
Band melam: బ్యాండ్ మేళం ఓటీటీ డేట్ ఇదే
-గత నెల 26 న థియేటర్స్ లో అడుగుపెట్టిన కోర్టు జంట -బ్యాండ్ మేళం మిస్ అయ్యారా -డోంట్ వర్రీ ఓటిటిలోకి వస్తుంది కోర్ట్ మూవీతో హిట్ ఫెయిర్ గా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు రోషన్, శ్రీదేవి. మరోసారి తమ మ్యాజిక్ ని రిపీట్ చేస్తు గత నెల 26 న 'బ్యాండ్ మేళం'తో అడుగుపెట్టారు. వైవిధ్యమైన కథాంశంతో, మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కగా అగ్ర కధారచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఆ డీటెయిల్స్ చూద్దాం ‘బ్యాండ్ మేళం స్ట్రీమింగ్ హక్కులని ZEE5 భారీ ధరకి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. మీరు మీకిచ్చిన జంట మరోసారి దరువు వెయ్యబోతున్నారనే క్యాప్షన్ తో అధికార ప్రకటన చేయడం విశేషం. గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి )ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మధ్యలో ఏర్పడిన కొన్ని పొరపచ్చాల వల్ల విడిపోయిన వీరు, విద్యాభ్యాసం మరియు సంగీతం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా కలిసినప్పుడు వారి మధ్య చోటు చేసుకున్న భావోద్వేగాలు, ప్రేమ, సంగీతం మిళితం చేసిన కథే ‘బ్యాండ్ మేళం’. సీనియర్ నటుడు సాయి కుమార్, గోపరాజు విజయ్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. also read: Pawan Kalyan: ఇంకో వికెట్ జైలు గూటికి.. హద్దు మీరితే ఇంతే సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం యువతని బాగా ఆకట్టుకుంది. పాటలు ఇప్పటికే చార్ట్బస్టర్గా నిలిచాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. మరి థియేటర్లలో మిస్ అయిన వారు బ్యాండ్ మేళంని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Apr 17, 2026పవన్కళ్యాణ్ డైరెక్షన్లో రావాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
- పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్రామా - ఎ.ఎం.రత్నం సెన్సేషనల్ కామెంట్స్ - జనసేనాని డ్రీమ్ ప్రాజెక్ట్ బ్యాక్స్టోరీ టాలీవుడ్ ‘పవర్ స్టార్’ నుంచి నేడు ఆంధ్రప్రదేశ్ ‘డిప్యూటీ సీఎం’ వరకు పవన్ కల్యాణ్ ప్రస్థానం ఒక సంచలనం. అయితే, ఆయన సినీ కెరీర్లో ఎంతో ఆసక్తి రేకెత్తించి, చివరి నిమిషంలో ఆగిపోయిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘సత్యాగ్రహి’ మాత్రమే. దశాబ్ద కాలం క్రితమే పవన్ కల్యాణ్ మెగాఫోన్ పట్టి, ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా అటకెక్కింది. తాజాగా ఈ సినిమా ఆగిపోవడానికి గల అసలు కారణాలను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు. రెండు దశాబ్దాల క్రితం 'ఖుషి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ తన స్వీయ దర్శకత్వంలో ‘జానీ’ సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పవన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ సమయంలోనే ఏఎం రత్నం నిర్మాణంలో ‘సత్యాగ్రహి’ అనే భారీ పొలిటికల్ మూవీని అనౌన్స్ చేశారు. అప్పట్లో ఈ సినిమా పోస్టర్లు, పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. దేశభక్తి, సామాజిక బాధ్యత నేపథ్యంలో సాగే ఈ కథను పవన్ స్వయంగా సిద్ధం చేసుకున్నారు. కానీ, ‘జానీ’ రిజల్ట్ పవన్ కల్యాణ్ను బాగా ఆలోచింపజేసింది. నిర్మాత ఏఎం రత్నంకు తన వల్ల నష్టం కలగకూడదని పవన్ భావించారట. సరైన స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకపోవడం, మరోవైపు తన దర్శకత్వ ప్రతిభపై తనకే సందేహాలు కలగడంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టాలని పవనే స్వయంగా నిర్ణయించుకున్నారని ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఆ సినిమా గనుక పూర్తి చేసి ఉంటే, పవన్ కల్యాణ్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తరహాలో సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగేవారని, రాజకీయాల వైపు వచ్చే వారు కాదేమోనని పవన్ తనతో అన్నట్లు రత్నం తెలిపారు. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్ గారూ చేపట్టిన అత్యవసర పరిస్థితి ఉద్యమ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించాలని పవన్ సంకల్పించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సినిమాల ద్వారా కాకుండా, ప్రత్యక్షంగా పోరాడితేనే మార్పు వస్తుందని ఆయన నమ్మారు. బహుశా అదే ఆలోచన ఆయనను సినిమాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండటం విశేషం.
Apr 17, 2026
Pawan Kalyan: ఇంకో వికెట్ జైలు గూటికి.. హద్దు మీరితే ఇంతే
-స్టాండప్ కామెడీ పేరుతో ఓవర్ యాక్షన్ -ముందు ముందు మరింత లిస్ట్ బయటపడుతుందా -ట్రాఫిక్ మహమ్మద్ ఎవరు స్టాండప్ కామెడీ పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వ్యక్తిగత జీవితాన్ని అవహేళన చేయడంతో ఫాన్స్, జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేయడంతో అనుదీప్ కటికాల కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్టాండప్ కమెడియన్ పవన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం. రఫిక్ మొహమ్మద్.. వైజాగ్ కి చెందిన స్టాండప్ కమెడియన్. ప్రదర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆయన వివాహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ షో చేసాడు. అయితే అవి గతంలో చేసిన వీడియోలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో జనసేన నాయకులు మచిలీపట్నం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, రఫిక్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని భావించి నిన్న రాత్రి విశాఖపట్నంలో రఫీక్ ని అదుపులోకి తీసుకున్నారు. also read: Sriramudu: రాముడిపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు ఈ వరుస అరెస్ట్ పై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు స్టాండప్ కామెడీ అనేది కూడా ఒక కళ. కానీ ఒకరి వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటుపాట్లపై కామెంట్స్ చేసి నవ్వు తెప్పించడం ఏంటి! ఇక నుంచైనా స్టాండప్ కామెడీ చేయాలనీ అనుకున్న వారు నిజమైన హాస్యానికి అర్ధం తెలుసుకొని ప్రదర్శన ఇవ్వాలి. అలా కాకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే కామెంట్స్ చేస్తున్నారు. అనుదీప్ కటికాలకి అయితే బెయిల్ వచ్చింది.
Apr 17, 2026
Raaka: అల్లు అర్జున్ 'రాకా'లో బాలీవుడ్ బాద్షా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి 'రాకా' (Raaka) అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఒకే ఒక్క పోస్టర్ తో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాకాలో షారుఖ్ ఖాన్ మెరుపులు? అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో షారుఖ్- అట్లీ కాంబినేషన్ లో 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే అట్లీ అడగ్గానే 'రాకా'లో గెస్ట్ రోల్ కి కింగ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. జైలర్కు 'నో'.. రాకాకు 'యస్'? మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2'లో గెస్ట్ రోల్ కోసం షారుఖ్ను సంప్రదించగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అల్లు అర్జున్ 'రాకా' కోసం మాత్రం ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై బన్నీ, షారుఖ్లను ఒకే ఫ్రేమ్లో చూడటం అభిమానులకు పూనకాలే అని చెప్పాలి. భారీ తారాగణం.. భారీ అంచనాలు ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రల కోసం రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటిసారిగా అల్లు అర్జున్ ఒక సైన్స్ ఫిక్షన్ చేస్తుండటం, ఫస్ట్ లుక్ విభిన్నంగా ఉండటంతో 'రాకా'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Apr 17, 2026పుట్టగానే బిడ్డను గూడ్సు బండిలో వదిలేసిన తల్లి.. కారణం తెలిస్తే తట్టుకోలేరు!
- రజనీకాంత్ ఎమోషనల్ సీన్ వైరల్ - మణిరత్నం మ్యాజిక్ - గుండె బరువెక్కించే సన్నివేశం టాలీవుడ్, కోలీవుడ్ సినీ చరిత్రలో మణిరత్నం-రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ‘దళపతి’ ఒక అద్భుతం. ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఒక ఆణిముత్యం. ముఖ్యంగా సూర్య (రజనీకాంత్) తన గతాన్ని, తన తల్లి తనను చిన్నప్పుడే విసిరిపారేసిందన్న నిజాన్ని తెలుసుకునే సన్నివేశం ప్రేక్షకుల గుండెలను పిండేస్తుంది. ఈ సీన్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. కథలో దేవరాజు (మమ్ముట్టి)కి అండగా ఉంటూ అన్యాయాలను ఎదిరించే సూర్య, తనెవరో తెలియని అనాథగా పెరుగుతాడు. అయితే, ఊరి కలెక్టర్ అర్జున్ (అరవింద్ స్వామి) తో సూర్యకు వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కలెక్టర్ భార్య ద్వారా సూర్య తన తల్లి గురించి, ఆమె తనను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో తెలుసుకుంటాడు. సూర్య నల్లగా ఉన్నాడని, పెళ్లి కాకుండానే పుట్టాడన్న భయంతో అతని తల్లి రైలు పెట్టెలో వదిలేస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకున్న సూర్య పడే ఆవేదన వర్ణనాతీతం. రజనీకాంత్ తన నటనతో ఆ బాధను కళ్ళకు కట్టినట్లు చూపించారు. "నా కొడుకు సూర్య చాలా మంచివాడు" అని శ్రీవిద్య (తల్లి పాత్ర) చెప్పే మాటలు ఈ సీన్కు హైలైట్ అని చెప్పాలి. మరోవైపు దేవరాజును అరెస్ట్ చేసిన కలెక్టర్ను ఊరి ప్రజలంతా వ్యతిరేకిస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, సూర్య మాత్రం తన స్నేహితుడి కోసం, తన తల్లి కోసం పడే సంఘర్షణ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కలెక్టర్ తన తమ్ముడే అని తెలిసినా, స్నేహం కోసం సూర్య తీసుకునే నిర్ణయాలు సినిమాను మలుపు తిప్పుతాయి. సినిమా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, సూర్య మరియు అతని తల్లి మధ్య ఉండే ఆ అదృశ్య బంధం నేటికీ సినీ అభిమానులను కదిలిస్తూనే ఉంది. ఇళయరాజా సంగీతం ఈ సన్నివేశాల్లోని ఎమోషన్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "అప్పటి రజనీకాంత్ యాక్టింగ్ లెవలే వేరు" అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
Apr 17, 2026
Sriramudu: రాముడిపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
-సరికొత్త వివాదంలో ప్రకాష్ రాజ్ -రాముడంటే ప్రకాష్ రాజ్ ఏమనుకుంటున్నాడు -ప్రకాష్ రాజ్ మాటలతో రామ భక్తుల నిరసన -పోటాపోటీగా కేసులు హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు(Sriramudu)మంచి కార్యక్రమం తలపెట్టినా, శుభకార్యాలు మొదలు పెట్టినా రాముడిని తలచుకోకుండా ఏ పనిమొదలుపెట్టరు. రాముడి గుడి లేని ఊరు కూడా ఉండదు. అసలు నోటి వెంట శ్రీరామ నామం రానిదే నిద్ర కూడా పోరు. . అంతలా హిందుల జీవన విధానంలో రామభద్రుడు సదా చిరస్మనీయుడుగా ఉన్నాడు. మరి అలాంటి శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్(Praksh raj)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాళ్ళందర్నీ బాధకి గురి చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడాడో చూద్దాం. ప్రకాష్ రాజ్ రీసెంట్ గా కేరళ రాష్ట్రంలో జరిగిన సాహిత్య ఉత్సవంలో మతసామరస్యం, ప్రజల విశ్వాసం అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతు రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలు. వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారు. శూర్పణఖ ఆ దొంగతనాన్ని చూసి జిఎస్టితో కలుపుకొని రెండు వేల డాలర్స్ కట్టాలని అడిగిందనే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ దేశంలో ప్లాన్ ప్రకారం ముస్లిమ్స్,గిరిజనుల్ని తుడిచిపెట్టాలనుకొని కొన్ని శక్తులు అనుకుంటున్నాయని చెప్పుకొచ్చాడు. Also read: Thimmarajupalli TV Movie Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి. పలు ఏరియాల్లో కేసులు కూడా నమోదు చేసారు. తాను నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయిన వారణాసి, స్పిరిట్ చిత్రాల నుంచి ప్రకాష్ రాజ్ ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ రీసెంట్ గా డెకాయిట్ మూవీలో కనిపించిన విషయం తెలిసిందే
Apr 17, 2026
Janhvi Kapoor: అలా మద్యానికి బానిసనయ్యా.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్!
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), కేవలం తన గ్లామర్తోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ బిజీగా ఉంది. 'దేవర'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు రామ్ చరణ్ సరసన 'పెద్ది'లో నటిస్తోంది. తాజాగా ఆమె 'మద్యపాన వ్యసనం' (Alcohol Addiction) గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ.. మన దేశంలో మద్యపాన వ్యసనం గురించి జరిగే చర్చలు చాలా తక్కువని, ఒకవేళ చర్చ జరిగినా అది కేవలం ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటానికే పరిమితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. "ఎవరైనా మద్యానికి బానిసయ్యారంటే వారిని ఒక రోగిగా చూడాలి కానీ, వారి క్యారెక్టర్ను జడ్జ్ చేయకూడదు" అని ఆమె పేర్కొంది. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య అని గుర్తించకపోవడం వల్లే చాలామంది సాయం కోరడానికి భయపడుతున్నారని ఆమె వివరించింది. చాలా సందర్భాల్లో ఒత్తిడి, ఒంటరితనం నుంచే వ్యసనాలు మొదలవుతాయని జాన్వీ అభిప్రాయపడింది. "మనం శారీరక గాయాలకు చికిత్స చేయించుకున్నట్లే, మానసిక సమస్యలకు కూడా చికిత్స అవసరం. కానీ మన సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటాన్ని నేటికీ ఒక తప్పుగా చూస్తున్నారు" అని ఆమె చెప్పుకొచ్చింది. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇటువంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడటం వల్ల బాధితుల్లో ధైర్యం పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. జాన్వీ కపూర్ కి కూడా మద్యం అలవాటు అయింది. అది వ్యసనంగా మారుతుండంతో ఆమె దానికి దూరమైంది. దీనిపై జాన్వీ మాట్లాడుతూ.. "అప్పుడప్పుడు నేను మద్యం తీసుకునే దానిని. నాకు తెలియకుండానే నేను దానికి బానిసగా మారిపోయా. నా చుట్టూ ఉన్న చాలామంది ఆ వ్యసనానికి బలికావడం ప్రత్యక్షంగా చూశా. వ్యసనం కూడా ఓ మానసిక ఆరోగ్య సమస్య అని గుర్తించా. వ్యసనం కారణంగా జీవితంలో ఏం కోల్పోతామో, ఎంత నష్టం జరుగుతుందో తెలిసిన తర్వాత.. ఆ అలవాటుకి దూరమయ్యాను" అని చెప్పుకొచ్చింది. శారీరక దృఢత్వం కంటే మానసిక ఆరోగ్యమే ముఖ్యమని జాన్వీ అభిప్రాయపడింది. తన తల్లి శ్రీదేవి మరణం తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, ఒత్తిడిని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తనను తాను నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానం చేయడంతో పాటు సరైన జీవనశైలిని ఎంచుకున్నట్లు తెలిపింది. "మనం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బయట ప్రపంచానికి సంతోషంగా కనిపిస్తాము. ఏదైనా వ్యసనానికి బానిస అవ్వడం కంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం" అని జాన్వీ కపూర్ యువతకు సందేశం ఇచ్చింది.
Apr 17, 2026
Sambhavam Adhyayam Onnu Review:సంభవం అధ్యాయం ఒన్ను మూవీ రివ్యూ
మూవీ: సంభవం అధ్యాయం ఒన్ను నటీనటులు: అస్గర్ అలీ, నీతూ క్రిష్ణ, సిద్దార్థ్ భరతన్, కనకం, వినీత్ కుమార్ ఎడిటింగ్: అర్జున్ ప్రకాశ్ మ్యూజిక్: గాడ్విన్ థామస్ సినిమాటోగ్రఫీ: నవీన్ నజోస్ దర్శకత్వం: జీతూ సతీషన్ ఓటీటీ : జియో హాట్ స్టార్ కథ: కర్ణాటక - కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్ కి సీపీఓ ఆనంద్ (అస్గర్ అలీ)కి బదిలీ అవుతుంది. మరో నెలలో డెలివరీ కానున్న తన భార్య 'నీతూ'ను వదిలి అతను అయిష్టంగానే బయల్దేరతాడు. విధుల్లో చేరడానికి అతను పోలీస్ స్టేషన్ కి వెళుతుండగా, వేరే రాష్ట్రానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ను జీపు ఢీ కొడుతుంది. అతణ్ణి హాస్పిటల్లో చేర్పించిన తరువాతనే అతని పేరు జాన్ పీటర్ అనే విషయం ఆనంద్ కి తెలుస్తుంది. జాన్ పీటర్ దగ్గర లభించిన 'వాకీ టాకీ'ని తన దగ్గరే ఉంచుతాడు ఆనంద్. కొత్తగా డ్యూటీలో చేరిన ఆనంద్ కి పోలీస్ ఆఫీసర్ 'అశోకన్' తో .. మరో ఆఫీసర్ 'రెజీ'తో పరిచయం ఏర్పడుతుంది. ముగ్గురూ కలిసున్న సమయంలో జాన్ పీటర్ వాకీ టాకీ మోగుతుంది. అడవిలో తను ఆపదలో ఉన్నానని, తనని కాపాడమని పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రిక్వెస్ట్ చేస్తాడు. అతను చెప్తున్న ఆనవాళ్ల ఆధారంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ముందుకు వెళ్తారు. అలా వాళ్లు మానవ దేహం .. కాకి తల కలిగిన ఒక విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. ఆ తర్వాత వారికి ఏం జరిగింది? అసలు ఆ ఫోన్ లో మట్లాడిన వ్యక్తి ఎవరు? ఆ కాకి తల కలిగిన విగ్రహం అక్కడ ఎందుకు ఉంది? ఆనంద్, అశోకన్, రెజీల లైఫ్ లో జరిగిందనేది మిగతా కథ. విశ్లేషణ: కథ, స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ, బిజిఎమ్, స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అన్నీ పర్ ఫెక్ట్ గా ఉన్న ఈ సినిమా చివరి వరకు ఎంగేజింగ్ గా సాగుతుంది. ఒకసారి చూడటం మొదలెడితే చివరి వరకు చూసేలా మలిచారు మేకర్స్. సినిమా మొత్తం రెండు గంటల ఏడు నిమిషాలు..ఇందులో మొదటి నాలుగు నిమిషాలు టైటిల్స్, చివరి నాలుగు నిమిషాలు ఎండ్ కార్డ్స్ తీసేస్తే రెండు గంటల్లోపే సినిమా ఉంటుంది. సినిమా మొదలవ్వడం ఒక హార్రర్ ఫీల్ ని కలిగించినా .. వెళ్ళే కొద్దీ సస్పెన్స్ ని అందిస్తుంది. ఇక ఫస్టాఫ్ పూర్తయ్యేసరికి కథ అర్థమైపోతుంది. అయితే అక్కడి నుండి ఎలా వాళ్ళు సర్వైవ్ అయ్యారనే పాయింట్ ని దర్శకుడు జీతు సతీషన్ సరిగ్గా మలిచారు. ఇందులో నెగెటివ్ అంటూ ఏం లేవు. అయితే సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు వేరే ఏ ఇతర పనులు చేయకుండా చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేసి చూసినా ఆ థ్రిల్ మిస్ అవుతారు. ఇందులో వచ్చే ట్విస్ట్ లు ఎవరి ఊహకి ఉందవు.. ఒకవైపు మనుషులు ఎవరైనా చేస్తున్నారా అనే భావన కలుగుతుంది.. మరోవైపు దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అనే భావన కలుగుతుంది. మరోవైపు దైవ శక్తి అంటూ అన్నీ మిక్స్ చేసి చూపించడంతో ఆడియన్స్ కాస్త అయోమయంగా ఉంటుంది. అయితే వెళ్ళే కొలదీ వచ్చే ట్విస్ట్ లతో ఆద్యాంతం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫస్టాప్ తర్వాత క్యాట్ అండ్ మౌస్ చేజ్ లా రేసీగా సాగుతుంది కథ. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో ఆడియన్ థ్రిల్ అవ్వాల్సిందే. అడల్ట్ సీన్లు లేవు.. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంది. నవీన్ నజోస్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. గాడ్విన్ థామస్ అందించిన బిజిఎమ్ బాగుంది. అర్జున్ ప్రకాశ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: ఆనంద్ గా అస్గర్ అలీ, అశోకన్, రెజీ, తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ గా : వర్త్ వాచింగ్ మూవీ. రేటింగ్ : 3/5
Apr 17, 2026టాక్సిక్, రామాయణపై యశ్ సెన్సేషనల్ కామెంట్స్!
- ‘టాక్సిక్’ నుంచే అసలు కథ మొదలైంది - రాకీ భాయ్ నెక్స్ట్ టార్గెట్ - రావణ పాత్రపై యశ్ క్లారిటీ కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని ‘కేజీఎఫ్’ సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన నటుడు రాకింగ్ స్టార్ యశ్. ‘రాకీ భాయ్’గా వెండితెరపై ఆయన చూపించిన మాస్ మేనరిజమ్స్కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే కేజీఎఫ్ 2 తర్వాత యశ్ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ (Toxic) అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్.. తన అప్ కమింగ్ మూవీస్ ‘టాక్సిక్’ మరియు ‘రామాయణ’ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో యశ్ ‘రావణుడి’ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర తన దగ్గరకు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయన రివీల్ చేశారు. ‘టాక్సిక్’ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కోసం తాను అమెరికా వెళ్లినప్పుడు, అక్కడ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ‘డినెగ్’ (DNEG) సీఈఓ నమిత్ మల్హోత్రాను కలిశారట. ఆ సమయంలో భారతీయ సినిమాను గ్లోబల్ లెవల్కు తీసుకెళ్లడంపై చర్చ నడిచిందని, అదే క్రమంలో ‘రామాయణ’ ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చిందని యశ్ తెలిపారు. రావణుడి పాత్రలోని లోతు, ఆ క్యారెక్టరైజేషన్ తనను ఎంతగానో ఆకట్టుకోవడంతో వెంటనే ఓకే చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ‘టాక్సిక్’ సినిమా గురించి యశ్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక గ్యాంగ్స్టర్ డ్రామా మాత్రమే కాదని, చాలా లోతైన కథాంశం ఇందులో ఉంటుందని చెప్పారు. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. భాషా పరిమితులు లేకుండా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ప్లాన్ చేసినట్లు యశ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ‘రామాయణ’లో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ పై యశ్ స్పందిస్తూ.. కథ డిమాండ్ మేరకు అత్యుత్తమ నటీనటులను ఎంపిక చేశామని చెప్పారు. సాయి పల్లవి నటనను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. యశ్ నుంచి వస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మామూలుగా లేదు. ఒకవైపు రాక్షస రాజు రావణుడిగా, మరోవైపు గ్లోబల్ గ్యాంగ్స్టర్గా యశ్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండటం, ‘టాక్సిక్’ భారీ బడ్జెట్తో తెరకెక్కడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ‘టాక్సిక్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది జూన్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ‘రామాయణ’ తొలి భాగం కూడా 2026 దిపావళికి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాకింగ్ స్టార్ తన ఫ్యాన్స్కు వచ్చే ఏడాది డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Apr 17, 2026హోం మినిస్టర్కే వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి.. లేడీ అమితాబ్ మాస్ గర్జన!
టాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటి విజయశాంతి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్యాయాలను ఎదిరించే పవర్ఫుల్ పాత్రల్లో ఆమె నటన అద్వితీయం. విజయశాంతి నటించిన ఆశయం సినిమాలోని అసెంబ్లీ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అధికార గర్వంతో విర్రవీగే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సాగే ఈ సీన్ చూస్తుంటే, ఆమెను ఎందుకు 'లేడీ అమితాబ్' అంటారో మరోసారి అర్థమవుతుంది. ఈ వైరల్ వీడియోలో విజయశాంతి హోం మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి దుర్మార్గాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన వారే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడితే, ఆ వ్యవస్థను ఎలా ప్రశ్నించాలో ఈ సీన్లో అద్భుతంగా చూపించారు. "హోం మినిస్టరే నా శీలాన్ని దోచుకుంటే.. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ అకృత్యానికి సెల్యూట్ కొట్టి కాపలా కాస్తుంటే.. నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి?" అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. రాజకీయ బలంతో సామాన్యులను అణచివేసే నాయకుల నిజస్వరూపాన్ని బయటపెట్టడమే కాకుండా, తనపై జరిగిన వ్యక్తిగత దాడులను కూడా ఆమె దీటుగా ఎదుర్కొన్నారు. తన క్యారెక్టర్ను దెబ్బతీయాలని చూసిన ప్రత్యర్థులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా పోలీసు అధికారులకు ఆమె ఇచ్చిన స్వేచ్ఛ, "ఎవరు తప్పు చేసినా.. ఆఖరికి నేను లేదా ముఖ్యమంత్రి అయినా సరే సంకెళ్లు వేసే అధికారం మీకు ఇస్తున్నాను" అన్న డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్లో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విజయశాంతి పర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి సినిమాల్లో అలాంటి గంభీరమైన పాత్రలు, పదునైన డైలాగులు కరువయ్యాయని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. విజయశాంతి వంటి పవర్ఫుల్ హీరోయిన్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
Apr 17, 2026
Thimmarajupalli TV Movie Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ
మూవీ పేరు: తిమ్మరాజుపల్లి టీవీ నటీనటులు: సాయి తేజ్,వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి, చిట్టిబాబు, లతీష్ కీలపట్టు తదితరులు సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్ ఎడిటింగ్: మ్యూజిక్: వంశీ కాంత్ రేఖన నిర్మాతలు: కిరణ్ అబ్బవరం, రహస్య బ్యానర్: క ప్రొడక్షన్స్ రచన,ఎడిటింగ్, దర్శకత్వం: మునిరాజు రిలీజ్ డేట్ : ఏప్రిల్ 17 ,2026 హీరోగా తన చరిష్మా కొనసాగిస్తూ వస్తున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'తిమ్మరాజుపల్లి టీవీ'(Thimmaraju Palli Tv). ప్రచార చిత్రాలు పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించడంతో ప్రేక్షకుల చూపు తిమ్మరాజుపల్లిపై పడింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ సతీష్(సాయి తేజ్) లైఫ్ ని సరదాగా గడిపే మధ్య తరగతి యువకుడు. తన ఊరి గ్రామస్థులు మొత్తం టీవీలో సినిమా చూడాలనుకున్నప్పుడు తలా కొంత డబ్బులు వసూలు చేసి సతీష్ కి ఇస్తే, తను టౌన్ కి వెళ్లి టీవీ, సినిమా క్యాసెట్ లు అద్దెకి తీసుకొస్తుంటాడు. శారద( వేద జలంధర్), సతీష్ ప్రేమించుకుంటారు. రాజప్ప(ప్రదీప్ కొట్టే), ఎల్లమ్మ( స్వాతి కరిమిరెడ్డి) కొత్తగా పెళ్ళైన జంట. ఇద్దరు కల్లాకపటం లేని మంచి మనుషులు. రాజప్ప ఎవరో కాదు స్వయానా శారదకి అన్నయ్య. రాజప్ప ఇంట్లో ఉండే టీవీ దొంగతనానికి గురవుతుంది. దీంతో సతీష్, శారద పెళ్ళికి రాజప్ప ఒప్పుకోడు. టీవీ దొంగతనానికి సతీష్, శారద పెళ్ళికి సంబంధం ఏంటి? టీవీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? టీవీ వెనక ఏమైనా కథ ఉందా? ఉంటే ఆ కథ ఏంటి? సతీష్, శారద ఒక్కటయ్యారా? టీవీ దొంగతనం వల్ల ఎల్లమ్మ, రాజప్ప మధ్య ఏమైనా కలహాలు వచ్చాయా? అనేదే తిమ్మరాజుపల్లి టీవీ ఎనాలసిస్ ఇలాంటి కథతో మూవీ తెరకెక్కించడం మంచి ప్రయత్నమే.. కానీ సింగల్ పాయింట్ తో నడిచే సబ్జెట్ ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే తెరకెక్కించాలి. మన పాత వంశీ సినిమాలని చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. అలా కాకుండా టీవీ దొంతనం అనే సింగల్ పాయింట్ ని సీరియస్ గా తెరకెక్కించడమే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. మూవీ మొత్తం కంప్లీట్ గా తిమ్మరాజుపల్లి అనే గ్రామంలోనే జరుగుతుంది కాబట్టి పల్లెటూరిలో ఉండే కామెడీ మనుషులని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే తన వాయిస్ ఓవర్ లో ఏదైతే చెప్పాడో ఆ కథ ఉండదు. సతీష్, శారద మధ్య వచ్చే లవ్స్ సీన్స్ నాచురల్ గా ఉన్నాయి. పాత రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తనకి నచ్చిన హీరో సినిమా క్యాసెట్ ఇస్తే మరింత ప్రేమని చూపించే వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రేమని చూపించిన విధానం బాగుంది. ఈ లైన్ మీదనే మరింత కథనాన్ని అల్లితే కావాల్సినంత స్టఫ్ దొరికేది. రాజప్ప, అతని తండ్రి మధ్య వచ్చే సీన్స్, రాజప్ప పెళ్లి సీన్స్ బాగున్నాయి. మిగతా క్యారెక్టర్స్ మధ్య వచ్చిన సీన్స్ లో పసలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో సతీష్ తాను చేసిన ఛాలెంజ్ పైనే ఎక్కువ ఫోకస్ చెయ్యాల్సింది. అలా కాకుండా కథని నడపడానికి అనవసరమైన సీన్స్ చాలానే వచ్చాయి. రివర్స్ స్క్రీన్ ప్లే లో కూడా తెలిసిన కథనే మళ్ళీ ఎందుకు చెప్పారో అర్ధం కాదు. టివి దొంగతనం ఎవరు చేసారో కనుక్కునే ప్రాసెస్ లో వచ్చిన సీన్స్ మాత్రం బాగున్నాయి. మేకర్స్ అదృష్టం ఏంటంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుంది. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు సతీష్ క్యారక్టర్ లో సాయి తేజ్ పెద్దగా సూటవ్వలేదు. పెర్ ఫార్మ్ పరంగా కూడా సోసో. రాజప్పగా ప్రదీప్ కొట్టే మాత్రం సూపర్ గా చేసాడు. మూవీ మొత్తానికి తన పెర్ఫార్మ్ నే హైలెట్. తెలుగు సినిమాకి ఒక కొత్త రకం రూపుతో కూడుకున్న నటుడు దొరికినట్టే. శారద, ఎల్లమ్మలుగా చేసిన వేద జలంధర్, స్వాతి తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు చేసి మెప్పించారు. మిగతా ఆర్టిస్టులు గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేకపోయినా ఊరిపెద్దగా చేసిన రామ చంద్ర మాత్రం పర్వాలేదనే స్థాయిలో చేసాడు. మూవీ మొత్తం ఒకే ఊరిలో తెరకెక్కించారు కాబట్టి కిరణ్ అబ్బవరం నిర్మాణ విలువుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి. మునిరాజు(Muniraju)దర్శకుడిగా మెప్పించాడు కానీ రచయితగా మెప్పించలేకపోయాడు. బలాలు 1 . పల్లెటూరి వాతావరణం 2 .ఫొటోగ్రఫీ 3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 4 .ప్రీ క్లైమాక్స్ 5 . క్లైమాక్స్ బలహీనతలు 1 . కథ 2 . కథనం 3 . మాటలు 4 . రాంగ్ కాస్టింగ్ చివరిగా చెప్పాలంటే మంచి ప్రయత్నం.. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. రేటింగ్ 2 .5 / 5 అరుణాచలం
Apr 17, 2026
Vishnu Priya: అప్పట్లోనే విష్ణుప్రియ రచ్చ.. 8 ఏళ్ళ క్రితం ఫన్ బకెట్లో కామెడీ చూశారా?
యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు టీవీ షోలతో పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో హాట్ ఫోటోలను పోస్ట్ చేసి, డబ్బు సంపాదిస్తుండటంపై ఇటీవల విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన ఎనిమిది ఏళ్ల క్రితం నాటి ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అప్పట్లో 'తెలుగువన్' యూట్యూబ్ ఛానల్లో సంచలనం సృష్టించిన 'ఫన్ బకెట్'(Fun Bucket)లో విష్ణుప్రియ చేసిన కామెడీ స్కిట్లు ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. విష్ణుప్రియ కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, కామెడీ స్కిట్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ‘ఫన్ బకెట్’లో ఆమె చేసిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. సుమారు ఎనిమిదేళ్ల క్రితం విష్ణుప్రియ ఫన్ బకెట్ వీడియోలలో చురుగ్గా పాల్గొంది. ముఖ్యంగా ఆమెలోని నాచురల్ కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఆ వీడియోలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిస్టర్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, వైఫ్ గా ఆమె చేసిన నటన అప్పట్లోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. టీవీలో 30 అడుగుల పాము గురించి తమ్ముడితో మాట్లాడే సీన్, భర్తతో లాప్టాప్ డాక్యుమెంట్స్ విషయంలో చేసే గొడవ వంటివి ఇప్పటికీ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం విష్ణుప్రియ స్టార్ యాంకర్ గా ఎదిగినా, ఆ పాత వీడియోల్లోని ఆమె అమాయకత్వం, నటనను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. తన అల్లరి, స్పాంటేనియస్ డైలాగ్స్తో ఎనిమిదేళ్ల క్రితమే విష్ణుప్రియ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, కామెడీని కూడా పండించగలనని ఆమె అప్పట్లోనే నిరూపించుకుంది. సోషల్ మీడియాలో మళ్ళీ హల్చల్ చేస్తున్న ఈ వీడియోలు, విష్ణుప్రియ అభిమానులకు ఒక మంచి థ్రోబాక్ మెమరీగా నిలుస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
Apr 17, 2026
Sharwanand: భార్యకు దూరంగా హీరో శర్వానంద్.. ఆ ఒక్క పనితో మొదలైన విడాకుల రచ్చ!
- హీరో శర్వానంద్ కు ఏమైంది? - భార్య రక్షితా రెడ్డితో ఎందుకు దూరంగా ఉంటున్నారు? - అసలు ఈ విడాకుల రచ్చకు కారణమేంటి? - ఆ పని తెలిసే చేశారా? అనుకోకుండా జరిగిందా? టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలిచారు. సక్సెస్ ఫుల్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ జోష్లో ఉన్న శర్వానంద్, తన భార్య రక్షితా రెడ్డితో విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆయన చేసిన ఒక పని ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది. ఫోటోలు డిలీట్: సాధారణంగా సెలబ్రిటీలు తమ బంధానికి ముగింపు పలకాలనుకున్నప్పుడు మొదట చేసే పని సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేయడం. గతంలో సమంత-చైతన్య, నిహారిక-చైతన్యల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు శర్వానంద్ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి భార్య రక్షితా రెడ్డితో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను, ఇతర మెమోరీస్ ని పూర్తిగా డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రొఫైల్లో కేవలం తన సినిమాల పోస్టర్లు, వ్యక్తిగత ఫోటోలు మాత్రమే కనిపిస్తుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏడాది తిరగకముందే మనస్పర్ధలు? శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం 2023 జూన్ లో జైపూర్లోని లీలా ప్యాలెస్లో ఎంతో అట్టహాసంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రక్షితతో శర్వానంద్ వివాహం అప్పట్లో ఒక పెద్ద వేడుకలా సాగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, పెళ్లయిన ఏడాది గడవకముందే వీరి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తాయని, గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారని సినీ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మౌనం వెనుక మర్మమేంటి? శర్వానంద్ ప్రస్తుతం 'బైకర్' (Biker) సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. 'బైకర్' ప్రమోషన్స్ లో ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎంతో యాక్టివ్గా మాట్లాడుతున్న శర్వా, తన విడాకుల రూమర్లపై మాత్రం పెదవి విప్పడం లేదు. గతంలో ఇలాంటి ఏ చిన్న వార్త వచ్చినా ఆయన టీం వెంటనే స్పందించి ఖండించేది, కానీ ఈసారి స్వయంగా ఫోటోలు డిలీట్ చేసినా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. సినిమా రంగంలో ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. పర్సనల్ లైఫ్లో ఎదురైన ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి. చిన్న పాప భవిష్యత్తు దృష్ట్యా వీరిద్దరూ మళ్లీ కలిసి ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఫోటోల తొలగింపు కేవలం టెక్నికల్ కారణమా లేక నిజంగానే విడాకుల సంకేతమా అనేది శర్వానంద్ స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
Apr 17, 2026
Anudeep Katikala: రంగు పడింది.. బెయిల్ వచ్చినా తప్పని తిప్పలు.. నెక్స్ట్ ఏంటి?
- స్టాండప్ కామెడీ పేరుతో హద్దు మీరి వ్యాఖ్యలు - డిప్యూటీ సీఎంనే టార్గెట్ చేస్తే.. చూస్తూ ఊరుకుంటారా? - కటకటాల పాలైన అనుదీప్ కటికాల! - బెయిల్ వచ్చినా తప్పని తిప్పలు! స్టాండప్ కామెడీ పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సెటైర్లు వేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మెగా ఫ్యామిలీపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల (Anudeep Katikala) చేసిన కొన్ని కామెంట్స్ పెను వివాదానికి దారితీశాయి. అయితే అనుదీప్ ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేయడం, అతను బెయిల్పై విడుదల కావడం జరిగిపోయాయి. కానీ, ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివాదానికి కారణం ఏమిటి? హైదరాబాద్కు చెందిన అనుదీప్ కటికాల ఇటీవల నిర్వహించిన ఒక షోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాలపై కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ రామ్ చరణ్, నిహారిక కొణిదెలపై కూడా సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, అలాగే నిహారిక విడాకుల విషయంలో పవన్ సలహా తీసుకోవచ్చని చేసిన జోకులు మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. పోలీసుల చర్య - అరెస్ట్ వివరాలు: అనుదీప్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేత బడే వెంకట కృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుదీప్ కావాలనే పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా, మహిళలను కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు అనుదీప్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనుదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్నట్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 14న అక్కడ తన తండ్రితో కలిసి పార్కులో ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో కాకినాడకు తరలించారు. క్షమాపణలు చెప్పినా తగ్గని వివాదం: వివాదం ముదురుతోందని గమనించిన అనుదీప్, ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశం ఎవరినీ నొప్పించడం కాదని, కేవలం కామెడీ కోసమే అలా మాట్లాడానని వివరణ ఇచ్చాడు. అయితే, అతను చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బెయిల్పై విడుదల అనుదీప్ను కాకినాడ పోలీసులు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి.శ్రీదేవి ముందు హాజరుపరిచారు. రాత్రి 12 గంటల వరకు వాదనలు కొనసాగాయి. రూ.10 వేల పూచీకత్తుతో అనుదీప్ను బెయిల్పై విడుదల చేశారు. నిబంధనల ప్రకారం విచారణకు సహకరించాలని ఆదేశించారు. సజ్జనార్ ఏం చేయబోతున్నారు? అయితే కాకినాడలో బెయిల్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్.. వెంటనే విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. స్టాండప్ కామెడీ పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం తరచుగా వివాదాలకు కారణమవుతోంది. అనుదీప్ కటికాల ఉదంతం స్టాండప్ కమెడియన్లు తమ కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తుచేస్తోంది.
Apr 17, 2026
Papam Prathap: 'పాపం ప్రతాప్' మూవీ హైలైట్స్.. అదే సినిమాను కాపాడింది!
'ఈటీవీ విన్' (ETV Win) వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమా 'పాపం ప్రతాప్' (Papam Prathap). తిరువీర్ హీరోగా నటించిన ఈ మూవీ ఒక విభిన్నమైన సమస్య చుట్టూ తిరుగుతుంది. మరి ఈ సినిమాలోని హైలైట్స్ ఏంటి? సినిమాను ఏ అంశాలు సేవ్ చేశాయో ఇప్పుడు చూద్దాం. తిరువీర్ అద్భుత నటన ఈ సినిమాకు అతిపెద్ద బలం తిరువీర్. 'మసూద', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్.. ప్రతాప్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అమాయకత్వం, భావోద్వేగాలు, కామెడీని పండించడంలో అతను చూపిన పరిణతి సినిమాను ముందుకు నడిపించింది. ముఖ్యంగా భార్య వదిలి వెళ్ళినప్పుడు అతను పడే వేదన, ఆ తర్వాత తన సమస్యను పరిష్కరించుకోవడానికి పడే తపన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. వినోదం పంచిన సపోర్టింగ్ కాస్ట్ సినిమాలో కామెడీ పాలు తగ్గకుండా చూసుకోవడంలో అజయ్ ఘోష్, గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయి. అజయ్ ఘోష్ తండ్రి పాత్రలో తనదైన మార్కు చూపించగా, రాశి తల్లి పాత్రలో ఎమోషన్ పండించారు. భావోద్వేగాలే ఈ సినిమా ప్రాణం కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలా సహజంగా ఉన్నాయి. హీరోకు ఉన్న వింత సమస్య కారణంగా సమాజం నుంచి ఎదురయ్యే అవమానాలు, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలను దర్శకుడు దుర్గా నరేష్ ఎమోషనల్ గా తెరకెక్కించారు. క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ వచ్చే మలుపులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సినిమాను కాపాడిన అంశాలు కథనం అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించినప్పటికీ, సినిమాను సేవ్ చేసినవి ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి 'కామెడీ టైమింగ్', రెండు 'క్లైమాక్స్ ట్విస్ట్'. హీరోకి ఉన్న సమస్య ఏమిటో రివీల్ చేసే క్రమంలో దర్శకుడు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెడుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, గ్రామీణ నేపథ్యంలో సాగే విజువల్స్ సినిమాకు మంచి ఫీల్ ఇచ్చాయి. మొత్తానికి 'పాపం ప్రతాప్' ఒక సింపుల్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్. చిన్న పాయింట్ అయినప్పటికీ.. తిరువీర్ నటన, సహజమైన కామెడీ, ఎమోషన్స్ వల్ల ఈ సినిమా నిలబడింది. కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ, ఈ వీకెండ్ లో సరదాగా కుటుంబంతో కలిసి చూడటానికి ఇది ఒక మంచి ఆప్షన్. Also Read: 'పాపం ప్రతాప్' మూవీ రివ్యూ
Apr 17, 2026.webp)
Papam Prathap Review: ‘పాపం ప్రతాప్’ మూవీ రివ్యూ
నటీనటులు: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, రూపలక్ష్మి, దేవీప్రసాద్, గోపరాజు రమణ, రఘుబాబు తదితరులు సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్.వి. ఎడిటింగ్: అన్వర్ అలీ నిర్మాతలు: రాకేష్రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరె బ్యానర్స్: ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్, కృషి ఎంటర్టైన్మెంట్స్ రచన, దర్శకత్వం: ఎస్.పి.దుర్గా నరేష్ విడుదల తేదీ: 17.04.26 ఇటీవలికాలంలో ఈటీవీ విన్ విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకొని తక్కువ బడ్జెట్తో పెద్ద విజయాలు సాధిస్తోంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ వంటి సినిమాలు దానికి ఉదాహరణ. అందులో భాగంగానే తాజాగా ‘పాపం ప్రతాప్’ పేరుతో మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈటీవీ విన్. మరి ఈ సినిమా ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? గత సినిమాల స్థాయిలో విజయం సాధించిందా? అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం. కథ: అతని పేరు ప్రతాప్(తిరువీర్). పక్క ఊరిలో ఉండే బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ)ను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తూ ఉంటాడు. అది ఒన్ సైడ్ లవ్ అయినప్పటికీ ఆమె కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతాడు. అలా తండ్రి వీరయ్య(అజయ్ ఘోష్)తో తిట్లు తింటాడు. పెద్దయ్యే సరికి బుజ్జమ్మ సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎంతో ఆర్భాటంగా పెళ్లి జరుగుతుంది. మూడు రాత్రులు అయిన తర్వాత నాలుగోరోజు బుజ్జమ్మ ఆ ఊరిలో పంచాయతీ పెడుతుంది. ప్రతాప్తో కలిసి తను ఉండలేనని చెబుతుంది. కారణం అడిగిన ప్రతాప్కి నిద్రలో అతను ప్రవర్తించే తీరు తను తట్టుకోలేకపోతున్నానని, అతని సమస్య ఏమిటో తెలుసుకొని దాన్ని తగ్గించుకుంటేనే అత్తారింటికి వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోతుంది. ప్రతాప్కి ఉన్న సమస్య ఏమిటి? పెళ్లయిన మూడు రోజులకే భర్తని వదిలి బుజ్జమ్మ పుట్టింటికి ఎందుకు వెళ్లిపోయింది? భార్య అలా వెళ్లిపోవడం వల్ల ఊరి జనం ముందు అతను ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి? ప్రతాప్ తనకి ఉన్న సమస్య తెలుసుకున్నాడా? అతను తిరిగి మామూలు మనిషి అయ్యాడా? చివరికి ప్రతాప్, బుజ్జమ్మ కలుసుకున్నారా? అనేది మిగతా కథ. విశ్లేషణ: కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న పాయింట్. దాని చుట్టూ రకరకాల అంశాలను చేర్చి కొంత సెంటిమెంట్, మరికొంత ఎమోషన్, అక్కడక్కడా కామెడీతో రెండున్నర గంటల సినిమాగా మలిచారు. ప్రతాప్ నిద్రలో ఒక సమస్య ఉంది అనే పాయింట్ అంత కన్విన్సింగ్గా లేదు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సమస్య మనం ఎక్కడా చూసి ఉండం. దాంతో ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవ్వడం కష్టం. అయితే ఒక కథగా దాన్ని అనుకున్నప్ప్పుడు దాని వల్ల ఎదురయ్యే సమస్యలు కొంత ఎంటర్టైనింగ్గా తియ్యడం వల్ల ప్రేక్షకులు కూడా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. తన సమస్యను తెలుసుకోవడం, దాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతాప్ చేసే ప్రయత్నాలు సినిమా నిడివిని పెంచేందుకు చేసిందిగా అనిపిస్తుంది. ప్రతాప్ భార్య అతన్ని వదిలి వెళ్లిపోయిందని ఊరి జనం నానా మాటలు అనే సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. అవి మొదట ఎంటర్టైనింగ్గా అనిపించినా రాను రాను బోర్ కొట్టిస్తాయి. అయితే మధ్య మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్ని నవ్విస్తాయి. అలాగే కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. నిద్రలో సమస్య అనేది ప్రధాన కథ అయినప్పటికీ కథనంలో వేగం ఉండడం, ఎంటర్టైనింగ్ సీన్స్ కూడా ఉండడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు. పాపారావు(గోపరాజు రమణ), వీరయ్య(అజయ్ ఘోష్) ఇద్దరూ కలిసి షకీలా సినిమా చూసే సీన్ ఆడియన్స్ని బాగా నవ్విస్తుంది. నటీనటులు: ప్రతాప్ పాత్రలో తిరువీర్ ఒదిగిపోయాడని చెప్పాలి. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా అన్ని వేరియేషన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కని నటన ప్రదర్శించింది. ఇక సినిమాలో ఎక్కువగా కనిపించే పాత్ర వీరయ్యది. కొన్ని సీన్స్లో బాగా చేసినా, కొన్నిచోట్ల ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అనిపిస్తుంది. గోపరాజు రమణ తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకున్నాడు. ప్రతాప్ తల్లిగా రాశి కొన్ని సన్నివేశాల్లో కంట తడి పెట్టిస్తుంది. మిగతా పాత్రల్లో దేవీప్రసాద్, రూపలక్క్ష్మీ, రఘుబాబు, అవసరాల శ్రీనివాస్, ప్రసాద్ బెహరా ఫర్వాలేదు అనిపించారు. సాంకేతిక నిపుణులు: టెక్నికల్ ఎస్సెట్స్ గురించి చెప్పాలంటే.. విశ్వేశ్వర్ ఫోటోగ్రఫీ సాధారణంగా ఉంది. ఈ కథకి, బ్యాక్డ్రాప్కి మెరుపులు మెరిపించాల్సిన అవసరం లేదు కాబట్టి అందులో విశేషం ఏమీ లేదు. చాలా కాలం తర్వాత కె.ఎం.రాధాకృష్ణన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు. అతను చేసే తరహా మ్యూజిక్ ఈ కథకు అవసరం లేదు కాబట్టి పాటలు కూడా సాధారణంగానే ఉన్నాయి. ఒక మెలోడీ సాంగ్ మాత్రం ఆనంద్, గోదావరి వంటి సినిమాలను గుర్తు చేసింది. సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు అనిపించింది. అన్వర్ అలీ ఎడిటింగ్లో కూడా మెరుపులు ఏమీ లేవు. అది కూడా సాధారణంగానే ఉంది. డైరెక్టర్ దుర్గా నరేష్ గురించి చెప్పాల్సి వస్తే.. ఒక చిన్న పాయింట్తో రెండున్నర గంటల సినిమా నడిపేందుకు కావాల్సిన సరంజామా అంతా బాగానే ఏర్పాటు చేసుకొని ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా చూశాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. హీరోకి ఉన్న సమస్య ఏమిటి అనేది రివీల్ చెయ్యకుండా సస్పెన్స్ మెయిన్టెయిన్ చేశాడు. ఒక సందర్భంలో ఆ సమస్య ఏమిటో రివీల్ చేసినట్టుగా అనిపించినా, పూర్తి స్థాయిలో అది కాదు అని అసలు సమస్య చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే కథ ఎప్పుడు క్లైమాక్స్ వస్తుంది అని ఆడియన్స్ ఎదురుచూసేలా చివరి అరగంటను సాగదీసే ప్రయత్నం చేశాడు. ప్లస్ పాయింట్స్: సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ కామెడీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ మైనస్ పాయింట్స్: ఆడియన్స్కి కనెక్ట్ అవ్వని పాయింట్ ల్యాగ్ సీన్స్ రిపీటెడ్ సీన్స్ కథను క్లైమాక్స్కి తీసుకు రావడంలో తాత్సారం ఫైనల్గా చెప్పాలంటే: కథ ఎలా ఉన్నా.. కామెడీ కోసం, కొన్ని సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ కోసం సినిమా చూడొచ్చు. రేటింగ్: 2.5/5 - జి.హరా Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Apr 16, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



