
కాకా ధూమ్ ధమాకా: క్రేజీ కళ్యాణం సాంగ్ రిలీజ్.. అనుపమ మాస్ స్టెప్పులు.!
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కళ్యాణం". యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'కాకా ధూమ్ ధమాకా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. పెళ్లి భరాత్ లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు నచ్చేలా రూపొందించారు. ఈ పాటను సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి అదిరే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేశారు. 'కాకా ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక. మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు.. కొంగు ముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు..' అంటూ ఈ పాట ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. 'కాకా ధూమ్ ధమాకా' పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఆమె చేసిన స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి. [Kaaka Dhoom Dhamaka Song, Crazy Kalyanam Movie, Anupama Parameswaran, Tharun Bascker, Suresh Bobbili Songs, Telugu Songs, Telugu Film News]
Sep 12, 2026 7:45PM
250 కోట్ల బొమ్మ: ఓటీటీలో 'విశ్వనాథ్ & సన్స్' రెస్పాన్స్ ఎలా ఉందంటే.?
కోలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఆగస్ట్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.250 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. తండ్రీ కొడుకుల అనుబంధం, ఎమోషనల్ డ్రామా, అద్భుతమైన నటనతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఊహించని రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైన మొదటి రోజు నుంచే 'విశ్వనాథ్ & సన్స్' ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. థియేటర్లలో మిస్ అయిన కుటుంబ ప్రేక్షకులు, అలాగే మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాను ఓటీటీలో విపరీతంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సూర్య పండించిన ఎమోషన్స్, వెంకీ అట్లూరి హృదయానికి హత్తుకునే డైలాగ్స్ సోషల్ మీడియాలో క్లిప్స్గా మారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సూర్య తన సీరియస్ రోల్స్ నుంచి కాస్త పక్కకి జరిగి, ఎంతో మెచ్యూర్డ్ ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్లో జీవించేశారు. వెంకీ అట్లూరి టేకింగ్, జీవి మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిజిటల్ వ్యూయర్స్ను కట్టిపడేస్తున్నాయి. "చాలా కాలం తర్వాత ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా చూశాం" అంటూ ఓటీటీ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు. థియేటర్లలో 250 కోట్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపై కూడా సరికొత్త వ్యూయర్షిప్ రికార్డులను నమోదు చేస్తోంది. [Vishwanath and Sons OTT Response, Vishwanath & Sons, Vishwanath and Sons, Suriya, Venky Atluri, Telugu OTT Movies, Telugu Film News, Telugu News]
Sep 12, 2026 7:14PM
ది ప్యారడైజ్ స్టోరీ లీక్: అసలు కథ ఇదేనా?
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల మాస్ రగ్ డ్ మూవీ 'ది పారడైజ్ 'ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతుంది. ఆయా షేర్', 'యేష నాగుల' సాంగ్స్పవర్ ఫుల్ గ్లింప్స్ నెట్టింట సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా కథకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలనాత్మక వార్త లీక్ అయి వైరల్ అవుతోంది. ఈ లీక్ ప్రకారం కథ మొత్తం ఒక అణచివేయబడిన గిరిజన తెగ చుట్టూ, 1960 - 1980ల నాటి పీరియడ్ నేపథ్యంలో తిరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ఇప్పటివరకు ఎన్నడూ చూడని రఫ్ అండ్ రస్టిక్ అవతార్లో పొడవాటి జడలతో కనిపిస్తున్నారు. లీక్ అయిన కథనం ప్రకారం, ఈ చిత్రం సమాజంలో అణచివేతకు గురైన శవరి తెగ పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. నాని తన 18 సంవత్సరాల సినీ ప్రస్థానంలోనే ఇది అత్యంత కష్టమైన, మానసికంగా మరియు శారీరకంగా శ్రమతో కూడుకున్న క్యారక్టర్ అని ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో స్వయంగా వెల్లడించారు. Also Read: 90లనాటి ఐకానిక్ కామెడీ వినోదం: ఇప్పటి సినిమాల్లో ఆ మ్యాజిక్ మిస్ అవుతోందా? సోషల్ మీడియాలో ఈ సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో तब्బుల 1,000 మందితో భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంద ని, సీక్రెట్ అండర్వాటర్ యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ, హీరో నాని స్వయంగా స్పందిస్తూ 1,000 మందితో ఫైట్ గానీ, అండర్వాటర్ సీక్వెన్స్లు గానీ ఇందులో లేవని క్లారిటీ ఇచ్చారు. టీజర్ చూసి ఇదొక కేవలం రక్తం చిందే వైలెంట్ యాక్షన్ సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటేనని, ఇది ఒక బలమైన అమ్మా, కొడుకుల సెంటిమెంట్ కథ అని మేకర్స్ స్పష్టం చేశారు. "పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది" అనే కాళోజీ నారాయణరావు గారి అమూల్యమైన మాటల ప్రేరణతో ఈ సినిమా కథను శ్రీకాంత్ ఓదెల మలిచారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పటికీ, తమ సొంత ప్రాంతంలోనే గుర్తింపు లేక అన్యాయానికి గురైన ఒక తెగ తిరుగుబాటు ఆధారంగా 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేషన్ పొందిన ఈ సినిమాకు అనౌన్స్మెంట్ ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. [The Paradise , The Paradise Story Leak, Nani, Srikanth Odela, Anirudh Ravichander, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 6:59PM
తెల్ల కాగితం: విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ‘తెలుసా తెలుసా’ సాంగ్.!
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం.. అనుదీప్ దేవ్, లిప్సిక గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్ను మనసుని హత్తుకునేలా ఉంది. లిరికల్ వీడియో ఎంతో అందంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల జంట.. వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ పాటకు అదనపపు ఆకర్షణగా నిలిచాయి. [Telusa Telusa Song, Thellakaagitham Movie, Vijay Deverakonda, Harsh Roshan, Nakshatra, Vijai Bulganin, Telugu Songs]
Sep 12, 2026 6:48PM
90లనాటి ఐకానిక్ కామెడీ వినోదం: ఇప్పటి సినిమాల్లో ఆ మ్యాజిక్ మిస్ అవుతోందా?
హాస్య చిత్రాలు అలియాస్ కామెడీ చిత్రాలు.. ఆయురారోగ్యాలని అందించే అమృత వర్షిణి. ఆయురారోగ్యాలు బాగుంటే అష్టైశ్వర్యాలు అవే వస్తాయి కాబట్టి హాస్య చిత్రాలు చూడాలంటే పెట్టి పుట్టాలి. అసలు ఇప్పుడు తెరకెక్కాలంటేనే పెట్టి పుట్టాలనే పరిస్థితి. కుళ్ళు కామెడీ కాకుండా స్వచ్ఛమైన కామెడీ చూసి చాలా రోజులు అవుతుంది. 90ల కాలం నాటి తెలుగు సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆ రోజుల్లో థియేటర్కు వెళ్తే లభించే వినోదం, హాయిగా నవ్వుకునే వాతావరణం ఈనాటి డిజిటల్ యుగంలో క్రమంగా కనుమరుగవుతోందనే అభిప్రాయం సినీ ప్రేక్షకుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జంధ్యాల, ఈవివి సత్యనారాయణ, ఎస్.వి. కృష్ణా రెడ్డి వంటి దిగ్గజ దర్శకులు అందించిన 100% క్లీన్ అండ్ కంప్లీట్ ఎంటర్టైనర్ సినిమాలు ఈ రోజుల్లో రావడం నిజంగానే కష్టమేనా అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. 90ల నాటి కల్ట్ క్లాసిక్ సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లలో 90% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో వారాల తరబడి హౌస్ఫుల్ బోర్డులతో నడిచేవి. ఆ సినిమాలలో కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాలు మరియు శ్రావ్యమైన సంగీతం ఉండేవి. ఈనాటి మోడర్న్ ఫిల్మ్మేకింగ్లో విజువల్ ఎఫెక్ట్స్ మరియు 4K క్వాలిటీ మేకింగ్ వచ్చినప్పటికీ, కథలోని సహజత్వం మరియు హాస్యంలో ఉండాల్సిన ఆత్మీయత కొరవడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 90లలో వచ్చిన కామెడీ సినిమాలలో బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, కోట శ్రీనివాసరావు మరియు మల్లికార్జున రావు వంటి నటుల కాంబినేషన్ దాదాపు 95% సినిమాలను సూపర్ హిట్ తీరానికి చేర్చేది. వారు కేవలం డైలాగ్స్ ద్వారానే కాకుండా తమ శరీర భాష మరియు ముఖ కవళికలతో ప్రేక్షకులని పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవారు. నేటి సినిమాల్లో కామెడీ అనేది కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైపోతోంది లేదా డార్క్ కామెడీ, అడల్ట్ జోక్స్ వైపు మొగ్గు చూపుతోంది. Also Read: ఎవరు ఆ స్టార్ హీరోయిన్స్: దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ నిజాలు సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా, 90ల నాటి అమాయకత్వంతో కూడిన హాస్యాన్ని, బంధాల విలువలను ప్రతిబింబించే కథలను మళ్లీ వెండితెరపైకి తీసుకురావడం అతిపెద్ద సవాలుగా మారింది. ప్రేక్షకులు ఇప్పటికీ యూట్యూబ్, టీవీలలో 90ల నాటి సినిమాల కామెడీ క్లిప్లను మిలియన్ల కొద్దీ వ్యూస్తో చూస్తున్నారంటే ఆ సినిమాల ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ 10 లో 8 మంది సినీ అభిమానులు పాత సినిమాల హాస్యాన్నే రీ-వాచ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి 90ల నాటి మ్యాజిక్ను మళ్లీ పునఃసృష్టి చేయడం కష్టమే అయినప్పటికీ, మంచి రచన మరియు సహజమైన హాస్యంతో కూడిన కథలు వస్తే నేటి తరం ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనడంలో సందేహం లేదు. ఎందుకంటే హాస్యం సర్వరోగనివారిణి. [90s Telugu Comedy Movies, brahmanandam comedy , evv satyanarayana , Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 6:35PM
ప్యారడైజ్: నాని క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది.. ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్.!
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? - నాని గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ గారు చాలా కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు చూడలేదు. మాకు కూడా అది చాలా కొత్తగా అనిపించింది. నాని గారు ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. - నాని గారు ఈ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే మొదటిసారి. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయి. ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉంటుంది. - జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు. యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ జడలు రూప్లకు, ముఖానికి తగులుతుంటాయి. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయడం మాకు కూడా కొత్త అనుభవమే. మా అసిస్టెంట్కు కూడా అలాంటి జడలు వేయించి అందులో ఉండే కష్టం తెలుసుకుని మరీ యాక్షన్ను కంపోజ్ చేశాం. - నాని గారి కెరీర్లోనే ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు. ప్రతి విషయంలో తన 100 శాతం కష్టపడ్డాడు. ఎన్ని టేక్స్ అయినా చేయాలని మనసులో ఫిక్స్ అయ్యాడు. నిజంగా నాని ఇంత కష్టపడతాడని మేం ఊహించుకోలేదు. అంత గొప్పగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. - నాని బేర్ బాడీతో చేసే యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. అవి స్క్రీన్పై చేయడం అంత ఈజీ కాదు. బాడీ బిల్డింగ్ చేయాలి. డైటింగ్లో ఉండాలి. ఇందులోనూ దర్శకుడు శ్రీకాంత్ తనకు అనుకున్నది వచ్చేంతవరకు రాజీపడరు. శ్రీకాంత్ తీసుకున్న విజన్కు నాని 100 శాతం న్యాయం చేశారు. అందులో మేం భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాం. యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? - మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టింది. ఇందులో కొత్త మనుషులు, కొత్త బాడీ లాంగ్వేజ్.. అంతా కొత్తగానే ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ సహజంగానే యాక్షన్ను డిమాండ్ చేస్తుంది. ఇందులో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు.. ఫైట్ చేయాల్సిందే. అలాంటి పరిస్థితిని శ్రీకాంత్ క్రియేట్ చేశారు. - యాక్షన్ను కంపోజ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి బాడీ లాంగ్వేజ్తో సినిమా ఇంతకుముందు రాలేదు. అందుకే చాలా కేర్ తీసుకుని చేశాం. ఇందులో చాలా రిస్కీ యాక్షన్ ఉంటుంది. షూటింగ్ సమయంలో మా యూనిట్లో ఒకరికి గాయం కూడా అయింది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? - మోహన్ బాబు గారు చాలా సినిమాలు చేశారు. కానీ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయనకూ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. టెక్నికల్ టీం గురించి? - దర్శకుడు శ్రీకాంత్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. కెమెరామెన్ సాయి కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. ఇందులో లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. అందులో వాడిన పరికరాలు కూడా కొత్తగా ఉంటాయి. అనిరుద్ గారి మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. నిర్మాత సుధాకర్ గారి గురించి ? - సుధాకర్ గారు ఎక్కడా రాజీపడకుండా భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు. నాని, దర్శకుడిపై పూర్తి నమ్మకంతో ముందుకెళ్లారు. నాని గారు, నిర్మాత, దర్శకుడు కలిసి ‘ప్యారడైజ్’ను బిగ్ స్కేల్ లో చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన విజయం తప్పకుండా దక్కుతుందని మేం నమ్ముతున్నాం. [Ram Lakshman Interview, The Paradise Movie, Natural Star Nani, Fight Masters Ram Lakshman, Nani Paradise, Srikanth Odela, Telugu Film News, Telugu News]
Sep 12, 2026 6:27PM
మాస్ ట్రీట్: రవితేజ దర్శకుడితో ధ్రువ్ విక్రమ్ మూవీ.!
తమిళంలో తన విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ సెన్సేషన్ ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడు తన సరికొత్త లైనప్తో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో భాగంగానే రూపొందుతున్న భారీ ద్విభాషా చిత్రం 'DV4'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ బైలింగువల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ప్రేమికుల్లో, ముఖ్యంగా మాస్ ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'రాక్షసుడు', 'ఖిలాడి' వంటి హై-వోల్టేజ్ మాస్ అండ్ థ్రిల్లర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ను శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, పెన్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మేకర్స్, అక్టోబర్ 2026 నాటికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను పట్టాలెక్కించడానికి సమాయత్తమవుతున్నారు. సెప్టెంబర్ 23న ధ్రువ్ విక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ తో పాటు, సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు ధ్రువ్ విక్రమ్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. కరణ్ అరవింద్ కుమార్ ఆ చిత్రానికి దర్శకుడు. [DV4 Movie, Dhruv Vikram, Ramesh Varma, Sri Neeladri Productions, Pen Studios, Tamil Telugu Bilingual, Telugu Film News, Telugu News
Sep 12, 2026 6:11PM
ఎవరు ఆ స్టార్ హీరోయిన్స్: దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ నిజాలు
టంగ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు, ఒక్కోసారి మన కళ్ళ ముందు కనపడే, వినపడే దాంట్లో కూడా నిజం ఉండకపోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త మంది సినీ తారల గురించి వస్తున్న న్యూస్ కూడా ఆ కోవలోకే రావచ్చు. దుబాయ్ అనగానే మనందరికీ మెరిసే స్కైస్క్రేపర్లు, లగ్జరీ కార్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విలాసవంతమైన ప్రపంచం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఛమక్కుల వెనుక క్రికెట్ బెట్టింగ్, అండర్వరల్డ్ దందాలు, సినిమా గ్లామర్ల మధ్య నడిచే ఒక చీకటి సామ్రాజ్యం ఉందనేది నమ్మలేని సత్యం. ఆంతరంగికంగా నడిచే ఈ రహస్య వ్యవహారాలపై బుకీ అమిత్ మజిథియా బయటపెట్టిన సంచలన నిజాలు ఇప్పుడు క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. దుబాయ్లో ప్రైవేట్ షేక్లు, వ్యాపారవేత్తలు నిర్వహిచే రహస్య పార్టీలకు వేల కోట్ల రూపాయల నల్లధనం ఎలా ప్రవహిస్తుందో ఆయన బహిర్గతం చేశారు. ఈ సీక్రెట్ విందుల్లో పాలుపంచుకోవడానికి బాలీవుడ్ టాప్ నటీమణులు, మోడళ్లు ప్రత్యేకంగా విమానాల్లో చేరుకుంటారు. ముఖం ఎవరకి కనపడకుండా బుర్హాలు ధరిస్తారు. వాళ్లెవరో జనాలకి బాగా తెలుసు అక్కడ జరిగే నృత్య వేడుకలు, ముజ్రాల కోసం కోట్ల రూపాయలు చెల్లిస్తారని వివరించారు. ఈ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ప్రముఖ స్టార్ క్రికెటర్లు కూడా ఈ సీక్రెట్ దుబాయ్ విందుల్లో భాగమవుతుండటమే! ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ యాచ్లలో జరిగే ఈ ప్రైవేట్ పార్టీల్లో క్రికెటర్లు, బాలీవుడ్ భామలు, బుకీలు ఒకే వేదికపై కలుసుకుంటారని అమిత్ మజిథియా పేర్కొన్నారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ సమాచారం మార్పిడికి కూడా ఈ నైట్ పార్టీలే ప్రధాన వేదికలుగా మారుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో పద్ధతిగా కనిపించే పబ్లిక్ ఫిగర్స్, దుబాయ్ చీకటి గదుల్లో నిర్వహించే ముజ్రా పార్టీల్లో మద్యం, విలాసాల నడుమ ఎలా మునిగితేలుతారో ఆయన వివరంగా వెల్లడించారు. Also Read: సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య బ్రేక్ అప్ అయ్యిందా! ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందాల ద్వారా ప్రతి ఏడాది 100% కంటే ఎక్కువ రాబడి సాధిస్తూ కోట్ల విలువైన అక్రమ లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఈ ప్రైవేట్ ఈవెంట్లలో ఒక్కో ముజ్రా లేదా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు నటీమణులకు పారితోషికంగా ఇస్తారని సమాచారం. దుబాయ్లో చట్టాల పరిమితులు, ప్రైవేట్ విల్లాల కఠినమైన భద్రత కారణంగా 99% సందర్భాల్లో ఈ వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతారు. కేవలం 1% సంఘటనలు మాత్రమే ఏదో ఒక లీక్ ద్వారా లేదా దర్యాప్తు సంస్థల నిఘా ద్వారా వెలుగులోకి వస్తాయి. ఈ విందులకు హాజరయ్యే వారి ఫోన్లను సైతం ఎంట్రీ వద్దే స్వాధీనం చేసుకుంటారంటే అక్కడ ఎంత రహస్య వాతావరణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ వేదికగా సాగుతున్న ఈ గ్లామరస్ నెట్వర్క్ వెనుక ఉన్నది కేవలం వినోదం మాత్రమే కాదని, దీని వెనుక దాదాపు 1,00,000 కోట్లకు పైగా విలువైన అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్, హవాలా దందాలు ముడిపడి ఉన్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. [Amit Majithia, Dubai Secrets, Heroins, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 6:05PM
సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య బ్రేక్ అప్ అయ్యిందా!
సినీ ప్రేమికుల్ని, సంగీత ప్రియుల్ని నిద్రలో లేపి పలరించండి... సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో ఒక లెవల్, వాళ్ళ కాంబోలో వచ్చిన మొదటి సినిమా దగ్గరనుంచి అన్ని పాటలు వరుసగా వింటూనే ఉన్నాను. ఆర్ సి 17 సాంగ్స్ కోసం వెయిటింగ్ అని అంటుంటారు. అంతలా ఆ ఇద్దరి కాంబోకి క్రేజ్ ఉంది. సుకుమార్ మొదటి సినిమా ఆర్య దగ్గర్నుంచి ప్రీవియస్ పుష్ప 2 వరకు దేవినే మ్యూజిక్. దీన్ని బట్టి ఆ కాంబోకి ఏర్పడిన ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగిన ఈ సుదీర్ఘ అనుబంధంలో వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో మ్యూజికల్ చార్ట్బస్టర్స్ మరియు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే, రామ్ చరణ్, సుకుమార్ ల RC17 తో ఈ కాంబోకి బ్రేక్ పడనుందనే వార్తలు టాలీవుడ్లో వైరల్ గా మారాయి . 2024 హోలీ పండగ సందర్భంగా ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించినప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్పై దేవిశ్రీ ప్రసాద్ పేరే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ఆస్థాన సంగీత దర్శకుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. Also Read: యూత్ మూవీ అంటే బూతు సినిమానేనా: ఎపిక్ లో ఏం చెప్పారు! ఈ మార్పు వెనుక ఇటీవల విడుదలైన 'పుష్ప 2: ది రూల్' చిత్రం నిర్మాణ సమయంలో తలెత్తిన తీవ్రమైన క్రియేటివ్ డిఫరెన్సెస్ ముఖ్య కారణమని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. సినిమా విడుదలకు సమయం చాలా తక్కువగా ఉండటం, అనుకున్న గడువులోగా రీ-రికార్డింగ్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) అవుట్పుట్ రాకపోవడంతో సుకుమార్ ఇతర సంగీత దర్శకులైన ఎస్.ఎస్. తమన్, సామ్ సి.ఎస్ సేవలను అత్యవసరంగా ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని, అందువల్లే RC17 ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ బయటకు వచ్చాడని టాక్. ఈ క్రమంలోనే సుకుమార్ తన తదుపరి చిత్రం కోసం సరికొత్త సౌండింగ్ అండ్ మ్యూజిక్ అందిచేందుకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్, కోలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ సాయి అభ్యంకర్, హర్షవర్ధన్ రామేశ్వర్ లేదా అనిరుధ్ రవిచందర్ వంటి ఇతర సంగీత దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సగటు సినీ, సంగీత అభిమాని RC 17 కి సుకుమార్, దేవి కలిసి పని చేయాలని తమ ఇష్టదైవాన్ని కోరుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్పెషల్ సాంగ్స్ ప్రేమికులు కూడా. [RC17, Sukumar, Devisriprasad, Split Rumours, Pushpa 2 creative differences, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 5:04PM
‘ఆదర్శ కుటుంబం’ టీజర్: త్రివిక్రమ్ ఇలా షాకిచ్చాడు ఏంటి.?
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ టీజర్ తాజాగా విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, సరదా సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్లోని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. వెంకటేష్ కుటుంబాన్ని మొదట మధ్యతరగతి కుటుంబంగా పరిచయం చేశారు. చిన్న ఉద్యోగంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్టుగా వెంకటేష్ పాత్రను చూపించారు. ఆ తర్వాత లాటరీ లాంటిది తగిలి, ఆ ఫ్యామిలీ రిచ్ లైఫ్ చూస్తుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, టీజర్ చివర్లో క్రైమ్ ఎలిమెంట్స్ చూపించడం సర్ ప్రైజింగ్ గా ఉంది. "నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు. కానీ, సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను" అంటూ వెంకటేష్ తనలోని వయలెంట్ యాంగిల్ ను చూపించాడు. మొదట్లో టీజర్ ఎంత సరదాగా ఉందో, చివర్లో టీజర్ అంత వయలెంట్ గా మారిపోయింది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు.. ఇది ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. [Aadarsha Kutumbam Teaser, AK47 Teaser Telugu, Aadarsha Kutumbam House No 47, Venkatesh, Trivikram, Srinidhi Shetty, Telugu Film News, Telugu News]
Sep 12, 2026 4:49PM
యూత్ మూవీ అంటే బూతు సినిమానేనా: ఎపిక్ లో ఏం చెప్పారు!
ఒక మనిషికి ఈ భూమ్మీద ఎవరు పంచలేనంత ప్రేమని, మంచిని సినిమా మాత్రమే ఇస్తుంది. సినిమా చూసి బాగుపడని వారంటూ ఉండరు. ఎంత పెద్ద పండితులైనా వారానికి రెండు మూడు సినిమాలైనా చూడనిదే నిద్రపోరు. అష్టవదాని గరికిపాటి నరసింహారావునే ఒక ఉదాహరణ. అంతటి గొప్ప విజ్ణానానికి కేంద్ర బిందువైన సినిమాని అడ్డు పెట్టుకొని యూత్ ముసుగులో శృతిమించిన శృంగారాన్ని చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విడుదలైన ‘ఎపిక్’ సినిమా తర్వాత సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఈ చర్చ మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ సినిమాలో ఉపయోగించిన కొన్ని బోల్డ్ డైలాగ్స్, సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిని యథార్థ జీవితానికి అద్దం పట్టే ప్రయత్నంగా సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం యూత్ సినిమాల పేరిట బూతుని గ్లోరిఫై చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు ఒక సినిమాలో లైంగికతను లేదా శృంగారాన్ని చూపించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? లైంగిక సంబంధాలు, శృంగారాన్ని తెరపై చూపించడం వెనుక ఉన్న హద్దులేంటి అనే కోణంలో లోతైన విశ్లేషణ అవసరం. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం అని అంటుంటారు. నేటి యువత మాట్లాడుకునే భాష, వారి ఆలోచనా విధానం, బంధాలలో వారు ఎదుర్కొనే సమస్యలను నిజాయితీగా చూపించడమే తమ ఉద్దేశమని దర్శకులు చెబుతున్నారు. ‘ఎపిక్’ చిత్రంలో కూడా పాత్రల మధ్య ఉండే ఆవేశం, సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయని కొందరు బావిస్తున్నారు. అయితే, 100% నగ్నత్వాన్ని లేదా కేవలం లైంగిక చర్యలను మాత్రమే తెరపై చూపించడం వల్ల సినిమా గొప్పది అయిపోదు. ఒక కథలో శృంగార సన్నివేశం ఎందుకు ఉందో తెలిపే బలమైన భావోద్వేగం ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకుడు దానికి కనెక్ట్ అవుతాడు. అలా కాకుండా కేవలం పబ్లిసిటీ కోసం లేదా ఓపెనింగ్స్ రాబట్టడం కోసమే బోల్డ్ సీన్లు పెడితే, అది సినిమా స్థాయిని దిగజార్చుతుంది. Also Read: అలాంటి పుకార్లని నమ్మకండి: అందుకు హామీ ఇదే! గతంలో వచ్చిన అనేక ప్రపంచ ప్రసిద్ధ సినిమాలలో కూడా శృంగారాన్ని అత్యంత వినూత్నంగా, కళాత్మకంగా చూపించారు. కానీ అక్కడ కథనంలో 80% శాతానికి పైగా భావోద్వేగాలు, క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రమే ప్రధానంగా ఉండేవి. తెలుగులో కూడా యూత్ సినిమాల ట్రెండ్ మారుతోంది. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువతనే లక్ష్యంగా చేసుకుని దాదాపు 60% పైగా చిన్న చిత్రాలు నిర్మితమవుతున్నాయి. వీటిలో దాదాపు 40% చిత్రాలు కేవలం సెన్సేషనలిజం మీదే ఆధారపడుతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం బూతు మాటలు లేదా బోల్డ్ సీన్లు ఉంటే సరిపోదు, బలమైన కథాంశం 100% ఉండి తీరాలి. లైంగికత అనేది మానవ జీవితంలో ఒక సహజమైన భాగం. దానిని సినిమాలో చూపించడం తప్పు కాదు, కానీ దానిని ఏ రకంగా ప్రెజెంట్ చేస్తున్నారు అనేదే ముఖ్యం. ‘ఎపిక్’ వంటి సినిమాలు తెచ్చిన ఈ చర్చ కేవలం ఒక సినిమాకే పరిమితం కాదు, భవిష్యత్తులో రాబోయే యూత్ సినిమాల ధోరణిని నిర్దేశిస్తుంది. ప్రేక్షకులు కూడా కేవలం గ్లామర్, బూతు కంటెంట్ను మాత్రమే ఆదరించడం లేదని, కంటెంట్లో దమ్ముంటేనే 50 రోజులు థియేటర్లలో నిలబెడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి యూత్ సినిమా అంటే బూతు సినిమా కాదు, అది యువత ఆలోచనలను, వారి భావోద్వేగాలని ప్రతిబింబించే ఒక శక్తివంతమైన సాధనం అని నిరూపించాల్సిన బాధ్యత నేటి తరం దర్శకులపై ఉంది. [Youth Movies, Bold Content, Epic Analysis, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 4:35PM
అలాంటి పుకార్లని నమ్మకండి: అందుకు హామీ ఇదే!
తక్కువ సమయంలోనే వరుస చిత్రాలతో బిజీగా మారి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న భామ శ్రీలీల. విచిత్రంగా అంతే తక్కువ సమయంలో వరుస ప్లాప్ లతో స్టిల్ తెలుగులో సినిమాలు లేని పరిస్థితి. ప్రస్తుతం తన లిస్ట్ లో ధనుష్ 'ఓం'తో పాటు బాలీవుడ్ మూవీ ఉంది. ఈ రెండు ఆడితే శ్రీలీల జాతకం మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్టునే అసలైన ఆత్మ బంధువు. Also Read: ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా! శ్రీలీల తోటి నటీనటుల పట్ల ఈగో ప్రదర్శిస్తోందని, తనతో సమానంగా నటించే నటులు గానీ నటీమణులు గానీ లేరనే గర్వంతో వ్యవహరిస్తోందంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో నెగెటివ్ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల మాట్లాడుతు 'నాతో సమానంగా నటించే నటుడు లేదా నటి ఎవరూ లేరని నేను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నాకు ఎలాంటి అహంకారం లేదు, నేనెప్పుడూ ఎవరి దగ్గరా ఈగో ప్రదర్శించలేదు. అందరినీ సమానంగా గౌరవించే మనస్తత్వం నాది. కాబట్టి ఇలాంటి అనవసర పుకార్లని ఎవరూ నమ్మకూడదు, వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నా ధ్యాస అంతా ప్రస్తుతం నటనపైనే ఉంది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని పదిలపరుచుకోవడమే లక్ష్యం. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇరు రాష్ట్రాల అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. [Sreeleela, Ego Rumors, Dhanush, Om, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 4:03PM
పవన్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో భారీ చోరీ: చేసిందో ఎవరో తెలిస్తే షాక్ గ్యారంటీ
'హే చికితా' అంటూ పవన్ కళ్యాణ్ తో 'వస్తా నీ వెనుక' అంటూ మహేష్ బాబుతో ఆడిపాడి తెలుగు ప్రేక్షకులని వశం చేసుకున్న భామ 'అమీషా పటేల్. బాలీవుడ్ లో అయితే తన హవా చాలా బలంగానే చాటి చెప్పింది.ముంబై నగరంలోని చర్చిగేట్ ప్రాంతంలో ఉన్న అమీషా పటేల్ తల్లిదండ్రుల నివాసంలో సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురికావడం చిత్రపరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగతనం సంఘటనపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెరైన్ డ్రైవ్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి విచారణని వేగవంతం చేశారు. ఈ క్రమంలో అనుమానితురాలిగా ఉన్న ఇంట్లో పనిచేసే మహిళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో మలుపుగా మారింది. పోలీసు వివరాల ప్రకారం, ఈ దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని పాల్ఘర్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటేగా పోలీసులు గుర్తించారు. ఈమె గత 18 నెలలుగా (సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా) అమీషా పటేల్ తల్లిదండ్రుల నివాసంలో నమ్మకంగా పనిచేస్తోంది. జనవరి 2026లో ఇంట్లోని ఒక విలువైన వజ్రాలు పొదిగిన బంగారు గాజు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఈ వ్యూహాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన అమీషా తల్లి ఆశా పటేల్, సుమారు 5 నుండి 6 నెలల పాటు సీమాను నిలదీస్తూ, నిజం చెప్పి ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయమని కోరారు. కానీ, ఆమె నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, చివరకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. Also Read: ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా! ఫిర్యాదు నమోదు చేసుకున్న ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక క్రైమ్ డిటెక్షన్ టీమ్ సమర్థవంతంగా పనిచేసి, నిందితురాలు సీమా ఘాటే విరార్ ప్రాంతంలో ఉందనే పక్కా సమాచారాన్ని సేకరించి అక్కడ ఆమెను అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు సెప్టెంబర్ 15 వరకు పోలీస్ కస్టడీ విధించింది. Ameesha Patel, Pawan Kalyan, Ameesha Patel theft case,Mumbai, Mahesh Babu, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood
Sep 12, 2026 3:33PM
ఢీ-10 విన్నర్ రాజు అరెస్ట్: సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు.!
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ-10 విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. ఈ సెప్టెంబర్ 9న హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో రాజుపై ఒక యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని రాజు ఆమెకు ఆశ చూపాడట. పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మబలికి, ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. అవకాశాల పేరుతో తనను దారుణంగా మోసం చేశాడని, వేధింపులకు గురిచేశాడని ఆ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మియాపూర్ పోలీసులు.. తాజాగా రాజును అరెస్ట్ చేశారు. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించినట్లు సమాచారం. [Dhee 10 Winner, Dancer Raju Arrest, Dhee Raju Case, Sexual Harassment Case, Dhee Raju, Telugu Film News, Telugu News]
Sep 12, 2026 3:33PM
36 రోజుల్లో 3 సినిమాలు: విశ్వక్ సేన్ రేర్ ఫీట్.. టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్.!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టాలీవుడ్లో సరికొత్త రికార్డుకు తెరదీశారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఏకంగా 3 విభిన్నమైన సినిమాలతో థియేటర్లలోకి రాబోతున్నారు. అక్టోబర్ 30న 'కల్ట్', నవంబర్ 19న 'ఈ నగరానికి ఏమైంది 2', డిసెంబర్ 4న 'లెగసీ' సినిమాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం హీరోలు ఒక్కో సినిమాకు ఏడాది నుంచి రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ విశ్వక్ సేన్ ఏకంగా ఐదు వారాల గ్యాప్లోనే మూడు పూర్తి డిఫరెంట్ జానర్ సినిమాలను థియేటర్లలోకి దించుతున్నాడు. అక్టోబర్ 30న 'కల్ట్'.. ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. పోస్టర్స్, టీజర్లతోనే మాస్ ఆడియన్స్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. నవంబర్ 19న 'ENE REPEAT'.. యూత్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి ఇది అఫీషియల్ సీక్వెల్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పాత గ్యాంగ్ అంతా కలిసి ఈ కామెడీ రైడ్ తో మళ్ళీ రచ్చ చేయడానికి వస్తున్నారు. డిసెంబర్ 4న 'లెగసీ'.. పవర్, ఫ్యామిలీ, పాలిటిక్స్ అండ్ రివెంజ్ నేపధ్యంలో సాగే సాలిడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. బాలీవుడ్ నటుడు కే కే మీనన్ విలన్గా, 'పిండం' ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విశ్వక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా కాబోతోంది. కేవలం 36 రోజులు.. అంటే అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 4 మధ్యలోనే ఈ మూడు సినిమాల విడుదల జరగబోతోంది. ఒక పక్క హర్రర్ స్లాషర్, ఇంకో పక్క ప్యూర్ యూత్ఫుల్ కామెడీ, మరొక పక్క ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా. ఒకే హీరో మూడు డిఫరెంట్ షేడ్స్లో ఇంత తక్కువ టైమ్లో కనిపించడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక రేర్ ఫీట్. [Vishwak Sen, 3 Films in 36 Days, Cult Movie, ENE Repeat, Legacy Movie, Ee Nagaraniki Emaindi, Telugu Film News, Telugu News]
Sep 12, 2026 3:13PM
ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా!
నాచురల్ స్టార్ నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' (రిలీజ్ డేట్ 24 ) కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రమోషన్స్ జోరందుకోవడం, నాని నే నిన్నటినుంచి స్వయంగా పాల్గొనడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరకి ప్యారడైజ్ ఆవహించిందని చెప్పవచ్చు . అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి ఓవర్ సీస్ లో సరికొత్త రికార్డ్స్ కూడా సృష్టిస్తుంది. ఈ చిత్రానికి స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఆ ఇద్దరు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'సాధారణంగా ఏ వైలెంట్ సినిమాలోనైనా కొన్ని లీటర్ల రక్తాన్ని మాత్రమే ప్రాప్గా ఉపయోగిస్తుంటారు. కానీ ‘ది ప్యారడైజ్’ ప్రపంచం అంత రస్టెడ్, రా, వైలెంట్ బ్యాక్డ్రాప్లో సాగుతుండటంతో ప్రతి సన్నివేశం రక్తం చిందించేలా ప్లాన్ చేసాం. యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే ఏకంగా 2000 లీటర్లకు పైగా ప్రాప్ బ్లడ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఇది టాలీవుడ్ చిత్రసీమ చరిత్రలోనే అత్యధిక రక్తపాతం కలిగిన మాస్ సీన్లలో ఒకటిగా నిలవబోతోంది. నాని ఇప్పటివరకు తన కెరీర్లో చేయని సరికొత్త గెటప్ మరియు వైలెంట్ అవతార్లో కనిపించబోతున్నారు. Also Read: సుద్దాల అశోక్ తేజకి ప్రతిష్టాత్మక పురస్కారం: మూడవ తెలుగు వాడిగా రికార్డు సినిమా కథనం 100 శాతం ఎమోషనల్ అండ్ రా కాన్సెప్ట్తో నడుస్తుందని, అందుకే ఈ రకమైన రక్తపాతం కేవలం సన్నివేశాల గాఢతని పెంచడానికే తప్ప ఊరికే చూపించడానికి కాదని చెబుతున్నారు.ఇక ఈ వైలెంట్ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వర్కింగ్ డేస్ కేటాయించి, సుమారు 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు మరియు హెవీ ఫైటర్లతో భారీ షెడ్యూల్స్ నిర్వహించారు. నాని స్వయంగా డ్యూప్ లేకుండా అనేక ప్రమాదకరమైన ఫైట్స్ చేసి తన డెడికేషన్ చాటుకున్నాడు. ఏది ఏమైనా నాని ప్యారడైజ్ ఫ్లేవర్ స్టార్ట్ అయ్యింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్. [Nani, The Paradise, Ram Lakshman Stunts, Srikanth Odhela, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]
Sep 12, 2026 3:01PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com











