
Trisha Krishnan: త్రిషకు మెగా ఫ్యామిలీ సర్ప్రైజ్ గిఫ్ట్!
సౌత్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తనదైన క్రేజ్, అందం, నటనతో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan). కుర్ర హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు అందరి సరసన నటిస్తూ ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా చెక్కుచెదరని పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే, తాజాగా ఈ కోలీవుడ్ ముద్దుగుమ్మకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక సమ్మర్ స్పెషల్ సర్ప్రైజ్ అందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela) నిర్వహిస్తున్న బ్రాండ్ ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి త్రిషకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఈ స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అందుకోవడంతో త్రిష ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉపాసన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ 'అత్తమ్మాస్ కిచెన్' గిఫ్ట్ బాక్స్లో సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన ఎన్నో రకాల నోరూరించే వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలం అనగానే అందరికీ గుర్తొచ్చే ఘుమఘుమలాడే ఆవకాయ పచ్చళ్లతో పాటు, వివిధ రకాల రుచికరమైన పొడులు, పచ్చళ్ల జాడి ఈ హ్యాంపర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు ఇన్స్టంట్ మిక్స్ బాక్సులైన కేసరి, పొంగల్, ఉప్మా, రసం వంటి సాంప్రదాయ హోమ్ మేడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఆ గిఫ్ట్ ప్యాక్లో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో తయారుచేసే అచ్చమైన తెలుగు రుచులను దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్కు అందించాలనే ఉద్దేశంతోనే ఉపాసన ఈ హోమ్ ఫుడ్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బ్రాండ్ నుంచి త్రిషకు ఈ ప్రత్యేకమైన ప్యాకేజీ అందింది. ఈ క్రేజీ సమ్మర్ సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకోవడం పట్ల హీరోయిన్ త్రిష అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఉపాసన పంపిన ఆవకాయ పచ్చళ్లు, వివిధ రకాల వంటకాల బాక్సులను ఒక అందమైన ఫోటో తీసి, దానిని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోపై క్యాప్షన్ పెడుతూ.. "థాంక్యూ సో మచ్ ఉపాసన.. ఈ గిఫ్ట్ చూస్తుంటే నిజంగానే వేసవి వచ్చేసినట్లు అనిపిస్తోంది" అంటూ హార్ట్ ఎమోజీ మరియు లవ్ ఎమోజీలను జోడించి తన కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం త్రిష పెట్టిన ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీతో త్రిషకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది. ప్రస్తుతం త్రిష టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరసన 'విశ్వంభర' (Vishwambhara) అనే భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jun 3, 2026 1:20PM
Shiva rajkumar: గౌరనాయుడు అసలు క్యారక్టర్ ఈ హీరోదే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
కన్నడ స్టార్ హీరో కరుణాడ చక్రవర్తి శివరాజ్కుమార్(Shiva Rajkumar)అలియాస్ శివన్న 'పెద్ది'(Peddi)తో తెలుగు నాట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. 'గౌరనాయుడు' అనే పవర్ ఫుల్ ప్రతినాయకుడు రోల్ లో కనిపించనున్నాడు. గౌరనాయుడు లుక్ ,ప్రచార చిత్రాలు చూస్తుంటే తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది. జైలర్ , గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీస్ లో కేవలం కొద్ది నిమిషాల క్యామియో రోల్తోనే తెలుగు నాట పూనకాలు తెప్పించిన శివన్నకి 'పెద్ది' పూర్తి నిడివి గల రోల్. దీంతో శివన్నకి టాలీవుడ్లో ఒక కెరీర్ డిఫైనింగ్ అండ్ మైండ్బ్లోయింగ్ బ్రేక్ ఇస్తుందా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దిలో శివరాజ్కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ శివన్న ఎలివేషన్ సీన్లని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని, గౌరనాయుడుగా శివన్న జీవించారని చిత్ర యూనిట్ చెబుతోంది. స్వయంగా రామ్ చరణ్ మాట్లాడుతు శివన్న స్క్రీన్పై కనిపిస్తే అదొక ప్రభంజనం. కేవలం జైలర్ లో ఆయన సిగరెట్ కాల్చే స్లో మోషన్ షాట్ కోసమే నేను జైలర్ ని ఎన్నోసార్లు చూశానని కొనియాడారు.దీంతో 'పెద్ది' సినిమా శివరాజ్కుమార్కి తెలుగులో ఒక భారీ సోలో మార్కెట్ని క్రియేట్ చేయడమే కాకుండా మరిన్ని ఆఫర్స్ రావచ్చని అభిమానులు, సినీ పరిశీలకులు బావిస్తున్నారు. Also read: Peddi: పెద్ది కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియో.. వైరల్ గా మారిన స్పీచ్ గౌరనాయుడు క్యారక్టర్ కోసం శివరాజ్కుమార్ చూపించిన అంకితభావం ఎవరినైనా కన్నీళ్లు పెట్టించక మానవు. 2024 లో ఈ ప్రాజెక్ట్ కమిట్ అయిన తర్వాత, శివన్న ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డారు. దాంతో ఆయన యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. చిత్రం నుండి తప్పుకోవాలని ఆయన భావించినప్పటికీ, దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాత్రం గౌర నాయుడు క్యారక్టర్ ని మీరు మాత్రమే చేయాలి. మీ కోసం మేము వేచి చూస్తాం" అని నమ్మకంగా చెప్పారు. చెప్పినట్లుగానే శివన్న చికిత్స ముగించుకుని తిరిగి వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూశారు. ఆర్టిఫిషియల్ బ్లాడర్ సర్జరీ మరియు కఠినమైన కెమోథెరపీ సెషన్ల వల్ల తీవ్రమైన అలసట ఉన్నప్పటికీ, శివన్న కన్నడ చిత్రం '45' క్లైమాక్స్తో పాటు 'పెద్ది' షూటింగ్ను అద్భుతంగా పూర్తి చేసి సినిమాపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.
Jun 3, 2026 12:57PM
Peddi: 'పెద్ది' సాంగ్స్ బడ్జెట్పై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తాజాగా దర్శకుడు బుచ్చిబాబుతో ఏఆర్ రెహమాన్ (AR Rahman) జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు 'పెద్ది' చిత్రం కోసం రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రై రై రారా', 'హల్లల్లల్లో', 'మస్సా మస్సా' వంటి పాటలు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయని గుర్తు చేశారు. తాను కేవలం కథను, సిట్యువేషన్లను మాత్రమే వివరించానని, కానీ రెహమాన్ సార్ తన అద్భుతమైన ట్యూన్స్తో ఈ సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. బుచ్చిబాబు మాటలకు ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ.. దర్శకుడితో తనకున్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నన్ను ప్రేమించే మరియు పూర్తిగా విశ్వసించే ఒక దర్శకుడితో పనిచేయడం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. బుచ్చిబాబులో నాకు ఆ నమ్మకం కనిపించింది. ఒక దర్శకుడు సంగీత దర్శకుడిని 100 శాతం నమ్మినప్పుడు.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన నుండి 150 శాతం అత్యుత్తమ అవుట్పుట్ ఇవ్వగలడు" అని రెహమాన్ చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో సినిమాల్లో బడ్జెట్ మరియు దర్శకుల ప్రమేయం గురించి రెహమాన్ తనదైన శైలిలో స్పందించారు. కొందరు దర్శకులు ప్రతిదానికీ మార్పులు చేయాలని ఒత్తిడి తెస్తుంటారని, అలాంటప్పుడు ఆ సంగీతంలో ఒరిజినాలిటీ దెబ్బతింటుందని అన్నారు. "బడ్జెట్ ఎక్కువైతే.. అక్కడ నమ్మకం అనేది తగ్గిపోతుంది" అంటూ ఆయన నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బడ్జెట్ అనేది క్రియేటివిటీని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన సున్నితంగా వివరించారు. 'చికిరి చికిరి' అనే పదం వెనుక ఉన్న సీక్రెట్ను కూడా రెహమాన్ ఈ సందర్భంగా రివీల్ చేశారు. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన పర్కషన్ ప్లేయర్ రాజా గారు ఈ పదాన్ని తరచూ వాడేవారని, ఆ తెలుగు పదం తన మనసులో ఉండిపోయి ఇప్పుడు ఈ పాట రూపంలోకి వచ్చిందని తెలిపారు. అలాగే సినిమాలో బుచ్చిబాబు ప్లాన్ చేసిన చిన్న చిన్న డీటెయిలింగ్స్, ముఖ్యంగా 'హల్లల్లల్లో' సాంగ్లో వచ్చే కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మరియు గురువు ముందు హీరో ప్రవర్తించే విధానం తనకు ఎంతగానో నచ్చాయని రెహమాన్ అప్రిషియేట్ చేశారు. ఒక దర్శకుడికి ఇలాంటి సెన్సిటివ్ డీటెయిల్స్ చాలా ముఖ్యమని ఆయన ప్రశంసించారు. చివరగా 'పెద్ది' సినిమా గురించి చెబుతూ.. బుచ్చిబాబు కథ చెప్పిన దానికంటే సినిమా విజువల్ గా చాలా అద్భుతంగా వచ్చిందని రెహమాన్ చెప్పారు. రామ్ చరణ్ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ను కూడా ఈ చిత్రం ఎంతగానో అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Jun 3, 2026 12:57PMతమిళనాట వెర్రి అభిమానం.. దేవుళ్ల పక్కన విజయ్ విగ్రహం.. నెటిజన్లు ఫైర్!
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ, ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన దళపతి విజయ్కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను కేవలం ఒక నటుడిగానే కాకుండా.. తమ ఇంటి సభ్యుడిగా, దైవంగా భావించే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఒక వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే వ్యక్తి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. విజయ్ పై ఉన్న అమితమైన ప్రేమతో ఆయన తన ఇంట్లోని పూజగదిలోనే దళపతి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిత్యం దేవుళ్లతో పాటు విజయ్ విగ్రహానికి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ, కర్పూర హారతి ఇస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా తమిళనాట సినిమా హీరోలను, నటీమణులను అమితంగా ఆరాధించడం కొత్తేమీ కాదు. గతంలో సీనియర్ నటి ఖుష్బూ, గ్లామర్ క్వీన్ నమితలకు అక్కడి అభిమానులు ఏకంగా ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా దివంగత నేత ఎంజీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి లెజెండరీ నటులకు కూడా గుళ్లు కట్టిన చరిత్ర తమిళనాడుకు ఉంది. ఇప్పుడు అదే బాటలో విజయ్ కూడా చేరిపోయారు. అయితే పూజగదిలో విజయ్ విగ్రహం పెట్టి హారతి ఇవ్వడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి 'మా దళపతి క్రేజ్ అలాంటిది' అంటూ కాలర్ ఎగరేస్తుంటే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ, మనుషులను తెచ్చి దేవుడి గదిలో పెట్టడం ఏంటని, ఇలాంటి వెర్రి అభిమానం సమాజానికి మంచిది కాదని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వైరల్ వీడియో మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే చర్చకు దారితీస్తోంది. https://x.com/ChotaNewsApp/status/2061860665141469239?s=20
Jun 3, 2026 12:40PMకామెడీ వీడియో కొంపముంచింది.. రెండు నెలలు దుబాయ్ జైల్లో మగ్గిన కమెడియన్!
నవ్వులు పూయించడమే పనిగా పెట్టుకునే స్టాండప్ కమెడియన్లకు కొన్నిసార్లు తాము వేసే జోకులే పెద్ద శాపంగా మారుతుంటాయి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, చేదు అనుభవమే ఎదురైంది ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడియన్ యష్ భరద్వాజ్కు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒకే ఒక్క కామెడీ రీల్ వీడియో కారణంగా ఆయన ఏకంగా 47 రోజుల పాటు దుబాయ్ జైలులో (డిటెన్షన్ సెంటర్లో) నరకం అనుభవించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న తరుణంలో.. దుబాయ్లో గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పని చేయడం లేదంటూ యష్ భరద్వాజ్ సరదాగా ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయితే దీనిని దుబాయ్ భద్రతా అధికారులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. అది కేవలం ఒక హాస్య వీడియో అయినప్పటికీ, దేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అంశంగా భావించి మార్చి 19న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో యష్ దాదాపు రెండు నెలల పాటు దుబాయ్ నిర్బంధంలో గడపాల్సి వచ్చింది. సుదీర్ఘ విచారణలు, వారాల తరబడి సాగిన జైలు జీవితం తర్వాత ఎట్టకేలకు మే 5వ తేదీన దుబాయ్ అధికారులు ఆయన్ను భారతదేశానికి డిపోర్ట్ (బహిష్కరణ) చేశారు. ఈ విషయాన్ని స్వయంగా యష్ భరద్వాజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అవుతూ అభిమానులతో పంచుకున్నారు. స్టాండప్ కామెడీ రంగంలో తనదైన శైలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ భరద్వాజ్.. గతంలో ఎన్నో నగరాల్లో సక్సెస్ఫుల్ షోలు నిర్వహించారు. నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉంటూ నెటిజన్లను నవ్వించే యష్ను.. ఈ దుబాయ్ ఘటన శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ కష్టకాలంలో తన కుటుంబం ఎంతో వేదన అనుభవించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటానికి యష్ ప్రయత్నిస్తున్నారు. ఇండియాకు తిరిగొచ్చిన వెంటనే ముంబైలో మళ్లీ స్టేజ్ ఎక్కి షోలు చేయడం ప్రారంభించారు. ముంబై నగరం, అక్కడి ప్రేక్షకులు తనకు ఎంతో అండగా నిలిచారని, ప్రదర్శనలు ఇవ్వడం వల్ల మనసుకు కొంత ఉపశమనం లభించిందని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు, తోటి ఆర్టిస్టులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక చిన్న జోక్ ఇంతటి భయంకరమైన పరిస్థితికి దారితీయడంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న యష్ భరద్వాజ్.. తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు బెంగళూరు నగరానికి షిఫ్ట్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 16 ఏళ్ల క్రితం తనకు స్టాండప్ కామెడీపై తొలిసారిగా ఆసక్తి కలిగింది బెంగళూరులోనేనని.. అందుకే మానసిక ప్రశాంతత కోసం కొన్ని వారాల పాటు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా వాటన్నింటినీ మర్చిపోయి, మళ్లీ సరికొత్త జోకులతో ప్రేక్షకులను నవ్వించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని యష్ స్పష్టం చేశారు.
Jun 3, 2026 12:29PM
Peddi: పెద్ది కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియో.. వైరల్ గా మారిన స్పీచ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ కానుంది. ఈ తరుణంలో మెగా అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చరణ్ కోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి చరణ్ని విష్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ ప్రత్యేక వీడియోని కేవలం సాధారణ శుభాకాంక్షల రూపంలో కాకుండా, ఎంతో భావోద్వేగభరితంగా, కంటికి ఇంపైన దృశ్యమాలికలా మలిచారు. రామ్ చరణ్ కెరీర్లోని అద్భుతమైన మైలురాళ్లు, ఆయన సినీ ప్రయాణంలోని ఐకానిక్ సన్నివేశాలని ఈ వీడియోలో ఎంతో అందంగా మిళితం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా చరణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన నిబద్ధతని ఆంజనేయస్వామి ప్రతిరూపంతో పోలుస్తూ సాగిన ఎడిటింగ్ అభిమానులని భావోద్వేగ అనుభూతిని కలిగిస్తోంది. మెగా అభిమానులలో చాలామంది రామ్ చరణ్ను హనుమంతుడి అంశగా భావిస్తుంటారు; ఆయనలోని క్రమశిక్షణ, ధైర్యం, తెరపై కనిపించే విలక్షణమైన ఆహార్యం ఆంజనేయస్వామిని గుర్తు చేస్తాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేస్తుంటారు. ఈ బలమైన సెంటిమెంట్ని ప్రతిబింబించేలా వీడియోలో చరణ్ పవర్ఫుల్ విజువల్స్కి హనుమంతుని ప్రతీకలను, దైవికమైన ఎలిమెంట్స్ జోడించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. Also read: Janhvi kapoor: పెద్ది అచ్చాయమ్మ పరిస్థితి ఏంటి.. దేవర పరువు నిలబడుతుందా! అంతేకాకుండా, పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైన తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు చరణ్కి, 'పెద్ది’ చిత్ర బృందానికి ఎల్లప్పుడూ ఉండాలని ఈ వీడియో ద్వారా ఆకాంక్షించారు. "రామ్ చరణ్" అనే పేరులోనే దైవభక్తి, అపారమైన శక్తీ, శ్రీరాముని పాదాల చెంత శరణాగతి దాగి ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ రాసుకొచ్చిన క్యాప్షన్ ప్రతి ఒక్కరి హృదయాలని తాకుతోంది. https://x.com/PKCWoffl/status/2062053921502453965?s=20
Jun 3, 2026 12:29PM
Janhvi kapoor: పెద్ది అచ్చాయమ్మ పరిస్థితి ఏంటి.. దేవర పరువు నిలబడుతుందా!
అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్(Janhvi Kapoor), బాలీవుడ్లో సరైన బ్రేక్ ని అందుకోలేకపోయింది. కానీ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో 'దేవర' తో జత కట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. హిట్ అందుకోవడమే కాదు. తంగం అనే పల్లెటూరి అమ్మాయి రోల్ లో మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ చేసింది. గ్లామర్ పరంగానే కాకుండా, ఎమోషనల్ సీన్స్లోనూ మెప్పించి తల్లి శ్రీదేవిని మరిపించింది. 'దేవర' ఇచ్చిన జోష్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్దిలో జత కట్టింది. ప్రచార చిత్రాలు చూస్తుంటే అచ్చాయమ్మ గా మరో సారి తన హవా చాటడం ఖాయమని అనిపిస్తుంది. దేవర, పెద్దిని గమనిస్తే జాన్వీ తన టాలీవుడ్ టాప్ లీగ్ ని ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుందో అర్థమవుతుంది. 'దేవర' సినిమా ఆమెకు కమర్షియల్ సక్సెస్తో పాటు మాస్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు 'పెద్ది' సినిమా ఆమెలోని నటనను, విలేజ్ బ్యాక్డ్రాప్ ఎమోషన్స్ని మరింత పీక్స్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్లో ఒక హీరోయిన్ వరుసగా ఇద్దరు టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే, ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. Also read: Peddi: పెద్దితో బుచ్చిబాబు ఆ గండాన్ని దాటబోతున్నాడా! ప్రస్తుతం టాలీవుడ్లో రష్మిక మందన్న, శ్రీలీల లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ, జాన్వీ కి ఉన్న క్రేజ్, స్టార్ కిడ్ ఇమేజ్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు రేసులో అందరికంటే ముందు నిలబెడతాయి. దీంతో జాన్వీ తెలుగు సినిమా నంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు, సినీ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు.
Jun 3, 2026 12:08PM.webp)
Irumudi Glimpse: 'ఇరుముడి' హార్ట్ టచింగ్ గ్లింప్స్.. రవితేజ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) గత కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ ప్యాక్డ్, పక్కా కమర్షియల్ మాస్ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఆయన రూట్ మార్చారు. మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన, హృదయాలకు హత్తుకునే సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను వెండితెరపై ఆవిష్కరించి క్లాస్ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం 'ఇరుముడి' (Irumudi). మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త గ్లింప్స్ రవితేజను ఒక ఎమోషనల్ ఫాదర్గా సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది. (Irumudi Glimpse) 'హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో విడుదలైన ఈ ప్రత్యేకమైన గ్లింప్స్, ఈ సినిమా కేవలం ఒక రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదని, దీని వెనుక అంతకు మించిన ఒక బలమైన ఎమోషనల్ డ్రామా దాగి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రవితేజను ఆయన రెగ్యులర్ హై-ఎనర్జీ జోన్ లో కాకుండా, చాలా క్లాస్గా, సెటిల్డ్గా ప్రెసెంట్ చేయడం విశేషం. ఎలివేషన్ డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, భావోద్వేగాలతోనే ఈ గ్లింప్స్ సాగింది. ఒక తండ్రి-కూతురి మధ్య ఉండే సున్నితమైన అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత మరియు పశ్చాత్తాపం వంటి బలమైన ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథను దర్శకుడు శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ పోస్టర్లో రవితేజ తన చిన్నారి కూతురితో కలిసి ఒక ఎత్తైన రాతి కొండపై కూర్చుని, సుదూర తీరాలను చూస్తూ ఉన్న దృశ్యం ప్రేక్షకులలో ఎంతో ఉత్సుకతను పెంచింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ కూడా రవితేజలోని వింటేజ్ నటుడిని బయటకు తీసి, ఒక సిన్సియర్ తండ్రిగా ఆయన రూపాంతరాన్ని అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ప్రారంభంలో తండ్రీకూతుళ్ల బాండింగ్ ను అద్భుతంగా ఆవిష్కరించారు. మధ్యలో రవితేజలోని వయలెంట్ యాంగిల్ ను కూడా చూపించారు. ఇక చివరిలో "మందు మానేయ్ నాన్న" అని కూతురు అడగటంతో, రవితేజ అయ్యప్ప దీక్ష చేపట్టడం హృదయాలను హత్తుకునేలా ఉంది. అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు ఫాదర్ సెంటిమెంట్ కలగలిసిన ఈ 'ఇరుముడి' రవితేజ కెరీర్లోనే ఒక మైల్స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Jun 3, 2026 11:47AM
Peddi: పెద్దితో బుచ్చిబాబు ఆ గండాన్ని దాటబోతున్నాడా!
పెద్ది(Peddi)తో దర్శకుడు బుచ్చిబాబు మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. తన మొదటి మూవీ ఉప్పెన అత్యంత సెన్సిటివ్ సబ్జెట్ తో తెరకెక్కింది. కానీ బుచ్చిబాబు చాలా తెలివిగా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఉప్పెన ని చూస్తున్నంత సేపు తొలి చిత్రమని ఎవరు అనుకోరు. అంతలా తన టేకింగ్ తో మెస్మరైజ్ చేసాడు. కానీ టాలీవుడ్లో ఎప్పటినుంచో ఒక బలమైన సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాలని, ప్రేక్షకులని భయపెడుతూనే ఉంది. మొదటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి, బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన దర్శకులకి తమ రెండవ సినిమా దగ్గరకి వచ్చేసరికి ఫ్లాప్ ని అందుకుంటారనే నమ్మకం ఉంది. ఈ సెకండ్ మూవీ సెంటిమెంట్ ఎంతో మంది టాలెంటెడ్ దర్శకుల కెరీర్పై ప్రభావం చూపించింది. ఇప్పుడు సరిగ్గా ఇదే సెంటిమెంట్ ముంగిట నిలబడ్డారు బుచ్చిబాబు. ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బుచ్చిబాబు, ఇప్పుడు తన రెండవ చిత్రానికి సంబంధించి ట్రేడ్ సర్కిల్ లో వినపడే సెంటిమెంట్ని బద్దలు కొడతారా లేదా అన్నది సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు సైతం తమ రెండవ సినిమాతో విజయం సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే, చాలా మంది కొత్త దర్శకులు మొదటి సినిమాతో ఉన్నపళంగా స్టార్ స్టేటస్ తెచ్చుకుని, రెండవ సినిమా విషయంలో కథపై పట్టు కోల్పోయి బోల్తా పడిన దాఖలాలు 80 శాతానికి పైగా ఉన్నాయి. కానీ బుచ్చిబాబు మాత్రం ఈ సెంటిమెంట్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్తో చరణ్ని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. పైగా పెద్ది కోసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేసాడు. ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలైతే ఒక రేంజ్ లో ఉన్నాయి. Also read: Peddi: పెద్ది ఫస్ట్ డే కొట్టబోయే కలెక్షన్స్ ఇవేనా! ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ తో పాటు, మిగతా నటీనటులు, నిర్మాతలు బుచ్చిబాబు గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే రెండవ సినిమా గండాన్ని దాటతాడనే అనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, 'పెద్ది' మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.
Jun 3, 2026 11:40AM
Peddi: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దండయాత్ర.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ తెలిస్తే షాక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడానికి సర్వం సిద్ధమైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో మరియు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా కావడంతో మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా రిలీజ్ కోసం వేల కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు అందిన ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు థియేట్రికల్ రన్ అంకెలు ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన 'పెద్ది' చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ వాల్యూను సొంతం చేసుకుంది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు రూ. 220 కోట్లకు క్లోజ్ అయింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ చిత్రం ఏకంగా రూ. 135 కోట్లకు పైగా భారీ థియేట్రికల్ బిజినెస్ను జరుపుకుంది. చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు కంటెంట్ పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ భారీ బిజినెస్ టార్గెట్ను అందుకోవడానికి మేకర్స్ 'పెద్ది' చిత్రాన్ని గ్లోబల్ వైడ్గా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1500 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్క్రీన్స్ కౌంట్ 2700 కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్స్ లో విడుదలకు ప్లాన్ చేశారని సమాచారం. చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో టికెట్ ధరల పెంపునకు కూడా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 125 చొప్పున టికెట్ ధరలను పెంచుతూ, రోజుకు ఐదు ప్రదర్శనలు (5 Shows) వేసుకోవడానికి 10 రోజుల పాటు అనుమతులు లభించాయి. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే రూ. 600 టికెట్ ధరతో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
Jun 3, 2026 11:22AM
Peddi: పెద్ది ఫస్ట్ డే కొట్టబోయే కలెక్షన్స్ ఇవేనా!
మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'(Peddi)గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ కానున్నాడు. దీంతో మెగా అభిమానుల్లో, మూవీ లవర్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఫస్ట్ డేకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్ నుంచి ఉత్తరాంధ్ర వరకు భారీ ఎత్తున జరగడంతో తొలి రోజు పెద్ది సాధించే కలెక్షన్స్ పై ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, 'పెద్ది' చిత్రం మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ చూపిస్తున్నాయి.ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ కి చేరింది. ఇండియా వైడ్ గా లెక్కలు రావాల్సి ఉంది. పైగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఈ లెక్కన 100 కోట్లు సాధించే అవకాశం ఉందని టాక్ పాజిటివ్గా వస్తే, లాంగ్ రన్లో సరికొత్త రికార్డులని అధిగమించడం ఖాయమని అంటున్నారు. Also read: Michael jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. 7000 కోట్లు మొన్న విజయవాడ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు తో పాటు మిగతా నటీనటులు,నిర్మాతలు చెప్పిన దాన్ని బట్టి పెద్ది పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. రెహ్మాన్ మ్యూజిక్ నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Jun 3, 2026 11:13AM
Spirit: ప్రభాస్ లీక్డ్ పిక్ వైరల్.. స్పిరిట్ సెట్స్లో రెబల్ స్టార్ రచ్చ!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' (Spirit). టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్కు సంబంధించిన ఒక అఫీషియల్ లుక్ తరహా పిక్ ఇంటర్నెట్లో లీక్ అయి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లీక్డ్ ఫోటోలో ప్రభాస్ ఎంతో స్టైలిష్గా, ముఖంపై చిరునవ్వుతో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఐకానిక్ విమల్ థియేటర్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ జరిగింది. ఈ షూటింగ్ గ్యాప్లో ప్రభాస్ తన పర్సనల్ స్టైలిస్ట్తో దిగిన సెల్ఫీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ లీక్డ్ పిక్లో ప్రభాస్ బ్లాక్ డ్రెస్ ధరించి, బ్లూ కలర్ సన్గ్లాసెస్ పెట్టుకుని, నుదుటన తిలకంతో ఎంతో రాయల్గా కనిపిస్తున్నారు. ఆయన వింటేజ్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా, ఎక్కడా బ్రేక్స్ తీసుకోకుండా దర్శకుడు సందీప్ రెడ్డి తన మార్క్ ఎఫిషియంట్ ప్లానింగ్తో అత్యంత వేగంగా ఈ మూవీ షూటింగ్ను ముందుకు నడిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను భారీ ఎత్తున చిత్రీకరించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గతంలో 2026 నూతన సంవత్సర కానుకగా గాయాలతో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ను విడుదల చేసి మేకర్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తర్వాత, ఇప్పుడు వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. ఈ హై-ఇంటెన్స్ కాప్ డ్రామాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు. భారీ తారాగణం, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయడానికి చిత్రయూనిట్ డేట్ను లాక్ చేసింది. ప్రభాస్ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సిల్వర్ స్క్రీన్పై చూడటానికి అభిమానులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Jun 3, 2026 10:56AM
Michael jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. 7000 కోట్లు
ప్రపంచ పాప్ పితామహుడు, కోట్లాది మంది అభిమానులు చేత కాలకృత్యాలు మాన్పించి తన పాటలని, డాన్స్ లని మాత్రమే చూసేలా చేసిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్(Michael jackson). ఆ లెజండ్రీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ 'మైఖేల్'(Michael). ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించింది. ప్రారంభంలో మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ మ్యూజికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు 7,100 కోట్లు) భారీ వసూళ్లని సాధించి, గ్లోబల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మన దగ్గర కూడా అదే రోజు ఇంగ్లీష్ వెర్షన్లోనే రిలీజై 50 కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ గ్లోబల్ వండర్, ఇప్పుడు భారతీయ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రాబోయే వారం నుంచే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. జూన్ 9, నుండి ప్రముఖ ప్లాట్ఫారమ్ 'బుక్ మై షో స్ట్రీమ్' (BookMyShow Stream) లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంగ్లీష్తో పాటు హిందీ లాంగ్వేజ్ లో కూడా అందుబాటులో ఉండనుంది. మొదటగా రెంటల్,కొనుగోలు విధానంలో అందుబాటులోకి రానుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ఇతర ప్రముఖ అంతర్జాతీయ వేదికల్లో కూడా రెంటల్ ప్రాతిపదికన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బయోపిక్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం ఏమిటంటే, మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం. మైఖేల్ జాక్సన్ యొక్క ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ప్రెజెన్స్, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐకానిక్ డ్యాన్స్ స్టెప్స్ ,సిగ్నేచర్ మూమెంట్స్ని జాఫర్ అద్భుతంగా పండించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు. తెరపై ఆయనను చూసిన ఫ్యాన్స్, చాలా సందర్భాల్లో నిజంగానే మైఖేల్ జాక్సన్ని మళ్లీ చూస్తున్నామనే ఎమోషనల్ ఫీలింగ్ పొందారు. 1960ల కాలంలో 'జాక్సన్ 5' బ్యాండ్తో మొదలైన మైఖేల్ ప్రస్థానం నుంచి, 1980ల చివర్లో 'బ్యాడ్ వరల్డ్ టూర్' ద్వారా సాధించిన గ్లోబల్ సక్సెస్ వరకు జరిగిన ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించగా నియా లాంగ్, జూలియానో వాల్డి, కోల్మన్ డొమింగో, మైల్స్ టెల్లర్ వంటి నటీనటులు కీ రోల్స్ పోషించారు. థియేటర్లలో ఈ విజువల్ వండర్ని మిస్ అయిన ఇండియన్ ఆడియన్స్ ఓ టిటిలో చూసి మైకేల్ జాక్సన్ ఇచ్చే మజాని పొందవచ్చు.
Jun 3, 2026 10:46AM
Peddi: రామ్ చరణ్ కంటికి గాయం.. చిరంజీవి ఫోన్ చేయగానే వణికిపోయిన బుచ్చిబాబు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్స్లో ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పెహల్వాన్ పాత్రలో నటిస్తుండటంతో, సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజాలను వెల్లడించారు. సినిమాలోని ఒక అత్యంత కీలకమైన కుస్తీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న తరుణంలో రామ్ చరణ్ కంటికి ఊహించని విధంగా తీవ్రమైన గాయమైంది. దెబ్బ తగిలిన వెంటనే రామ్ చరణ్ కంటి నుండి రక్తం కారిపోయింది. అదంతా లైవ్లో షూటింగ్ కెమెరాలోనే రికార్డ్ అయిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కళ్లముందే రక్తంతో తడిసిపోవడం చూసి దర్శకుడు బుచ్చిబాబుకు ఒక్కసారిగా చేతులు, కాళ్లు ఆడలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక అగ్ర హీరో తన సెట్స్లో ఇలా రక్తగాయంతో పడిపోవడంతో బుచ్చిబాబు విపరీతమైన భయాందోళనలకు గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ విషయం తెలిస్తే అసలు ఏం జరుగుతుందో, సరిగ్గా చూసుకోలేదని తనను ఎంత గట్టిగా మందలిస్తారో అని బుచ్చిబాబు లొకేషన్లోనే వణికిపోయారు. అనుకున్నట్టుగానే చరణ్కు గాయం అయిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి బుచ్చిబాబుకు నేరుగా ఫోన్ కాల్ వచ్చింది. ఆ క్షణంలో తనకు గుండె ఆగినంత పనైందని, తీవ్రమైన టెన్షన్తో ఫోన్ లిఫ్ట్ చేశానని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన బుచ్చిబాబుపై ఏమాత్రం కోపం వ్యక్తం చేయకుండా, అస్సలు మందలించకుండా ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూల్గా అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి గారు ఫోన్ లో మాట్లాడుతూ.. "కంగారు పడకు బుచ్చి, సినిమా అంటే ఇలాంటివి జరుగుతుంటాయి" అని ధైర్యం చెప్పారు. అంతేకాకుండా, చరణ్కు గాయం జరిగిన వివరాలను ప్రశాంతంగా అడిగి, ఆ యాక్సిడెంట్ వీడియో క్లిప్ను తనకు పంపించమని కోరారు. మెగాస్టార్ చూపించిన ఆ అపారమైన మెచ్యూరిటీ, దర్శకుడిని అర్థం చేసుకున్న తీరు చూసి బుచ్చిబాబు మైండ్ బ్లాక్ అయింది. ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారి గొప్పతనం ఆ రోజే తనకు పూర్తిగా అర్థమైందని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో చరణ్ కంటికి నాలుగు కుట్లు పడినా సరే విరామం తీసుకోకుండా 25 నుంచి 30 రోజుల పాటు సాగిన ఆ కుస్తీ షెడ్యూల్ను పూర్తి చేయడం విశేషం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ 'పెద్ది' చిత్రం కోసం చరణ్ ఎన్నో గాయాలను భరించారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం బాక్సాఫీస్ రిజల్ట్ రూపంలో దక్కుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Jun 3, 2026 10:24AM
Pandu Master: వైజాగ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు!
బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తనదైన క్లాస్, మాస్ స్టెప్పులతో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. (Dance Master Pandu) విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలను మరియు ఆయన అభిమానులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. (Pandu Master Accident) అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళితే.. డ్యాన్స్ మాస్టర్ పండు మంగళవారం నాడు విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో జరిగిన ఒక స్థానిక జాతర డ్యాన్స్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఈవెంట్ తర్వాత పండు మాస్టర్ తన డ్యాన్స్ బృందంతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వారంతా కారులో వైజాగ్ నుండి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో వారి వాహనం ఆనందపురం సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఒక తోటి డ్యాన్సర్కు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడి, వాంతులు అయ్యాయి. దీంతో కారును రోడ్డు పక్కన నిలిపారు. అయితే దురదృష్టవశాత్తూ అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా కోళ్ల లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న వీరి కారును బలంగా ఢీకొట్టింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఈ భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బొలెరో వాహనం వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో జరిగిన ఇంపాక్ట్కు కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతని రెండు కాళ్లకు చాలా బలమైన గాయాలు కావడంతో ఆయన కదలలేని స్థితికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, తోటి సిబ్బంది.. పండు మాస్టర్ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు అత్యవసర వైద్య సేవలను అందించడం ప్రారంభించింది. ప్రస్తుతానికి ఆసుపత్రి వర్గాల నుండి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పండు మాస్టర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. అయితే కాళ్లకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో డ్యాన్సర్గా ఎంతో భవిష్యత్తు ఉన్న పండు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.
Jun 3, 2026 10:03AM
Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ క్రేజీ అప్డేట్.. టీజర్ వచ్చేది ఆ రోజే!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit). ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ కల్ట్ కాప్ డ్రామాలో ప్రభాస్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయా అని రెబెల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా భారీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్తో షెడ్యూల్స్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ పార్ట్ను ముగించాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. సందీప్ రెడ్డి పక్కా ప్లానింగ్ మరియు స్క్రిప్ట్ వర్క్తో రంగంలోకి దిగడంతో, ఇప్పుడు జరుగుతున్న జెట్ స్పీడ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఆయన అనుకున్న సమయానికే, అంటే ఈ డిసెంబర్ కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 మార్చి 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ లాంగ్ గ్యాప్లో పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులను హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమా రిలీజ్కు ముందే అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించేందుకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధమవుతోంది. రాబోయే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వడానికి సందీప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే కానుకగా 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సందీప్ రెడ్డి మార్క్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ పోలీస్ అవతార్ను సిల్వర్ స్క్రీన్పై చూడటానికి యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
Jun 3, 2026 9:17AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







