
The Paradise: 'ఆయా షేర్' హుక్ స్టెప్ వెనుక అసలు రహస్యాలివే.!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'ఆయా షేర్' 'ది ప్యారడైజ్' మూవీ టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ హుక్ స్టెప్ ట్రోల్స్ పై క్లారిటీ తెరవెనుక ఇంత జరిగిందా? ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది... అదే "ఆయా షేర్"(Aaya Sher). న్యాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ది ప్యారడైజ్'(The Paradise) చిత్రంలోని ఈ పాట ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం పాట మాత్రమే కాదు, ఆ పాట వెనుక ఉన్న కష్టం, ఆ భావం, మరియు నాని అంకితభావం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ పాట సృష్టించిన మ్యాడ్నెస్ వెనుక ఉన్న అసలు కథను తాజాగా మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకుంది. శ్రీకాంత్ ఓదెల విజన్, సుధన్ మాస్టర్ డెబ్యూ 'దసరా' సినిమాతో తన మార్క్ చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి అంతకు మించిన ఇంటెన్సిటీతో 'ది ప్యారడైజ్'ను తెరకెక్కిస్తున్నారు. ఈ పాట ద్వారా సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. 'దసరా' సమయంలో అసిస్టెంట్గా పనిచేసిన సుధన్ ప్రతిభను గుర్తించి, శ్రీకాంత్ ఈ భారీ అవకాశాన్ని ఇచ్చారు. అనిరుధ్ మ్యాజిక్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ పాటకు వెన్నెముకగా నిలిచింది. మొదట కంపోజ్ చేసినప్పుడు ఇది కేవలం రెండు శాతం మాత్రమే అని, ఆ తర్వాత ఒక్కో లేయర్ యాడ్ చేస్తూ పూర్తి స్థాయి వైల్డ్ ఫైర్ లాంటి సాంగ్ గా మార్చారని టీమ్ తెలిపింది. జానపద గాయకులు జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య ల వాయిస్ లు ఈ సాంగ్ కు అదనపు బలాన్ని ఇచ్చాయి సీజీ కాదు.. ప్యూర్ హార్డ్ వర్క్ చాలా మంది ఈ పాటలోని స్టెప్స్ చూసి అవి గ్రాఫిక్స్ ఏమో లేదా తాడు కట్టుకుని చేశారేమో అని అనుకుంటున్నారు. కానీ, సుధన్ మాస్టర్ స్పష్టం చేసిన దాని ప్రకారం, ఆ అద్భుతమైన స్టెప్స్ వెనుక నాని నెల రోజుల కఠిన శ్రమ ఉంది. షూటింగ్ సమయంలో ఆయనకు భుజం గాయం ఉన్నప్పటికీ, ఎక్కడా తగ్గకుండా సింగిల్ టేక్లో ఆ షాట్స్ పూర్తి చేయడం విశేషం. ఆ కసి, ఆ డెడికేషన్ వల్లే ఈ రోజు స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ కనిపిస్తోంది. లిరిక్స్ వెనుక ఉన్న లోతైన అర్థం ఈ పాటలో వాడిన ప్రతి పదం ఒక ఆయుధంలా ఉంది. లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఈ పాటలోని లోతైన అర్థాలను వివరించారు. జడి తీయాలే: ఏదైనా విషాదం లేదా ఉత్కంఠ కలిగినప్పుడు ఒళ్ళు ఒక్కసారిగా జలదరించడాన్ని 'జడి' అంటారు. బరిబత్తాలు: అంటే సర్వం కోల్పోయినవాడు అని అర్థం. ఏమీ లేనివాడికి దేనికీ భయం ఉండదు అనే ఎమోషన్ ఇందులో కనిపిస్తుంది. మొలదారం లేనోన్ని: మనిషి చనిపోయినప్పుడు మొలదారం కూడా తీసేస్తారు. అంటే 'నేను చనిపోయిన వాడితో సమానం, నన్ను ఇంకేం భయపెడతావు' అనే తెగింపును ఈ పదం సూచిస్తుంది. సారా బట్టి: కష్టాలు, కన్నీళ్లు సారా బట్టిలో మరిగినట్టు మరిగి, ఇప్పుడు అవి నీ పంచె మీద బొట్టు బొట్టుగా రాలతాయి అనే బలమైన మెటాఫర్ ఇందులో వాడారు. లోకల్ నుండి గ్లోబల్ వరకు తెలంగాణ యాసలో ఉన్నప్పటికీ, ఈ పాటలోని ఎమోషన్ ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అవుతోంది. దాదాపు 12 దేశాలలో ఈ పాట ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఒక అణచివేతకు గురైన జాతి (సవారీ జాతి) తిరగబడితే ఎలా ఉంటుందో ఈ పాట ప్రతిబింబిస్తుంది. యాస తెలంగాణది అయినప్పటికీ, అందులోని ఎమోషన్ అందరిదీ. ఒక వ్యక్తిపై దౌర్జన్యం జరిగినప్పుడు వచ్చే ఆవేశం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉంటుంది, అందుకే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 'ఆయా షేర్' కేవలం ఒక పాట మాత్రమే కాదు, అది ఒక ఆవేశం, ఒక ఆవేదన. శ్రీకాంత్ ఓదెల విజన్, నాని హార్డ్ వర్క్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించాయి. మునుముందు ఈ సాంగ్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశముంది. పూర్తి ఇంటర్వ్యూ కోసం 'తెలుగువన్ సినిమా' యూట్యూబ్ ఛానల్ సందర్శించండి.
Mar 02, 2026
Dhurandhar 2 vs toxic: ఈ రెండు చిత్రాలపై ఆశలు వదులుకోండి.. ఏరియాస్ ఇవే
-టాక్సిక్, ధురంధర్ 2 కి షాక్ -అక్కడ ఇబ్బందులు తప్పవు -ఫ్యాన్స్ లో నిరుత్సాహం ఎందుకు -కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం ఏంటి! అభిమానులు, మూవీ లవర్స్ తమ రోజు వారి పనులు చేసుకుంటూనే ధురంధర్ 2(Dhurandhar 2),టాక్సిక్ (Toxic)పై ఒక లుక్ వేస్తూనే ఉన్నారు. ఈ మాట విన్న వెంటనే ప్రేక్షకులు సైతం ఎంటర్ అయ్యి నీ కంటికి మేము కనపడటం లేదా, అక్కడుంది ఎలాంటి మూవీస్. మేము కూడా ట్రెండ్ కి తగ్గట్టే అప్ డేట్ అయ్యాం. కేవలం సినిమా అప్పుడే కాదు ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా హంగామా చేయడానికి రెడీ అయ్యాం అని అంటున్నారు. చెప్పినట్టుగానే చేస్తు రెండు సినిమాలు హిట్ అవ్వడంతో పాటు మంచి వసూళ్లు సాధించాలని కూడా కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆ రెండు చిత్రాలకి సంబంధించిన న్యూస్ ఒకటి వాళ్ళ ఆశలకి చోటా గండి కొట్టింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి ఏరియాస్ ని వార్ జోన్లోకి నెట్టాయి. దాంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఈ యుద్ధ వాతావరణం మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 19 న సదరు ఏరియాస్ లో టాక్సిక్, ధురంధర్ రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. also read: The Kerala story 2: రికార్డు కలెక్షన్స్ లో కేరళ స్టోరీ 2 .. ఆ మూడు సినిమాల కలెక్షన్స్ గల్లంతు మన సినిమాలకి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచి వసూళ్లు వస్తుంటాయి. సౌదీ అరేబియా, ఖతార్ వంటి ప్రాంతాల్లో ఉన్న భారీ భారతీయ జనాభా కారణంగా రికార్డు వసూళ్లు గ్యారంటీ. ఈ విషయంలో సబ్జెట్ దృష్ట్యా ధురంధర్ 2 కి మామూలుగానే రిలీజ్ అవకాశం లేదు. కానీ ‘టాక్సిక్’కూడా ఆ మార్కెట్ని కోల్పోవాల్సి వచ్చింది. యుఎస్ లో డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బాక్సాఫీస్ ఓవరాల్ కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అరబ్ కంట్రీస్ కాకపోయినా మిగతా చోట్ల కూడా ధురంధర్ 2 కల్లెక్షన్స్ పై పడే అవకాశం ఉంది.
Mar 02, 2026
The Kerala story 2: రికార్డు కలెక్షన్స్ లో కేరళ స్టోరీ 2 .. ఆ మూడు సినిమాల కలెక్షన్స్ గల్లంతు
-థియేటర్స్ లో కేరళ స్టోరీ 2 హంగామ -పాజిటివ్ టాక్ నిజమేనా! -కలెక్షన్స్ పరిస్థితి ఇదే రిలీజ్ ఏప్పుడుంటుందో తెలియని పరిస్థితుల్లో ఈ నెల 27 న సెకండ్ షోస్ నుంచి స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది ది కేరళ స్టోరీ పార్ట్ 2(The Kerala Story 2). మూవీ చూసిన ప్రేక్షకుల నుంచి అయితే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం సాధించిన కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో వాటి వివరాలు చూద్దాం. శుక్రవారం సెకండ్ షో నుంచి కలుపుకొని ఇప్పటి వరకు టోటల్ గా 12 .3 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఒక్క ఆదివారమే 5 కోట్ల నెట్ ని రాబట్టింది. అదే రోజు బాలీవుడ్ మూవీస్ లేటెస్ట్ మూవీస్ అస్సి 1.6 కోట్లు, దో దీవానే సెహర్ మెయిన్ 1.45 కోట్లు, తు యా మెయిన్ 80 లక్షలు సాధించినట్టుగా చెప్తున్నారు. దీంతో సండే రోజుకి సంబంధించి కలెక్షన్స్ విషయంలో కేరళ స్టోరీ పార్ట్ 2 పై చేయి సాధించినట్లయింది. ఇక ఈ కలెక్షన్స్ ని చూస్తుంటే కేరళ స్టోరీ మొదటి భాగం కలెక్షన్స్ గుర్తుకు వస్తున్నాయి. ఆ చిత్రం కూడా కలెక్షన్స్ నిదానంగా స్టార్ట్ అయ్యి టోటల్ రన్ లో 302 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. మరి ఇప్పుడు సీక్వెల్ కూడా ఆ శాయి కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి. కామాఖ్య నారాయణ సింగ్(Kamakhya Narayana Singh)దర్శకత్వంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా, సుమిత్, అర్జన్ సింగ్, యుక్తం ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించారు. also read: Ustaad bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి షాకింగ్ బిజినెస్.. ఇక ట్రైలర్ ఎప్పుడో చెప్పండి
Mar 02, 2026అమ్మాయి చావుకు కారణమైన ఫారెస్ట్ ఆఫీసర్... డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్తలివే!
అది ఒక దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ నివసించే ప్రజలంతా ‘పులి’ భయంతో వణికిపోతుంటారు. కొందరు వ్యక్తులు పులి బారిన పడి చనిపోతూ ఉన్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సాధారణ వ్యక్తిగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ప్రాంతానికి వచ్చాడు. మనుషుల్ని చంపేది పులి కాదని, పులి పేరుతో మనుషులే ఆ హత్యలు చేస్తున్నారని తన పరిశోధనలో తెలుసుకుంటాడు. అయితే ఆ హత్యలు చేస్తున్నది ఎవరనేది కనిపెట్టే క్రమంలో కొందరు వ్యక్తుల్ని అనుమానిస్తూ వారి గురించి ఆరా తీస్తుంటాడు. ఆ వ్యక్తులు చనిపోవడానికి కారణం సుమతి అనే ఒక అమ్మాయి అని ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా తెలుస్తుంది. ఆ అమ్మాయిని తన కామ దాహానికి బలి తీసుకున్నాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్. సెక్స్ అనేది అతని బలహీనత. దాని కోసం వివేకాన్ని కూడా చంపుకొని ఎలాంటి దారుణం చెయ్యడానికైనా అతను సిద్ధపడిపోతాడు. పైకి ఒక పెద్ద మనిషిలా అందరికీ కనిపిస్తూ పులి ముసుగులో ఇలాంటి దారుణాలు చేస్తుంటాడు. పక్షులు చేసే శబ్ధాల్లోనే సంగీతం దాగి ఉందని, దానిపై పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాయాలని అక్కడి కాంట్రాక్టర్ ప్రయత్నిస్తాడు. తన వయసు మీద పడిపోవడంతో ఆ కార్యాన్ని పూర్తి చేసేందుకు సుమతి అనే అమ్మాయిని రంగంలోకి దించుతాడు. పక్షుల శబ్దాలను రికార్డు చేసుకునేందుకు ఆ అమ్మాయి అడవిలోని మూల మూలలకు వెళుతూ ఉంటుంది. దాన్ని అదనుగా చేసుకొని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మరో ముగ్గురి సహకారంతో ఆమెను హింసించి తన కోరిక తీర్చుకుంటాడు. అయితే ఆ క్రమంలో సుమతి చనిపోతుంది. ఆ అమ్మాయిని పులి చంపిందని ఆ ముగ్గురు వ్యక్తులు ఊరిలో ప్రచారం చేస్తారు. ఇది జరిగిన కొన్నాళ్ళకు ఆ ఊరిలో పులి వల్ల మనుషులు చనిపోతూ ఉంటారు. ఫారెస్ట్ ఆఫీసర్కి సహాయం చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు వరసగా చనిపోతారు. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అనే మిస్టరీని చేధించేందుకు ఆ పోలీస్ ఆఫీసర్ గట్టిగా ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలోనే ఫారెస్ట్ ఆఫీసర్ మీద అనుమానం వచ్చి ఒక పథకం ప్రకారం అతను నేరం ఒప్ప్పుకునేలా చేస్తాడు. సుమతి అనే అమ్మాయి చావుకు కారణం తాను, తన అనుచరులు అని ఒప్ప్పుకుంటాడు. కానీ, ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని చెబుతాడు. అడవిలోని క్రూర మృగాల కంటే మనిషిలోని అదుపులేని కోరికలు, పశుత్వమే అత్యంత ప్రమాదకరమైనవి. ఎవరెన్ని నేరాలు చేసినా, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రోజు ఆ నిజం బయట పడక మానదు. కామాంధుడై ఒక అమాయకురాలి చావుకు కారణమైన ఫారెస్ట్ ఆఫీసర్, అతని అనుచరుల్ని హత్య చేస్తున్నది ఎవరు అనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్లో ఉంచేందుకు దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు నిజంగా ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా పేరు ‘అన్వేషణ’. కార్తీక్, భానుప్రియ, సత్యనారాయణ, శరత్బాబు, రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, సుధాకర్, వై.విజయ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. 1985లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాలతో కూడిన ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం Teluguone Cinema ను Subscribe చెయ్యండి.
Mar 02, 2026
Ustaad Bhagat singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి షాకింగ్ బిజినెస్.. ఇక ట్రైలర్ ఎప్పుడో చెప్పండి
-ఉస్తాద్ బిజినెస్ పై సినీ విశ్లేషకులు ఏమంటున్నారు -అదే జరిగితే పవన్ ని ఆపడం కష్టమేనా! -లెక్కలు ఏం చెప్తున్నాయి -ట్రైలర్ కోసం వెయిటింగ్ బేసిక్ గా ఒక్కో హీరో అభిమానికి ఒక్కో టైం వస్తుంది. ఆ టైం ఏర్పడటానికి కారణం తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడమే. ఆ టైంలో ఇంట్లో శుభకార్యం జరుగుతున్నంత ఊపిరి సలపని బిజీతో ఉంటారు. ఆ శుభ గడియలు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)రూపంలో ఫ్యాన్స్ ని ఆవహించాయి. పైగా 'గబ్బర్ సింగ్' కాంబో కావడంతో వాళ్ళ అంచనాలకి కొత్తగా రెక్కలు వచ్చి ఏ రికార్డు దగ్గర ఆగాలో వాళ్ళకే తెలియని పరిస్థితి. కేవలం సినిమాగానే కాకుండా, అభిమానుల ఎమోషన్స్ ని ప్రతిబింబించేలా కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ బిజినెస్ రేంజ్ ఏంటి? బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లు రాబడితే సేఫ్ అనే చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఆ విశేషాలని చూసేద్దాం. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 130 కోట్ల రూపాయిల వరకు బిజినెస్ జరిగి ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు. ఓటిటి డీల్ కూడా 80 కోట్ల రూపాయలకి క్లోజ్ అయినట్లుగా సమాచారం. దీంతో ఫిల్మ్ సర్కిల్స్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' టాక్ ఆఫ్ ది లేటెస్ట్ న్యూస్ గా ఒక రేంజ్ లోనే వైరల్ గా మారింది. అయితే ఓవర్సీస్ మరియు ఇతర ఏరియాలని కలుపుకుంటే, బాక్స్ ఆఫీస్ వద్ద ఉస్తాద్ సుమారు 250 నుండి 350 కోట్ల రూపాయలు రాబడితే ఉస్తాద్ సేఫ్ జోన్ లోకి వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాళ్ళు ఇంకా మాట్లాడుతు ఉస్తాద్ లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుందని, దాదాపు రెండు గంటల పాటు పవన్ ని వెండితెరపై చూడవచ్చు. ఓజి' కి వచ్చిన రెస్పాన్స్ తో పవన్ కళ్యాణ్ లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే ఎనర్జీతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. హరీష్ శంకర్(Harish Shankar)కి ఉస్తాద్ భారీ విజయం సాధించడం అత్యంత కీలకం. కాబట్టి గబ్బర్ సింగ్ బెంచ్ మార్క్ ని అందుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో పవన్ మానియా కూడా వర్క్ అవుట్ అయితే 250 కోట్లు రాబట్టడం పెద్ద పనేమీ కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఈ న్యూస్ అభిమానులకి పూనకాలు తెప్పించే వార్తే. మూవీలో పొలిటికల్ అంశాల గురించి చర్చ జరుగుతున్నప్పటికీ, ఇది ప్యూర్లీ సినిమా కేవలం జనాన్ని కనెక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ నిజ జీవిత అంశాలని పాటల్లో మరియు నెరేటివ్ లో వాడారని సమాచారం. ఇప్పటికే హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్నీ తెలియచేసాడు. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ స్టామినాని మరోసారి సినీ ప్రపంచానికి చాటిచెప్పడానికి సిద్ధమవుతోంది. ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా రేంజ్ ఏంటో మరింత స్పష్టత వస్తుంది. ఈ నెల 26 న ఉస్తాద్ వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే also read: ANR..ఏఎన్నార్ టైటిల్స్ వాడితే పరిస్థితి ఇదే.. కానీ ఆ ఒక్క హీరో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి! కింద ఉన్న వీడియోతో పాటు మా ఛానల్లో పవన్ కళ్యాణ్ సినిమాలపై మరిన్ని ప్రత్యేక వీడియోలు ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి.
Mar 02, 2026
Sivaji: మేకర్స్ కి శివాజీ సవాల్.. నేను ఏ ఆర్టిస్ట్ కంటే తక్కువ కాదు.. త్వరలో ఎన్టీఆర్ ను కలుస్తా!
శివాజీ సంచలన ఇంటర్వ్యూ తెలుగు నటులకు అన్యాయం దండోరా విషయంలో అసంతృప్తి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి నటుడిగా దశాబ్దాలుగా అలరిస్తూ, 'బిగ్ బాస్' రియాలిటీ షో తర్వాత ప్రతి ఇంటి మనిషిగా మారిపోయిన శివాజీ(Sivaji) ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో మరింత జోరు చూపిస్తున్నారు. ఓటీటీలో '90s' వెబ్ సిరీస్ తో అదరగొట్టారు. 'కోర్టు', 'దండోరా' సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మార్చి 6న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'తెలుగువన్'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకోవడంతో పాటు, ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. (Sampradayini Suppini Suddapoosani) సరికొత్త వినోదం: అప్పట్లో శివాజీ-లయ జోడీకి మంచి క్రేజ్ ఉంది. చాలా ఏళ్ల తర్వాత శివాజీ-లయ కలిసి 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'లో నటించడం విశేషం. దాదాపు మూడున్నర కోట్ల బడ్జెట్తో, హార్స్లీ హిల్స్ నేపథ్యంలో 48 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ప్రేక్షకులకు కావాల్సిన మంచి వినోదాన్ని, థ్రిల్ను అందిస్తుందని శివాజీ ధీమా వ్యక్తం చేశారు. తెలుగు నటుల ఆత్మగౌరవం: తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటులు ఉన్నా, తరచుగా ఇతర భాషల నటుల వైపు మొగ్గు చూపడంపై శివాజీ తనదైన శైలిలో స్పందించారు. "నేను ఏ ఆర్టిస్ట్ కంటే తక్కువ కాదు. నేను ఏ పాత్రయినా చేస్తా." అని ఆయన మేకర్స్కు సవాల్ విసిరారు. నేను అనే కాదు, తెలుగులో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. మానవత్వం, సమాజం: సమాజం పట్ల శివాజీకి ఉన్న బాధ్యత పునర్విక పాప విషయంలో మరోసారి నిరూపితమైంది. ఆ పాప వైద్యం కోసం సహాయం చేయడానికి ఆయన స్వయంగా ప్రయత్నించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ లావాదేవీ విఫలమైనప్పటికీ, ఆయన చూపిన చొరవ నిజంగా అభినందనీయం. ఇక తిరుపతి లడ్డూ వంటి వివాదాల విషయంలోనూ, "తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి" అని ఆయన కుండబద్దలు కొట్టారు. వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ: సినిమా షూటింగ్ లేని సమయంలో శివాజీ చాలా సాధారణంగా గడుపుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, టీవీ చూస్తూ గడపడం ఆయన దినచర్యలో భాగం. స్క్రీన్ మీద ఫిట్గా కనిపించడం కోసం కఠినమైన డైట్ కూడా పాటిస్తారు. లయతో మళ్ళీ నటించడం ఎలా అనిపించింది? కథ విన్నప్పుడే హీరోయిన్గా లయ అయితే బాగుంటుందని అనుకున్నాం. మా కాంబినేషన్కు ఒక క్రేజ్ ఉంది, అది ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. దండోరా విషయంలో అసంతృప్తి? 'దండోరా' సరైన సమయంలో థియేటర్ లో విడుదలయ్యుంటే.. 'కోర్టు' తరహాలో రూ.50 కోట్లు దాకా వసూలు చేసి ఉండేది. ముందు రోజు సాయంత్రం వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దాంతో సరైన షోలు లభించలేదు. కొన్ని రోజులు ఆగి సినిమాను విడుదల చేసి ఉండాల్సింది. కానీ నిర్మాత ఓటీటీ డీల్ పోతుందనే భయంతో కంగారుగా విడుదల చేశారు. ఓటీటీలోకి వచ్చాక ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఆయనను స్వయంగా కలిసి కృతఙ్ఞతలు తెలుపుతాను. సోషల్ మీడియా పట్ల అభిప్రాయం? సోషల్ మీడియా అనేది ఒక విప్లవం లాంటిది, కానీ దానిని పునర్విక పాప వంటి మంచి కార్యాల కోసం వాడాలి. అదే సమయంలో ఇది సమాజానికి హాని చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే చిన్న పిల్లలకు దీనిని అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడాలని నా అభిప్రాయం. రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే ఆలోచన ఉందా? ప్రస్తుతం నా దృష్టి సినిమాలపైనే ఉంది. 2029 రాజకీయాల గురించి అప్పుడే మాట్లాడతాను, ప్రస్తుతానికి "గో విత్ ద ఫ్లో" అంతే. తదుపరి చిత్రాలు? ప్రస్తుతం 'లెనిన్' మరియు 'ప్రేమకు నమస్కారం' వంటి సినిమాల్లో నటిస్తున్నాను. ముఖ్యంగా 'లెనిన్' చిత్రంలో దాదాపు 70% వరకు నా పాత్ర ఉంటుంది. శివాజీ తన కెరీర్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన మాటల్లోని స్పష్టత, నిజాయితీ ఎక్కువమందికి చేరువ చేశాయి. 'కోర్టు', 'దండోరా' తరువాత 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'తో హ్యాట్రిక్ సిద్ధమవుతున్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం 'తెలుగువన్' యూట్యూబ్ ఛానెల్ని సందర్శించండి.
Mar 02, 2026
ANR: ఏఎన్నార్ టైటిల్స్ వాడితే పరిస్థితి ఇదే.. కానీ ఆ ఒక్క హీరో మాత్రం
-ఏఎన్నార్ కి మరణం లేదని ఫ్యాన్స్ అభిప్రాయం -అందుకు సాక్థ్యం ఆయన చిత్రాలే -సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి! నటసామ్రాట్, ఎవర్ గ్రీన్ అక్కినేని నాగేశ్వరరావు(ANR)సృష్టించిన సినీ చరిత్రకి మరణం అసాధ్యం. ఎందుకు అసాధ్యమో అభిమానులకి, తెలుగు సినిమా ప్రేమికులకి బాగా తెలుసు. ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్ మన మధ్య లేరనే మాట కూడా అబద్ధమని ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంటుంటారు. జ్ఞానం, విచక్షణ, సంస్కారం, నిజాయితీ, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ఐదు పంచామృతాలని పంచే చిత్రాలు తమ దగ్గర ఉండగా ఏఎన్ఆర్ కి మరణం లేదని ఆ అందరి నమ్మకం. రీసెంట్ గా ఏఎన్ఆర్ సినిమాలకి, కొంత మంది బడా హీరోల సినిమాలకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. దేవదాసు, యువరాజు, అందాల రాముడు. ఏఎన్ఆర్ నుంచి వచ్చిన ఆ మూడు చిత్రాలు అభిమానులకి ఫేవరేట్ చిత్రాలు.తర్వాత కాలంలో దేవదాస్ అనే టైటిల్ తో కృష్ణ(Krishna),నాగార్జున(Nagarjuna)తమ చిత్రాలని తెరకెక్కించి పరాజయాన్ని అందుకున్నారు. మహేష్ బాబు(Mahesh Babu)తన సెకండ్ మూవీగా 'యువరాజు' తో ప్లాప్ ని ఒడిసి పట్టుకున్నాడు. కామెడీ కింగ్ సునీల్(Sunil)మాత్రం 'అందాల రాముడు' టైటిల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కించి హిట్ ని అందుకున్నాడు. also read: Manjummel boys: మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు.. పేరు తెలిస్తే షాక్ గ్యారంటీ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి పాత సినిమా టైటిల్ తో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కినేని సినిమా టైటిల్ మ్యాటర్ వైరల్ గా మారింది.
Mar 02, 2026విజయ్ దేవరకొండని అలా చూసి భయపడిన రష్మిక.. మరి ప్రేమ ఎలా పుట్టింది?
ఎంతో కాలంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల లవ్స్టోరీ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయాయ్యరు. దాంతో వారిపై వస్తున్న రూమర్స్కి తెరపడింది. తమపై ఎన్ని వార్తలు వస్తున్నా ఒక్కసారి కూడా స్పందించకుండా ఎంతో సంయమనం పాటించి తాము అనుకున్న విధంగా పెళ్లి చేసుకున్నారు. ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తను మొదటిసారి చూసినపుడు కలిగిన ఫీలింగ్ గురించి వివరించారు రష్మిక. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన తొలి సినిమా ‘గీతగోవిందం’. ఈ సినిమా షూటింగ్లో తొలిసారి విజయ్ని చూసి రష్మిక భయపడిందట. ఎందుకంటే అంతకుముందు సంవత్సరమే ‘అర్జున్రెడ్డి’ సినిమా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో అతని గెటప్, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ తరహా క్యారెక్టర్ చేసిన విజయ్.. వెంటనే ‘గీతగోవిందం’ చిత్రంలో అమాయకంగా ఉండే క్యారెక్టర్ చేశాడు. ‘అర్జున్రెడ్డి’ ప్రభావం రష్మికపై చాలా ఉండడంతో విజయ్ని మొదటిసారి చూసి భయపడింది. చిన్నతనం నుంచి కొత్త వ్యక్తులతో కలవాలన్నా, మాట్లాడాలన్నా రష్మికకు చాలా భయం. అందులోనూ అర్జున్రెడ్డి వంటి సినిమా చూసిన తర్వాత విజయ్తో మాట్లాడేందుకు ఎంతో బెరుకుగా అనిపించిందట. సినిమాలో చేసిన క్యారెక్టర్కి, నిజ జీవితంలో కనిపించే వ్యక్తికి సంబంధం ఉండదు అనే విషయం నటిగా రష్మికకు తెలిసినప్పటికీ భయం మాత్రం పోలేదట. ఒక్కసారి విజయ్తో మాట్లాడిన తర్వాత ఆమె భయం పటాపంచలైపోయింది. ఎందుకంటే విజయ్ ఎవరితోనైనా ఎంత మర్యాదగా మాట్లాడతాడనే విషయం అందరికీ తెలుసు. రష్మికతో కూడా ఎంతో కూల్గా మాట్లాడడంతో ఆమె మనసు కుదుటపడింది. అతను సెట్లో ఉంటే వాతావరణం పాజిటివ్గా ఉంటుందని చెప్పింది. అతని కోఆపరేషన్ వల్ల తాము కలిసి నటించే సీన్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని, షూటింగ్ అంతా ఎంతో సాఫీగా సాగిపోయిందని విజయ్తో తన తొలి పరిచయం గురించి వివరించారు రష్మిక మందన్న.
Mar 02, 2026
Manjummel boys: మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు.. పేరు తెలిస్తే షాక్ గ్యారంటీ
-డైరెక్టర్ చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు -మంజుమ్మల్ బాయ్స్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ -ఆరోపణలు చేస్తుంది ఎవరు! -నోటీసులు జారీ అయ్యాయా! డీటెయిల్స్ చూద్దాం కథ,కథనం అనేవి సినీ అడ్రెస్స్ లేని నటుల్ని, మేకర్స్ ని ఓవర్ నైట్ స్టార్స్ ని చేస్తాయని నిరూపించిన చిత్రం మంజుమ్మల్ బాయ్స్'. అది కూడా పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించేలా చేసింది. దీన్ని బట్టి ఆ చిత్రం సృష్టించిన ప్రభంజాన్ని అర్ధం చేసుకోవచ్చు. 2024 లో రిలీజైనా కూడా సినిమా ప్రేమికులు అయితే నిద్రలో లేపి అడిగినా మూవీలోని సీన్స్ ని పిన్ టూ పిన్ చెప్తారు. అంతటి ప్రత్యేకతని సంతరించుకున్న మంజుమ్మల్ బాయ్స్ తన సినీ హిస్టరీ లో ఒక మరకని అంటించుకుంది. దర్శకుడు చిదంబరం(Chidambaram s.Poduval)పై వస్తున్న ఆరోపణలే అందుకు కారణం. పూర్తి మ్యాటర్ చూద్దాం రీసెంట్ గా కేరళలోని ఎర్నాకులం(Ernakulam)పోలీస్ స్టేషన్ లో చిదంబరం పై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. సదరు ఫిర్యాదులో 2021 వ సంవత్సరంలో చిదంబరం లైంగికంగా తనని వేధించినట్టుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు చిదంబరంపై కేసు నమోదు చేసి విచారణకి హాజరు కావాలని నోటిసులు పంపించారు. ఇప్పుడు ఈ విషయం కేరళ సినిమా పరిశ్రమలో వైరల్ గా మారింది. మంజుమ్మల్ బాయ్స్ పుణ్యమా అని సౌత్ లో కూడా కేసు విషయం గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఆరోపణలపై చిదంబరం ఎలాంటి సమాధానం ఇస్తాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. also read: Balakrishna: చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే.. ఆ చరిత్ర నాదే చిదంబరం సినీ జర్నీ విషయానికి వస్తే 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జాన్ ఈ మాన్' తొలి చిత్రం. మంజుమ్మేల్ బాయ్స్ సెకండ్ మూవీ. ఆ రెండు చిత్రాలతో నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తాడనే బ్రాండ్ ఏర్పడింది. ప్రస్తుతం తన కొత్త చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. పూర్తి పేరు చిదంబరం ఎస్ పోదువాల్..
Mar 02, 2026
Vishwanath & Sons: 'విశ్వనాథ్ & సన్స్' ఫస్ట్ లుక్.. సూర్య ఈసారైనా హిట్ కొడతాడా?
ఆకట్టుకుంటున్న 'విశ్వనాథ్ & సన్స్' ఫస్ట్ లుక్ త్వరలోనే టీజర్ విడుదల సూర్య బర్త్ డే కానుకగా సినిమా రిలీజ్! కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya) తన 46వ సినిమాని వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని తాజాగా రివీల్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమాకి 'విశ్వనాథ్ & సన్స్' అనే టైటిల్ను ఖరారు చేశారు. అలాగే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దాంతో పాటు, విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. (Vishwanath & Sons) 'విశ్వనాథ్ & సన్స్' ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. సూర్య ఒక చిన్నారిని ఎత్తుకొని కూల్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సూర్య లుక్ కూడా క్లాసీగా ఉంది. వింటేజ్ సూర్య గుర్తుకొస్తున్నాడు. ఇప్పటికే 'విశ్వనాథ్ & సన్స్' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 23న సూర్య పుట్టినరోజు. ఆయన బర్త్ డే కానుకగా ఆ తేదీకి సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే టీజర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ & సన్స్'లో మమిత బైజు, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా నిమిష్ రవి, ప్రొడక్షన్ డిజైనర్ గా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. సూర్య కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. థియేటర్లలో ఓ సాలిడ్ సక్సెస్ కోసం చూస్తున్న సూర్య.. 'విశ్వనాథ్ & సన్స్'తో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాల తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'విశ్వనాథ్ & సన్స్' కంటెంట్ పై ప్రేక్షకుల్లో నమ్మకం ఉంది. ఆ సినిమాల తరహాలో కంటెంట్ క్లిక్ అయితే సూర్య ఖాతాలో హిట్ పడినట్లే. సూర్య 'కరుప్పు' అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు 'ఆవేశం' ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలోనూ సూర్య ఒక సినిమా చేస్తుండటం విశేషం. https://x.com/Theteluguone/status/2028346409955795235?s=20
Mar 02, 2026
Balakrishna: చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే.. ఆ చరిత్ర నాదే
-షూటింగ్ కి వెళ్ళబోతున్న NBK111 -వీర సింహారెడ్డి కాంబో కావడంతో భారీ అంచనాలు -సంక్రాంతి దాకా జాతర పక్కానా! గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna).. ఈ పేరు వింటే చాలు నందమూరి అభిమానులకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి పూనకాలు వస్తాయి. అందుకు కారణమైన సినీ హిస్టరీ బహిరంగ రహస్యమే. హిట్ లకి మొహమాసిన రోజుల్లో అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ విజయాలతో బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుకున్నాడు. ప్రీవియస్ మూవీ అఖండ 2 తో కొంచం తగ్గినట్టుగా అనిపించినా కలెక్షన్స్ పరంగా మాత్రం తన కట్ అవుట్ కి ఉన్న వేడి తగ్గలేదు. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాతో (NBK111) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. వీరసింహ రెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)దర్శకుడు కావడంతో అంచనాల స్థాయిని కొలవడానికి సరికొత్త పరికరాల్ని కనిపెట్టాల్సిన పరిస్థితి. తాజాగా ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ఆసక్తికరమైన అప్డేట్స్ మీ కోసం. ఈ నెల ఐదు లేదా తొమ్మిదవ తారీకు నుంచి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభం కానుంది,. మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికనే తమ స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకొని మరిన్ని అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్లందరికీ తాజాగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే మేకర్స్ తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అభిమానులని ఎక్కువ కాలం వేచి చూడనివ్వకూడదనే ఉద్దేశ్యంతో దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. దసరా నుంచి సంక్రాంతి వరకి థియేటర్లలో బాలయ్య వేట కొనసాగేలా ఉండాలనేది వాళ్ళ ప్లాన్. దీన్ని బట్టి మేకర్స్ కి మూవీపై ఉన్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు. 'వీరసింహారెడ్డి'లో బాలయ్యను పవర్ ఫుల్ 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్లో చూపించి మెప్పించారు. ఈసారి అంతకు మించి ఉండబోతోందని తెలుస్తోంది. డ్యూయల్ రోల్ కాకపోయినప్పటికీ నాలుగైదు విభిన్నమైన గెటప్స్లో బాలయ్య కనిపించబోతున్నాడని, సదరు క్యారెక్టర్లో ఉండే వేరియేషన్స్ ప్రేక్షకులకి సర్ ప్రైజింగ్గా ఉంటాయని తెలుస్తోంది. ప్రతి గెటప్ హైలైట్గా నిలుస్తుందని టాక్. కథాంశం టోటల్ యాక్షన్ డ్రామాతో కూడిన మాఫియా బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ముంబై లేదా మరేదైనా విభిన్నమైన లొకేషన్లలో సినిమా నేపథ్యం ఉండవచ్చు. ఏ మూవీలో అయినా సరే బాలయ్య నోటి నుంచి డైలాగ్స్ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తాయనే విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ మూవీలో కూడా అభిమానులు ఆశించే రేంజ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నాయి. గత కొంతకాలంగా బాలయ్య సినిమాల్లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని కూడా బలంగా ఉండేలా గోపీచంద్ మలినేని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సినీ సర్కిల్ ఫ్రెష్ టాక్ . also read: మన శంకర వర ప్రసాద్ 50 డేస్ సెంటర్స్ ఇవే.. బాలకృష్ణకి కృతజ్ఞతలు ఈ భారీ ప్రాజెక్టులో బాలయ్య సరసన నయనతార(NayanThara)హీరోయిన్ గా చేస్తుందనట్టుగా తెలుస్తుంది. 'వీరసింహారెడ్డి'లో తన నటనతో మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఆమెతో పాటు ఉదయభాను లేదా మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మొత్తానికి, NBK111 సినిమాతో బాలయ్య బాబు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి వస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, మరియు బాలయ్య మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిసిన ఈ చిత్రం దసరా పండుగను మరింత స్పెషల్ గా మార్చడం ఖాయం. చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే. ఆ చరిత్ర నాదే అని బాలయ్య చెప్పే డైలాగ్స్ థియేటర్లలో పేలడానికి సిద్ధంగా ఉండండి. బాలకృష్ణ అభిమానులు, మూవీ మేకర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి! అలాగే కింద ఉన్న వీడియోలో బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ చూడండి.
Mar 02, 2026.webp)
ఆకలితో అలమటించిన చిరంజీవి.. మనవడికి తెలీకుండా అన్నం పెట్టిన తల్లి!
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో చైతన్యాన్ని నింపే సందేశాలు, బంధాలు, అనుబంధాల గురించి తెలియజెప్పే సాధనం కూడా. అలా ఎన్నో సినిమాల్లో మానవ సంబంధాల గురించి, వారి మధ్య ఉండే అనుబంధాల గురించి చర్చించారు, ప్రేక్షకుల్ని మెప్పించారు. గుండెల్ని పిండేసే అలాంటి ఓ సన్నివేశం మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ‘స్నేహం కోసం’ చిత్రంలో ఉంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాలో మీనా, ప్రకాశ్రాజ్, విజయ్కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుజాత, సితార తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, విజయ్కుమార్ల మధ్య స్నేహం, సెంటిమెంట్కి సంబంధించిన సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్. ఆ సన్నివేశం చూసి కంటతడి పెట్టని వారుండరు. అంతటి అద్భుతమైన ఆ సీన్ ఏమిటో చూద్దాం. సింహాద్రికి తమ యజమానితో అనుబంధం, ఆయన పట్ల విశ్వాసం ఎక్కువ. సింహాద్రి జైలుకి వెళ్లిన తర్వాత కొడుకు కూడా అదే విశ్వాసంతో యజమాని దగ్గర పనిచేస్తుంటాడు. యజమాని కూతురు క్షేమం కోసం చేయని నేరాన్ని నెత్తిన వేసుకొని జైలుకి వెళ్తాడు సింహాద్రి. 15 ఏళ్లు జైలు జీవితం గడిపి తిరిగి ఊరికి వచ్చిన సింహాద్రిని యజమాని చిన్న కూతురు ఘోరంగా అవమానించి ఇంటి నుంచి గెంటేస్తుంది. ఆ అవమానంతోనే కొడుకుని చూసేందుకు తన ఇంటికి వస్తాడు. యజమానికి తీరని ద్రోహం చేశాడని సింహాద్రిపై కోపంతో ఉంటాడు కొడుకు. ఈ విషయం తల్లి ద్వారా తెలుసుకున్న సింహాద్రి దొంగచాటుగా కొడుకుని చూస్తాడు. అదే సమయంలో తనకు ఆకలిగా ఉందని, అన్నం పెట్టమని తల్లిని అడుగుతాడు. మనవడికి తెలియకుండా కొడుక్కి అన్నం పెట్టే ప్రయత్నం చేస్తుందా తల్లి. కొడుక్కి ముద్ద తినిపించేలోపే మనవడు వచ్చి తండ్రిని నానా మాటలు అంటాడు. అయినా సింహాద్రి బాధ పడడు. తన లాగే కొడుకు కూడా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నాడని ఆనందిస్తాడు. ఇక అక్కడ ఉండకూడదని వెళ్లిపోతున్న సమయంలో యజమాని అక్కడికి వచ్చి సింహాద్రి జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందీ వివరిస్తాడు. అప్పటివరకు ఆ విషయం తల్లికి తెలీదు. అసలు నిజం ఎవరికీ చెప్పొద్దని యజమాని దగ్గర మాట తీసుకుంటాడు సింహాద్రి. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరిగిపోవడానికి చూసి తట్టుకోలేని యజమాని నిజం చెప్పేస్తాడు. విషయం తెలుసుకున్న సింహాద్రి తల్లి, కొడుకు కన్నీరు మున్నీరవుతారు. తన తల్లి చేతితో సింహాద్రిని అన్నం తినకుండా చేసినందుకు బాధపడిన కొడుకు తనే స్వయంగా తండ్రికి అన్నం తినిపిస్తాడు. ఆ వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రింద ఇస్తున్నాము. వీక్షించండి ఇలాంటి మరిన్ని భావోద్వేగ సన్నివేశాల కోసం ఇప్ప్పుడే Teluguone cinema ను Subscribe చేసుకోండి.
Mar 02, 2026.webp)
మన శంకర వరప్రసాద్ 50 డేస్ సెంటర్స్ ఇవే.. బాలకృష్ణకి కృతజ్ఞతలు
-రికార్డు సెంటర్స్ లో యాభై రోజులు -అభిమానులు, మూవీ లవర్స్ హ్యాపీ -మరి బాలయ్య కి ధన్యవాదాలు ఎందుకు హిట్ కి జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే.. కానీ హిట్ కొడితే మాత్రం దాని స్థాయి ఇలా ఉంటుందని మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)తో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)మరోసారి నిరూపించాడు. తన రీ ఎంట్రీ లో ఇప్పటికి వరకు ఐదు చిత్రాల వరకు చేసినా శంకర వరప్రసాద్ నే రీ ఎంట్రీ మూవీ అంటున్నారంటే ఏ స్థాయి విజయమో కూడా అర్ధం చేసుకోవచ్చు. పైగా విక్టరీ వెంకటేష్(Venkatesh)కట్ అవుట్ కి ఉన్న చరిష్మా తోడవ్వడంతో 400 కోట్ల గ్రాస్ దాకా రాబట్టి అచ్చ తెలుగు సినిమాకి ఉన్న మార్కెట్ ని తెలియచేసింది. ఈ రోజుతో మన శంకర వరప్రసాద్ యాభైయ్యవ రోజులోకి అడుగుపెట్టడంతో సెంటర్స్ లిస్ట్ పై అభిమానుల్లో, మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. మరి వాటి డీటెయిల్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 109 పైగా సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ధ్రువీకరిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. సదరు పోస్టర్ లో జిల్లాల వారీగా రన్ అయిన థియేటర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సరికొత్త జోష్ వచ్చినట్లయింది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు స్పందిస్తు ప్రస్తుత సినీ కలికాలంలో ఒక సినిమా ఎంత బాగున్నా యాభై రోజులు ఆడటం అనేది గగనమైపోయింది. కానీ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఈ విషయంలో కళామతల్లి ఋణం తీర్చుకుంటు 50 డేస్ కి ఎక్స్ పైరీ డేట్ ఉండదని నిరూపిస్తున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. అఖండ తో బాలకృష్ణ(Balakrishna) అర్ద శతదినోత్సవ వేడుకకి రిబ్బన్ కట్ చేసిన విషయం తెలిసిందే. also read: Balakrishna: బాలయ్య కి అభిమానుల విన్నపం ఇక మన శంకర వర ప్రసాద్ కి సంబంధించిన అర్ధ శతదినోత్సవ వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ ఓటీటీలో రికార్డ్స్ వాచ్ టైం మినిట్స్ తో దూసుకుపోతుంది.
Mar 02, 2026.webp)
'సరస్వతి' టైటిల్ బాలయ్యకు నచ్చింది.. ఏకంగా 45 నిమిషాలు మాట్లాడారు!
దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్ తొలి చిత్రం 'సరస్వతి' మార్చి 6న విడుదల వరలక్ష్మితో తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూ బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar ) అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆమె పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్. ముఖ్యంగా 'క్రాక్' సినిమాలోని 'జయమ్మ' పాత్ర ఆమెను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా 'సరస్వతి'(Saraswathi) అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న దర్శకత్వ కలను 'సరస్వతి' సినిమాతో నెరవేర్చుకుంటున్నారు. నటిగా, దర్శకురాలిగా మాత్రమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. 'సరస్వతి' సినిమా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సమాజంలో మహిళలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక గొప్ప మెసేజ్ తో ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మార్చి 6న 'సరస్వతి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ ప్రముఖుల మద్దతు ఈ చిత్రం కోసం పరిశ్రమ నుండి అద్భుతమైన మద్దతు లభించిందని వరలక్ష్మి తెలిపారు. నందమూరి బాలకృష్ణ: సినిమా కంటెంట్ చూసిన తర్వాత బాలయ్య గారు ఏకంగా 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయనకు 'సరస్వతి' అనే టైటిల్ మరియు అందులోని వైబ్ చాలా బాగా నచ్చింది. నాని: ఈ చిత్ర టీజర్ ను నాని గారు లాంచ్ చేసి తన మద్దతు తెలిపారు. సమంత: షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నా, సిగ్నల్ దొరకని కొండ ప్రాంతం నుండి కూడా ఒక్క బార్ సిగ్నల్ తో సమంత ఈ సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం విశేషం. ఎస్.ఎస్. థమన్: వరలక్ష్మితో ఉన్న స్నేహం కారణంగా, కథ కూడా వినకుండానే ఈ సినిమాకు సంగీతం అందించడానికి థమన్ ఒప్పుకున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం ఒక వెన్నెముక వంటిది. కష్టాలను దాటుకుని.. పరిశ్రమలో ఒక మహిళగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు. ట్రోలింగ్ మరియు విమర్శలను పట్టించుకోకుండా, ఒక 'దున్నపోతు చర్మం' (Buffalo skin) లాంటి మొండితనాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. తన భర్త నికోలస్ మరియు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతగానో ఉందని తెలిపారు. హఠాత్తుగా దర్శకత్వం వైపు రావడానికి కారణం? గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. దర్శకత్వం చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, కానీ సరైన మెచ్యూరిటీ మరియు ధైర్యం కోసం వేచి చూశాను. భర్త మరియు స్నేహితుల ప్రోత్సాహంతో ఈ అడుగు వేశాను. 'సరస్వతి' సినిమా ప్రత్యేకత? ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం. ఇందులో 7 నిమిషాల 42 సెకన్ల పాటు ఉండే ఒక సింగిల్ షాట్ కూడా ఉంది. ప్రేక్షకులకు వరలక్ష్మి విన్నపం? సినిమా నచ్చినా, నచ్చకపోయినా ఫర్వాలేదు కానీ, దయచేసి స్పాయిలర్స్ (ట్విస్టులు) బయట పెట్టవద్దు. నటిగా తన సత్తా చాటిన వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 'సరస్వతి' చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. పూర్తి ఇంటర్వ్యూ కోసం 'తెలుగువన్' యూట్యూబ్ ఛానెల్ ను సందర్శించండి. మా ఛానెల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మరియు మరెన్నో సినీ అప్డేట్స్ ఉన్నాయి.
Mar 02, 2026
Virosh: సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం.. విరోష్ పెళ్లి రిసెప్షన్ కి ఫ్యాన్స్ కి నో ఎంట్రీ!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్లో కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. మార్చి 4న హైదరాబాద్లో విజయ్-రష్మిక వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. (Virosh wedding reception) తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులను కలిసి తమ వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని రష్మిక ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సతీమణి.. రష్మికకు బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను బహుకరించారు. ఇదిలా ఉంటే ఆహ్వానం లేకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని అభిమానులను విజయ్, రష్మిక కోరారు. ఈ మేరకు వారి టీమ్ కీలక ప్రకటన చేసింది. "విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు రిసెప్షన్ లో పాల్గొననున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు." టీమ్ తెలిపింది. https://x.com/Theteluguone/status/2028071183460290976?s=20
Mar 01, 2026
Thalapathy Vijay: విజయ్ కి షాకుల మీద షాకులు.. దాని నుంచి ఇంకా తేరుకోకముందే...
దళపతి విజయ్ కి దెబ్బ మీద దెబ్బ ఇప్పటికే విడాకుల కోసం కోర్టుమెట్లెక్కిన భార్య ఇప్పుడు మరో షాకిచ్చిన కొడుకు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay)కి కుటుంబ పరంగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, తాజాగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్(Jason Sanjay) తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్, సంగీత 1999లో పెళ్ళి చేసుకున్నారు. 26 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యారు. నిజానికి వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రీసెంట్ గా విజయ్ భార్య సంగీత కోర్టుని ఆశ్రయించారు. విజయ్ ఒక నటితో రిలేషన్ లో ఉన్నారని, అందుకే విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. తమిళ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని కలలు కంటున్న విజయ్ కి, ఎన్నికల ముందు విడాకుల కేసు అనేది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇది చాలదు అన్నట్టుగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ కూడా షాకిచ్చాడు. విజయ్ ని ఇన్స్టాగ్రామ్లో సంజయ్ అన్ఫాలో చేయడం చూస్తుంటే.. తండ్రి వైపు కాకుండా, తల్లికి మద్దతుగా నిలవడానికి అతను సిద్ధమయ్యాడని అర్థమవుతోంది. కొడుకు చేసిన పనితో.. భార్యాభర్తలు మధ్య విభేదాల్లో విజయ్ దే తప్పనే సంకేతాలు జనాల్లోకి బలంగా వెళ్లే అవకాశముంది. అందుకే విజయ్ ఫ్యాన్స్ సంజయ్ తీరుని తప్పుబడుతున్నారు. తండ్రిపై కోపముంటే సైలెంట్ గా ఉండాలి కానీ, ఇలా తొలి ఎన్నికలకు ముందు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు.
Mar 01, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com










