పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్లతో వరుణ్ ధావన్ డబుల్ ట్రబుల్ లవ్ స్టోరీ!
- వరుణ్ ధావన్ కొత్త సినిమా గ్లింప్స్ వైరల్! - గోవిందా ‘సాండ్విచ్’ సినిమాకు రీమేకా? - ‘హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై’.. ఫస్ట్ లుక్ రివ్యూ! బాలీవుడ్ వెండితెరపై మరోసారి నవ్వుల విందు సిద్ధమైంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్, లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తన 46వ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తన కుమారుడు, మాస్ హీరో వరుణ్ ధావన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai) ఫస్ట్ లుక్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే పక్కా కలర్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మరియు అందాల నటి మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో ఏఐ (AI) సాయంతో రూపొందించిన ఇద్దరు చిన్నారులు మాట్లాడుకుంటూ తమ తండ్రి పేరు ‘జస్’ (వరుణ్ ధావన్) అని తెలుసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక హీరో.. ఇద్దరు హీరోయిన్ల మధ్య జరిగే ఈ ‘డబుల్ ట్రబుల్’ ప్రేమకథలో వరుణ్ ధావన్ తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని విజువల్స్ చాలా గ్రాండ్గా, కలర్ఫుల్గా ఉన్నాయి. ‘బివి నెం.1’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఇష్క్ సోనా హై’ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ వీడియోలో వినిపించే మ్యూజిక్ ప్రేక్షకులలో మంచి జోష్ నింపుతోంది. వరుణ్ ధావన్ గ్లామరస్ లుక్లో కనిపిస్తుండగా, పూజా హెగ్డే మరియు మృణాల్ ఠాకూర్ తమ అందచందాలతో వెండితెరకు కొత్త కళను తీసుకువస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గతంలో గోవిందా నటించిన ‘సాండ్విచ్’ సినిమాకు ఇది రీమేక్లా ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా, డేవిడ్ ధావన్ మార్క్ ‘జుడ్వా 2’ వైబ్స్ కనిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా, క్లీన్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అవుతుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ నటిస్తున్న నాలుగో చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘మై తేరా హీరో’, ‘జుడ్వా 2’, ‘కూలీ నెం.1’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేశాయి. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టును రమేష్ తౌరానీ ‘టిప్స్ ఫిలిమ్స్’ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మౌనీ రాయ్, రోహిత్ సరాఫ్, జిమ్మీ షెర్గిల్ వంటి భారీ తారాగణం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం జూన్ 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. వరుణ్ ధావన్ మాస్ అప్పీల్, పూజా-మృణాల్ గ్లామర్, డేవిడ్ ధావన్ మార్క్ కామెడీ వెరసి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Apr 14, 2026భారతీయ సంగీత ప్రపంచం గర్వించదగ్గ మేటి గాయని ఆశా భోస్లే!
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో 'ఆశా భోస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక శకం. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆశా భోస్లే 1933, సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు మరియు నాటక కళాకారుడు. ఆశాకి తన తండ్రి నుండే సంగీతం వారసత్వంగా అబ్బింది. ఆమె అక్క లతా మంగేష్కర్ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాయని అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆశా తన తొమ్మిదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. ఆ సమయంలో కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆమె, లతా మంగేష్కర్ కలిసి సినిమాల్లో పాడటం, నటించడం ప్రారంభించారు. 1943లో 'మాఝా బాల్' అనే మరాఠీ చిత్రంతో ఆశా భోస్లే తన గాయనీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. హిందీలో 1948లో 'చునరియా' సినిమా ద్వారా మొదటిసారి పాడారు. అయితే, ఆ సమయంలో గీతా దత్, శంషాద్ బేగం, ఆమె అక్క లతా మంగేష్కర్ వంటి దిగ్గజాలు ఇండస్ట్రీని ఏలుతుండటంతో, ఆశాకి మొదట్లో కేవలం చిన్న చిన్న అవకాశాలు లేదా నెగటివ్ పాత్రల పాటలే దక్కేవి. 1950వ దశకం చివరలో ఆశా కెరీర్ మలుపు తిరిగింది. సంగీత దర్శకులు ఓ.పి. నయ్యర్, ఎస్.డి. బర్మన్ ఆమెలోని ప్రతిభను గుర్తించి గొప్ప అవకాశాలు ఇచ్చారు. 1957లో వచ్చిన 'నయా దౌర్' సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె పాడలేని పాట లేదు. క్లాసికల్, గజల్స్, పాప్, క్యాబరే, భక్తి గీతాలు.. ఇలా ప్రతి విభాగంలోనూ తన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆర్.డి. బర్మన్ సంగీతంలో ఆమె పాడిన 'దమ్ మారో దమ్', 'పియా తూ అబ్ తో ఆజా' వంటి పాటలు నేటికీ కుర్రకారును ఉర్రూతలూగిస్తాయి. ఆశా భోస్లే వ్యక్తిగత జీవితం అనేక ఒడిదుడుకులతో సాగింది. తన 16వ ఏటనే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా గణపత్ రావు భోస్లేను వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వారిద్దరి జోడీ సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను సృష్టించింది. ఆశా భోస్లే దాదాపు 7 దశాబ్దాల (70 ఏళ్లు) పాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఆమె అత్యధికంగా పాటలు రికార్డ్ చేసిన గాయనిగా గుర్తింపు పొందారు. ఆమె 20కి పైగా భారతీయ భాషల్లో సుమారు 12,000 నుండి 20,000 వరకు పాటలు పాడారని అంచనా. తెలుగులో కూడా ఆమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించింది. రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే ఎన్నో ఫిలింఫేర్ అవార్డులతో పాటు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు కూడా ఆమెను వరించింది.
Apr 12, 2026ముగిసిన స్వర ప్రస్థానం: ఆశా భోస్లే ఇక లేరు
భారతీయ సంగీత సామ్రాజ్ఞి, వేల పాటల గల గలలు కురిపించిన ఆశా భోస్లే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. తన అద్భుతమైన స్వరంతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన ఆమె ప్రయాణం నేటితో ముగిసింది. గుండెపోటు, ఊపిరి తిత్తుల సమస్యతో ఏప్రిల్ 11న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఆశా భోస్లే కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆమె 7 సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు, రెండు నేషనల్ అవార్డులు పొందారు. తన కెరీర్లో 12,000కి పైగా పాటలు పాడారు. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆశా భోస్లే జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వద్ద సంగీత ఓనమాలు దిద్దారు. అక్క లతా మంగేష్కర్తో కలిసి భారతీయ సినిమా పాటను శిఖరాగ్రాన నిలబెట్టారు. 1943లో కేవలం 10 ఏళ్ల వయసులో 'మాఝా బాల్' అనే మరాఠీ సినిమాతో ఆమె పాట ప్రయాణం మొదలైంది. ఆశా భోంస్లే ప్రత్యేకత ఆమె వాయిస్లో ఉన్న వైవిధ్యం. మెలోడీ పాటలైనా, హుషారైన డ్యాన్స్ నంబర్లైనా, గజల్స్ అయినా.. ఆమె గొంతులో పలికితే ఆ మజానే వేరు. సుమారు 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా సొంతం చేసుకున్నారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. అలాగే ఎన్నో ఫిలింఫేర్ మరియు నేషనల్ అవార్డులు ఆమెను వరించాయి. లతా మంగేష్కర్ మరణం తర్వాత ఆశా భోస్లే.. మంగేష్కర్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. నేడు ఆమె మరణవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. పాట ఉన్నంత వరకు ఆశా భోస్లే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆశా భోస్లే మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
Apr 12, 2026షూటింగ్ కోసం రణవీర్ సింగ్ సాహసం.. షాకింగ్ విషయం బయటపెట్టిన డైరెక్టర్!
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ అంటేనే వెండితెరపై ఒక వైబ్రేషన్. ఎంచుకున్న పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని ఈ స్టార్ హీరోకు సంబంధించి ఒక షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఒక సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో సహజత్వం కోసం రణవీర్ ఏకంగా తనను తాను గాయపరుచుకున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో వచ్చిన ‘లూటేరా’ సినిమా షూటింగ్ సమయం నాటి ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్ర క్లైమాక్స్ సీన్లో రణవీర్ పాత్ర తీవ్రమైన నొప్పితో బాధపడాల్సి ఉంటుంది. ఆ బాధను తెరపై సహజంగా పండించాలని రణవీర్ ఒక వింత ప్రయత్నం చేశారట. తన పొట్ట భాగంలో క్లిప్పులు పెట్టుకుని, ఆ నొప్పిని అనుభవిస్తూ సీన్ చేశారని అనురాగ్ తెలిపారు. షూటింగ్ సమయంలో రణవీర్ ఎంతలా తపించారంటే.. ఆ విషయం కనీసం యూనిట్ సభ్యులకు కూడా చెప్పలేదట. కెమెరా ముందు సహజమైన ఎక్స్ప్రెషన్స్ రావడం కోసం ఆయన ఆ నొప్పిని భరించారు. సీన్ పూర్తయ్యాక రణవీర్ కనీసం కదలలేని స్థితికి చేరుకోవడంతో చిత్ర బృందం ఆందోళన చెందింది. వెంటనే ఆయనను పరీక్షించగా, పొట్టపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. దీంతో యూనిట్ వెంటనే రణవీర్ను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రణవీర్ సింగ్ కెరీర్లో ‘లూటేరా’ ఒక క్లాసిక్గా నిలిచిపోయినప్పటికీ, అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ రణవీర్ నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రతి సినిమా కోసం రణవీర్ ఇదే స్థాయిలో కష్టపడుతుంటారు. తాజాగా రణవీర్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం థియేటర్లలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 1600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో రణవీర్తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఆయన పాత సినిమాల డెడికేషన్ గురించి వచ్చిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రణవీర్ సింగ్ చేసిన ఈ సాహసంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "నటనపై రణవీర్కు ఉన్న ప్యాషన్ అమోఘం" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, "మరీ అంతలా రిస్క్ తీసుకోవాలా?" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక నటుడు ఒక పాత్రలో జీవించడానికి ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారని రణవీర్ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి భారీ ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నారు.
Apr 10, 2026
Salman Khan: ఈ చిరిగిన బూట్ల ధర ఇన్ని లక్షలా? సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫ్యాషన్ చూసి నెటిజన్లు షాక్!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఏం చేసినా అది ఒక సెన్సేషన్. ఆయన వేసుకునే బట్టల నుంచి వాడే వాచీల వరకు అన్నీ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా సల్మాన్ ఖాన్ వేసుకున్న బూట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. చూడటానికి రంగు వెలిసిపోయి, అక్కడక్కడా చిరిగినట్టుగా కనిపిస్తున్న ఆ బూట్ల ధర తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కేవలం ఆ పాతబడిన బూట్ల కోసమే సల్మాన్ ఖాన్ లక్షల రూపాయలు ఖర్చు చేశారన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రీసెంట్గా ఒక ఈవెంట్లో సల్మాన్ ఖాన్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్లో మెరిశారు. అయితే అందరి దృష్టి ఆయన వేసుకున్న 'లెదర్ కౌబాయ్' బూట్లపై పడింది. అవి కొత్తవా లేక పాతవా అనే అనుమానం వచ్చేలా డ్యామేజ్ అయి కనిపిస్తున్నాయి. తీరా ఆరా తీస్తే.. అవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్రాండ్ 'బాలెన్సియాగా' (Balenciaga) కు చెందినవని తేలింది. వీటి ధర దాదాపు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్! ఈ బూట్ల ఫోటోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. "మా ఇంట్లో పాత సామాన్ల బుట్టలో కూడా ఇలాంటి బూట్లు ఉండవు.. దీనికి లక్షన్నర రేటా?", "చిరిగిన బూట్లు వేసుకోవడమే ఫ్యాషన్ అయితే, మాకంటే పెద్ద ఫ్యాషన్ ఐకాన్స్ ఎవరూ ఉండరు" అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మరికొందరైతే "సల్మాన్ భాయ్ రేంజే వేరు.. ఆయన చిరిగిన బూట్లు వేసుకున్నా అది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది" అంటూ వెనకేసుకొస్తున్నారు. నిజానికి ఇలాంటి 'డిస్ట్రెస్డ్' (Distressed) లుక్ కలిగిన ఉత్పత్తులను తయారు చేయడంలో బాలెన్సియాగా బ్రాండ్ ప్రపంచ ప్రసిద్ధి. కావాలనే పాతబడినట్టుగా, చిరిగినట్టుగా డిజైన్ చేయడం వారి స్టైల్. గతంలో కూడా ఈ బ్రాండ్ ఇలాంటి వింత ఫ్యాషన్ వస్తువులను లక్షల ధరలో అమ్మి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ ట్రెండ్ను ఫాలో అవ్వడంతో ఇండియాలో ఈ బ్రాండ్ గురించి చర్చ మొదలైంది. మరి భవిష్యత్తులో ఈ 'చిరిగిన బూట్ల' ఫ్యాషన్ ఇంకెంత మంది సెలబ్రిటీలను ఊపేస్తుందో చూడాలి.
Apr 07, 2026దృశ్యం సినిమాకే బాప్ లాంటి థ్రిల్లర్.. ఓటీటీలో ప్రకంపనలు సృష్టిస్తున్న వధ్ 2
- నెట్ఫ్లిక్స్లో టాప్ ట్రెండింగ్లో క్రైమ్ థ్రిల్లర్ - ఊపిరి బిగబట్టే సస్పెన్స్.. - సంచలనం సృష్టిస్తున్న సంజయ్ మిశ్రా ‘వధ్ 2’ - క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ప్రస్తుతం సినీ ప్రియులు థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీ కంటెంట్ పైనే మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్లో దుమ్మురేపుతోంది. అదే 'వధ్ 2'. 131 నిమిషాల నిడివి గల ఈ చిత్రం, ఎలాంటి హడావిడి లేకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చి, ఇప్పుడు టాప్-10 ట్రెండింగ్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సాధారణంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మర్డర్ మిస్టరీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ‘దృశ్యం’. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించిన ఆ సినిమా రికార్డులను సైతం తలదన్నేలా ఈ 'వధ్ 2' ఉందంటూ సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి, పరిస్థితుల ప్రభావంతో హంతకుడిగా ఎలా మారాడు? సమాజం దృష్టిలో నిందితుడిగా ఉన్న వ్యక్తి మన దృష్టిలో హీరోగా ఎలా నిలుస్తాడు? అనే అంశాలను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. కథ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్లోని శివపురి జైలు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. శంభునాథ్ మిశ్రా (సంజయ్ మిశ్రా) అక్కడే జైలు అధికారికంగా పనిచేస్తుంటాడు. తన కుమారుడి చదువు కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక సతమతమవుతుంటాడు. ఆ కష్టాల్లో ఉండగానే, అదే జైలుకు ఒక ఎమ్మెల్యే తమ్ముడైన కేశవ్ వస్తాడు. కేశవ్ తన అహంకారంతో తోటి ఖైదీలను హింసిస్తూ ఉండగా, హఠాత్తుగా అతను అదృశ్యమవుతాడు. అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన సంజయ్ మిశ్రా, నీనా గుప్తాల నటన సినిమాకు ప్రాణవాయువులా నిలిచింది. సంజయ్ మిశ్రా తన సహజ సిద్ధమైన నటనతో శంభునాథ్ పాత్రలో ఒదిగిపోయారు. కేవలం పెద్ద బడ్జెట్, గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయనే భ్రమలను పటాపంచలు చేస్తూ, పటిష్టమైన కథ ఉంటే చాలని ఈ చిత్రం నిరూపించింది. గతంలో వచ్చిన 'వధ్' మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్, అంతకు మించిన థ్రిల్ను అందిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై భారీ చర్చ నడుస్తోంది. ఐఎండిబి (IMDb) లో 7.5 రేటింగ్తో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని నెటిజన్లు ‘మాస్టర్పీస్’ అని అభివర్ణిస్తున్నారు. ‘దృశ్యం’ సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్ ఇందులో ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ను మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వీకెండ్లో ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ‘వధ్ 2’ ఒక బెస్ట్ ఛాయిస్. ఎటువంటి అశ్లీలత లేకుండా కేవలం మైండ్ గేమ్ మరియు సస్పెన్స్తో సాగే ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడేవారు అస్సలు మిస్ అవ్వకూడని చిత్రమిది.
Apr 06, 2026.webp)
రణబీర్ కపూర్ రామాయణ టీజర్ ట్రోల్స్.. మేకర్స్కు బాసటగా నిలిచిన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్!
- రామాయణ VFXపై విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన హృతిక్ రోషన్ - సోషల్ మీడియా ట్రోల్స్కు చెక్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచినప్పటికీ, మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యతపై పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చి మూవీ టీమ్కు తన మద్దతు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా సినిమాలపై వచ్చే విమర్శల గురించి ఇతర హీరోలు పెద్దగా స్పందించరు. కానీ హృతిక్ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన నేరుగా సినిమా పేరు ఎత్తనప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత గురించి ఇన్ స్టాగ్రామ్లో పెట్టిన సుదీర్ఘమైన నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక భారీ చిత్రాన్ని రూపొందించే క్రమంలో ఉండే కష్టనష్టాలను ఆయన వివరిస్తూ మేకర్స్ పక్షాన నిలిచారు. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ మాత్రమే కావని, అది ఒక కళ అని హృతిక్ అభిప్రాయపడ్డారు. అత్యున్నత సాంకేతికతతో కూడిన సినిమాలు చేసేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నట్లుగా ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో రామాయణ దర్శకుడు నితీష్ తివారీకి హృతిక్ నుంచి గట్టి మద్దతు లభించినట్లయింది. గతంలో హృతిక్ రోషన్ కూడా 'క్రిష్' వంటి భారీ VFX ఆధారిత చిత్రాల్లో నటించి విజయం సాధించారు. స్వయంగా టెక్నాలజీపై అవగాహన ఉన్న హీరో కావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో ప్రాధాన్యత పెరిగింది. రణబీర్ ఫ్యాన్స్ కూడా హృతిక్ మద్దతు తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రేక్షకులు కొంత ఓపికగా ఉండాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చర్చ తారాస్థాయికి చేరింది. ఒక వర్గం నెటిజన్లు టీజర్ లోని విజువల్స్ పట్ల అసంతృప్తిగా ఉన్నా, మరికొందరు మాత్రం హృతిక్ వాదనతో ఏకీభవిస్తున్నారు. కేవలం టీజర్ చూసి సినిమా మొత్తాన్ని తక్కువ అంచనా వేయలేమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా 'రామాయణ' సినిమాపై రోజురోజుకూ క్రేజ్ తో పాటు వివాదాలు కూడా పెరుగుతున్నాయి. నితీష్ తివారీ ఈ పౌరాణిక గాథను ఏ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తారో చూడాలి. త్వరలోనే విడుదల కానున్న తదుపరి అప్ డేట్స్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
Apr 05, 2026ధురంధర్ రెండు పార్ట్లు ఒకే స్క్రీన్పై.. ఎన్ని గంటలో తెలిస్తే షాక్ అవుతారు!
- ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్ - ‘ధురంధర్’ స్పెషల్ ఎడిషన్ కోసం భారీ ప్లాన్! - మరోసారి థియేటర్లలో రచ్చ చేయబోతున్న ‘ధురంధర్’ బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్’ . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. సాధారణంగా మన సినిమాల నిడివి రెండున్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది. కానీ, ‘ధురంధర్’ విషయంలో మాత్రం మేకర్స్ ఎవరూ ఊహించని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ధురంధర్’ సినిమాను రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్: ది రివెంజ్) తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు భాగాలను కలిపి ఏకంగా 7 గంటల 30 నిమిషాల నిడివి గల ‘డైరెక్టర్స్ కట్’ వెర్షన్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంటే దాదాపు ఒక రోజులో మూడో వంతు సమయం ఈ సినిమా కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఒకే సినిమాను ఇంత సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై ప్రదర్శించడం అనేది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. ఈ భారీ ఎక్స్టెండెడ్ వెర్షన్ను సాధారణ థియేటర్లలో కాకుండా కేవలం IMAX, DC, HDR మరియు EPIQ వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తాను షూట్ చేసిన ప్రతి ముఖ్యమైన సీన్ను, ఎడిటింగ్లో తీసేసిన కీలక సన్నివేశాలను కూడా ఈ స్పెషల్ వెర్షన్లో చేర్చబోతున్నారట. హాలీవుడ్ లెజెండరీ చిత్రాలకు ఉండేలాగా, ఇండియన్ ప్రేక్షకులకు కూడా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో హాలీవుడ్లో ‘జస్టిస్ లీగ్’ వంటి చిత్రాలకు ఇలాంటి డైరెక్టర్స్ కట్ వెర్షన్లు రావడం మనం చూశాం. కానీ ఇండియన్ సినిమాలో ఇంతటి సుదీర్ఘమైన నిడివితో సినిమా రావడం ఇదే తొలిసారి కావచ్చు. రణవీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ రోల్లో నటించిన సినిమా ఇది. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ 7.5 గంటల వెర్షన్లో ఎలా ఉంటాయోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ప్రేక్షకులు థియేటర్లలో అంతసేపు ఎలా కూర్చుంటారు? మధ్యలో ఎన్ని విరామాలు ఇస్తారు? అనే ఆసక్తికర చర్చలు నెట్టింట మొదలయ్యాయి. రణవీర్ ఫ్యాన్స్ మాత్రం ఈ ‘మెగా మూవీ’ కోసం ఇప్పుడే సిద్ధమైపోతున్నారు. మరి ఈ క్రేజీ అప్డేట్పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
Apr 01, 2026‘ఆదిపురుష్’ చేదు జ్ఞాపకాలు ‘రామాయణ’ టీజర్తో తొలగిపోతాయా?
- హనుమాన్ జయంతి రోజే ‘రామాయణ’ విజువల్ వండర్! - బాలీవుడ్ పరువు కాపాడే బాధ్యత ఈ ఎపిక్ డ్రామాదేనా? - నాలుగు వేల కోట్ల బడ్జెట్తో ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ! భారతీయ చలనచిత్ర రంగంలో పౌరాణిక గాథలకు ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. అయితే, ఇటీవలి కాలంలో ‘ఆదిపురుష్’ లాంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవ్వడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసి, హిందీ చిత్ర పరిశ్రమ గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టే బాధ్యత ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’పై పడింది. నిర్మాత నమిత్ మల్హోత్రా దాదాపు నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్తో ఈ అద్భుత కావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అసలైన ప్రమోషన్ హడావుడి త్వరలోనే మొదలుకానుంది. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివి గల ఒక భారీ టీజర్ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. గతంలో కేవలం పాత్రల పరిచయానికే పరిమితమైన గ్లింప్స్ కాకుండా, ఈసారి అసలైన గ్రాఫిక్స్ కంటెంట్ మరియు మేకింగ్ స్టాండర్డ్స్ను ప్రపంచానికి చూపించబోతున్నారు. బాహుబలి, కల్కి వంటి చిత్రాలు భారతీయ సినిమాను గ్లోబల్ లెవల్కు తీసుకెళ్తే, ఈ 'రామాయణ' దాన్ని మరో వంద రెట్లు ముందుకు తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతమ్మ పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. ఇక రాక్షస రాజు రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్ తన విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. యానిమల్ సినిమాతో ఊహించని సక్సెస్ అందుకున్న రణబీర్ కపూర్కు, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అద్భుతమైన నటనతో ఆకట్టుకునే సాయి పల్లవికి ఈ సినిమా ఒక గొప్ప మైలురాయి కానుంది. ముఖ్యంగా ‘టాక్సిక్’ వంటి మాస్ సినిమాల మధ్య ఈ తరహా పౌరాణిక పాత్రను యష్ ఎంచుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దర్శకుడు నితీష్ తివారీ తన గత చిత్రాలైన ‘దంగల్’, ‘చిచోరే’లతో ప్రేక్షకుల్లో గొప్ప నమ్మకాన్ని కలిగించారు. కేవలం ఎమోషన్స్ మాత్రమే కాకుండా విజువల్స్ను కూడా భారీ స్థాయిలో హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకులకు కనువిందు చేయనుండగా, రెండో భాగం 2028లో విడుదలయ్యే అవకాశం ఉంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వాడటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చిత్ర బృందం అధిక సమయాన్ని కేటాయిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. “ఆదిపురుష్తో పోలిస్తే రామాయణ కచ్చితంగా గొప్పగా ఉండాలి” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి లుక్ ఎలా ఉండబోతుందనే విషయంలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ గనుక అంచనాలను అందుకుంటే, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. అటు రణబీర్ ఫ్యాన్స్, ఇటు యష్ అభిమానులు ఈ విజువల్ వండర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ ఇండియన్ సినిమా స్థాయిని ఏ మేరకు పెంచుతుందో చూడాలి!
Mar 31, 2026సల్మాన్ ఖాన్ సరసన నయనతార.. వంశీ పైడిపల్లి - దిల్ రాజు ‘SVC63’ మూవీ క్రేజీ అప్డేట్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే ‘SVC63’. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మెగా ప్రాజెక్టులో సల్మాన్ సరసన కథానాయికగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంపికయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్మెంట్తో ఇటు సౌత్, అటు నార్త్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిజానికి నయనతారకు బాలీవుడ్లో ఇది రెండో భారీ ప్రాజెక్ట్. ఇప్పటికే షారుఖ్ ఖాన్తో కలిసి ‘జవాన్’ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి, హిందీ ఆడియన్స్కు తన పవర్ ఏంటో చూపించింది. ఇప్పుడు మరో ఖాన్.. సల్మాన్తో జతకట్టడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వంశీ పైడిపల్లి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథను నడిపించే బలమైన పాత్రలను ఆయన డిజైన్ చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా నయనతార పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని సమాచారం. దర్శకుడు వంశీ పైడిపల్లి గత చిత్రం ‘వారసుడు’ (Varisu) తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ హిట్ కావడంతో, ఈసారి నేరుగా బాలీవుడ్ స్టార్ను హ్యాండిల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 63వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో రికార్డులు సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్కు, వంశీ పైడిపల్లి క్లాస్ అండ్ యాక్షన్ మేకింగ్కు తోడు నయనతార క్రేజ్ తోడవడంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా స్కై హైకి చేరింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేసుకుని 2027లో ఈ సినిమాను గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే సల్మాన్-నయనతార జంటపై చర్చలు మొదలయ్యాయి. గతంలో వీరు కలిసి నటించకపోయినా, ఈ సరికొత్త జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు తన బ్యానర్లో వస్తున్న ఈ సినిమాపై భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. మొత్తానికి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి ‘SVC63’ టీమ్ సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Mar 31, 2026వైరల్... ‘ధురంధర్’ షూటింగ్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్న ఆదిత్య ధర్!
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. గతేడాది డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా చుట్టూ మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రం మేకింగ్కు సంబంధించిన ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ‘ధురంధర్’ మేకింగ్ వీడియోలో సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన సవాళ్లు, ఆదిత్య ధర్ విజన్, రణవీర్ సింగ్ తన పాత్ర కోసం పడ్డ కష్టం వంటి ఎన్నో అంశాలను చూపించనున్నారు. ముఖ్యంగా థాయ్లాండ్, లడఖ్ వంటి కఠినమైన లొకేషన్లలో షూటింగ్ ఎలా సాగిందనేది ఈ డాక్యుమెంటరీలో హైలైట్గా నిలవనుంది. సాధారణంగా హాలీవుడ్ చిత్రాలకు ఉండే మేకింగ్ డాక్యుమెంటరీల తరహాలో, దీనిని కూడా అత్యంత నాణ్యతతో రూపొందించినట్లు సమాచారం. భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఐసీ-814 హైజాకింగ్, ముంబై దాడుల వంటి సున్నితమైన అంశాలను ఆదిత్య ధర్ వెండితెరపై ఆవిష్కరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతటి భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించడం వెనుక ఉన్న రీసెర్చ్, స్క్రిప్ట్ వర్క్ గురించి ఈ డాక్యుమెంటరీలో దర్శకుడు స్వయంగా వివరించబోతున్నారు. నటీనటుల విషయానికి వస్తే, రణవీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ రోల్లో కనిపించి మెప్పించారు. ఆయనతో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వీరందరి ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీని, సెట్స్లో వారు సరదాగా గడిపిన క్షణాలను కూడా అభిమానులు ఈ మేకింగ్ వీడియో ద్వారా వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1 మరియు పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2,700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారతీయ సినిమా సత్తాను చాటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీ గురించి భారీగా చర్చ జరుగుతోంది. థియేటర్లలో ఈ యాక్షన్ విజువల్స్ చూసి ముగ్ధులైన ప్రేక్షకులు, అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఈ డాక్యుమెంటరీ కూడా వ్యూయర్షిప్ పరంగా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఈ మేకింగ్ ఫిల్మ్ విడుదలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుతోంది. త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు రణవీర్ ఫ్యాన్స్ బాక్సాఫీస్ రికార్డులను ఎంజాయ్ చేస్తూ, ఈ కొత్త అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే
Mar 31, 2026
Dhurandhar 2: 'ధురంధర్ 2'పై ఐపీఎల్ ఎఫెక్ట్..!
'ధురంధర్ 2' బాక్సాఫీస్ విధ్వంసం ఐపీఎల్ ఫీవర్ను తట్టుకొని నిలబడ్డ స్పై థ్రిల్లర్ సాధారణంగా ఐపీఎల్ మొదలైందంటే చాలు, సినిమా థియేటర్లు వెలవెలబోతాయి. పెద్ద హీరోల సినిమాలు కూడా ఐపీఎల్ సీజన్లో విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతుంటారు. కానీ, రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) మాత్రం ఇందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఐపీఎల్ ఫీవర్ ఒకవైపు ఉన్నప్పటికీ, థియేటర్ల వద్ద ఈ సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐపీఎల్ ఇంపాక్ట్ ఎంత? సాధారణంగా సాయంత్రం వేళల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల వల్ల థియేటర్ల ఆక్యుపెన్సీ 20-30% తగ్గుతుంటుంది. అయితే 'ధురంధర్ 2' విషయంలో ఈ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది. సెకండ్ వీకెండ్లో కూడా ఈ సినిమా శనివారం రూ. 62 కోట్ల నెట్, ఆదివారం రూ. 68 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్ లో కూడా ఒక సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇండియన్ సినీ చరిత్రలో అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన కంటెంట్, రణవీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను క్రికెట్ వదిలి థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాయి. మూడు గంటల కంటే ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ, ఆదిత్య ధర్ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తోంది. రికార్డుల సునామీ: 11 రోజుల్లోనే రూ. 1365 కోట్లు! ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్, మొదటి భాగం (Dhurandhar 1) సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను కేవలం 11 రోజుల్లోనే అధిగమించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1,365 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో ఇప్పటిదాకా రూ. 867 కోట్ల నెట్ రాబట్టింది. విదేశాల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాహుబలి 2 పేరిట ఉన్న పాత రికార్డులను సైతం తుడిచిపెట్టేసి, అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తెలుగులో ఈ సినిమా రెండు రోజులు ఆలస్యంగా విడుదలైనప్పటికీ, ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకి గట్టి పట్టు కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు సుమారు రూ. 25-30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా మరికొన్ని రోజుల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 సినిమాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని కూడా సవాల్ చేసేలా కనిపిస్తోంది. ఐపీఎల్ ఫైనల్స్ వచ్చేలోపు ధురంధర్ 2 మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Mar 30, 2026
Dhurandhar 2: 'ధురంధర్-2' కలెక్షన్ల సునామీ.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు!
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh), సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్(Aditya Dhar) కాంబినేషన్లో జియో స్టూడియోస్ నిర్మించిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ "ధురంధర్: ది రివెంజ్" బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. (Dhurandhar The Revenge) విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం, మొదటి ఎనిమిది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. జియో స్టూడియోస్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ.814 కోట్లు, ఓవర్సీస్ లో రూ.274 కోట్లతో.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1088 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఘనతతో ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా "ధురంధర్-2" నిలిచింది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం హిందీలోనే కాకుండా, సౌత్ మార్కెట్లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు వెర్షన్ ద్వారా దాదాపు ₹20 కోట్ల నెట్ కలెక్షన్స్ రావడం విశేషం. రణవీర్ సింగ్ యాక్షన్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే గూఢచారి కథాంశం కావడంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రస్తుత ఊపు చూస్తుంటే, ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫుల్ రన్ లో 'పుష్ప-2', 'బాహుబలి-2' స్థాయి వసూళ్ళు రాబట్టిన ఆశ్చర్యంలేదు.
Mar 27, 2026
Dhurandhar: ‘ధురంధర్’ను రిజెక్ట్ చేసిన స్టార్స్.. ముఖేష్ ఛాబ్రా సెన్సేషనల్ కామెంట్స్!
గతేడాది డిసెంబర్ లో విడుదలైన 'ధురంధర్'(Dhurandhar) మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో హీరోని మించి విలన్ పాత్రకి ఎక్కువ పేరొచ్చింది. ఇందులో విలన్ గా రెహమాన్ డెకాయిట్ అనే పాత్రలో అక్షయ్ ఖన్నా నటించాడు. సినిమా విడుదల సమయంలో ఆయన రోల్ కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే 'ధురంధర్'లో రెహమాన్ డెకాయిట్ పాత్ర కోసం మొదట పలువురు ప్రముఖ నటులను సంప్రదించగా వారందరూ రిజెక్ట్ చేశారట. అక్షయ్ ఖన్నా కూడా మొదట్లో ఈ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా రివీల్ చేయడం విశేషం. ముఖేష్ ఛాబ్రా మాట్లాడుతూ, రెహమాన్ డెకాయిట్ పాత్ర చాలా తీవ్రమైన, డార్క్ షేడ్స్ ఉన్నది. ఇలాంటి నెగటివ్ రోల్స్ చేయడానికి చాలా మంది నటులు ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందో లేదనే అనుమానం కూడా వారిలో ఉండేదని తెలిపారు. సినిమాలో మిగతా పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉండటంతో రెహమాన్ డెకాయిట్ పాత్ర హైలైట్ కాదని వారు భావించినట్లు చెప్పారు. ఈ పాత్రను చాలా మంది నటులు తిరస్కరించడంతో పాటు, చివరికి ఈ పాత్రను పోషించిన అక్షయ్ ఖన్నా కూడా మొదట ఒప్పుకోలేదని ముఖేష్ ఛాబ్రా తెలిపారు. కథ వినకముందే ఆయన “ఇలాంటి పాత్ర ఎందుకు?” అని సందేహం వ్యక్తం చేసినట్టు చెప్పారు. తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ చెప్పిన కథ విని, వెంటనే ఈ పాత్రకు అక్షయ్ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. సినిమా విడుదలైన తర్వాత రెహమాన్ డెకాయిట్ పాత్రకు ఊహించని రెస్పాన్స్ రావడంతో, ఆ పాత్రను రిజెక్ట్ చేసిన యాక్టర్స్ అంతా ఫీల్ అయ్యారని ముఖేష్ ఛాబ్రా చెప్పుకొచ్చారు. సరైన కథ, సరైన నటుడు ఉంటే నెగటివ్ రోల్ కూడా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపుతుందో 'రెహమాన్ డెకాయిట్' రోల్ ను ఉదాహరణగా చెప్పవచ్చు. కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ గా తెరకెక్కిన 'ధురంధర్: ది రివెంజ్'(Dhurandhar 2) మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఫుల్ రన్ లో రూ.1500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది. రూ.2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Mar 25, 2026పాకిస్థాన్లో భారత గూఢచారుల జాతర.. నెట్ఫ్లిక్స్లో టాప్ ట్రెండింగ్లో మన సినిమాలు!
- సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమాల క్రేజ్ - పాక్ నెట్ఫ్లిక్స్లో దుమ్ములేపుతున్న 'ధురందర్', 'బోర్డర్ 2'! - శత్రు దేశంలోనూ మన స్పై సినిమాలే టాప్ - నెట్ఫ్లిక్స్ చార్ట్స్లో ఇండియా మార్క్ భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతలు ఎన్ని ఉన్నా, వెండితెరపై మన హీరోలు చేసే సాహసాలను చూసేందుకు పాక్ ప్రేక్షకులు అమితాసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లోని నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ చార్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విశేషం ఏమిటంటే.. అక్కడ టాప్ 10 జాబితాలో ఏకంగా మూడు ఇండియన్ సినిమాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘ధురందర్’ పాకిస్థాన్ ఆడియన్స్ను ఊపేస్తోంది. ఇందులో రణవీర్ ఒక పవర్ఫుల్ అండర్ కవర్ ఏజెంట్గా కనిపించారు. కరాచీ అండర్ వరల్డ్ నెట్వర్క్ను ఛేదించే ఒక గూఢచారి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 52 రోజులుగా పాక్ నెట్ఫ్లిక్స్ టాప్-5లో కొనసాగుతుండటం విశేషం. మన దేశ భక్తిని చాటే సినిమా అక్కడి ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, క్లాసిక్ వార్ డ్రామా ‘బోర్డర్’కు సీక్వెల్గా వచ్చిన ‘బోర్డర్ 2’ సైతం అక్కడ సెన్సేషన్ సృష్టిస్తోంది. 1971 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం విడుదలైన వెంటనే పాక్ నెట్ఫ్లిక్స్ చార్ట్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. భారత సైనికుల పరాక్రమాన్ని చాటిచెప్పే కథ అయినప్పటికీ, ఆ మేకింగ్ మరియు యాక్షన్ సీక్వెన్స్లకు అక్కడి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. వీటితో పాటు ఆలియా భట్ నటించిన ‘రాజీ’ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ పాక్ ఆడియన్స్ను వదలడం లేదు. గత మూడు వారాలుగా ఈ చిత్రం టాప్-10 జాబితాలో కొనసాగుతోంది. ఒక భారతీయ గూఢచారి పాక్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లోకి కోడలిగా వెళ్లి సమాచారాన్ని ఎలా సేకరించింది అనే ఎమోషనల్ డ్రామా అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. కేవలం దేశభక్తి మాత్రమే కాకుండా, బాలీవుడ్ సినిమాల్లో ఉండే హై-వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ మరియు సాంకేతిక విలువలు అంతర్జాతీయ స్థాయిలో ఉండటమే ఈ ఆదరణకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కథ తమకు వ్యతిరేకంగా ఉన్నా, ఒక సినిమాగా దానిలోని ప్రతిభను పాక్ నెటిజన్లు ఆదరిస్తుండటం గమనార్హం. సోషల్ మీడియాలో కూడా దీనిపై భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా భారతీయ కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ స్పై థ్రిల్లర్స్ ఇదే రీతిలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతాయని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు సాధిస్తున్న వ్యూయర్ షిప్ చూస్తుంటే, ఇండియన్ సినిమాల రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
Mar 24, 2026ఆ వార్తల్లో నిజం లేదు.. కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘కపూర్’ ఖాందాన్ గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా లెజెండరీ నటుడు రాజ్ కపూర్ నిర్మించిన 'ఆర్కే స్టూడియో' ఒక కాలంలో బాలీవుడ్ చిత్రాలకు చిరునామాగా ఉండేది. అయితే, గత కొన్నాళ్లుగా ఈ ఐకానిక్ స్టూడియోను మళ్ళీ పునఃప్రారంభించ బోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఆర్కే స్టూడియోస్ పునరాగమనం గురించి కరీనా మాట్లాడుతూ.. "ఈ వార్త వినడానికి చాలా బాగుంది కానీ, ఇందులో వాస్తవం లేదు. మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కూడా దీనిపై చర్చ జరిగింది. అందరూ ముక్తకంఠంతో ఇది జరగడం లేదని స్పష్టం చేశారు. జనాలు ఆర్కే స్టూడియో మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవు" అని బెబో స్పష్టం చేశారు. ముఖ్యంగా తన సోదరుడు రణబీర్ కపూర్ దీనిని టేకోవర్ చేస్తాడని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం తన నటనపైనే పూర్తి దృష్టి సారించాడని కరీనా చెప్పుకొచ్చారు. "రణబీర్ ఒక అద్భుతమైన నటుడు. ప్రస్తుతానికి అతను కేవలం తన పాత్రలు, సినిమాల గురించే ఆలోచిస్తున్నాడు. ప్రొడక్షన్ లేదా స్టూడియో నిర్వహణ వంటి బాధ్యతలు తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడు. ఇది వినడానికి కొంచెం బాధగా అనిపించినా ఇదే నిజం. ఒకవేళ ఆర్కే స్టూడియోస్ మళ్ళీ మొదలవ్వాలంటే అది లోలో (కరిష్మా కపూర్) లేదా రణబీర్ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్షన్ లేదా ప్రొడక్షన్ ఆలోచనలు పెద్దగా లేవు" అని కరీనా మనసులో మాట బయటపెట్టారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 1948లో రాజ్ కపూర్ ఈ స్టూడియోను నిర్మించారు. ఆవామ్, శ్రీ 420, బాబీ వంటి క్లాసిక్ సినిమాలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. అయితే, 2017లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో స్టూడియోలోని అధిక భాగం కాలిపోయింది. ఆ తర్వాత స్టూడియో నిర్వహణ భారంగా మారడంతో కపూర్ కుటుంబం దానిని 2019లో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించింది. అప్పటి నుండి ఈ లెజెండరీ బ్యానర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్ తన కెరీర్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవలే 'సింగం అగైన్' చిత్రంతో పలకరించిన ఆమె, త్వరలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో 'దాయరా' అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఓటీటీలో ఒక మినీ సిరీస్ చేయాలని ఉందంటూ తన కోరికను బయట పెట్టారు. ఆర్కే స్టూడియోస్ రీఎంట్రీ వార్తలకు బ్రేక్ పడినా, కపూర్ వారసులు తమ నటనతో మాత్రం రాజ్ కపూర్ వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పక తప్పదు
Mar 24, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



