెప్పారు. ఒక సినిమాలో బాలకృష్ణ గారు తనను కొట్టే సీన్ ఉందని, ఆ రోజు పొద్దునంతా తనది 'నోటిదూల క్యారెక్టర్' కావడంతో ఆయనను గెలకాల్సి వచ్చిందని, దీంతో తన గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని నవ్వుతూ పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో నటించేటప్పుడు ఆయన డైలాగ్ చెబితే తాను కౌంటర్ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని, ఆ సమయంలో కూడా కొంచెం భయపడ్డానని అన్నారు. టాలీవుడ్ లో మోహన్ బాబు కాంపౌండ్, చిరంజీవి కాంపౌండ్, బాలకృష్ణ కాంపౌండ్, అల్లు అర్జున్ కాంపౌండ్ ఇలా అన్ని కాంపౌండ్స్ తోనూ తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఎవరి దగ్గరకు వెళ్లినా వారి ప్రైవసీకి గౌరవం ఇవ్వడం వల్లే తనకు ఈ క్రేజ్ దక్కిందని బివిఎస్ రవి స్పష్టం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) గ్లింప్స్ చూసిన తర్వాత టాలీవుడ్ హీరోల పవర్ ఏంటో అందరికీ అర్థమైందని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తున్నప్పటికీ థియేటర్లలో సరైన సినిమాలు లేక మల్టీప్లెక్స్లలో చాలా షోలు క్యాన్సిల్ అవుతున్నాయని, సింగిల్ స్క్రీన్స్ తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, త్వరలోనే రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఊపు తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
May 30, 2026 4:35PMకోర్టు సీన్లో బాలయ్య నట విశ్వరూపం.. డైలాగ్స్ వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం!
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నో పవర్ఫుల్ పాత్రలు, బ్లాక్బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్టు రూమ్ డ్రామాగా నిలిచిన చిత్రం 'ధర్మక్షేత్రం'. ఈ సినిమా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇందులో బాలయ్య పలికిన డైలాగులు, ఆయన చూపించిన నటన ఇప్పటికీ సినీ ప్రియుల హృదయాల్లో పచ్చగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ కోర్టు సీన్ టాలీవుడ్ చరిత్రలోనే ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ హై-వోల్టేజ్ సీన్లో బాలకృష్ణ తనదైన శైలిలో విశ్వరూపం చూపించారు. న్యాయస్థానం వేదికగా సాగే ఈ సన్నివేశంలో ఆయన పలికే ఒక్కో మాట తూటా లాంటిది. సమాజంలోని అన్యాయాలను, చట్టంలోని లొసుగులను ప్రశ్నిస్తూ సాగే ఈ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ థియేటర్లలో అప్పట్లో ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయేలా చేసింది. బాలయ్య బాబు రౌద్ర రసం ఉట్టిపడేలా చేసిన నటన నందమూరి అభిమానులకే కాకుండా సామాన్య ప్రేక్షకులకు కూడా పూనకాలు తెప్పిస్తుంది. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ఈ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఒక లాయర్ పాత్రలో బాలయ్య ఆవేశం, ఆవేదన, చట్టంపై ఉన్న గౌరవం వంటి నవరసాలను ఒకే సీన్లో పలికించారు. సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్లలో మాస్ ఇమేజ్ చూపించే బాలయ్య, కేవలం మాటల పదునుతోనే ప్రత్యర్థులను ఎలా కడిగిపారేయవచ్చో ఈ సినిమాతో నిరూపించారు. చట్టాన్ని తప్పుదోవ పట్టించే దుర్మార్గుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఈ కోర్టు సీన్ సాగుతుంది. ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం ఈ సీన్కు మరింత బలాన్ని చేకూర్చింది. బాలయ్య డైలాగ్స్ చెబుతుంటే వెనుక వచ్చే హై-పిచ్ మ్యూజిక్ ప్రేక్షకుడికి రోమాంచిత అనుభూతిని ఇస్తుంది. సినిమా విజయంలో ఈ ఒక్క సన్నివేశం ఎంతటి కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి తరం నటులకు కూడా ఈ కోర్టు డ్రామా సీన్ ఒక గొప్ప రిఫరెన్స్ లాంటిదని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాత బంగారు క్లిప్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్లో ఈ సీన్కు వస్తున్న వ్యూస్ మరియు రెస్పాన్స్ చూస్తుంటే బాలయ్య మానియా ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. "బాలయ్య బాబు డైలాగ్ చెబితే ఆ గంభీరత్వమే వేరు, ఇప్పటికీ ఈ సీన్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తరాలు మారినా నందమూరి లెగసీ అలాగే కొనసాగుతుందనడానికి ఈ క్లాసిక్ మాస్ సీనే నిదర్శనం. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 29, 2026 7:49PMఇప్పటికీ కన్నీళ్లు పెట్టించే పాట.. ఆ స్నేహబంధం అజరామరం!
తెలుగు సినిమా చరిత్రలో స్నేహం నేపథ్యంగా వచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన దృశ్య కావ్యం, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’. ఈ సినిమాలో చిరంజీవి, విజయ్ కుమార్ మధ్య సాగే స్నేహ బంధం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘మీసమున్న నేస్తమా.. నీకు రోషమెక్కువ’ అనే పాట తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్నేహానికి అసలైన నిర్వచనంలా నిలిచే ఈ గీతం విన్న ప్రతిసారీ ఎవరికైనా తమ ప్రాణ స్నేహితుడు గుర్తుకురాక మానడు. ఆత్మీయత, అనురాగం, త్యాగం కలబోసిన ఈ పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలిచింది. ఈ పాటలో చిరంజీవి, విజయ్ కుమార్ మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు వారి నటనా పటిమ అద్భుతంగా పండాయి. ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చేంతటి గాఢమైన స్నేహాన్ని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ స్క్రీన్ మీద ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. మెగాస్టార్ చిరంజీవి తన సహజసిద్ధమైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఈ క్లాసిక్ సాంగ్లో స్నేహితుల మధ్య ఉండే చిన్న చిన్న అలకలు, సరదాలు, అలాగే ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవం మరియు నమ్మకాన్ని ఎంతో చక్కగా చూపించారు. సంగీత దర్శకుడు ఎస్.ఎ. రాజ్కుమార్ అందించిన మెలోడీ ట్యూన్, సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం వినడమే కాదు, చూస్తున్నప్పుడు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగేలా ఈ సాంగ్ డిజైన్ చేయబడింది. సాధారణంగా మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చిరంజీవి, ఇలాంటి ఒక పూర్తి స్థాయి సెంటిమెంట్ ఎమోషనల్ సాంగ్లో చూపించిన హావభావాలు ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. విజయ్ కుమార్ కూడా చిరంజీవికి పోటాపోటీగా నటించి ఈ స్నేహ బంధాన్ని మరింత రక్తికట్టించారు. యుగాలు మారినా, తరాలు మారినా స్నేహం విలువ మారదు అని చాటిచెప్పేలా ఈ పాట సాగుతుంది. అందుకే విడుదలైన ఇన్నేళ్లయినా ఈ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యూట్యూబ్లో ఈ వీడియో సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకుపోతుండటమే దీనికి నిదర్శనం. నేటి తరం యువత కూడా ఈ పాటను తమ వాట్సాప్ స్టేటస్గా, సోషల్ మీడియా రీల్స్లా వాడుకుంటూ తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అని చెప్పడానికి ‘మీసమున్న నేస్తమా’ సాంగ్ ఒక చక్కని ఉదాహరణ. మొత్తానికి, తెలుగు సినిమా ఉన్నంత కాలం, స్నేహం అనే మాటకు విలువ ఉన్నంత కాలం ఈ పాట ప్రతి ఒక్కరి గుండెల్లో మోగుతూనే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ సాంగ్గా నిలిచిన ఈ గీతం, స్నేహ దినోత్సవం వచ్చినా లేదా స్నేహితుడిని తలచుకున్నా గుర్తొచ్చే మొదటి ఆప్షన్గా మారిపోయింది. ఇలాంటి భావోద్వేగభరితమైన పాటల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 29, 2026 7:20PMపోలీసులు ఒక్కరోజు డ్యూటీ మానేస్తే దేశం ఏమవుతుందో చూపించిన రాజశేఖర్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు జీవిత రాజశేఖర్. ఖాకీ యూనిఫామ్ వేసి ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో ఈలలు, గోలలు మామూలుగా ఉండవు. పోలీస్ పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ముఖ్యంగా సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల జోక్యంపై ఆయన నటించిన సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. తాజాగా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఒక్కడు చాలు చిత్రంలోని ఒక పవర్ఫుల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో పోలీసులు ఎదుర్కొనే అసలైన ఆవేదనను కళ్ళకు కట్టినట్లు చూపించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి, కానీ రాత్రి పగలు అనక శాంతిభద్రతలను కాపాడే పోలీసులకు మాత్రం రాజకీయ నాయకుల మాట వినడమే రూల్ అయిపోయింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక రౌడీ కత్తితో పొడిచి చంపబోతే, వాడిని అరెస్ట్ చేసినందుకు ఒక మంత్రి వచ్చి స్టేషన్లో దౌర్జన్యం చేస్తాడు. సాక్షాత్తూ ఎఫ్ఐఆర్ కాపీని నలిపేసి, డ్యూటీలో ఉన్న ఎస్ఐని, రైటర్ను కొట్టి ఖైదీని తీసుకెళ్లిపోతాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితికి ఎదురుతిరిగి, ఏసీపీ సూర్య పాత్రలో రాజశేఖర్ చేసిన ఆందోళన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. "పోలీసులు అంటే పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు కాదు" అంటూ ఆయన కమిషనర్తో చెప్పే డైలాగులు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. చట్టాన్ని అవమానించి పోలీసులపై చేయి చేసుకున్న సదరు మంత్రి స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పాలని, అలాగే ఆ నిందితుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ నిరసన సీన్ సినిమాకే హైలైట్గా నిలిచింది. సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా పోలీసులు పడే కష్టాలను, పొలిటికల్ ప్రెజర్స్ను ఈ సీన్ ప్రతిబింబిస్తుంది. పోలీసులు గనుక ఒక్కరోజు డ్యూటీ చేయటం మానేస్తే సమాజం ఏమైపోతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా, పవర్ఫుల్గా చూపించారు. రాజశేఖర్ మార్క్ యాక్టింగ్, ఆవేశం, ఆవేదన కలగలిసిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో కట్టుకున్నాయి. చివరగా, తప్పు చేసినవాడు మంత్రి అయినా, మరెవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించే క్లైమాక్స్ సీన్ అద్భుతంగా ఉంటుంది. తన సిబ్బందిని కొట్టినందుకు గాను సదరు మంత్రికి బుద్ధి చెప్పే సీన్ థియేటర్లలో అప్పట్లో భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ పవర్ఫుల్ సీన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి విశేష స్పందనను రాబడుతోంది. ఇలాంటి పవర్ఫుల్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribeచేసుకోండి.
May 29, 2026 3:22PM‘ఫ్యామిలీ సర్కస్’ నవ్వుల జాతర.. కోట, బ్రహ్మానందం, ధర్మవరపు హైలైట్ కామెడీ!
తెలుగు సినిమా రంగంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు, కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు కథానాయకుడిగా తెరకెక్కిన వినోదాత్మక సినిమాలు థియేటర్లలోనే కాకుండా, బుల్లితెరపై కూడా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన హాస్య భరిత చిత్రం 'ఫ్యామిలీ సర్కస్'. తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వినోదాన్ని పంచడమే కాకుండా, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో డిజిటల్ యుగంలోనూ చెరగని ముద్ర వేసుకుంది. ఈ చిత్రంలోని బెస్ట్ కామెడీ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే నవ్వు ఆపుకోవడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో జగపతి బాబు మార్క్ టైమింగ్, ఆయన పండించిన ఫ్యామిలీ డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక మధ్యతరగతి గృహస్థుడిగా ఆయన ఎదుర్కొనే గందరగోళ పరిస్థితులను, వాటి చుట్టూ అల్లిన హాస్యాన్ని దర్శకుడు తేజ అద్భుతంగా తెరకెక్కించారు. జగపతి బాబు నటనకు తోడుగా నిలిచిన ఇతర సీనియర్ హాస్యనటుల నటన ఈ చిత్రానికి కొండంత బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ సినిమాకే హైలైట్గా నిలిచాయి. ఈ సీనియర్ నటులందరూ కలిసి చేసిన హంగామా ‘ఫ్యామిలీ సర్కస్’ను ఒక ఎవర్గ్రీన్ కామెడీ క్లాసిక్గా మార్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ఈ కామెడీ క్లిప్స్ చూస్తుంటే, అప్పటి సినిమాల్లోని సహజమైన హాస్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా, కుటుంబం అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునేలా ఈ సీన్స్ ఉంటాయి. నేటి తరం యువత కూడా ఈ పాత కామెడీ వీడియోలను తెగ లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. ఈ వీడియో కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లు చూస్తే ఈ సినిమాపై, ఈ నటులపై వారికి ఉన్న అభిమానం స్పష్టమవుతుంది. "ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ కామెడీ సినిమాలు ఈ రోజుల్లో రావడం లేదు", "కోట, బ్రహ్మీ, ధర్మవరపు కాంబినేషన్ను మళ్లీ రీప్లేస్ చేయలేరు" అంటూ ప్రేక్షకులు తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. మొత్తానికి, ఒత్తిడితో కూడిన నేటి బిజీ లైఫ్లో కాసేపు ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి అనుకునే వారికి ఈ ‘ఫ్యామిలీ సర్కస్’ కామెడీ సీన్స్ ఒక అద్భుతమైన డిజిటల్ టానిక్ లాంటివని చెప్పవచ్చు. ఈ నవ్వుల జాతరను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
May 29, 2026 2:37PMబాలకృష్ణ 'దేవుడు' మూవీ సీన్ వైరల్.. కైకాల సత్యనారాయణ పవర్ఫుల్ పంచాయితీ తీర్పు!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సీన్లకు, ఎమోషనల్ పల్లెటూరి నేపథ్య చిత్రాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పంచాయితీ సీన్లు ప్రేక్షకులలో గూస్బంప్స్ తెప్పిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబుకు సంబంధించిన ఒక పాత సినిమా పవర్ఫుల్ పంచాయితీ సీన్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ధర్మ పీఠంపై కైకాల సత్యనారాయణ పలికే సంభాషణలు, దేవుడిగా బాలకృష్ణ ఇచ్చే కౌంటర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వైరల్ వీడియోలో ఊరి పెద్ద రాయుడు పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపిస్తారు. గతంలో ఊరి కట్టుబాటును దాటి, మొదటి భార్య ఉండగానే మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి రాయుడు గారు కఠినమైన శిక్ష విధిస్తారు. బాధితురాలికి పది ఎకరాల భూమిని మనోవర్తిగా ఇప్పించడమే కాకుండా, తప్పు చేసిన వాడికి గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించి, ఊరి నుంచి బహిష్కరించాలని సంచలన తీర్పునిస్తారు. ఆనాటి పవర్ఫుల్ ఫ్లాష్బ్యాక్ సీన్ ప్రేక్షకులలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అయితే కాలం మారింది కదా అని తీర్పు మారుతుందా అంటూ విలన్ గంగరాజు పాత్రధారి, కథానాయకుడు 'దేవుడు' (బాలకృష్ణ)పై అన్యాయంగా నిందలు వేస్తూ రాయుడు గారి ముందుకు పంచాయితీ తీసుకొస్తాడు. దేవుడు ఇద్దరు అమ్మాయిల మెడలో బలవంతంగా తాళి కట్టాడని, కాబట్టి అతడిని కూడా ఊరి నుంచి వెలివేయాలని కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో జరిగే నాటకీయ పరిణామాలు, ఆ ఇద్దరు అమ్మాయిలు దేవుడికి మద్దతుగా నిలబడటం కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ పంచాయితీలో దేవుడిని సమర్థిస్తూ తల్లి పాత్రధారి దుర్గమ్మ మాట్లాడే మాటలు హృదయాలను కదిలిస్తాయి. ఊరికి గండి పడినప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చెరువుకు అడ్డుపడి ఊరిని కాపాడింది దేవుడేనని ఆమె గుర్తు చేస్తుంది. ఒకవేళ ఆ రోజు దేవుడు ఆ పని చేయకపోతే ఈ రోజు తీర్పు చెప్పడానికి రాయుడు గారు, శిక్ష వేయడానికి ఈ పంచాయితీ ఉండేవి కావు అంటూ ఆమె చెప్పే డైలాగులు హైలైట్గా నిలుస్తాయి. అంతేకాకుండా, పట్టణం నుంచి వచ్చిన అమ్మాయిలు చట్టం ప్రకారం మొదటి భార్య అంగీకారంతో రెండో పెళ్లి చేసుకోవచ్చని వాదిస్తారు. దేవుడు (బాలకృష్ణ) స్వయంగా వచ్చి తాము పెళ్లి చేసుకోలేదని, కేవలం ఒక ఆపద సమయం వల్ల అలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేయడంతో విలన్ల కుట్రలు భగ్నమవుతాయి. కనిపించని ఆ దేవుడి కంటే, పిలవగానే పలికి అందరికీ సాయం చేసే ఈ 'దేవుడు' గొప్పవాడని ఊరి ప్రజలంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతారు. దేవుడు లేని ఊరిలో తాము ఉండలేమని, అతడిని వెలివేస్తే తామంతా ఊరు విడిచి వెళ్ళిపోతామని ప్రజలు ప్రకటించే ముగింపు సీన్ ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 28, 2026 7:04PMమెగాస్టార్ చిరంజీవి మాస్ జాతర: థియేటర్లను ఊపేసిన క్లైమాక్స్ ఫైట్!
తెలుగు సినిమా చరిత్రలో 'మెగాస్టార్' అనే పేరు ఒక బ్రాండ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, అంతకుమించి ఆయన చేసే యాక్షన్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. టాలీవుడ్ కమర్షియల్ సినిమా రూపురేఖలను మార్చిన ఘనత ముమ్మాటికీ చిరంజీవిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కెరీర్లో మైల్స్టోన్గా నిలిచిన చిత్రాల్లో 'ఖైదీ నెం.786' ఒకటి. విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు, సాధించిన వసూళ్లు టాలీవుడ్లో సరికొత్త చరిత్ర లిఖించాయి. ముఖ్యంగా చిరంజీవి ఊరమాస్ లుక్, యాక్టింగ్ స్టైల్ నభూతో నభవిష్యత్ అనేలా సాగాయి. ఈ సినిమాలో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు ఇప్పటికీ పూనకాలు తెప్పిస్తుంది. విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చిరంజీవి చేసే ఫైట్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు, చిరు పలికించిన రౌద్ర రసం థియేటర్లలో ఒక ఊపు ఊపింది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన భానుప్రియ కథానాయికగా నటించగా, రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో ఒక సంచలనం. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. మోహన్ బాబు, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజ నటులు విలన్లుగా మెగాస్టార్ను ఢీకొట్టడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ కెరీర్ను మలుపు తిప్పిన యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ టాప్లో ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించే ఒక సామాన్యుడు ఖైదీగా మారి, ఆపై శత్రువుల అంతం చూసే క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్ను ఇస్తుంది. చిరంజీవి మార్క్ ఫైట్స్ అంటే ఏంటో ఈ సీన్ నిరూపిస్తుంది. ఈ క్లాసిక్ యాక్షన్ ఎపిసోడ్ను డిజిటల్ ప్లాట్ఫామ్లలో మళ్లీ చూస్తున్న అభిమానులు పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ ఫైట్ సీన్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందని, మెగాస్టార్ గ్రేస్ అప్పట్లోనైనా, ఇప్పట్లోనైనా ఎప్పటికీ అన్మ్యాచ్బుల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పవర్ఫుల్ యాక్షన్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 28, 2026 5:56PMకోట శ్రీనివాసరావు, బాబుమోహన్ క్లాసిక్ కామెడీ సీన్స్.. 494 రూపాయల ఇడ్లీ వీడియో వైరల్!
తెలుగు సినీ చరిత్రలో కామెడీ అనగానే గుర్తొచ్చే ఐకానిక్ కాంబినేషన్లలో నవరస నటసార్వభౌమ కోట శ్రీనివాసరావు, హాస్య నటుడు బాబు మోహన్ జోడీ ముందు వరుసలో ఉంటుంది. వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల జడివాన కురవాల్సిందే. ఈ క్రేజీ కాంబోలో వచ్చిన ఎన్నో అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 'స్నేహం కోసం' సినిమాలో వీరిద్దరి మధ్య సాగే ట్రాక్ ఎప్పటికీ ఒక క్లాసిక్. తాజాగా తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఒక ప్రత్యేకమైన కామెడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మధ్య సాగే '494 రూపాయల ఇడ్లీ' కామెడీ సీన్ హైలైట్గా నిలిచింది. యజమానిగా కోట, అమాయకపు నౌకరుగా బాబుమోహన్ చేసిన నటన తెలుగు కామెడీ ప్రేమికులను మరోసారి పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. వీడియో విశేషాల్లోకి వెళితే.. కోట శ్రీనివాసరావు ఆకలితో నకనకలాడుతూ, ఇడ్లీ తీసుకురావడానికి బాబుమోహన్ను హోటల్కు పంపిస్తాడు. రూ. 500ల నోటు ఇచ్చి, "నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పెట్టరా" అని ఆర్డర్ వేస్తాడు. అయితే, బాబుమోహన్ ఏకంగా రూ. 494ల విలువైన ఇడ్లీలను ఒక పెద్ద మూటలో కట్టుకుని ఇంటికి తీసుకురావడం ఈ సీన్లో పరమ కామెడీని పండించింది. అంతేకాకుండా, చట్నీ, సాంబార్ ఎందుకు తేలేదని కోట అడిగితే.. "నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పట్టుకురా అని మీరే చెప్పారుగా" అంటూ బాబుమోహన్ ఇచ్చే అమాయకపు కౌంటర్లు, దానికి కోట శ్రీనివాసరావు చూపించే ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెషన్స్ థియేటర్ స్థాయి నవ్వులను పూయిస్తాయి. వీరిద్దరి టైమింగ్, డైలాగ్ డెలివరీ అద్భుతమనే చెప్పాలి. ఈ వీడియోలోనే మరో ఐకానిక్ సీన్ అయిన 'కొండను ఎత్తే' కామెడీ ట్రాక్ కూడా ఉంది. ఊరి జనాన్ని అంతా నమ్మించి, "ఊరు మొత్తం వచ్చి ఆ కొండను నా చేతి మీద పెట్టండి.. నేను ఒక్కడినే ఎత్తుతాను" అంటూ బాబు మోహన్ చెప్పే లాజిక్ చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఇలాంటి క్లాసిక్ కామెడీ సీన్స్ ఈ రోజుల్లో రావడం చాలా అరుదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో డిజిటల్ ప్లాట్ఫామ్లలో విపరీతమైన వ్యూస్తో దూసుకుపోతోంది. నేటి తరం సరికొత్త కామెడీలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ పాత తరం హాస్యం అందించే ఫ్లేవర్ ఎప్పటికీ ప్రత్యేకమైనదేనని నెటిజన్లు కామెంట్ల రూపంలో కొనియాడుతున్నారు. బోర్ కొట్టినప్పుడల్లా ఈ వీడియో చూసి రిలాక్స్ అవ్వచ్చంటూ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఫన్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 28, 2026 4:48PMరాజ్కపూర్ ‘ఆవారా’ కంటే ఎన్టీఆర్ ‘మంచి మనిషి’ గొప్ప సినిమా.. ఎందుకంటే?
తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో చిత్రాలు వెండితెరపై అద్భుతాలు సృష్టించాయి. అందులోనూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దేవుడి పాత్రలతో కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఎన్టీఆర్, ఒక దొంగ పాత్రలో నటించి, ఆ సినిమాకు ‘మంచి మనిషి’ అనే టైటిల్ పెడితే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? సరిగ్గా 62 సంవత్సరాల క్రితం విడుదలైన 'మంచి మనిషి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా, ఇప్పటికీ ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. హిందీలో రాజ్కపూర్ నటించిన ‘ఆవారా’ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘నేరస్తుడి కొడుకు నేరస్తుడే అవుతాడా?’ అనే పాయింట్ చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది. అయితే ‘ఆవారా’ చిత్రంలో ప్రేక్షకులను వేధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నకు, తెలుగు ‘మంచి మనిషి’ చిత్రంలో రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి అద్భుతమైన ముగింపునిచ్చారు. తండ్రిపై పగతో కొడుకు జీవితాన్ని నాశనం చేసిన విలన్ పాత్ర (మిక్కిలినేని), క్లైమాక్స్లో తన తప్పు తెలుసుకుని రియలైజ్ అవ్వడం ఈ చిత్రంలోని అతిపెద్ద హైలైట్. హాలీవుడ్ ప్రసిద్ధ రచయిత ఓ హెన్రీ రాసిన షార్ట్ స్టోరీ ఇన్స్పిరేషన్తో పినిశెట్టి ఈ కథను అద్భుతంగా మలిచారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఒక ఎత్తయితే, గజదొంగ అయిన వేణు పాత్రలో ఆయన పండించిన మానవత్వం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ముఖ్యంగా ఒక పార్టీలో పోలీస్ ఆఫీసర్ కూతురు ఆటోమేటిక్ లాకర్లో ఇరుక్కుపోయినప్పుడు, ఆ పాపను కాపాడటం కోసం తను దొంగ అని తెలిసిపోయినా లెక్కచేయకుండా ఎన్టీఆర్ లాకర్ను ఓపెన్ చేసే సన్నివేశం సినిమాకే హైలైట్. తను ప్రేమిస్తున్న జమున ముందే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా, ఒక పాప ప్రాణం ముఖ్యమని భావించే ఆ పాత్రలోని హ్యూమానిటీయే ఈ చిత్రానికి ‘మంచి మనిషి’ అనే టైటిల్ను వంద శాతం జస్టిఫై చేసింది. ఈ సీన్ స్ఫూర్తితోనే తర్వాతి కాలంలో కృష్ణ నటించిన ‘మామ అల్లుళ్ల సవాల్’ చిత్రంలో కూడా ఒక సీన్ డిజైన్ చేయడం విశేషం. ఈ క్లాసిక్ మూవీ వెనుక మరికొన్ని అరుదైన విశేషాలు ఉన్నాయి. ప్రముఖ విలన్ త్యాగరాజుకి నటుడిగా ఇదే మొదటి సినిమా. అలాగే ప్రముఖ కామెడీ నటుడు పద్మనాభం తండ్రిగా రమణా రెడ్డి కేవలం ఫోటో ఫ్రేమ్లలోనే కనిపిస్తూ విభిన్న ఎక్స్ప్రెషన్స్తో నవ్వించడం అప్పట్లోనే ఒక సరికొత్త ప్రయోగం. ఇదే టెక్నిక్ను తర్వాత కాలంలో ‘మగమహారాజు’ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర కోసం వాడుకున్నారు. అప్పటివరకు కేవలం ఏఎన్నార్తోనే ఎక్కువ సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు కె. ప్రత్యగాత్మ, ఎన్టీఆర్తో చేసిన మొదటి సినిమా కూడా ఇదే. తర్వాతి కాలంలో ఆయన కుమారుడు కె. వాసు కూడా ఎన్టీఆర్తో సినిమా చేయడం ద్వారా, తండ్రీకొడుకుల దర్శకత్వంలో నటించిన అరుదైన రికార్డును ఎన్టీఆర్ ఖాతాలో వేసింది ఈ చిత్రమే. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 28, 2026 12:06PMఈస్ట్ గోదావరి మొగుడి ‘పవర్ ఫుల్’ క్లాస్.. శ్రీకాంత్, రమ్యకృష్ణల వింటేజ్ డైలాగ్స్ వైరల్!
టాలీవుడ్ వింటేజ్ సినిమాల్లోని కొన్ని సీన్లు, డైలాగులు ఎప్పటికీ ఎవర్గ్రీన్. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో హీరోలు చెప్పే పక్కా లోకల్ డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. అలాంటి ఒక సూపర్ హిట్ వింటేజ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది. శ్రీకాంత్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు' చిత్రంలోని ఒక పవర్ఫుల్ డైలాగ్ సీన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో హీరో శ్రీకాంత్ ఈస్ట్ గోదావరి మొగుడిగా పక్కా లోకల్ యాసలో, రోషంతో చెప్పే డైలాగులు థియేటర్లలో అప్పట్లో ఎలాంటి ఈలలు వేయించాయో గుర్తుచేస్తున్నాయి. పెళ్లి, సంప్రదాయాలు, ఆధునిక పోకడల నేపథ్యంలో సాగే ఈ సీన్లో శ్రీకాంత్ నటన అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళా మండలి ప్రతినిధులతో సాగే వాడివేడి చర్చ, దానికి శ్రీకాంత్ ఇచ్చే కౌంటర్లు ఈ సీన్కే హైలైట్గా నిలిచాయి. "పండించేది వరి.. పుట్టింది ఈస్ట్ గోదావరి" అంటూ శ్రీకాంత్ మార్క్ మ్యానరిజంతో చెప్పే డైలాగ్స్ సినిమా స్థాయిని పెంచాయి. ఆధునికత పేరుతో సంప్రదాయాలను మర్చిపోయే వారికి బుద్ధి చెప్పేలా ఈ సన్నివేశాన్ని దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రమ్యకృష్ణ కూడా తనదైన శైలిలో నటనతో ఈ చిత్రంలో మెప్పించారు. ఇద్దరి మధ్య వచ్చే హై-వోల్టేజ్ డ్రామా సీన్స్ ప్రేక్షకులకు అప్పట్లో కనువిందు చేశాయి. యూట్యూబ్లో ఈ సీన్ చూసిన నెటిజన్లు వింటేజ్ టాలీవుడ్ రోజులను గుర్తుచేసుకుంటున్నారు. "అప్పటి సినిమాల్లోని డైలాగ్స్లో ఉండే పవర్ వేరు, అర్థం వేరు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీకాంత్ కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన పాత్రగా నిలిచిపోతుందని, ఇలాంటి క్లాసిక్ సీన్స్ ఎప్పటికీ బోర్ కొట్టవని అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా ఈ పవర్ఫుల్ వింటేజ్ సీన్ను చూసి ఆస్వాదించండి. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
May 27, 2026 5:19PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com









