
'ది ఇండియా స్టోరీ'.. కాజల్ అగర్వాల్ సినిమాకి ఊహించని షాక్.!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన సరికొత్త సామాజిక కథా చిత్రం 'ది ఇండియా స్టోరీ'. సినీ ప్రియులు, కాజల్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్రం జూలై 24న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. హిందీ వెర్షన్ మాత్రం అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమాజంలో తీవ్ర చర్చకు దారితీసే ఒక అత్యంత కీలకమైన సామాజిక అంశాన్ని నేపధ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతోంది అనే చేదు నిజాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్యం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా ఉంటుందని మేకర్స్ మొదటినుంచీ చెబుతున్నారు. ఈ సందేశాత్మక చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి మెప్పించబోతున్నారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తుండగా, సాగర్ బి.షిండే ఎంతో నిర్మించారు. అయితే డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన సెన్సార్ క్లియరెన్స్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడమే ఈ హఠాత్ వాయిదాకు కారణమని తెలుస్తోంది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసుకుని తెలుగు, తమిళ భాషల్లో కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. Kajal Aggarwal, The India Story, Postponed
Jul 23, 2026 6:23PM.webp)
సుప్రీంకోర్టులో బండ్ల గణేష్కు గట్టి షాక్.. ఆస్తి వేలం కేసులో అసలు నిజాలివే.!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్కు ఆస్తి వేలం వివాదంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ షేక్పేట ప్రాంతంలో ఉన్న ఆస్తిని బ్యాంక్ వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే యథాతథంగా అమల్లో ఉండనుంది. ఈ వివాదానికి ప్రధాన మూలం శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్కు సంబంధించిన బ్యాంక్ రుణాలు. ఆ సంస్థ తీసుకున్న రుణాలకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు హామీదారులుగా వ్యవహరించారు. అయితే కాలక్రమేణా సదరు సంస్థ రుణ బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద 2019వ సంవత్సరంలోనే బ్యాంక్ అధికారులు హామీదారుల ఆస్తిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2022లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ ఆస్తిని సుమారు రూ. 8.51 కోట్లకు యూనియన్ బ్యాంక్ విక్రయించింది. బ్యాంక్ జరిపిన ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేష్ డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డీఆర్టీ మొదట బ్యాంక్ చేపట్టిన వేలాన్ని రద్దు చేస్తూ బండ్ల గణేష్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ యూనియన్ బ్యాంక్ ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ సమయంలో బండ్ల గణేష్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ, సదరు కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో దివాళా పరిష్కార ప్రక్రియ (Insolvency) కొనసాగుతున్నందున వేలం ఎంతమాత్రం చెల్లదని పేర్కొన్నారు. అయితే బ్యాంక్ తరఫు లాయర్లు మాత్రం వేలం వేసిన ఆస్తి కంపెనీది కాదని, రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చిన వ్యక్తుల సొంత ఆస్తి అని, కాబట్టి సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంక్ చర్యలు పూర్తిగా చట్టబద్ధమేనని గట్టిగా వాదించారు. హైకోర్టు బ్యాంక్ వాదనతో ఏకీభవించి డీఆర్టీ తీర్పును రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ పరిణామంతో తన ఆస్తులన్నీ పోయాయంటూ వస్తున్న పుకార్లపై బండ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు. "కొందరు నా మొత్తం ఆస్తి పోయిందని అపోహ పడుతున్నారు, అది పూర్తిగా అవాస్తవం. ఈ కేసు కేవలం షేక్పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీకి మాత్రమే పరిమితమైనది. 2022లో రూ. 8.51 కోట్లకు యూనియన్ బ్యాంక్ అమ్మిన ఆ ఒక్క ఆస్తి విక్రయాన్నే నేను చట్టపరంగా ప్రశ్నించాను" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును తాను సంపూర్ణంగా గౌరవిస్తున్నానని, భారతీయ న్యాయవ్యవస్థపై తనకు పరిపూర్ణ విశ్వాసం ఉందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. Bandla Ganesh, Property Auction, Supreme Court, Verdict
Jul 23, 2026 6:08PM
Pawan Kalyan vs vijay: పవన్ కళ్యాణ్ ని దాటలేకపోయిన విజయ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇళయ దళపతి విజయ్(Vijay).. సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తమదైన ఆధిపత్యం చెలాయించే హీరోలు. కట్ అవుట్ కనపడితే చాలు కోట్లు కురవాల్సిందే. అభిమాన ఘనానికైతే లెక్కే లేదు.ఇప్పుడు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పవన్ నుంచి గత ఏడాది వచ్చిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG) థియేటర్లలో సాధించిన సంచలన ఓపెనింగ్స్ అందరినీ విస్తుపోయేలా చేశాయి.వరల్డ్ వైడ్ గా మొదటి రోజూ 154 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ టాప్ 10 ఇండియన్ ఓపినింగ్ కలెక్షన్స్ జాబితాలో నిలిచింది. నార్త్ అమెరికా ప్రీమియర్ల ద్వారానే ఏకంగా $3.13 మిలియన్ల కంటే ఎక్కువ రాబట్టడం పవన్ కళ్యాణ్ మాస్ స్టామినాకి నిదర్శనం. ఇండియా వైడ్ గా 90 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డు పుటలకెక్కింది. Also read: జననాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ.. తెలుగు ప్రేక్షకులు ఆ వైపే ఎందుకు! విజయ్ స్టిల్ జన నాయగన్(జననాయకుడు) తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. దీంతో మొదటి రోజు 'ఓజీ' నెలకొల్పిన 154 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్ల మార్కుని 'జన నాయగన్' దాటగలదా లేదా?అనే చర్చలు మొదలయ్యాయి. మూవీ అయితే కొన్ని ఏరియాస్ లో డిజాస్టర్, కొన్ని ఏరియాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.ట్రేడ్ వర్గాల ముందస్తు అంచనాల ప్రకారం 'జన నాయగన్' తమిళనాడు, కేరళ, కర్ణాటక ఓవర్సీస్ మార్కెట్లలో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. దీంతో తొలిరోజే గ్లోబల్గా 100 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ 'ఓజీ' నెలకొల్పిన రూ. 154 కోట్ల రికార్డును అందుకోవాలంటే 'జన నాయగన్' తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా మార్కెట్లో ఊహించని రేంజ్లో రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీ, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఓవర్సీస్ ప్రీమియర్స్లో భారీ వసూళ్లు రాబడితే 'ఓజీ' రికార్డు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కానీ ఆ ప్రమాదం లేదనే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. og, pawan kalyan, vijaythalapathy, vijay, jana nayagan
Jul 23, 2026 6:04PM
జననాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ.. తెలుగు ప్రేక్షకులు ఆ వైపే ఎందుకు!
ఈ రోజు థియేటర్లలో తిష్ట వేసిన దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో 'జననాయకుడు'కి ఆశించిన స్థాయిలో టాక్ రావడం లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వన్ మాన్ షో సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'నే మళ్ళీ తెరకెక్కించడంతో మన దగ్గర వర్క్ అవుట్ కాదని, తమిళనాడులో వర్క్ అవుట్ అవుతుందనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' కి అనూహ్యమైన ప్లస్ పాయింట్గా మారింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా చేయగా 'బేబీ', 'కలర్ ఫోటో' చిత్రాల దిగ్గజ నిర్మాత సాయి రాజేష్ కథ, స్క్రీన్ప్లే అందిస్తూ స్వయంగా నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి కట్స్ లేకుండా,పూర్తి పాజిటివ్ వైబ్స్తో థియేటర్లలోకి అడుగుపెడుతోంది. సరిగ్గా ఈ సమయంలో పెద్ద సినిమా అయిన 'జన నాయకుడు' కి ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో, యూత్ఫుల్ కంటెంట్ను ఇష్టపడే ప్రేక్షకులు, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలని ఆదరించే సినీ ప్రియులు ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్స్ కి పోటెత్తుతారని అంటున్నారు. Also read: 'జననాయగన్' కి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!..మరి మిగతా వాళ్ళకి దీంతో పేయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ పెట్టిన నమ్మకం నూటికి నూరు శాతం నిజమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పోటీలో ఇతర పెద్ద సినిమాలేవీ లేకపోవడం, జన నాయకుడు ప్రభావం తగ్గడం మూలంగా ఈ వారం ఆడియెన్స్ కి 'చెన్నై లవ్ స్టోరీ' ఒకే ఒక్క బెస్ట్ ఛాయిస్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సపోర్ట్ ఇవ్వడం, మణిశర్మ అందించిన అద్భుతమైన మెలోడీలు సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చాయి. 'చెన్నై లవ్ స్టోరీ' కనుక ప్రేక్షకుల హృదయాలని తాకితే, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్గా నిలవడం ఖాయం. కాకపోతే కంటెంట్ బాగుంటేనే సదరు విజయం లాభాలు ఇచ్చే దాకా వెళ్ళిపోని అతిధిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. vijay, jana nayakudu, chennai love story, kiran abbavaram
Jul 23, 2026 5:32PM'టాక్సిక్' మూవీ 'పెద్దలకు' మాత్రమే?.. నిర్మాత వెంకట్ సంచలన ప్రకటన.!
పాన్ ఇండియా సూపర్స్టార్ యష్ 'కెజిఎఫ్' ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద నెలకొల్పిన సంచలనం అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'టాక్సిక్'. ఈ చిత్రానికి 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (A Fairy Tale for Grown-Ups) అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ను ఖరారు చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ తారలు అత్యంత కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. అయితే ఈ సినిమా కంటెంట్, కథాంశం గురించి సోషల్ మీడియాలో నిరంతరం రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 'టాక్సిక్' సినిమా ఎలాంటి కేటగిరీకి చెందుతుందనే దానిపై నిర్మాత వెంకట్ కె. నారాయణ్ పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చారు. ఇటీవల 'జన నాయగన్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నిర్మాత కీలక విషయాలను వెల్లడించారు. 'టాక్సిక్' చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే (Only for Grown-Ups) అని ఆయన బహిరంగంగా స్పష్టం చేశారు. మేము ఈ విషయాన్ని ఎక్కడా దాచలేదని, సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రోజే 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అని స్పష్టమైన ట్యాగ్ లైన్ ద్వారా ప్రేక్షకులకు ముందే క్లారిటీ ఇచ్చామని గుర్తుచేశారు. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్తో పాటు కాస్త ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్లో చూపించిన కార్ సీన్, 'తబాహీ' పాటలో యష్, కియారా అద్వానీ మధ్య వచ్చే కెమిస్ట్రీ, అలాగే 'మనసాగదే' మెలోడీ సాంగ్లో యష్, తారా సుతారియా కనిపించిన బాత్టబ్ సీన్ నెటిజన్లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పోస్టర్లలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన తీరు సినిమాలోని బోల్డ్ అండ్ రా ఎలిమెంట్స్కు నిదర్శనంగా నిలిచింది. సినిమా ప్రమోషన్ల వ్యూహం గురించి నిర్మాత మాట్లాడూతూ, ఇప్పటివరకు మొత్తం 3 విభిన్నమైన టీజర్లు, 2 అదిరిపోయే పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. మొదటి టీజర్ ద్వారా కథలోని మేకింగ్ క్రియేటివిటీని చూపించగా, రెండో టీజర్తో సినిమా యొక్క భారీ స్కేల్, విజువల్స్ స్థాయిని పరిచయం చేశామన్నారు. ఇక మూడో టీజర్లో సినిమాలో నటించిన పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్లను రివీల్ చేశామని చెప్పారు. ప్రత్యేకంగా ఆయా ఏజ్ గ్రూప్ ప్రేక్షకులకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో ప్రెజెంటేషన్, క్యారెక్టర్ స్టైలింగ్ డిజైన్ చేసినట్లు వెల్లడించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ్, హీరో యష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్గా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కథనం, మేకింగ్ పరంగా సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా రూపొందుతున్న ఈ డార్క్ ఏ-సర్టిఫైడ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. Yash, Toxic Movie, Toxic A Fairy Tale for Grown Ups
Jul 23, 2026 5:24PM
'జననాయగన్' కి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!..మరి మిగతా వాళ్ళకి
వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ దగ్గర జన నాయగన్(జన నాయకుడు) జోరు చూస్తుంటే తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందేమో అనిపిస్తుంది. తమిళనాడులో మెజారిటీ రివ్యూస్ మూవీ పర్లేదని చెప్తున్నా తెలుగు రివ్యూస్ మాత్రం కొంచం నెగిటివ్ గా వస్తున్నాయి. ఇందుకు కారణం బాలకృష్ణ వన్ మాన్ షో భగవంత్ కేసరి కథతోనే జన నాయకుడు తెరకెక్కడం. కాకపోతే విజయ్ నటనకి మాత్రం మంచి పేరు వస్తుంది. జన నాయగన్ కోసం విజయ్తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న రెమ్యూనరేషన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. విజయ్(Vijay)220 కోట్ల నుండి 250 కోట్ల వరకు భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు టాక్. మరి ఇదే నిజమైతే భారతదేశ సినీ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్న అతికొద్దిమంది అగ్ర కథానాయకులలో విజయ్ అగ్రస్థానంలోనిలిచినట్టే. పూజా హెగ్డే 6 కోట్లు. విలన్ గా చేసిన బాబీ డియోల్ 5 కోట్లు, ప్రకాష్ రాజ్ 5 కోట్లు ప్రియమణి 3 కోట్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 3 కోట్లు, నరేన్ 2.5 కోట్లు పారితోషికం పొందినట్లు సమాచారం. మమితా బైజూ 1 కోటి వరకు తీసుకున్నారని చెప్తున్నారు. also read: జననాయగన్ ని త్రిష ఏ థియేటర్ లో చూసిందంటే.. అక్కడే ఎందుకు! తెర వెనక ఉన్న వారి విషయానికి వస్తే దర్శకుడు హెచ్. వినోత్ తన కెరీర్లోనే అత్యధికంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ పొంది రికార్డు సృష్టించాడని చెప్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ 13 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ భారీ వ్యయానికి తగ్గట్టే 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో ఊచకోత కోసింది. భారతదేశంలో ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ సాధించగా, ఓవర్సీస్ లో ప్రి సేల్స్ 15 కోట్లు దాటాయి. తొలిరోజే ఇండియాలో . 60 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని, తొలి వీకెండ్ నాటికి ఇండియాలో 150-180 కోట్లు, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ మునుపటి ఇండస్ట్రీ హిట్స్ అయిన 'లియో' (. 606 కోట్లు), 'గోట్ (GOAT)' (. 458 కోట్లు) రికార్డులను తిరగరాస్తూ 'జన నాయగన్' సరికొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి! jana nayagan, jana nayakudu, vijay, pooja hegde, h vinoth, mamitha baiju
Jul 23, 2026 5:02PM
'చెన్నై లవ్ స్టోరీ' షాకింగ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.?
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన సరికొత్త ప్రేమకథా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. 'కలర్ ఫోటో', 'బేబీ' వంటి సంచలన విజయాల తర్వాత నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం, ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. డిఫరెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్కు ముందే ఈ చిత్రం బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాన్ని సుమారు రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. మేకర్స్ అనుసరించిన పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీ, పాటలకు లభించిన ఆదరణ కారణంగా ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెటింది. ఈ చిత్రం సాధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే, ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.15 కోట్ల మేర భారీ ఆఫర్ దక్కగా, ఆడియో రైట్స్ రూపంలో మరో రూ.5 కోట్లు సమకూరాయి. అంటే కేవలం నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే మేకర్స్కు మొత్తంగా రూ.20 కోట్ల ఆదాయం లభించింది. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.15 కోట్ల మేర జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.35 కోట్లకు చేరుకుని, నిర్మాతలు విడుదల కంటే ముందే సుమారు రూ.20 కోట్ల భారీ ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టేలా చేసింది. థియేట్రికల్ బిజినెస్ రూ.15 కోట్లుగా నమోదవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ నాటికే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అధిగమించి క్లీన్ హిట్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Kiran Abbavaram, Chennai Love Story, Business, Box Office
Jul 23, 2026 4:50PMమూవీ లవర్స్కి గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్లో సైకలాజికల్ థ్రిల్లర్.!
డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ప్రతి వారం కొత్త రకం చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్, డ్రామా జోనర్లకు ఓటీటీ వేదికలపై విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో తమిళ చిత్రసీమ నుంచి వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను మైమరిపించిన ఒక విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఆ సినిమా పేరు 'ఈగో రామన్'. తమిళంలో మంచి సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 24, 2026 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుండటంతో ఓటీటీ ప్రియులలో, థ్రిల్లర్ ప్రేమికులలో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు గణేషన్ నాచిముత్తు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఈగో రామన్' చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సిబి చంద్రన్ కథానాయకుడిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయనతో పాటు ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్, చేరన్ రాజ్ మరియు కీర్తన శ్రీకుమార్ ముఖ్య పాత్రలలో నటించి మెప్పించారు. ఈ కథంతా 'అరివు' అనే ఒక మధ్యతరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పంతో టిఎన్పిఎస్సి (TNPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న అరివుకు, అతని తల్లి ఎంతో ప్రేమతో ఒక యామహా బైక్ను కానుకగా ఇస్తుంది. ఆ బైక్ అరివు జీవితంలో కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అతని ఆశయానికి మరియు అమ్మ ప్రేమకు నిదర్శనంగా మారుతుంది. అయితే ఊహించని విధంగా వారి కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ బైక్ను కోల్పోవాల్సి వస్తుంది. తన ప్రాణంగా భావించే బైక్ను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని అరివు చేసే తీవ్ర ప్రయత్నాలే ఈ కథకు ప్రధాన మలుపు. బైక్ వేటలో సాగే అరివు ప్రయాణం అనుకోకుండా ఒక ప్రమాదకరమైన హంతకుడితో ముడిపడుతుంది. మరోవైపు, తనకు మార్గదర్శకుడిగా ఉన్న గురువుతో తలెత్తే ఇగో సంఘర్షణలు, అహంకారపూరిత సవాళ్లు అరివు జీవితాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయి. ఒక సాధారణ యువకుడు తన ఆత్మగౌరవాన్ని, ఆశయాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం, ఈ క్రమంలో వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు ఉత్కంఠను పంచుతాయి. సినిమాలోని నిర్మాణ విలువలు, పాత్రల మధ్య సాగే మానసిక ఘర్షణ, ఉత్కంఠభరితమైన స్క్రీన్ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. దాదాపు 2 గంటల పాటు సాగే ఈ ఉత్కంఠభరిత ప్రయాణం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సైకలాజికల్ డ్రామా, ఓటీటీలో సైతం విశేషమైన వ్యూవర్షిప్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై 24, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న 'ఈగో రామన్' చిత్రాన్ని మీ ఓటీటీ వాచ్లిస్ట్లో చేర్చుకోవడం అస్సలు మర్చిపోకండి.
Jul 23, 2026 4:15PM
'జననాయకుడు' ని త్రిష ఏ థియేటర్ లో చూసిందంటే.. అక్కడే ఎందుకు!
ఇళయ దళపతి విజయ్(VIjay)తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి థియేటర్స్ లో 'జన నాయగన్'(తెలుగు జననాయకుడు)తో సందడి చేస్తున్నాడు. సెన్సార్ వివాదాల తలెత్తిన ఏడూ నెలల తర్వాత రిలీజ్ అవ్వడంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. విజయ్తో పలు హిట్ చిత్రాల్లో జత కట్టిన స్టార్ హీరోయిన్ త్రిష(Trisha)చెన్నైలోని ప్రసిద్ధ రోహిణి థియేటర్కి జన నాయగన్ చూడటానికి వచ్చింది. వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఎంతో సింపుల్గా థియేటర్లోకి అడుగుపెట్టిన త్రిషని చూసి అక్కడున్న వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా ఈలలు, కేరింతలతో థియేటర్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. నటుడిగా విజయ్ చివరి సినిమాని మొదటి రోజే బిగ్ స్క్రీన్పై చూసేందుకు త్రిష స్వయంగా రావడం వారిద్దరి మధ్య ఉన్న అపారమైన స్నేహ బంధానికి, పరస్పర గౌరవానికి అద్దం పడుతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికల్లో క్ష వైరల్గా మారాయి. Also read: జననాయకుడులో ప్రకాష్ రాజ్ రోల్.. ఆ పొలిటికల్ లీడర్దేనా? విజయ్, త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి ఆ ఇద్దరు ఇంతవరకు ఓపెన్ గా చెప్పింది లేదు. కానీ సోషల్ మీడియాలో ఆ ఇద్దరి బంధంపై పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. విజయ్ భార్య సైతం విజయ్ ఒక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని చెప్పినప్పడు త్రిష పేరు వినపడింది. ఆ వెంటనే త్రిష, విజయ్ కలిసి ఒక ఫంక్షన్ కి కూడా హాజరయ్యారు. త్రిష మాత్రం ఇటీవల మాట్లాడుతూ 'నచ్చిన వ్యక్తి కనపడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. vijay, trisha, jana nayaganm rohini theater, h vinoth
Jul 23, 2026 4:08PM
రాజమౌళి, మహేష్ బాబు కోసం 'వారణాసి' టైటిల్ ఇచ్చేసిన డైరెక్టర్ సుబ్బారెడ్డి.!
దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన 'వారణాసి' సినిమా టైటిల్ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు సుబ్బారెడ్డి కలిసి ఇంటర్వ్యూలో చర్చించారు. దర్శకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. "2023లో 'వారణాసి' టైటిల్ను తన బ్యానర్పై రిజిస్టర్ చేసుకుని ఆ కథపై పని ప్రారంభించానని తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న ఈ భారీ చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు. టైటిల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంగా చూడలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఆలోచన తనకు రాలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. "టైటిల్ అనేది నాకు ఒక ఎమోషన్. దాన్ని అమ్మడానికి కాదు, మంచి సినిమా కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాను" అని పేర్కొన్నారు. దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. మొదట సుబ్బారెడ్డి ఆ టైటిల్పై ఎంతో భావోద్వేగంతో ఉన్నారని, అందుకే వెంటనే మాట్లాడలేదన్నారు. తరువాత రాజమౌళి, కేఎల్ నారాయణ వంటి ప్రముఖుల చిత్రం కోసం టైటిల్ ఇస్తే ఇండస్ట్రీకి మంచి సందేశం వెళ్తుందని వివరించగా, సుబ్బారెడ్డి వెంటనే అంగీకరించారని తెలిపారు. టైటిళ్లను డబ్బు కోసం కాకుండా, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరస్పరం సహకరించుకోవాలని ఈ నిర్ణయం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని వీరశంకర్ అభిప్రాయపడ్డారు. సుబ్బారెడ్డి చేసిన ఈ నిర్ణయం భవిష్యత్లో ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయరచయిత చంద్రబోస్లకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'వారణాసి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. Varanasi Title, SS Rajamouli, Mahesh Babu, Tollywood
Jul 23, 2026 3:40PM
జననాయకుడులో ప్రకాష్ రాజ్ రోల్.. ఆ పొలిటికల్ లీడర్దేనా?
ఆలస్యం అమృతం..విషం అనే సామెతని మార్చివేసి ఆలస్యం అమృతం.. మహదానందం అనే రీతిలో అభిమానులు సంబరపడిపోయేలా ఇళయ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ 'జననాయగన్(తెలుగు జన నాయకుడు) తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. విజయ్ నుంచి వస్తున్న లాస్ట్ మూవీ కావడంతో అభిమానులు, మూవీ లవర్స్ ప్రేమ, భావోద్వేగంతో థియేటర్స్ లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ‘రోజా రంగస్వామి’ అనే ఒక సీనియర్ పొలిటీషియన్ క్యారక్టర్ లో కనిపించాడు. రెఫినిక్స్ డ్రామాలో ఆయన మాట్లాడే పదునైన సంభాషణలు, కథలోని క్యారక్టర్ ల శైలి చూసిన సగటు ప్రేక్షకుడు, తమిళనాడు రాజకీయ చరిత్రలో నిలిచిన ఏదో ఒక ప్రముఖ రాజకీయనాయకుడి ఛాయలు ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పే ఒక ముఖ్యమైన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "దశాబ్దాలుగా రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు వంతులవారీగా అధికారాన్ని పంచుకుంటూ దోచుకుంటుంటే, మాలాంటి మూడో శక్తి ఎలా ప్రభావం చూపగలదు?" అని ప్రకాష్ రాజ్ పాత్ర ప్రశ్నిస్తుంది. ఈ ఒక్క సంభాషణే తమిళనాడు రాజకీయాల్లోని డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) ద్వంద్వ ప్రభావాన్ని, అలాగే థర్డ్ ఫ్రంట్ లేదా కొత్త రాజకీయ శక్తులు పడే తపనను కళ్లకు కట్టినట్లు చూపుతోంది. దీంతో ఈ రోల్ తమిళనాడులోని ప్రముఖ ద్రవిడ నాయకులలో ఒకరిని ఉద్దేశించి డిజైన్ చేశారా లేదా తమిళనాడు పొలిటికల్ సిస్టమ్లోని కుళ్ళును ఎత్తిచూపడానికి రూపొందించిన ఒక काल्पनिक పాత్ర మాత్రమేనా అనే దానిపై సోషల్ మీడియాలో హోరాహోరీ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక విజయ్, ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న వ్యక్తిగత, రాజకీయాభిప్రాయాల వైరుధ్యం ఈ రూమర్లకు మరింత ఉప్పు, కారం దట్టించింది. నిజ జీవితంలో ప్రకాష్ రాజ్, విజయ్ రాజకీయాల్లోకి రావడంపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. "సినిమాల్లో ముఖ్యమంత్రిగా నటించడం వేరు, నిజ జీవితంలో ప్రజల కోసం పోరాడటం వేరు" అని ప్రకాష్ రాజ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీని ప్రశ్నించారు. అయితే, ఎంతటి తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, షూటింగ్ సెట్లో మాత్రం విజయ్ని ‘చెల్లం’ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటూ ఇద్దరూ మంచి మిత్రులుగా పనిచేశారని దర్శకుడు హెచ్. వినోద్ ఇటీవలే ఇంటర్వ్యూలలో వెల్లడించారు. Also read: జననాయకుడు హైలెట్స్ ఇవే.. మరి మూవీ ఎలా ఉందో! ఈ 183 నిమిషాల నిడివి గల పొలిటికల్ ఎంటర్టైనర్లో విజయ్ 'తళపతి వెట్రి కొండన్' (TVK) అనే ఐపీఎస్ ఆఫీసర్గా మరియు పవర్ ఫుల్ ప్రిజనర్గా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలో ఎమ్.జి.ఆర్ ఉపయోగించిన విప్తో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ను విజయ్ కొట్టే సీన్ తమిళనాడు రాజకీయాల్లో ఏఐఏడీఎంకే వారసత్వాన్ని సొంతం చేసుకునే సంకేతంగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం 'రోజా రంగస్వామి' పాత్ర ఏ ఒక్క వ్యక్తికో పరిమితం కాదని, తమిళనాడు రాజకీయాల్లో వేళ్లూనుకున్న అవినీతి వ్యవస్థకు అది ఒక ప్రతిరూపమని స్పష్టం చేస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజే దాదాపు 90% కి పైగా థియేటర్లలో హౌస్ఫుల్ కాన్వర్సేషన్లు నడుస్తుండటంతో ప్రకాష్ రాజ్ పాత్రపై మొదలైన ఈ సస్పెన్స్, రీసెర్చ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. jana nayakudu, vijay, h vinoth, pooja hegde, prakash raj
Jul 23, 2026 3:33PM
జన నాయకుడు హైలెట్స్ ఇవే.. మరి మూవీ ఎలా ఉందో!
ఇళయదళపతి విజయ్(Vijay)ఈ రోజు జననాయగన్ అలియాస్ 'జన నాయకుడు'(Jana nayakudu)గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. తెల్లవారుజాము నుంచే షోస్ పడటంతో థియేటర్స్ అన్ని విజయ్ అభిమానులతో, సినీ ప్రేమికులతో కళకళలాడుతున్నాయి. మూవీ చూసిన వాళ్లంతా కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం. 1 . తండ్రిగా, పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వన్ మాన్ షో 2 . మమిత భైజు, విజయ్ మధ్య వచ్చిన సీన్స్ 3 . ప్రకాష్ రాజ్ క్యారక్టరయిజేషన్ 4 . బాబీడియోల్ క్యారక్టరయిజేషన్ 5 . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 6 . ఫొటోగ్రఫీ 7 . నిర్మాణ విలువలు 8 . దర్శకత్వ ప్రతిభ 9 . సెకండ్ హాఫ్ 10 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ also read: jana nayagan Movie Review In Telugu: జన నాయకుడు మూవీ రివ్యూ జన నాయకుడు చూసిన తెలుగు ప్రేక్షకులు మీడియాతో మాట్లాడుతు 'బాలకృష్ణ' వన్ మాన్ షో భగవంత్ కేసరి లా ఉండటం కాదు, భగవంత్ కేసరి కథనే మళ్ళీ తెరకెక్కించారు. కాకపోతే పొలిటికల్ అంశాలు, తీవ్రవాదం అనే అంశాలు యాడ్ చేసారు. విజయ్ పెర్ ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉందని అంటున్నారు.
Jul 23, 2026 3:03PMరాజభవనం VS ప్రేతాత్మలు: తెలుగు ఆడియన్స్ని థ్రిల్ చేస్తున్న కొరియన్ సిరీస్.!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వేదికలపై కొరియన్ డార్క్ ఫాంటసీ, హారర్ డ్రామాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. కొరియన్ కథల్లోని సహజత్వం, ఆకట్టుకునే గ్రిప్పింగ్ టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 17 జులై 2026 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త కొరియన్ డార్క్ ఫాంటసీ వెబ్ సిరీస్ 'ది ఈస్ట్ ప్యాలెస్' (The East Palace). నామ్ జూ హ్యూక్ (Nam Joo-Hyuk) ప్రధాన పాత్రలో నటిస్తూ, చోయ్ జంగ్-క్యూ దర్శకత్వంలో రూపొందిన ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్లింగ్ సిరీస్కి ప్రముఖ క్రిటిక్స్ 5కి 3.0 రేటింగ్ ఇచ్చారు. రాజభవనం, వారసత్వ పోరాటాలు, క్షుద్ర శక్తులు మరియు దెయ్యాల కలబోతగా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం. ఈ కథ అంతా ఒక అందమైన ప్రాచీన రాజభవనం మరియు దాన్ని పరిపాలించే ప్రిన్స్ 'క్రౌన్' చుట్టూ తిరుగుతుంది. ఈ రాజభవనంలో గతంలో పాలించిన రాజుకు నలుగురు వారసులు ఉండగా, వారు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తారు. ఆ విషాదకర సంఘటనలు జరిగి సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ అదే దారుణమైన మరణాల పరంపర పునరావృతమవుతుంది. రాజా క్రౌన్ ముగ్గురు కుమారులు దారుణంగా చనిపోగా, నాలుగో కుమారుడు అంటే ప్రస్తుత యువరాజు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. ప్యాలెస్లోని కోనేటి దెయ్యం లేదా పిశాచిగా మారిన ఒక రాజనర్తకి ఆత్మ ఈ వరుస మరణాలకు కారణమని అందరూ నమ్ముతుంటారు. చిన్నతనం నుంచే అతీంద్రియ శక్తులు కలిగిన 'గు-చోన్' (నామ్ జూ హ్యూక్) అనే సాధారణ యువకుడికి దుష్టశక్తులను, ప్రేతాత్మలను ఎదుర్కొనే ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. తన నాలుగో కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి రాజు క్రౌన్ గు-చోన్ను రహస్యంగా పిలిపిస్తాడు. కోనేటి దెయ్యాన్ని అంతం చేసి యువరాజును బతికించగలిగితే కోరిన బహుమానం ఇస్తానని చెబుతాడు. అయితే అసలు విషయాన్ని రహస్యంగా ఉంచి, గు-చోన్ను ఒక 'వాస్తు నిపుణుడు'గా ప్యాలెస్లోకి పంపిస్తారు. అదే సమయంలో ప్యాలెస్కి దూరంగా పెరిగిన రాజు కూతురు యువరాణి (రో యున్-సో)ని పిలిపించి, గు-చోన్కు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ అతని కదలికలను నిఘా వేయమని ఆదేశిస్తాడు. ప్యాలెస్లో అడుగుపెట్టిన గు-చోన్, యువరాణి ఇద్దరూ కలిసి ప్యాలెస్లోని ప్రతి మూలను పరిశీలించడం ప్రారంభిస్తారు. పరిశోధనలో భాగంగా రాజభవనంలోని ఒక రహస్య కోనేరు, ఉప్పుగని ప్రాంతంలో దుష్ట ప్రేతాత్మల సంచారం ఎక్కువగా ఉన్నట్లు వారు గమనిస్తారు. అలాగే మంత్రించిన కుండల వెనుక ఏదో పెద్ద మర్మం దాగి ఉందని గు-చోన్ గ్రహిస్తాడు. యువరాజు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఆ పిశాచి మూలాలను వెతికేందుకు గు-చోన్ ప్రయత్నిస్తుంటే, అసలు రాజభవనంలో తన తల్లిని హత్య చేసిన అసలు నేరస్థుడెవరో తెలుసుకోవడానికి యువరాణి తనదైన శైలిలో అన్వేషణ సాగిస్తుంది. ఈ భయంకరమైన రాజభవనంలోని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు ఎవరూ ప్రాణాలతో బయటపడరనే భయంకరమైన ప్రచారం రాజ్యంలో బలంగా ప్రచారంలో ఉంటుంది. దాంతో తాను వచ్చిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రాణాలతో బయటపడాలని గు-చోన్ భావిస్తాడు. కానీ తన తల్లి హత్య వెనుక ఉన్న నిజాలు తేలేవరకు ప్యాలెస్ వదలనని యువరాణి పట్టుబడుతుంది. వీరిద్దరి శోధనకు రాజమాత (జంగ్ యంగ్-నామ్) నిరంతరం అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పిశాచిగా మారిన రాజనర్తకి ఎవరు, ఆ ప్యాలెస్ తూర్పు భాగంలో దాగి ఉన్న అసలు రహస్యమేమిటి అనే అంశాలు కథను ఊహించని మలుపులు తిప్పుతాయి. సాధారణంగా రాజులు, రాజభవనాల నేపథ్యం అంటే అధికారం కోసం వారసత్వ పోరాటాలు, క్షుద్ర పూజలు సహజమే. కానీ ఈ సిరీస్లో జానపద కథకు హారర్ మరియు ఫాంటసీ అంశాలను జోడించి నెక్స్ట్ లెవెల్లో రూపొందించారు. నైట్ ఎఫెక్ట్స్, భారీ విజువల్స్, అద్భుతమైన సెట్స్ సిరీస్కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కథలోని 4వ ఎపిసోడ్ నాటికి అసలు కథ ముగిసిపోయిందేమో అనిపించినప్పటికీ, అక్కడి నుంచే కథ మరొక అనూహ్యమైన ట్విస్ట్ తీసుకుని ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ప్రేతాత్మలతో జరిగే యుద్ధ సన్నివేశాలు, చోయ్ జంగ్-క్యూ దర్శకత్వ ప్రతిభ, జంగ్ సే-రిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ను తప్పక చూడాల్సిన డార్క్ ఫాంటసీగా తీర్చిదిద్దాయి.
Jul 23, 2026 2:04PM
jana nayagan Movie Review In Telugu: జననాయకుడు మూవీ రివ్యూ
-సినిమా పేరు: జన నాయగన్ -నటీనటులు: జోసఫ్ విజయ్, పూజా హెగ్డే, మమితా భైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నాజర్, సునీల్ తదితరులు -సినిమాటోగ్రఫీ:సత్యన్ సూర్యన్ -ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్ -మ్యూజిక్: అనిరుద్ -నిర్మాత: వెంకట్ కె నారాయణ -బ్యానర్: కేవిఎన్ ప్రొడక్షన్స్ -రచన,దర్శకత్వం: హెచ్ వినోత్. -రిలీజ్ డేట్ : జులై 23 ,2026 ఎట్టకేలకు ఈ రోజు దళపతి జోసఫ్ విజయ్(Vijay)'జననాయకుడు'(Jana Nayakudu)గా థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. దీంతో అభిమానులు, మూవీ లవర్స్ థియేటర్స్ కి పోటెత్తారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఒక ఊరి గ్రామప్రజలు గత ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి భయపడుతూ ఉంటారు. దళపతి వెట్రి కొండన్( విజయ్) నాలుగు పదుల వయసు దాటిన సగటు వ్యక్తి. ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కూతురు విజ్జి(మమితా బైజు)ని సొంత కూతురులా పెంచుతుంటాడు. విజ్జికి భయంతో పాటు ఆయాసం లాంటి హెల్త్ ప్రాబ్లెమ్ ఉంటాయి. కానీ విజ్జిని ఆర్మీ ఆఫీసర్ ని చెయ్యాలని వెట్రి ప్రయత్నిస్తుంటాడు. కానీ విజ్జికి మాత్రం ఆర్మీ ఆఫీసర్ అవ్వడం ఇష్టం ఉండదు. జాన్ హిమ్లర్(బాబీ డియోల్). అత్యంత క్రూరుడుతో పాటు అసాంఘిక శక్తి. శ్వాసినియా దేశంలోని ప్రజలు ఒకరికొకరు చంపుకునేలా చేసి ఆ దేశం నాశనమయ్యేలా చేస్తాడు. రోజా రంగ స్వామి ( ప్రకాష్ రాజ్) సీనియర్ పొలిటికల్ లీడర్. ప్రతి పక్షంలో ఉన్నా సరే తమిళనాడు రాష్ట్రాన్ని శాసించే నియంత. తన తాత, తండ్రి, తనతో పాటు తన బిడ్డలు, మనవళ్ళు మాత్రమే తమిళనాడుని పరిపాలించాలనుకుంటాడు. రోజాపై ఈగ వాలినా కొన్ని లక్షల ప్రజలు ఊరుకోరు. వెట్రి కొండన్, జాన్ హిమ్లర్, రోజా రంగ స్వామి మధ్య నడిచే సంఘర్షణ, గతం తాలూకు ఘర్షణ ఏంటి అనేదే జన నాయకుడు కథ. ఎనాలసిస్ మూవీ చూస్తున్నంత సేపు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ భగవంత్ కేసరి గుర్తుకొస్తూనే ఉంటుంది. పొలిటికల్ టచ్ తప్ప మిగిలిన కథ మొత్తం ఇంచు మించు సేమ్. ఆడవాళ్ళకి ఇన్ స్ప్రెషన్ గా నిలిచే డైలాగ్స్, ప్రజల వలన చెడ్డ రాజకీయనాయకుడు ఎలా పుట్టుకొస్తున్నారనే డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వెట్రి ఇంట్రడక్షన్, విజ్జి, వెట్రి మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. ఆ తర్వాత కథ కొంచం స్లోగా నడవడంతో పాటు సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కయల్ గా చేసిన పూజా హెగ్డే, వెట్రి మధ్య పెద్దగా సీన్స్ నడవలేదు. శ్వాసినియా దేశానికీ సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ గా ఉంది. సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.సెకండ్ హాఫ్ లో వెట్రి, జాన్ హిమ్లర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్లేదు . ముఖ్యంగా హిమ్లర్ చెడ్డవాడిగా మారడానికి చూపించిన రీజన్ వెరైటీగా కొత్తగా ఉంది. మతాల మధ్య చిచ్చు అనేది రొటీన్ పాయింట్. కాకపోతే దర్శకుడు, ప్రొడక్షన్ వాల్యూస్, విజయ్ వల్ల సీన్స్ బోరు కొట్టకుండా సాగాయి. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు వెట్రిగా విజయ్ పెర్ఫార్మ్ పతాక స్థాయిలో ఉంది. తన కూతురు కాకపోయినా విజ్జిని సొంత తండ్రిగా, ప్రాణానికి ప్రాణంగా పెంచే తండ్రిగా, మరో వెర్షన్ లో రాజకీయ నాయకుల అంతు చూసే పోలీస్ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ చేసాడు. ముఖ్యంగా స్కూల్ వయస్సు ఉన్న పాపతో పెదనాన్న అయినా బాబాయ్ అయినా, ఎవరైనా సరే నిన్ను మూడు చోట్ల టచ్ చేస్తే అమ్మకి చెప్పాలి అనే సీన్ లో విజయ్ నటన నభూతో న భవిష్యత్. విజ్జి గా మమితా భైజు మెప్పించే నటనే ప్రదర్శించింది. బాబీడియోల్, ప్రకాష్ రాజ్ తో మిగతా నటీనటులు కూడా తమ కెరీర్ లో గుర్తుండిపోయే పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా బాబీ డియోల్ హైలెట్ అని చెప్పవచ్చు. పూజా హెగ్డే తో తో పాటు మిగతా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అనిరుద్ నుంచి వచ్చిన సాంగ్స్ లో మెరుపులు లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వినోత్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. రచయితగా రొటీన్ సీన్స్ కావడం కొంచం మైనస్. నిర్మాణ విలువలు. ఫొటోగ్రఫీ ప్లస్ బలాలు 1 . విజయ్ పెర్ ఫార్మెన్స్ 2 . శ్వాసినియా దేశం ఎపిసోడ్ 3 . సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ 4 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 5 . ఫొటోగ్రఫీ 6 . డైరెక్షన్ బలహీనతలు 1 . అందరూ చూసేసిన భగవంత్ కేసరి కథ కావడం 2 . ఫస్ట్ హాఫ్ 3 . రొటీన్ సీన్స్ చివరిగా చెప్పాలంటే విజయ్ యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్. వినోత్ దర్శకత్వ ప్రతిభ జననాయగన్ కి బలం. కానీ రొటీన్ సీన్స్ ,భగవంత్ కేసరి గా బాలయ్య ఇప్పటికే తెలుగు వారి ఇంట్లో తిష్ట వేయడం జననాయగన్ కి మైనస్. రేటింగ్ 2 .5 /5 అరుణాచలం
Jul 23, 2026 1:58PM
'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్.. హల్క్ నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ.!
మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్లో 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజే (జెండయా)తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్గా ఉండబోతుందనే విషయం మరోసారి స్పష్టమైంది. అలాగే ఈ ట్రైలర్లో మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు కూడా అధికారికంగా చూపించారు. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మరో ఆసక్తికరమైన అధ్యాయానికి ఈ సినిమా నాంది పలకనుంది. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిన్ కురిట్జ్కెస్ కథను అందించగా కెవిన్ ఫైగీ, ఏమీ పాస్కల్, అవి ఆరాడ్, రాచెల్ ఓ'కానర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మన్, మైకేల్ మాండో, మార్క్ రఫాలో కీలక పాత్రల్లో నటించారు. 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అలాగే 2D, 3D, 4DX 3D, ScreenX, Dolby Cinema, ICE 3D, MX4D, P[XL], BIGPIX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. Spider Man Brand New Day, Final Trailer, Tom Holland, Spider Man
Jul 23, 2026 1:04PM
జూబ్లీహిల్స్లో స్థల కబ్జా యత్నం.. ఇద్దరు టాలీవుడ్ నిర్మాతలపై కేసు నమోదు.!
టాలీవుడ్ నిర్మాతలు సి. కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ఉన్న ప్లాట్ నంబర్ 89 స్థలం కబ్జా యత్నానికి గురైందంటూ ప్రముఖ వ్యాపారవేత్త కంఠంనేని రవిశంకర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదాస్పద ప్లాట్ నంబర్ 89 స్థలానికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉందనే విషయాన్ని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా, జూన్ 10న గౌరవ కోర్టు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం, రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు (ఇంజక్షన్ ఆర్డర్) ఇస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారని రవిశంకర్ ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిందితులు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని రవిశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు దౌర్జన్యంగా ఆస్తి కాంపౌండ్ గేటు తాళాలు పగులగొట్టారని, గేటును తీవ్రంగా ధ్వంసం చేశారని ఆయన వివరించారు. ఆవరణలో ఉన్న సామాగ్రిని చెల్లాచెదురుగా పడేసి, అక్కడున్న భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వెల్లడించారు. అంతటితో ఆగకుండా, ఆ ప్లాట్లో నిర్మించిన ఒక గదిని కూడా నిందితులు ధ్వంసం చేశారని రవిశంకర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/Theteluguone/status/2080175511750443190 Kantamneni Ravi Shankar, Land Dispute, C Kalyan, Burugupalli Sivaramakrishna
Jul 23, 2026 12:49PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com










