బీఎస్ఎన్ఎల్ నెత్తిన భస్మాసుర హస్తం

ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు. అది కూడా అత్యంత ఖరీదైన వస్తువుగా తెలుసు. అప్పట్లో వీధికి ఒక్క ఫఓన్ మాత్రమే ఉండేది.  గ్రామాలలో పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. ఇలాంటి సమాచార వ్యవస్థలో వచ్చిన పెను మార్పులు ఫోన్ల స్థానంలో మొబైల్ ఫోన్లను తెచ్చాయి. ఇప్పడు ప్రతి ఇంట్లో కనీసం అరడజను ఫోన్లు. టెలికాం విప్లవం మొబైల్ ఫోన్లతో ఆగిపోలేదు.  జనరేషన్ల పేరుతో తన సేవలను పెంచుకుంటూ ఇప్పుడు 5జీగా కొనసాగుతోంది. అలాంటి సమాచార విప్లవంలో భారత ప్రభుత్వం కూడా తన స్వంత సంస్థగా కోటి రూపాయల మూలధనంతో భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ను ప్రారంభించింది.  ప్రయివేటీకరణలో భాగంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తూ వచ్చిన భారత ప్రభుత్వం క్రమంగా బీఎస్ఎన్ఎల్ ను పక్కన పెట్టేసింది. భారత దేశంలో డిఫఎన్స్, రైల్వేస్ తరువాత అ త్యధిక మంది ఉద్యోగులను, ఆస్తులను కలిగిన బీఎస్ఎన్ఎల్ దివాళా తీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. చివరికి బీఎస్ఎన్ ఎల్ అభివృద్ధి 3జి దగ్గరే ఆగిపోయింది.  మిగిలిన కార్పొరేట్ టెలికాం సంస్థలు లాభాల బాటలో నడుస్తుంటే భారత ప్రభుత్వంలోని బీఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలో చిక్కుకుంది.  తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ కు 89వేల కోట్ల రూపాయల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది.  దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి.  ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 89 వేల కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీలో పలు కీలక అంశాలపై దేశంలో చర్చ సాగుతోంది.  బీఎస్ఎన్ఎల్ ను పలు రకాలుగా నష్టాలలోకి నెట్టి అప్పడప్పుడూ ప్యాజేపీలు ప్రకటించడాన్ని టెలికాం రంగ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒకటిన్నర శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న భారత టెలికాం రంగానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం మితిమీరిన కార్పొరేట్ పలుకుబడే కారణమని విమర్శలు వస్తున్నాయి.  స్పెక్ట్రం లకు బీఎస్ఎన్ఎల్ ను దూరం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడుు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం, వాటిని దొడ్డి దారిన కార్పొరేట్ల చేతుల్లోకి పంపడానికే అని విమర్శలు ఉన్నాయి.  దేశంలో  సుమారు 36శాతం మంది గ్రామీణ ప్రజలు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఆధారపడి ఉన్నారు. గ్రామీణ బ్రాడ్ బాండ్ లలో అధిక లాభాలు రావు కాబట్టి కార్పొరేట్లు ఆ వైపు చూడటం లేదు.  అయినా బీఎస్ఎన్ఎల్ ఇంత వరకూ 4జి సేవలను పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది.  లాభాలు తెచ్చే సేవలో పోటీ పడే కార్పొరేట్లు దేశంలోేని పేదల కోస నెట్ వర్క్ లు నడపడం లేదు.  సేవల ఏర్పాట్లపై టీసీఎల్ కు 15వేల కోట్లు చెల్లిస్తున్న బీఎస్ఎన్ఎల్, టాటాలను పెంచి పోషిస్తోంది. 4జి సేవల కోసం అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతికను కొర్పొరేట్లు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంటే, చైనాపై ఆంక్షలు విధించిన కేంద్రం ఇక్కడి పారిశ్రామిక వేత్తల నుండే టెక్నాలజీని కొనాల్సి వస్తోంది.  దీంతో సేవలు అంతరాయానికి గురవుతున్నాయి. టెక్నాలజీ కొనుగోళ్ల పేరుతో దేశంలోని కార్పొరేట్లు ఆ డబ్బును కూడా దిగమింగుతున్నారు. దేశ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికీ బీఎన్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 89వేల కోట్ల ప్యాకేజీ అటూ, ఇటూగా తిరిగి దేశీయ కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లబోతోంది అన్నది అక్షర సత్యం.
Publish Date: Jun 8, 2023 5:58PM

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వానా!

వారం రోజులు ఆలస్యం అయితే అయ్యింది కానీ ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం లోగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   ఈ ఏడాది రుతుపవనాల రాక  ఆలస్యం కావడంతో ఆ ప్రభావం వ్యవసాయం మీద ఉంటుందని రైతులు అంటున్నారు. ఇక ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో రానున్న రెండు రోజులలో అవి కర్నాటక, తమిళనాడులకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే అంటే మరో మూడు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.   అయితే అంత వరకూ తెలుగు రాష్ట్రాలలో  ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.   నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అయితే దక్షిణ చత్తీస్ గఢ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందనీ, ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.  
Publish Date: Jun 8, 2023 3:19PM

నాలుగేళ్లూ గాలికి.. ఇకనైనా పని..జగన్ వేడుకోలు

వైసీపీ అధినేత జగన్ పార్టీ క్యాడర్ నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమయ్యారా? అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకత వెనుక పార్టీ అధినాయకుడు క్యాడర్ విశ్వాసం కోల్పోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు.   అవును ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు, నాయకులు.  నిజానికి, ఈరోజున అధికార పార్టీలో నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య దూరం అంతో ఇంతో కాదు, అంచనాలకు అందనంతగాపెరిగింది. ఇందుకు కారణం పార్టీ అధినేత కార్యకర్తలకే కాదు   ముఖ్యసలహాదారు సజ్జలకు తప్ప   మంత్రులకు కూడా కనిపించరని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  అటువంటి ముఖ్యమంత్రి రాజకీయాలంటే మానవ సంబంధాలు అంటూ చాలా గంభీర ప్రకటన చేయడం పార్టీలో ఆయన పట్ల సన్నగిల్లిన నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో భాగమే అంటున్నారు.  ఎమ్మెల్యేలను టిక్కెట్టివ్వను జాగ్రత్త అంటే బెదరించకుండా, మంత్రులను  మీ పనితీరు మెరుగు పరచుకుంటారా ..  పీకేయ మంటారా ? హెచ్చరించకుండా..  నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోను అంటూ  బుజ్జగింపులకు దిగడానికి కారణమదే అంటున్నారు. అయితే  ఎంతగా స్వరం మార్చినా పార్టీ క్యాడర్ ఆయనను విశ్వసించే పరిస్ధితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ముఖ్యంగా ఏప్రిల్ 7 న ప్రారంభమైన,  ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వంపై వైస్పీ కార్యకర్తలు, స్థానిక నాయకుల్లో భగ్గుమంటున్న అసమ్మతిని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధాన్నీ బహిర్గతం చేసిందంటున్నారు.  నిజానికి మా నమ్మకం న ువ్వే జగనన్నాకు ముందు ఏడాది కాలంగా సాగుతున్న  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు జనం నాడి అర్థమైంది. అందుకే, గడప గడపకు కార్యక్రమంపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం లేక పోయింది. ఆ తరువాత దానికి కొనసాగింపుగా  దింపుడు కళ్ళెం ఆశతో చేపట్టిన  మా నమ్మకం నువ్వే జగనన్నా  కార్యక్రమంలోనూ  వైసీపే నాయకులకు జనం నుంచి అవమానాలే ఎదురయ్యాయి.  దీనిని బట్టి చూస్తే వాస్తవానికి ఫెయిలైంది వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి నాయకత్వం. చాలా చాలా ఆలస్యంగానైనా జగన్ ఈ విషయాన్ని గుర్తించారనడానికి బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో జగన్ మాటలే నిదర్శనమని  అంటున్నారు పరిశీలకులు.  తొమ్మది నెలలు కష్టపడండి అధికారం మనదే అనడం వెనుక ఈ నాలుగేళ్ల వైఫల్యాలనూ మంత్రుల ముందు జగన్ అంగీకరించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Jun 8, 2023 3:00PM

విజయమ్మ.. జగన్.. మధ్యలో సజ్జల!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తల్లి విజయమ్మ  బుధవారం (జూన్ 7) అమరావతిలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. కుమారుడి ఇంటి వైపు కనీసం కన్నెత్తి చూడకుండా విజయమ్మ సజ్జల నివాసానికి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అ యితే వైయస్ విజయమ్మ  సజ్జల నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. అయితే  సాక్షాత్తూ ముఖ్యమంత్రి తల్లి అయిన విజయమ్మ స్వయంగా కుమారుడి కింద పని చేసే ఉద్యోగి లాంటి సజ్జల నివాసానికి వెళ్లడం తల్లీ కుమారుల మధ్య విభేదాలున్నాయనీ, కనీసం రాకపోకలు కూడా లేవని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయ్యింది. అయినా వాస్తవానికి విజయమ్మ స్థాయికి ఆమె కాకితో కబురంపితే రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిన స్థాయి సజ్జలది. అయితే  విజయమ్మే స్వయంగా సజ్జల నివాసానికి వెళ్లడమేమిటన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.   దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి,  ప్రస్తుత సీఎం  జగన్‌ తల్లి, అధికార వైపీసీ మాజీ  గౌరవ అధ్యక్షురాలు అయిన  ఆమె.. సజ్జల ఇంటికి వెళ్లడం.. ఆ సమయంలో సజ్జల లేకపోవడం.. మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ విజయమ్మని అవమానపరచడమేనని వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ముందస్తుగా సజ్జలకు సమాచారం ఇచ్చే.. హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారని.. అలాంటి ఆమెను.. ఇలా అగౌరవపరచడం సజ్జల అహంకారం తప్ప మరోటి కాదని అంటున్నారు.  అయినా మహానేత భార్య  వైయస్ విజయమ్మ.. ఎందుకు సజ్జల ఇంటికి వెళ్లారనే అంశంపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.   అయితే అమరావతి వరకూ.. అదీ సజ్జల ఇంటి వరకు వెళ్లిన ఆమె... ఆ పక్కనే తాడేపల్లిలో ఉన్న తన కుమారుడు, సీఎం జగన్ ఇంటికి వెళ్లక పోవడం ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  జగన్ అధికార పీఠంపై కూర్చొబెట్టేందుకు తల్లిగా విజయమ్మ, చెల్లిగా  షర్మిల.. ఎంతగా కష్టపడాలలో అంతగా కష్టపడ్డారని.. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ వీరిద్దరినీ జగన్ దూరం పెట్టారని కూడా ఈ  సందర్భంగా  పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీలో వరుసగా చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు.  మరోవైపు వైయస్ జగన్ సొంత చిన్నాన్న  వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురై.. నాలుగేళ్ల దాటిపోయిందని... ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాత్రం ప్రధాన నిందితులంటూ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ కావడం..  అవినాష్ రెడ్డి అయితే కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందడం.. తదితర అంశాలను ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోవైపు తన తండ్రి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ  వివేకా కుమార్తె వైయస్ సునీత  వైయస్ అవినాష్ రెడ్డి పొందిన ముందస్తు బెయిల్  ను సవాల్ చేస్తూ మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిస్థితులలో జగన్ తల్లి విజయమ్మ కుమారుడిని కనీసం పలకరించకుండా.. ఆ పక్కను ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు నివాసానికి వెళ్లడం వెనుక ఏదో గట్టి కారణమే ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అదీకాక వైయస్ జగన్, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు  సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారం   చేస్తున్నారనే ఓ చర్చ  వైసీపీ వర్గాల్లో  హల్ చల్ చేస్తోంది.  దీంతో విజయమ్మ.. సజ్జలతో ఏ అంశాలపై చర్చించేందుకు  ఆయన నివాసానికి వైయస్ విజయమ్మ వెళ్లి ఉంటారన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
Publish Date: Jun 8, 2023 2:34PM

ఖమ్మం సభకు ప్రియాంక!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో  విజయం సాధించి అధికారంలో  కొనసాగుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి  కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో  కేసీఆర్ రాజకీయానికి సంపూర్ణంగా చెక్ పెట్టేందుకు ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీలోని హస్తం పార్టీ నేతల వరకు అంతా ప్రణాళికబద్దంగా పావులు కదుపుతున్నారు.  ఆ క్రమంలో ఈ నెల 25వ తేదీన  ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. అదీకాక ఇదే ఉమ్మడి జిల్లాలోని మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు వస్తారని అంటున్నారు. రాహుల్ వచ్చినా రాకున్నా  ప్రియాంకా గాంధీ మాత్రం పక్కాగా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.  ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. అదే విధంగా ఈ ఏడాది చివరిలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులోభాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ఈ నెల 12వ తేదీన ఆమె ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టున్నారని... ఆ క్రమంలో ఖమ్మం వేదికగా జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇదే వేదికపైన .. అదే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు   హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.  ఇంకోవైపు జూన్ 11 లేదా 12వ తేదీన ఢిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు భేటీ అయి.. రాష్ట్రంలో పార్టీ  విజయం కోసం అమలు చేయాల్సిన అంశాలు.. అలాగే ప్రజల్లోకి ఏ ఏ అంశాలు బలంగా తీసుకు వెళ్లాలి తదితర అంశాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  తెలంగాణలో   ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రియాంక గాంధీ సైతం.. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది. ఇక తెలంగాణలో పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత.. పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. అందుకు ఆయన చేపడుతోన్న సభలు, బహిరంగసభకు భారీగా ప్రజలు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. అయితే రానున్న తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారనున్నాయనేది సుస్పష్టమని తెలంగాణలోని పోటిలికల్ సర్కిల్‌లో చర్చ అయితే ఇప్పటికే ఊపందుకొంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి దక్షిణాదిలో.. అదీ తెలంగాణలో పాగా వేసి... తమ సత్తా చాటుకోవాలని బీజేపీలోని కాషాయం పార్టీ నేతలు... తమ వ్యూహాలకు పదును పెడుతూ.. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు.  అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పార్టీ పరిస్థితి పాతాళంలోకి పడిపోతోందని తెలిసినా.. తెలంగాణలో మాత్రం అధికారం నిలుపుకుంటామని.. హస్తం పార్టీ అధిష్టానం కలలు కన్నది. కానీ ఆ కలలను... నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లలు చేశారు. దీంతో తమ పార్టీ అధిష్టానం కన్న కలను సాకారం చేసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని అయితే హస్తం పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం సత్తా చాటిన తెలుగుదేశం.. 2019 ఎన్నికల్లో మాత్రం అంతగా సత్తా చాట లేకపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌ పార్టీగా అవతరించిన తర్వాత.. తెలంగాణలో టీడీపీ సైతం సూపర్ స్పీడ్‌తో సైకిల్ సవారీ చేస్తుంది. ఆ క్రమంలో 2022 డిసెంబర్‌లో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావ సూపర్ సక్సెస్ అయింది.  ఆ తర్వాత అంటే  2023, జనవరిలో కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం ఖమ్మంలో భారీ సభ చేపట్టి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం వేదికగా సభ నిర్వహించి.. సత్తా చాటనుంది. మరి అలాంటి వేళ.. కాషాయం పార్టీ నేతలు సైతం....ఖమ్మం వేదికగా.. సభ నిర్వహించినా నిర్వహించవచ్చుననే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్ చల్ చేస్తోంది.    అన్ని పార్టీలు ఇలా ఖమ్మం వేదికగా.. బహిరంగ సభలు నిర్వహించినా.. ఓటర్లు మాత్రం ఒకే ఒక్క పార్టీకే మేజార్టీ స్థానాలు కట్టబెతారనేది సుస్పష్టం. అలాంటి వేళ.. అదీ ఏ పార్టీ అంటే మాత్రం.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే వరకు వేచి చూడాల్సిందేనన్నది సుస్పష్టం.
Publish Date: Jun 8, 2023 2:15PM

రామ రామ.. ఇదేం పని!?

వివాదాలు సృష్టించి సినిమా సక్సెస్ కు బాటలు వేసుకోవడమన్నది కొత్త విషయమేమీ కాదు. ఈ విషయంలో  ఆర్జీవీగా పిలవబడే రామగోపాల్ వర్మ అందరి కంటే రెండాకులు ఎక్కువే చదివాడని అంతా అనుకుంటారు. కానీ ఆదిపురుష్ బృందం తిరుమలలో చేసిన హంగామా చూస్తుంటే.. వారి నుంచి రామ్ గోపాల్ వర్మ ఇంకా నేర్చుకోవాలేమో అనిపించకమానదు.  మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ, సినిమా ఫంక్షన్లలోనూ సినిమావాళ్లు హగ్గులు, కిస్సులూ మామూలే అన్నట్లుగా అయిపోయాయి. వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సీరియస్ గా తీసుకోరు. కానీ ఎంత సినిమావాళ్లైనా వాళ్లు ఉన్నది ఎక్కడ, చేస్తున్నది ఏమిటి అన్న విచక్షణ ఉండాలి. ఉద్దేశ పూర్వకంగా వివాదం చేయడానికి జరిగిందో కాదో చెప్పలేము కానీ తిరుమలలో ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్, ఆ సినిమాలో సీత పాత్రధారిణి కృతి సనన్ ల ఆలింగనాలు, చుంబనాల వ్యవహారం అందరి విమర్శలనూ ఎదుర్కొంటోంది. తీసిందేమో రాముడి సినిమా.. ఉన్నదేమో కలియుగ వైకుంఠం అయిన తిరుమలో. అటువంటి చోట పవిత్రతకు, ఆధ్యాత్మికతకు తిలోదకాలిచ్చి ఆలింగనాలు, చుంబనాలతో రెచ్చిపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. సినిమా ప్రచారానికి ఇంకా చాలా మార్గాలున్నా ఇలాంటి జుగుప్సాకర, అభ్యంతరకర మార్గాన్ని ఎంచుకోవడాన్ని సర్వులూ తప్పుపడుతున్నారు.  వారు వ్యవహరించిన తీరు హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయంటున్నారు. హిందూ సంఘాలు క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి దర్శకుడినా ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలు కురిపించారంటూ ఆయనపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో రాముడి ఔన్నత్యాన్ని ఎలా చూపారు? సినిమా ఎలా ఉంది అన్నది ఆ సినిమా విడుదలైతే తప్ప తెలిసే అవకాశం లేదు. కానీ అంతకంటే ముందే  తిరుమల కొండపై తమ విన్యాసాల ద్వారా వారికి తమ సినిమా వ్యాపారం తప్ప శ్రీరామ చంద్రుడిపై కానీ, తిరుమలేశునిపై కానీ గౌరవం, భక్తి లేవని విస్పష్టంగా చెప్పేశారని జనం దుయ్యబడుతున్నారు. రాముడి సినిమా తీసేస్తే గొప్పవారు అయిపోరనీ, కనీస సంస్కారం ఉండాలని అంటున్నారు.  భక్తి సినిమాలో చూపించేసి మీ భుజాలు మీరు చరిచేసుకుని కాలరెగరేస్తే ఊరుకోమని  హిందుత్వ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.  ఇక  నెటిజన్లు కూడా ఆదిపురుష్ డైరెక్టర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 
Publish Date: Jun 8, 2023 1:20PM