
'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్: 'ఆయా షేర్'ని మించే ఫోక్ సాంగ్.!
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఇంటర్నెట్ను షేక్ చేసింది. ప్రతీ చోటా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. రాబోయే వారంలో 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి మరొక స్పెషల్ తెలంగాణ ఫోక్ సాంగ్ అప్డేట్ రాబోతోంది. ఈ పాట ఊర మాస్ బీట్స్తో, తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా, వింటేనే పూనకాలు వచ్చే విధంగా రూపుదిద్దుకుందట. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. తెలంగాణ ఫోక్ డ్రమ్స్, పక్కా లోకల్ లిరిక్స్, నాని ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూవ్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. 'దసరా' సినిమాలో 'చమ్కీల అంగీలేసి' పాట ఎలాగైతే అన్ని చోట్లా మారుమోగిపోయిందో.. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫోక్ సాంగ్ కూడా అదే రేంజ్లో సంచలనం సృష్టిస్తుందని చెబుతున్నారట. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చే వారంలోనే ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్తో రాబోతోందని టాక్. Nani, The Paradise, Aaya Sher Song, Telangana Folk Song
Aug 17, 2026 6:46PM
ఎన్టీఆర్ 'డ్రాగన్' అప్డేట్: బిగ్ షాక్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్.!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పారలల్ గా చేస్తున్నట్లు సమాచారం. Dragon Movie, Jr NTR, Prashanth Neel, NTR Neel
Aug 17, 2026 6:30PM
నైజాంలో విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్స్ తుఫాన్
విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు సెల్యులాయిడ్ పై 'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు వెదజల్లుతున్నారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పట్టడానికి శ్రావణ మాస శోభనే ఒక కారణం కావచ్చు. నిజానికి సంజయ్ విశ్వనాధ్ గా సూర్య నటన అంత ఆషామాషి తో కూడుకున్న వ్యవహారం కాదు. క్యారక్టర్ కి తగ్గట్టుగా పిన్ టూ పిన్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాలంటే ఎంతో శ్రమ తప్పని సరి. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో కలెక్షన్స్ తుపాన్ సృష్టిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 5.2 కోట్ల గ్రాస్ ని రాబట్టి తన అర్హత ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది. దీంతో మొదటి మూడు రోజులకి కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల మార్కుని తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా కూడా నిలవడం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు దక్కే వీలుంది. Also read: DC: డిసి తంబికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి అసలు కారణాలు ఇవేనా! వెంకీ అట్లూరి దర్శకత్వం, మాటలకి, మాగి గా మమితా బైజు నాచురల్ పెర్ ఫార్మెన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు, జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి ఫొటోగ్రఫీ పోటాపోటీగా విశ్వనాధ్ అండ్ సన్స్ కి కుదిరాయి. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకి సుమారు 120 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. Vishwanath And Sons, Suriya, Mamitha Bhaiju
Aug 17, 2026 6:29PM
అల్లు అర్జున్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్: నెక్స్ట్ మూవీ లాంచ్ ఎప్పుడంటే.?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం AA23 గురించి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా గ్రాండ్ లాంచ్ ఈ ఏడాది నవంబర్లో జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పుష్ప 2 సిరీస్ సృష్టించిన సంచలనం తర్వాత, అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో పాన్ ఇండియా మార్కెట్ని మరింత షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా 'రాకా' చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ మూవీ లాంచ్ నవంబర్ నెలలో చాలా గ్రాండ్గా జరగనుందని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. లోకేష్ కనగరాజ్ మార్క్ డార్క్ అండ్ రా యాక్షన్ మేకింగ్, దానికి తోడు అల్లు అర్జున్ అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్. వీరిద్దరి కాంబోకి రోక్స్టార్ అనిరుధ్ ఇచ్చే ఎనర్జెటిక్ మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'రాకా' ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసుకొని, ఆ వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. Allu Arjun, Lokesh Kanagaraj, AA23 Launch
Aug 17, 2026 6:14PM
DC: డిసి తంబికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి అసలు కారణాలు ఇవేనా!
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా తమిళ సరుకు 'డిసి' గురించే చర్చ నడుస్తుంది. మన దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిన బడా హీరోల సినిమాలనే తమిళ తంబీ పెద్దగా పట్టించుకోడు. కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం డి సి బాగుందని టాక్ రావడం ఆలస్యం చలో టూ 'డిసి' థియేటర్స్ అంటున్నారు. వీకెండ్ తో సంబంధం లేకుండా మంగళ, బుధవారాల్లో నైట్ సెకండ్ షో హౌస్ ఫుల్ అవుతుంటే థియేటర్ యజమానులు కూడా కల, నిజామా అంటూ గిల్లుకొనే పరిస్థితి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా 'డిసి' గురించి మాట్లాడుకుంటున్నారు తెలుగు సినిమా ప్రియులు ఎప్పుడూ డార్క్ కథలు, ఎమోషనల్ షేడ్స్, డెప్త్ ఉన్న ఆంటి-హీరో లేదా మాస్ క్యారెక్టర్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతారు. డీసీ కామిక్స్ లోని "బ్యాట్మ్యాన్", "జోకర్" పాత్రలలో ఉండే తీవ్రమైన అంతర్మథనం, సైకలాజికల్ డ్రామా మన ఆడియన్స్కి ఎంతగానో నచ్చుతాయి. సరిగ్గా అదే తరహాలో, లోకేష్ కనగరాజ్ నటించిన "DC" మూవీలో దేవదాస్, చంద్ర అనే ఇద్దరు సమాజం చేత తీవ్రంగా గాయపడిన వ్యక్తుల వైలెంట్ రివెంజ్ డ్రామా తెలుగు ప్రేక్షకుల టేస్ట్కి సరిగ్గా సెట్ అయింది. లొకేషన్ల డార్క్ మూడ్, అపరిమితమైన యాక్షన్ కంటెంట్, మరియు అనిరుధ్ రవిచందర్ అందించిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెలుగులో మాస్ రికార్డుల దిశగా నడిపించాయి. Also read: ఇరుముడి vs టాక్సిక్.. వాళ్ళు ఎటు వైపు! లోకేష్ కనగరాజ్ స్వయంగా దర్శకుడిగా "LCU"తో సృష్టించిన డార్క్ సినిమాటిక్ వాతావరణం, ఆయన నటనలో కూడా కనిపించడం వల్ల కూడా మరింత బ్రహ్మరథం పట్టారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వరల్డ్ వైడ్ గా 84.31 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, తమిళనాడు కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది. దీన్ని బట్టి తెలుగు ప్రేక్షకులు డిసి ని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు..DC అంటే దేవదాస్, చంద్ర. Lokesh Kanagaraj, wamiqa Gabbi, Arun Matheswaran
Aug 17, 2026 5:55PMసైకాలజికల్ థ్రిల్లర్ ‘ఫైట్ మహా’.. ఆగస్టు 21న వరల్డ్వైడ్ రిలీజ్.!
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా గత నెల విడుదల చేసిన టీజర్ అద్భుతమైన స్పందన వచ్చింది, మిలియన్ ప్లస్ వ్యూస్ తో ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. కాగ ఈ రోజు 2 నిమిషాల 20 సెకండ్స్ నిడివిగల ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం ఆగస్టు 21 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రొడ్యూసర్ ఏవీఎస్ రాజు మాట్లాడుతూ - "దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ కథ చెప్పినప్పుడు మా అందరికీ బాగా నచ్చింది. కథే ఈ సినిమా నిర్మించేందుకు మమ్మల్ని ఇన్స్ పైర్ చేసింది. డైరెక్టర్ మాకు కథ ఎంత బాగా చెప్పాడో అంతే బాగా రూపొందించాడు. వైజాగ్, కేరళ, హైదరాబాద్ లో ఈ సినిమాను చిత్రీకరించాం.ఈ సినిమా పోస్టర్ లో కేవలం ఇద్దరు సునీల్, అఖిల్ ఉడ్డెమారి కనిపించినా షుమారు 40 మంది నటీ నటులు ఈ చిత్రం లో అలరించనున్నారు. జూలై నెలలో టీజర్ మా రాము చేతులమీదుగా విడుదల చేసాము మిలియన్ ప్లస్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం" అన్నారు. డైరెక్టర్ ఆనంద్ చంద్ర మాట్లాడుతూ - " 'ఫైట్ మహా' లో మేము చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యునిక్ గా వుంటుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినా, మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రంలోని కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని నమ్మకం ఉంది. ఈ చిత్రం ఒక వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, ఎక్కడో దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ. 'మహా' అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన జీవితంతో ఫైట్ చేస్తుంటాడు. అందుకే ఫైట్ మహా అనే టైటిల్ మా మూవీకి పెట్టాం. లైఫ్ లో నిరాశ, నిసృహలతో ఏ విషయాన్నీ అయినా వదిలిపెట్టకూడదు. నిత్యం పోరాడుతూనే ఉండాలి అనే మంచి సందేశం ఈ సినిమాలో చూపిస్తున్నాం." అన్నారు.
Aug 17, 2026 5:55PM
క్రేజీ కాంబో: రవితేజ కోసం అదిరిపోయే కథ రాసిన బుచ్చిబాబు.!
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తో డైరెక్టర్ గా టాలీవుడ్కు పరిచయమైన బుచ్చిబాబు సానా.. రెండో సినిమా 'పెద్ది'ని ఏకంగా రామ్ చరణ్ తో చేసి సంచలనం సృష్టించారు. అయితే బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు రాసిన మొదటి కథ మాస్ మహారాజా రవితేజ కోసం రాశారు. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబు స్వయంగా రివీల్ చేయడం విశేషం. రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బుచ్చిబాబు గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరి ముందు చెప్పారు. "నా మొదటి కథను రవితేజ గారి కోసమే రాసుకున్నాను. ఆ కథ ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉంది. ఎప్పటికైనా ఆ కథను రవితేజ గారికి నేరేట్ చేస్తాను." అని చెప్పారు. బుచ్చిబాబు మాటలను బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన రవితేజతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అనిపిస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు 'పెద్ది' సినిమాతో సూపర్ సక్సెస్ మీదున్నారు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అది పాన్ ఇండియా రేంజ్లో ఉంటోంది. మరోవైపు రవితేజ కూడా 'ఇరుముడి'తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే, అది టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశముంది. Irumudi Movie, Ravi Teja, Buchi Babu Sana, Peddi Movie
Aug 17, 2026 5:41PM
ఇరుముడి vs టాక్సిక్.. వాళ్ళు ఎటు వైపు!
పాజిటివ్ వైబ్రేషన్స్ తో వస్తున్న ఇరుముడి హిట్ అయ్యి రవితేజని ప్లాప్స్ భూతం నుంచి బయట పడేస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ తో పాటు అజయ్ ఘోష్ భూతులు మాట్లాడారనే విమర్శలు వస్తున్నా సినిమా బాగుంటే అవన్నీ జుజుబీ.. కానీ సినీ ట్రేడ్ సర్కిల్స్ లో ఇప్పట్నుంచే టాక్సిక్ వర్సెస్ ఇరుముడి నినాదం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. 'ఇరుముడి' ఈ నెల 21న అంటే ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఐదు రోజుల వ్యవధిలోనే, అంటే 26న యశ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్' థియేటర్లలోకి వస్తోంది. దీనివల్ల 'ఇరుముడి'కి ఫుల్ లెంగ్త్ 2 వారాల సోలో లాంగ్ రన్ లభించని పరిస్థితి ఏర్పడింది. కెజియఫ్ సిరీస్ తర్వాత యశ్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరగడం, 'టాక్సిక్' సినిమాపై ఉన్న మైండ్ బ్లాకింగ్ అంచనాల వల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లు, ప్రైమ్ షోలు ఆ సినిమాకే కేటాయించాల్సి వస్తుంది. మొదటి 3 రోజుల్లోనే 'ఇరుముడి' అత్యంత వేగంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, భారీగా కలెక్షన్లు రాబడితేనే థియేటర్లను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. 'ఇరుముడి'లోని భక్తి, ఎమోషన్, డ్రామా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కలెక్షన్లు స్థిరంగా ఉంటాయి. కానీ బాక్సాఫీస్ టైమింగ్ లెక్కల్లో 5 రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో, రవితేజ తన మార్కెట్ హోల్డ్ను మొదటి వీకెండ్లోనే 100% నిరూపించుకోవాల్సి ఉంది. మరి 'టాక్సిక్' సునామీని తట్టుకుని మాస్ మహారాజా 'ఇరుముడి' విజయం సాధిస్తుందో లేదో చూడాలి. Also read: ఆ రాజకీయ పార్టీలో చేరిన శ్రష్టి వర్మ.. అసలు ఆట ఇప్పుడు మొదలు కానుందా! ఏది ఏమైనా ఈ రసవత్తు పోరు అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుండగా సినీ అభిమానులు, ప్రేక్షకులు మంత్ ఎండింగ్ సమీపిస్తుండటంతో రెండు సినిమాలని ఫ్యామిలీ తో సహా చూడటానికి కావాల్సిన సరిపడా అమౌంట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. పైగా పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మాన్ షో 'ఖలీఫా' 20 వ తారీకు విడుదల కావడం బోనస్. Irumudi, Toxic, Raviteja, Yash
Aug 17, 2026 5:13PM
'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ సునామీ: 10 రోజుల్లో ఎన్ని కోట్ల గ్రాస్ అంటే.?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'. ఆగష్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నవ్వుల వర్షం కురిపిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతో కసితో కష్టపడ్డారు. ఆ కష్టానికి, నిరీక్షణకు దక్కిన ఫలితం ఈ 50 కోట్ల క్లబ్. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి 'కొరియన్ కనకరాజు' బ్లాక్బస్టర్గా నిలిచింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన రోజు నుంచే హౌస్ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండ బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగుతుంది. కనకరాజు(వరుణ్ తేజ్) అనే పక్కా లోకల్ కుర్రాడి శరీరంలోకి, ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర పాయింట్ తో ఇది తెరకెక్కింది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్లో వచ్చిన కామెడీ ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తోంది. రెండో వారంలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు భారీ ప్రాఫిట్స్ అందించిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. https://x.com/UV_Creations/status/2089266652139639157 Varun Tej, Korean Kanakaraju, 10 Days Collections, 50 Crore Gross
Aug 17, 2026 4:43PM
ఆ రాజకీయ పార్టీలో చేరిన శ్రష్టి వర్మ.. అసలు ఆట ఇప్పుడు మొదలు కానుందా!
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ విషయం సినీ సర్కిల్స్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో క్రేజీ న్యూస్ గా మారింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు వర్ధమాన కళాకారులు, డాన్సర్స్ కూడా భారీ సంఖ్యలో బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్లోని ఇటావా పట్టణానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రష్టి వర్మ చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. భరతనాట్యంలో శిక్షణ పొంది, కేవలం 8 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక 'తాజ్ మహోత్సవ్' వంటి జాతీయ స్థాయి వేదికలపై డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. తొలినాళ్లలో పైలట్ కావాలని కలలు కన్నప్పటికీ, నృత్యంపై ఉన్న తీవ్రమైన మక్కువతో మోడలింగ్, డ్యాన్స్ రంగాన్ని ఎంచుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన 'ఢీ' డ్యాన్స్ రియాలిటీ షోలో కో డ్యాన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'ఢీ-జోడీ' సిరీస్లో కంటెస్టెంట్గా పాల్గొని, తన అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులనే కాక జడ్జిలను సైతం ఫిదా చేసి విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. తెలుగు సినీ రంగానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పరిచయమైన శ్రష్టి వర్మ అనతికాలంలోనే అగ్ర కథానాయకుల సినిమాలకు నృత్య రీతులు సమకూర్చే అవకాశాలు దక్కించుకున్నారు. Also read: డీసీ మూవీ చూసిన #మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా షాకింగ్ రిప్లై సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రంలోని 'నువ్వు కావాలయ్యా' మాస్ సాంగ్కు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2' చిత్రంలోని పాపులర్ 'సూసేకి..' పాటకు ఆమె అసిస్టెంట్గా అందించిన కొరియోగ్రఫీ ట్రెండ్ సెట్ చేసింది. వీటితో పాటు 'అల వైకుంఠపురములో', 'క్రాక్', 'బీస్ట్', 'గేమ్ ఛేంజర్', 'మనమే', అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన 'కిసి కా భాయ్ కిసి కా జాన్' వంటి భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలకు ఆమె కొరియోగ్రఫీ టీమ్లో కీలక పాత్ర పోషించారు. డ్యాన్స్ రంగంలోనే కాక 'యథా రాజా తథా ప్రజా' అనే చిత్రంతో నటిగా కూడా మారిన శ్రష్టి వర్మ, బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన 'బిగ్ బాస్: సీజన్-9' లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి తన గ్లామర్, గేమ్ప్లేతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ప్రజాసేవ చేసేందుకే శ్రష్టి వర్మ పార్టీలో చేరినట్లుగా తెలుస్తుంది. Shrasti Verma, Jani Master
Aug 17, 2026 4:37PM
డీసీ మూవీ చూసిన మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా షాకింగ్ రిప్లై
ఎన్ని సినిమా న్యూస్ వచ్చినా సైట్స్, సోషల్ మీడియాకి రాని 'కళ' మహేష్ బాబు న్యూస్ వస్తే మాత్రం ఆయా సైట్స్, సోషల్ మీడియాకి కళ తో పాటు అదనపు శోభని తెచ్చిపెడుతుంది. తాజాగా మహేష్ బాబు లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా 'డీసీ' చిత్రాన్ని వీక్షించి, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. 'డీసీ' అత్యంత వినూత్నమైన, అద్భుతమైన సినిమా. సినిమా ప్రెజెంటేషన్ చాలా కూల్గా అనిపించింది. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి చిన్న అంశాన్ని ఎంతగానో ఆస్వాదించాను. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ మహేష్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు నుంచి వచ్చిన ఈ ఊహించని ప్రశంసలపై దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మరియు సంగీత దర్శకుడు అనిరుధ్ స్పందిస్తూ సూపర్ స్టార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Also Read: దిల్ రాజు లాంటి నిర్మాత మళ్లీ ఎందుకు రాలేదు.. వస్తాడా! వస్తే ఎప్పుడు! ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన డిసి విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, దేశీయంగా రూ. 50.26 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఇది రూ. 100 కోట్ల క్లబ్ దిశగా శరవేగంగా దూసుకెళ్తుండడం గమనార్హం. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన క్లాసిక్ నవల 'దేవదాస్' స్ఫూర్తితో నేటి క్రైమ్ యాక్షన్ నేపథ్యానికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. నటుడిగా మొదటి అడుగు వేసిన లోకేష్ కనగరాజ్ తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో దేవదాస్ పాత్రలో జీవించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కథానాయికలుగా వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి నటన చిత్రానికి ప్రధాన పిల్లర్లుగా నిలిచాయి. ఇక రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ డార్క్ యాక్షన్ మూవీకి ప్రాణం పోశాయి. Mahesh Babu, Dc, Lokesh kanagaraj, Tollywood
Aug 17, 2026 4:08PMపబ్లిసిటీతో థియేటర్లు నిండుతాయా? ప్రేక్షకుల ఆలోచన ఎలా ఉంది.?
ఈ రోజుల్లో ఒక సినిమాను నిర్మించడం ఎంత కష్టమో.. దానిని బాక్సాఫీస్ వద్ద సరైన రీతిలో రిలీజ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంతకంటే పెద్ద కష్టంగా మారిపోయింది. నెల రోజుల ముందు నుంచే ఊరూవాడా ప్రమోషన్ల హోరు ఎత్తడం, గ్లింప్స్లు, ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లతో సోషల్ మీడియాను ఊపేయడం కామన్ అయిపోయింది. కంటెంట్ను జనం ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ నూటికి నూరు శాతం వాడుకోవడానికి దర్శకులు, నిర్మాతలు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడుతోంది. ప్రమోషన్ల సమయంలో 'ఇదొక విజువల్ వండర్', 'ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు' అంటూ చిత్ర యూనిట్ చేసే హంగామా ఒకెత్తయితే, తీరా థియేటర్కు వెళ్లాక అందులో మేటర్ లేకపోతే ప్రేక్షకులు దారుణంగా తిప్పి కొడుతున్నారు. పబ్లిసిటీ ఈవెంట్లలో చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మే రోజులు పోయాయని, కంటెంట్ ఉంటేనే ఆదరిస్తామని సినీ ప్రియులు తేల్చిచెబుతున్నారు. సినిమా రిలీజ్ కాకముందు ఎంత బిల్డప్ ఇచ్చినా, మొదటి రోజు ఉదయం ఆట పడగానే వచ్చే పబ్లిక్ టాక్, మౌత్ టాక్ మీదే థియేటర్ల భవిష్యత్తు ఆధారపడుతోంది. ఓటీటీల దాడి, టికెట్ రేట్ల భారం పెరిగిన ఈ కాలంలో ప్రేక్షకుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కేవలం పోస్టర్లు, ఇంటర్వ్యూలు చూసి థియేటర్ వైపు రావడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. నిజంగా సినిమాలో విషయం ఉందనే టాక్ వస్తేనే ఫ్యామిలీతో సహా థియేటర్ మెట్లు ఎక్కుతున్నారు. మరోవైపు, ప్రమోషన్ల కోసమే నిర్మాతలు కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. పబ్లిసిటీ బడ్జెట్ పెరిగిపోయి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతున్నా.. తీరా రిలీజయ్యాక ఆ ఖర్చులో పదో వంతు కూడా రికవరీ కాకపోవడం నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎంత ఊదరగొట్టినా కంటెంట్లో దమ్ము లేకపోతే ఏ ప్రమోషన్ స్ట్రాటజీ కూడా సినిమాను కాపాడలేకపోతోందనేది పచ్చి నిజం. పోస్టర్లతోను, హంగులతోను జనాలను ఒక రోజు మభ్యపెట్టవచ్చేమో కానీ, మూడు గంటల థియేటర్ అనుభవాన్ని మార్చలేరు. ప్రమోషన్ల కోసం కోట్లు తగలేసే కంటే.. ఆ శ్రద్ధను, ధనాన్ని మంచి కథ, కథనాలపై పెడితేనే సినిమాను బాక్సాఫీస్ విజేతగా నిలబెట్టగలరని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Aug 17, 2026 4:05PM
దిల్ రాజు లాంటి నిర్మాత మళ్లీ ఎందుకు రాలేదు.. వస్తే ఎప్పుడు!
దిల్ రాజు.. పర్సన్ తో సంబంధం లేకుండా కంటెంట్ పైనే దృష్టి పెట్టి భారీ హిట్స్ అందుకొని బడా నిర్మాత అయ్యాడు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన సినీ జర్నీ, సాధించిన విజయాలు, ప్రస్తుత జర్నీ అందరకి తెలిసినవే . కానీ తెలియాల్సిందల్లా దిల్ రాజు టైప్ లోనే 'ఎలాంటి కథ ప్రేక్షకులకు నచ్చుతుంది? ఎంత బడ్జెట్ తో సేఫ్ అవుతాము? ఏ వర్గం ఆడియెన్స్ ఏ సినిమాని గుండెల్లో పెట్టుకుంటారు? అనే విషయాలని అలోచించి విజయదుందుభి మోగించే మరో నిర్మాత ఇండస్ట్రీలో ఎందుకు రాలేదు అని. అందుకు గల కారణాల గురించి నిత్యం సినీ సర్కిల్స్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటి సినీ పరిస్థితులని పరిశీలిస్తే, నిర్మాతలు అసలైన 'కంటెంట్'ను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కథే కథానాయకుడిగా ఉండేది. కానీ ఇప్పుడు కథ కంటే ఎక్కువగా హంగులు, ఆర్భాటాలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. నిర్మాతలు 100% దృష్టిని కథలోని భావోద్వేగాలు, స్క్రిప్ట్ బలం మీద పెట్టాల్సింది పోయి, కేవలం కాంబినేషన్లు కుదర్చడంలోనే సమయాన్ని వృథా చేస్తున్నారు. ఈ క్రమంలో అసలైన కథాబలం కొరవడి, బాక్సాఫీస్ వద్ద 70% నుండి 80% సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పటికీ, థియేటర్లలో కనీసం రెండు వారాల పాటు నిలబడలేకపోవడానికి కారణం కంటెంట్ లేకపోవడమే. దీనికి తోడు ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో 'షో బాచ్' సంస్కృతి తీవ్రంగా పెరిగిపోయింది. నిర్మాతతో పలనా దర్శకుడి వద్ద అసిస్టెంట్ గా చేసాని అని చెప్పగానే కథని పుట్టిస్తున్నాడా! సృష్టిస్తున్నాడా అని చూడకుండా చెప్పేదే గొప్పది అనుకుంటూ వింటున్నారు. ఈ విషయంలో దర్శకుడు చెప్పేది నిజమా కాదా, ప్రస్తుతం ఎలాంటి కథలని చూస్తున్నారు. లేదా బయట ప్రేక్షకుల మెంటాలిటీ ఎలా ఉంది, ఎలాంటి కథని తెరకెక్కించాలి అని నిర్మాత జడ్జ్ చేయలేకపోతున్నాడు.అసలు కథతో, మేకింగ్తో సంబంధం లేని వ్యక్తులు, పబ్లిసిటీ స్టంట్లు చేసేవారు, సోషల్ మీడియా హంగామా చేసే కొన్ని పిఆర్ గ్రూపులు ఎక్కువైపోయాయి. వీరంతా సినిమా షూటింగ్ ప్రారంభం నుండి విడులయ్యే వరకు అనవసరమైన హడావుడి చేస్తూ లీక్లు, హైప్ క్రియేట్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతలు స్క్రిప్ట్ టేబుల్ వద్ద గంటల తరబడి కూర్చుని, 10 నుండి 15 సార్లు రీ-రైట్ చేయించి, ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవారు. కానీ నేటి తరం నిర్మాతలు షూటింగ్ స్పాట్లో కేవలం ఆర్భాటాలు, కారవాన్ల హంగామా, అనవసరపు ఖర్చులకే పరిమితమవుతున్నారు. Also read: లక్షమంది అమ్మాయిలకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ కానుక గత ఐదేళ్లలో తెలుగు సినీ పరిశ్రమ పరిమాణం మరియు బడ్జెట్లు 300% పైగా పెరిగాయి. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల రూ. 200 కోట్ల నుండి రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు సర్వసాధారణం అయ్యాయి. కానీ బడ్జెట్ పెరిగినంతగా కంటెంట్ క్వాలిటీ పెరగడం లేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏకంగా 30% నుండి 40% బడ్జెట్ కేవలం నిర్మాణ విలంబన, అనవసరమైన వృథా ఖర్చులకే సరిపోతోంది. దిల్ రాజు ఒక సినిమాను అనుకున్న బడ్జెట్లో, అనుకున్న సమయానికి పూర్తి చేసి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా సరైన ధరకు థియేటర్లకు చేర్చే వ్యవస్థను నిర్మించారు. కానీ నేటి నిర్మాతలు బిజినెస్ లెక్కల మీద ఉన్న శ్రద్ధ, ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడం మీద పెట్టడం లేదు. సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం కాదు, అది ఒక వ్యాపారం మరియు కళల కలయిక. దిల్ రాజు లాంటి విజనరీ నిర్మాతలు మళ్లీ రావాలంటే, నిర్మాతలు కేవలం ఫైనాన్సియర్లుగా మిగిలిపోకుండా, కథను ప్రేమించే నిజమైన క్రియేటర్లుగా మారాల్సిన అవసరం ఉంది. అసలు కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు కూడా కాంబినేషన్స్ వెంట పడుతున్నాడని ఫిలిం నగర్ లో డైలీ వినిపించే న్యూస్. Dil Raju, Tollywood
Aug 17, 2026 3:37PMతెలుగు సినిమా పయనం ఎటు వైపు? హీరోలు ఏం చెయ్యబోతున్నారు?
'ప్రేక్షకులే మా దేవుళ్లు.. వారి నవ్వులే మాకు నిజమైన రివార్డులు' అంటూ ప్రమోషన్స్ వేదికలపై ప్రతి స్టార్ హీరో నోటి నుంచి వినిపించే మాట ఇది. కానీ, తీరా థియేటర్లోకి వెళ్తే పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులను గమనిస్తే ఒక ప్రశ్న స్పష్టంగా నిలదీస్తోంది. సినిమాలు తీస్తున్నది ప్రేక్షకుల వినోదం కోసమా? లేక తమ మాస్ ఇమేజ్, పాన్-ఇండియా రేంజ్, సొంత సంతృప్తి కోసమా? ప్రేక్షకుల అభిరుచిని, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను పక్కనపెట్టి మన హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే హాయిగా నవ్వుకునే హాస్యం, గుండెలను పిండేసే అనుబంధాలు, భావోద్వేగాలు నిండిన కుటుంబ కథా చిత్రాలు రాజ్యమేలేవి. పండగొచ్చినా, వీకెండ్ వచ్చినా ఇళ్లల్లోని పెద్దలు, పిల్లలు, మహిళలంతా కలిసి థియేటర్ వైపు అడుగులు వేసేవారు. కానీ నేటి పరిస్థితి చూస్తే.. కుటుంబంతో కలిసి చూసేందుకు వీలైన సినిమాలు ఏడాదిలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయాయి. స్క్రీన్ పై పదే పదే కత్తి పట్టి నరకడం, రక్తం ఏరులై పారడం, ఊచకోతలు కోయడమే ఒక ఉద్యమంగా మారిపోయింది. మరోవైపు, "థియేటర్లకు జనాలు రావడం లేదు.. ఓటీటీల వల్లే బాక్సాఫీస్ దెబ్బతింటోంది" అంటూ నిర్మాతలు, దర్శకులు తరచూ గగ్గోలు పెడుతుంటారు. కానీ, అసలు నిజం ఏమిటంటే.. మితిమీరిన హింస, అశ్లీలత కారణంగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ఇండస్ట్రీయే స్వయంగా అడ్డుకుంటోంది. పిల్లలతో కలిసి థియేటర్కు వెళ్లి గంటన్నర పాటు రక్తపాతం చూసి భయపడటం కంటే, హాయిగా ఇంట్లోనే ఓటీటీలో పాత సినిమాలు లేదా పద్ధతిగల షోలు చూసుకోవడమే నయమని ఫ్యామిలీ ఆడియన్స్ భావిస్తున్నారు. పెద్ద హీరోలు సైతం తాము సేఫ్ జోన్ వీడుతున్నామని చెప్తూ మాస్, డార్క్, రా-అండ్-రస్టిక్ కాన్సెప్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. 100 కోట్ల బడ్జెట్లతో నిర్మించే చిత్రాల్లో గ్రాఫిక్స్, నరకడాలు, యాక్షన్ డిజైన్పై పెడుతున్న శ్రద్ధ.. కథలో ఉండాల్సిన హృదయాన్ని తాకే సీన్ల పై పెట్టడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్లాస్, ఫ్యామిలీ డ్రామాలను కేవలం చిన్న సినిమాలకే పరిమితం చేసి, స్టార్ హీరోలంతా 'కత్తుల సవాల్' కే జై కొడుతున్నారు. మాస్ ఆడియన్స్ను అలరించడం ఎంత అవసరమో, కనీస వినోదాన్ని పంచుతూ హాయిగా సాగే చిత్రాలను అందించడం కూడా అంతే ముఖ్యం. 'ప్రేక్షకుడే దేవుడు' అనే పదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, మళ్లీ కుటుంబాలు హాయిగా థియేటర్లలో నవ్వుకునే రోజుల్ని తీసుకురావాల్సిన బాధ్యత మన దర్శకులు, హీరోలపై ఎంతైనా ఉంది. ఈ వైలెన్స్ ట్రెండ్ ఎన్నాళ్లు సాగుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్ నిరాదరణ బాక్సాఫీస్పై లాంగ్ రన్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది రాబోయే రోజుల్లో టాలీవుడ్ కచ్చితంగా ఆలోచించాల్సిన అంశం. Tollywood Extreme Violence Movies, Telugu Family Entertainer Movies, Tollywood Star Heroes Movies, Telugu Cinema Box Office Trends, Family Audience Theatre Footfalls
Aug 17, 2026 2:58PM
లక్షమంది అమ్మాయిలకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ కానుక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ఆ పేరుకి ఉన్న వైబ్రేషన్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే పాన్ ఇండియా ఫ్యాన్స్, ప్రేక్షకులు మాకు తెలుసు అని ఆ వైబ్రేషన్ తాలూకు రికార్డుల గురించి పూస గుచ్చినట్టుగా చెప్తారు. అల్లు అర్జున్ ఇటీవల తన అభిమానులతో మీటింగ్ నిర్వహించి వాళ్లందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సామాజిక సేవ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది. మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణపై, దానిని అడ్డుకునే హెచ్పీవీ (HPV - Human Papillomavirus) వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. 'ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు' అనే ప్రధాన ఆశయంతో ముందడుగు వేసిన ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మహోద్యమం ద్వారా పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9 నుండి 26 సంవత్సరాల వయసు గల దాదాపు 1,00,000 మందికి పైగా బాలికలు, యువతులకు నేరుగా హెచ్పీవీ టీకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అల్లు అర్జున్ ఇచ్చిన "ప్రతి ఏటా ఒక మంచి పని" (One Good Deed Every Year) అనే పిలుపునే స్పూర్తిగా తీసుకుని, వైద్య నిపుణుల సమక్షంలో యువతులకు సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాలు మరియు టీకా ద్వారా దానిని నిరోధించే విధానాలను చాలా స్పష్టంగా వివరించారు. Also Read: ప్రస్తుతం ఏ సినిమా ఆడుతుందో, ఆడదో చెప్పలేని పరిస్థితి.. ప్రేక్షకుడా నీకు వందనం సోషల్ మీడియాలో #AAFASupportsHPVDrive హ్యాష్ట్యాగ్తో ఈ అరుదైన సేవా కార్యక్రమం ట్రెండ్ అవుతోంది. కేవలం అభిమాన ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన సైన్యంగా మారి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కృషి నిజంగా అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వస్థ్ నారీ వికసిత్ భారత్' లక్ష్యానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్ అభిమానులు ఈ అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించారు. Allu Arjun, Allu Arjun Fans, Hpv
Aug 17, 2026 2:49PM
ప్రస్తుతం ఏ సినిమా ఆడుతుందో, ఆడదో చెప్పలేని పరిస్థితి.. ప్రేక్షకుడా నీకు వందనం
సినిమా.. ప్రేక్షకులకి వినోదాన్ని పంచడానికి మాత్రమే పుట్టిన ఒక అద్భుతమైన దృశ్య సాధనం. కానీ క్రమక్రమంగా పంచభూతాల్లో ఒకటిగా మారింది. నేటికీ ఎంతో మంది మేకర్స్, హీరోలు, హీరోయిన్స్ డైలీ ఒక సినిమా చూడందే నిద్రపోని పరిస్థితి. అందుకే అంటారు ప్రపంచం మొత్తం పెను విపత్తుతో కొట్టుకుపోయినా సినిమా మాత్రం తన జెండా, అజెండా కొనసాగిస్తూనే ఉంటుందని. అలాంటి సినిమా ఒకప్పుడు విజయం సాధించాలంటే పెద్ద హీరో, అందరికి సులువుగా అర్ధమయ్యే కథ, భారీ బడ్జెట్, కలర్ఫుల్ పాటలు, అదిరిపోయే ఫైట్లు ఉంటే సరిపోయేది.కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో, ఏ సినిమా డిజాస్టర్గా మిగిలిపోతుందో ముందే అంచనా వేయడం అగ్ర నిర్మాతలు, దర్శకులకి, హీరోలకి సవాలుగా మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన ఊహించని మార్పులు సినిమా పరిశ్రమ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. నేటి తరం ప్రేక్షకులు చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉన్నారు. వారు కేవలం పోస్టర్, ట్రైలర్ చూసి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒకప్పుడు గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిన పెద్ద సినిమాలు కూడా, కథలో దమ్ము లేకపోతే కేవలం రెండు మూడు రోజుల్లోనే థియేటర్ల నుండి ఖాళీ అవుతున్నాయి. అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం కోటి లేదా రెండు కోట్ల బడ్జెట్తో వచ్చిన చిన్న సినిమాలు కేవలం నోటి మాట ప్రచారం అంటే 'వర్డ్ ఆఫ్ మౌత్'తో బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు, గతంలో కేవలం 5 శాతం నుండి 10 శాతం వరకు మాత్రమే ఉన్న చిన్న సినిమాల విజయాల శాతం, కంటెంట్ బలంతో ఏకంగా 40 శాతానికి పైగా వసూళ్లని సాధిస్తూ పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం ఓటీటీ (OTT) ప్లాట్ఫారమ్ల వ్యాప్తి. కరోనా తర్వాతి రోజుల్లో ఓటీటీ వినియోగం దాదాపు 300 శాతం పెరిగింది. డిజిటల్ విప్లవం వల్ల ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమాలు, వెబ్ సిరీస్లు చేతివేళ్ల వద్దకే అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రతీవారం థియేటర్కు వెళ్లి సినిమా చూడాలనే నియమం పోయింది. "కొన్ని రోజులు ఆగితే ఎలాగూ ఓటీటీలోనే వస్తుంది కదా" అనే భావన దాదాపు 60 శాతానికి పైగా ప్రేక్షకుల్లో నెలకొంది. అందుకే థియేటర్కు వచ్చి . 200 నుండి రూ. 300 వరకు టికెట్ కొని, మరో రూ. 200 పాప్కార్న్పై ఖర్చు చేయాలంటే ఆ సినిమాకు ఆ స్థాయి లార్జర్ ద్యాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదా బలమైన ఎమోషన్ ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తున్నారు. Also Read: అదరగొడుతున్న హుషార్ పిట్టలు కలెక్షన్స్.. త్రీ డేస్ లెక్క ఇదే! అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా సినిమా భవితవ్యాన్ని నిర్ణయించడంలో 80 శాతం పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు సినిమా రివ్యూలు ఆదివారం లేదా మరుసటి రోజు పేపర్లలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) ముగిసిన 15 నిమిషాలకే ట్విట్టర్ (X), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో లక్షలాది రివ్యూలు వ్యాపిస్తున్నాయి. నెగెటివ్ టాక్ కనుక ఒక్కసారి వైరల్ అయితే, ఆ సినిమా ఈవెనింగ్ షోలకే కలెక్షన్లు 50 శాతానికి పైగా పడిపోతున్నాయి. నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసే ప్రమోషన్ల కంటే, సాధారణ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఇచ్చే అర నిమిషం రివ్యూనే బాక్సాఫీస్ విజయాన్ని శాసిస్తోంది. మరో ఆసక్తికరమైన నిజం ఏంటంటే... ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ డమ్ కంటే సబ్జెక్ట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు కూడా సరైన స్క్రీన్ప్లే లేకపోతే వందల కోట్ల నష్టాలను మిగులుస్తున్నాయి. అదే కొత్త నటీనటులు, సరికొత్త కాన్సెప్ట్లతో వచ్చే థ్రిల్లర్లు, డ్రామాలు, రూటెడ్ ఎమోషనల్ కథలు 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతున్నాయి. కానీ ఇదే నిజమని అనుకున్నా కూడా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇటీవల చిన్న చిత్రాలు కొన్ని మంచి కంటెంట్ తోనే వచ్చాయి. కానీ ప్రేక్షకులు ఆదరించలేదు. అందుకే ఏ సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పాలని పరిస్థితి. Cinema, Telugu Cinema, Tollywood
Aug 17, 2026 2:25PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com










