
Biker Trailer: అదిరిపోయిన శర్వానంద్ 'బైకర్' ట్రైలర్.. రాజశేఖర్ కుమ్మేశాడుగా!
హీరో శర్వానంద్(Sharwanand) వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ అటెంప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన శర్వానంద్ 'బైకర్' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. (Biker Trailer) అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం, ఇండియాలో మొట్టమొదటి మోటోక్రాస్ ఫిల్మ్ కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ 3న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు అదిరిపోయే విజువల్స్ తో కట్టిపడేసింది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ట్రైలర్ లో మోటోక్రాస్ రేసింగ్ సీన్లు, మట్టి ఎగురుతుంటే శర్వానంద్ బైక్పై చేసే విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. శర్వానంద్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు చక్కగా సరిపోయాయి. రేసింగ్ ట్రాక్పై శర్వానంద్ తన బైక్తో చేసే సాహసాలు కన్నుల పండువగా ఉన్నాయి. సినిమాలో కేవలం రేసింగ్ మాత్రమే కాదు, ఒక బలమైన తండ్రి-కొడుకుల సెంటిమెంట్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇందులో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించడం విశేషం. ఆయన పాత్ర సీరియస్ గా కనిపిస్తోంది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి. "నువ్వు అందరికంటే ముందు రాలేదు. నీకంటే అందరూ వెనకాల వచ్చారు. రెండింటికీ చాలా తేడా ఉంది" అని శర్వానంద్ తో రాజశేఖర్ చెప్పే డైలాగ్ సినిమాలోని కథా వైవిధ్యాన్ని చాటి చెబుతోంది. రేసింగ్ లో కొడుకు ఫస్ట్ వచ్చినా రాజశేఖర్ కి తృప్తి లేదు. మిగతా వాళ్ళ కంటే బెటర్ రేసర్ గా కాదు, బెస్ట్ రేసర్ గా తన కొడుకుని చూడాలనే తాపత్రయం రాజశేఖర్ పాత్రలో కనిపిస్తోంది. తండ్రీకొడుకుల మధ్య సీన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. తన డ్రీమ్ ని, తన కొడుకు ద్వారా తీర్చుకోవాలని చూస్తున్నట్టుగా రాజశేఖర్ పాత్ర కనిపిస్తోంది. అందుకే కొడుకు విషయంలో కఠినంగా ఉంటున్నాడనేలా సన్నివేశాలు ఉన్నాయి. మరోవైపు మాళవిక నాయర్ పాత్ర కూడా చాలా సహజంగా ఉంది. ట్రైలర్ చివరలో వచ్చే రేసింగ్ సీన్స్, ఆ ఎమోషనల్ టచ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ కనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. 'బైకర్'తో శర్వానంద్ భారీ హిట్ కొట్టడానికి సిద్ధమైపోయాడని అర్థమవుతోంది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Mar 22, 2026
MissTerious: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్!
తెలుగులో ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఆ కోవలోనే గతేడాది చివర్లో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకున్న మూవీ 'మిస్టీరియస్' (MissTerious). సస్పెన్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 'మిస్టీరియస్' మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో అడుగుపెట్టింది. మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. కథ ఏంటంటే.. సబ్ ఇన్వెక్టర్ రాంకీ(ఆబిద్ భూషణ్) హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో కథ మొదలవుతుంది. ఈ కేసును టేకప్ చేసిన ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి).. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్(రోహిత్ సాహ్ని) భార్య శిల్ప(మేఘన రాజ్పుత్)ను అనుమానిస్తాడు. అసలు రాంకీ ఎక్కడికి వెళ్ళాడు? విరాట్, శిల్పలకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? చివరకు బయటపడిన ఆ భయంకరమైన నిజం ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు మహి కొమటిరెడ్డి ఈ సినిమాను మలిచారు. బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సాహ్ని ఈ సినిమాలో తన నటనతో మెప్పించారు. అతనికి జోడీగా మేఘన రాజ్పుత్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఏసీపీ పాత్రలో బాలరాజ్ హుందాతనాన్ని ప్రదర్శించగా, అబిద్ భూషణ్ కీలక పాత్రలో కనిపించాడు. ఎం.ఎల్. రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్ మూడ్ను బాగా క్యారీ చేసింది. యాష్లే క్రియేషన్స్ బ్యానర్పై జై వల్లందాస్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేశాయి. అయితే తెలిసిన నటీనటులు కాకపోవడంతో ఈ సినిమా పెద్దగా జనాలకు రీచ్ అవ్వలేదు. ఓటీటీలో విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ లో ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
Mar 22, 2026
Band Melam Trailer: బ్యాండ్ మేళం ట్రైలర్ అదిరింది.. కోర్ట్ జోడి ఖాతాలో మరో హిట్ ఖాయం!
'కోర్ట్' తర్వాత హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’(Band Melam). ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కి చెందిన కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఇది రూపొందింది. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్యూర్ విలేజ్ ఎమోషన్స్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలబోతగా వస్తోంది. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్ లోని విజువల్స్ చాలా నేచురల్గా, కలర్ ఫుల్ గా ఉన్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో బంధించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా హీరో హర్ష్ రోషన్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉన్నాడు. సంగీతం పేరుతో హడావుడి చేసే కుర్రాడిగా, అలాగే ప్రేమ కోసం నిలబడే యువకుడిగా అతని వేరియేషన్స్ బాగున్నాయి. ట్రైలర్ లో కామెడీ పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలో కామెడీతో పాటు, ఎమోషన్స్ కూడా పీక్స్లో ఉన్నాయని ట్రైలర్ హింట్ ఇస్తోంది. ట్రైలర్ లోని కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ లు కట్టిపడేస్తున్నాయి. బావమరదళ్ళ కథగా ఇది తెరకెక్కింది. ప్రారంభంలో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో, చివరిలో అదే స్థాయిలో ఎమోషన్స్ ఉంటాయని అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో హీరో తన బాధను స్నేహితులతో పంచుకునే సీన్ గుండెకు హత్తుకునేలా ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలుస్తోంది. విజయ్ బల్గానిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లింది. ఎమోషనల్ సీన్లలో హృదయాన్ని హత్తుకుంటూనే, కామెడీ సీన్లలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. గతేడాది 'కోర్ట్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హర్ష్ రోషన్ - శ్రీదేవి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ‘బ్యాండ్ మేళం’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.
Mar 22, 2026
Jr NTR: డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్.. ఏడు వారాల్లో ఎన్ని కిలోలు తగ్గాడో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన అప్ కమింగ్ మూవీ 'డ్రాగన్'(Dragon) కోసం చేస్తున్న కసరత్తులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారాయి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్ను పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమాలోని పాత్ర డిమాండ్ మేరకు అత్యంత సన్నగా, ఫిట్గా కనిపించేందుకు ఎన్టీఆర్ కఠినమైన ఫిట్నెస్ నియమాలను అనుసరించాడు. తన ట్రైనర్స్ పర్యవేక్షణలో రోజుకు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ, క్రమశిక్షణతో కూడిన డైట్ ప్లాన్ను ఫాలో అయ్యాడు. కేవలం ఏడు వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువు తగ్గడం వెనుక ఎన్టీఆర్ పడిన శ్రమ అసామాన్యమని చెప్పవచ్చు. సినిమా సినిమాకు ఎన్టీఆర్ తన బాడీ మేకోవర్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. 'టెంపర్' కోసం తొలిసారి సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. అలాగే 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్' సినిమాలలో డిఫరెంట్ ఫిజిక్ తో కనిపించాడు. ఇక ఇప్పుడు 'డ్రాగన్'లో సరికొత్తగా కనిపించనున్నాడు. ఇందులో కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ 'బ్రూస్లీ' తరహా ఫిజిక్ తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడట. అంటే చూడటానికి స్లిమ్ గా ఉంటూనే, కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడన్నమాట. ఈ సినిమా షూటింగ్ కి ముందు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ వైరల్ కావడంతో, ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ఆ తర్వాత సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్ అని తెలిసి.. ఎన్టీఆర్ డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం 'డ్రాగన్' మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే జోర్డాన్ లో ఒక కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, తదుపరి యాక్షన్ సీక్వెన్స్లపై దృష్టి పెట్టింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది ఉంది. అదే రోజు కొత్త విడుదల తేదీపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Mar 22, 2026
Amaravathiki Aahvanam: ఆహాలో 'అమరావతికి ఆహ్వానం'.. రెస్పాన్స్ ఎలా ఉందంటే?
టాలీవుడ్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం'(Amaravathiki Aahwanam). శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్ నొరోన్హా, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టింది. థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'అమరావతికి ఆహ్వానం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' సొంతం చేసుకుంది. మార్చి 20 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్ రిలీజ్ అయిన ఐదు వారాలకే ఓటీటీలోకి రావడంతో హారర్ ప్రియులు ఖుషీ అవుతున్నారు. కథ ఏంటంటే.. ఈశ్వర్(శివ కంఠమనేని) సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. భార్య భాను(ధన్య బాలకృష్ణ), ఇద్దరు మరదళ్ళతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తుంటాడు. మరదలు భార్గవి(సుప్రీత) ఓ యూట్యూబర్. సిటీలోని భూత్ బంగ్లాలలో ఒకరోజు గడిపి అక్కడ దెయ్యం లేదని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది. ఒకసారి ఓ అజ్ఞాత వ్యక్తి భార్గవికి ఫోన్ చేసి.. అమరావతి అనే ఊరిలో నిజంగా దెయ్యాలు ఉన్నాయంటూ అక్కడికి ఆహ్వానిస్తాడు. ఇదొక ట్రిప్ లా ఉంటుందని భార్గవితో పాటు ఫ్యామిలీ అంతా వెళ్ళడానికి రెడీ అవుతారు. ఈశ్వర్ కి ఇష్టం లేకపోయినా.. భార్య కోసం బయల్దేరతాడు. అమరావతిలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? అక్కడ ఈశ్వర్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడికి వెళ్ళాక తెలిసిన రహస్యం ఏంటి? ఇందులో రాజేశ్వరి(ఎస్తర్ నొరోన్హా) పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలైన తర్వాత 'అమరావతికి ఆహ్వానం' సినిమాకు మంచి స్పందనే లభిస్తోంది. హారర్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా దర్శకుడు జీవీకే ఈ కథను రూపొందించడం ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. అయితే, కొన్ని సీన్స్ పాత హారర్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి 'అమరావతికి ఆహ్వానం' ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. Also Read: అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ
Mar 22, 2026
Sreeleela: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. శ్రీలీల ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). తన డాన్సులతో, చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో కొన్ని ఫ్లాప్ లు ఎదురుకావడంతో.. నెటిజన్లు తనపై దారుణంగా ట్రోల్స్ చేశారని శ్రీలీల గుర్తు చేసుకుంది. "నేను చాలా సెన్సిటివ్, ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేక చాలాసార్లు ఏడ్చేశాను" అంటూ తనలోని బాధను బయటపెట్టింది. ఒకానొక దశలో సినిమాలకు గుడ్ బై చెప్పాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ట్రోల్స్ భరించలేక తన తల్లి దగ్గరకు వెళ్లి.. "అమ్మా, ఇవన్నీ నా వల్ల కావడం లేదు.. నేను మళ్ళీ కాలేజీకి వెళ్లి చదువుకుంటాను" అని ఎమోషనల్ అయినట్లు శ్రీలీల వెల్లడించింది. అయితే, తన తల్లి ఇచ్చిన ధైర్యంతోనే మళ్ళీ నిలబడ్డానని, ఇప్పుడు అలాంటి ట్రోల్స్ ని ధైర్యంగా ఎదుర్కొంటున్నానని శ్రీలీల చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా చూస్తే, 'పెళ్లి సందడి'తో ఎంట్రీ ఇచ్చి 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీలీల. ఆ తర్వాత 'భగవంత్ కేసరి'లో తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే అప్పటినుంచి శ్రీలీలను ఎక్కువగా ఫ్లాప్ లే పలకరించాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమాలో మెరిసింది శ్రీలీల. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లనే రాబడుతోంది. ప్రస్తుతం శ్రీలీల కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా భారీ ఆఫర్లను అందుకుంటోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ఉన్నా, తన హార్డ్ వర్క్ తోనే సమాధానం చెబుతానని అంటోంది ఈ డ్యాన్సింగ్ క్వీన్.
Mar 22, 2026
ustaad bhagat singh: ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి కొత్త లుక్
-థియేటర్స్ లో సందడి చేస్తున్న ఉస్తాద్ -సినిమా ఎలా ఉంది -చిరు రాకతో అదనపు ఆకర్షణ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తూ ఉంది. ఫ్యామిలీస్ కూడా ఉస్తాద్ బాట పడుతుండంతో పాటు మూవీ చూసాక వాళ్ళందరు మీడియాతో మాట్లాడుతు 'ఈ మధ్య కాలంలో ఎలాంటి అసభ్యత లేకుండా వచ్చిన మూవీ ఉస్తాద్. పలానా సీన్స్ మాకు బాగా నచ్చాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉస్తాద్ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)దంపతులు కూడా జాయిన్ అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లో చిరంజీవి, సురేఖ దంపతులు, పవన్ దంపతులు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ని వీక్షించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లోని 'వాన వాన వెల్లువాయే' సాంగ్ కి పవన్ డాన్స్ చేస్తున్న సీన్ తో పాటు తొలిప్రేమలోని 'ఈ మనసే, నా మనసే' సాంగ్ కి చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ షో లో హరీష్ శంకర్, శ్రీలీల, అనిల్ రావిపూడి, ఆనంద్ సాయి దంపతులు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో పాటు మరికొంత మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మైత్రి మూవీస్ నే ఎక్స్ వేదికగా సదరు మొత్తం వీడియోని షేర్ చేసింది. Also read: Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల కామెంట్స్ తో మైత్రి ఎక్స్ సర్వర్ క్రాక్ అయ్యే పరిస్థితి. పవన్ ప్రీవియస్ చిత్రం 'ఓజి' ని కూడా చిరంజీవి, సురేఖ గారు చూసిన విషయం తెలిసిందే. https://x.com/MythriOfficial/status/2035298848344822027?s=20
Mar 21, 2026‘లవ్ జిహాద్’ ఆరోపణలకు చెక్ పెట్టిన మోనాలిసా.. బెదిరింపులపై స్పందించిన భర్త!
మహా కుంభమేళా 2025లో తన నీలి రంగు కళ్లతో, రుద్రాక్ష మాలలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన 'రుద్రాక్ష గర్ల్' మోనాలిసా భోస్లే ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె పెళ్లాడటంతో ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేరళలోని తిరువనంతపురంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కేరళ మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి వివాహాన్ని 'లవ్ జిహాద్' అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో పాటు, వీరికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భర్త ఫర్మాన్ ఖాన్ మీడియా ముందు గట్టిగానే స్పందించారు. తాము ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నామని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఫర్మాన్ స్పష్టం చేశారు. "మేము ముందుగా మనుషులం. ఎవరి మతాన్ని వారు పాటిస్తూనే ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఆమె హిందూగానే ఉంటుంది, నేను ముస్లింగానే ఉంటాను. ఇక్కడ మత మార్పిడి ప్రసక్తే లేదు" అని ఆయన కుండబద్ధలు కొట్టారు. మోనాలిసా కూడా తన తండ్రికి ఇష్టం లేకపోయినా, తన ఇష్ట ప్రకారమే ఈ వివాహం చేసుకున్నానని మీడియాకు వివరించారు. వీరిద్దరూ 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆరు నెలల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి పీటలెక్కారు. ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్కు చెందిన నటుడు కాగా, మోనాలిసా మధ్యప్రదేశ్ వాసి. వీరిద్దరి కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఈ సినిమా సెట్స్పై ఉంది. ఈ సినిమాలోని వీరి కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ యాప్ ద్వారా వీరు తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు. కేరళ ప్రజలు తమకు ఎంతో మద్దతుగా ఉన్నారని, అవసరమైతే అక్కడే సెటిల్ అవుతామని కూడా ఈ జంట ప్రకటించడం విశేషం.
Mar 21, 2026చిన్ననాటి స్నేహితుడితో బిగ్బాస్ ఫేమ్ పునర్నవి ఏడడుగులు.. వైరల్ అవుతున్న పిక్స్!
నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ విదేశాల్లో ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో తన చిరకాల మిత్రుడు హేమంత్వర్మతో కలిసి ఏడడుగులు వేసింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. వరుడు హేమంత్వర్మ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫొటోగ్రాఫర్గా రాణిస్తున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచే స్నేహితులు కావడం విశేషం. గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ, తాజాగా మార్చి 20న వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆర్భాటాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక సింపుల్గా జరిగింది. పునర్నవి భూపాలం అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘ఉయ్యాల జంపాల’ సినిమా. ఆ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన సునీత పాత్రలో ఆమె పండించిన అమాయకత్వం, నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షోనే. అందులో తన ముక్కుసూటి తనంతో బోల్డ్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై బిజీ అవుతుందని అందరూ భావించినప్పటికీ, పునర్నవి మాత్రం తన కెరీర్ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ఫీల్డ్కు విరామం ప్రకటించి, లండన్కు వెళ్లి సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేరుగా పెళ్లి వార్తతో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పునర్నవి వెడ్డింగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్లో పునర్నవి ఎంతో కళగా కనిపిస్తుండగా, వరుడు హేమంత్ కూడా క్లాసీగా ఉన్నాడు. ఈ జంటను చూసిన నెటిజన్లు “మేడ్ ఫర్ ఈచ్ అదర” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mar 21, 2026ఓటీటీని షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సుడల్: ది వార్టెక్స్
ఇటీవలికాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పెరుగుతున్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. థియేటర్లలో కంటే ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రకరకాల జోనర్స్ సినిమాలను ఆయా సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'సుడల్: ది వార్టెక్స్' (Suzhal: The Vortex) వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమిళం నుంచి తెలుగు సహా పలు భాషల్లోకి అనువదించిన ఈ సిరీస్ గ్రిప్పింగ్ నేరేషన్తో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఈ కథ సాంబలూరు అనే చిన్న గ్రామంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో యూనియన్ లీడర్ షణ్ముగం (పార్థిబన్) చిన్న కూతురు నీలా కనిపించకుండా పోతుంది. ఈ రెండు సంఘటనల వెనుక ఉన్న నిగూఢ సత్యాలను ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులే ఈ సిరీస్కి ఆయువుపట్టు. ముఖ్యంగా ఈ సిరీస్లో నటీనటుల పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన శ్రియారెడ్డి పవర్ఫుల్ నటనను కనబరిచారు. కథిర్ మరియు పార్థిబన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 'విక్రమ్ వేద' వంటి సంచలన చిత్రానికి కథను అందించిన పుష్కర్-గాయత్రి ద్వయం ఈ సిరీస్ను క్రియేట్ చేయడం విశేషం. సాంకేతికంగా కూడా ఈ సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలను, ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలను మరియు వాటి తాలూకు మానసిక ప్రభావాలను ఈ సిరీస్ లో చాలా లోతుగా చర్చించారు.
Mar 21, 2026
Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే
-ఉగాది రోజున ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో చిరు -ఆ రోజు మాట్లాడలేదు -కానీ ఇప్పుడు తన ట్వీట్ తో ఎన్టీఆర్ రేంజ్ చెప్పేసాడు తెలుగు సినిమా, అభిమానుల, ప్రేక్షకుల, ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటరత్నపద్మశ్రీ నందమూరి రామారావు(Ntr). ఆయన పేరుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అవార్డుని మొన్న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అందుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై రీసెంట్ గా చిరంజీవి ఎక్స్ వేదికగా తన భావాన్ని పంచుకోవడం జరిగింది. ఏమని స్పందించాడో చూద్దాం. 'తెలుగు సినిమాకి ఉన్న కీర్తిని ఖండాంతరాలకి చేర్చిన మహానుభావుడు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో గొప్ప గౌరవం కూడాను. ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనం. N అంటే నాట్యం, T అంటే తాళం, R అంటే రాగం. ఈ విధంగా తన పేరుతోనే లలిత కళలని ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియకపోయినా తాను పోషించిన క్యారక్టర్ ల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభావంతుడు. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం. ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిదంటు చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. also read: Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా! ఇప్పుడు ఈ ట్వీట్ తో అవార్డు అందుకున్న రోజు ఎన్టీఆర్ గురించి చిరంజీవి మాట్లాడలేదనే విమర్శలకి చెక్ పడినట్లయింది. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో బావ, బామ్మర్దులుగా చేసారు. ఎన్టీఆర్ గారు తనని కలిసినప్పుడల్లా ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చేవారని చిరంజీవినే స్వయంగా చాలా సందర్భంలో చెప్పుకొచ్చాడు. అనంతర కాలంలో చిరంజీవి నుంచి వచ్చిన కొన్ని సినిమా ఫంక్షన్స్ కి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ హాజరయ్యారు.
Mar 21, 2026నితిన్ లైనప్ అదిరిందిగా.. మూడు ప్రాజెక్టులతో ఫ్యాన్స్కి గొప్ప ట్రీట్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన కెరీర్లో మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. వరుస పరాజయాలు పలకరించినప్పటికీ, ఎక్కడా తగ్గకుండా వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద భారీ కమ్బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నితిన్ ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి అభిమానులకు అదిరిపోయే ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం నితిన్ ప్రతిభావంతుడైన దర్శకుడు వి.ఐ. ఆనంద్తో కలిసి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన ఆనంద్, ఈసారి నితిన్ కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నితిన్ కెరీర్కు ఎంతో కీలకం కానుంది. కేవలం ఈ ఒక్క చిత్రంతోనే ఆగిపోకుండా, నితిన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఆయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజితో నితిన్ చేతులు కలిపారు. తన సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' బ్యానర్పైనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది నితిన్ ప్లాన్. అంతేకాకుండా, వచ్చే నెలలో మరో కొత్త దర్శకుడితో ఒక క్రేజీ ప్రాజెక్టును ప్రకటించేందుకు నితిన్ సిద్ధమవుతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా వరుసగా మూడు సినిమాలు లైనప్లో ఉండటంతో నితిన్ తన మార్కెట్ను మళ్లీ సెట్ చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నితిన్ సినీ ప్రస్థానం గమనిస్తే, 'జయం', 'దిల్', 'సై' వంటి చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినప్పటికీ 'ఇష్క్', 'అ ఆ', 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే, గత కొన్ని చిత్రాలు నిరాశపరచడంతో ఈసారి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నితిన్ తదుపరి చిత్రాలపై భారీగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వి.ఐ. ఆనంద్ సినిమాతో నితిన్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హిట్ దర్శకులతో జతకట్టడం, విభిన్న జోనర్లను ఎంచుకోవడం చూస్తుంటే నితిన్ బాక్సాఫీస్ వద్ద గట్టి వేటకే సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న నెలల్లో టీజర్లు, ట్రైలర్లతో నితిన్ సందడి మొదలుకానుంది. నితిన్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలు నితిన్ కెరీర్ను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.
Mar 21, 2026
Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా!
-మ్యాడ్ లో శృతిగా ఫుల్ పాపులర్ -ఈ నెల 27 నా హ్యాపీ రాజ్ తో సెల్యులాయిడ్ పైకి -శ్రీ గౌరీ ప్రియకి హీరోలపై వివక్ష ఉందా! రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతని, సోషల్ మీడియా లవర్స్ ని రామ్ నితిన్ చెంప పగలకొట్టింది ఎవరు అని సమయం, సందర్భం లేకపోయినా పర్లేదు అడగండి. వాళ్లంతా ఇంకేం మాట్లాకుండా శృతి' అని చెప్తారు. మనం అడిగింది మ్యాడ్ మూవీ గురించి అని వీళ్ళకెలా తెలుసు అని మనం అనుకుంటూ ఉంటే, వాళ్లేమో శృతి క్యారక్టర్ తో తమకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని గత స్మృతులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంతలా మ్యాడ్ లోని ఒకే ఒక చెంప దెబ్బ సన్నివేశంతో శ్రీ గౌరీప్రియ(Sri Gowri Priya)ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో తన అప్ కమింగ్ మూవీ హ్యాపీ రాజ్(Happy Raj)పై అభిమానులు ఒక లుక్ వేసి ఉంచారు. నిన్న హైదరాబాద్ లో సదరు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా శ్రీ గౌరీప్రియ మాట్లాడిన మాటలు అభిమానులకి, సోషల్ మీడియాకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం. ఆమె మాట్లాడుతు నేను తమిళ హీరోలతో రొమాంటిక్ గా, తెలుగు హీరోలతో యారంగిట్ గా ప్రవర్తిస్తూ కొడతానని అంటారు. నేను ఒక్క మూవీలో మాత్రమే హీరోని కొడతాను.అయినా నేనేమైనా హీరోలని కొట్టాలని కంకణం కట్టుకున్నానా! నాకు మాత్రం ఎవరి మీద కోపం లేదు. పైగా నేను తమిళ సినిమాల్లో ఏడుస్తానని, తెలుగు సినిమాల్లో మాత్రం సంతోషంగా ఉంటానని కూడా కొంత మంది అంటారు. నాకు వచ్చిన ఆఫర్స్ మేరకే నా క్యారక్టర్ రియాక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చింది. Also read: Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం కాకినాడకి చెందిన అచ్చ తెలుగింటి అమ్మాయి అయిన శ్రీ గౌరీప్రియ క్యారక్టర్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తమిళ్ లో మోడరన్ లవ్ చెన్నై, ట్రూ లవర్ వంటి చిత్రాల ద్వారా సోలో హీరోయిన్ గా తమిళ ప్రేక్షకులకి దగ్గర అయ్యింది. ఇప్పుడు హ్యాపీ రాజ్ తో తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి సందడి చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్ హీరో కాగా ముస్తఫా..ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అంటూ తెలుగు రాష్టాల ప్రేక్షకులని తన మైకంలో పడేసిన హీరో అబ్బాస్ పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరియ రాజ్(Mariya raj)దర్శకుడు. మార్చి 27 రిలీజ్ డేట్.
Mar 21, 2026సింహం Vs నక్క.. శంబాల టీమ్ భారీ సోషియో ఫాంటసీ.. హీరో ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా 'ఊరు పేరు భైరవకోన', 'రాయన్' వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'శంబాల' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో సింహం మరియు నక్కల మధ్య పోరాటాన్ని చూపిస్తూ పవర్, విధి, ఆధిపత్యం అనే అంశాలను హైలైట్ చేశారు. "సమ్ వార్స్ నెవర్ ఎండ్.. సమ్ కింగ్స్ నెవర్ డై" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ సినిమా థీమ్పై భారీ అంచనాలను పెంచుతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 'శంబాల' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ మరియు డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈసారి అంతకు మించిన గ్రాండియర్తో ఈ సోషియో ఫాంటసీని తెరకెక్కించబోతున్నారు. సందీప్ కిషన్ ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త గెటప్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్షన్కి ఫాంటసీ అంశాలను జోడించి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మిగిలిన నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. 'శంబాలస టీమ్తో సందీప్ కిషన్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Mar 21, 2026
Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం
-డైవర్స్ పై నోరు విప్పిన నీహారిక -ఇన్ని రోజులు ఎన్నో ఊహాగానాలు -వాటన్నిటికీ చెక్ -అసలు నిజం ఏంటి! హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారి హిట్ జర్నీని కొనసాగించడమంటే మాములు విషయం కాదు. అందుకు ఎన్నో గట్స్ ఉండాలి. పైగా ప్రెజెంట్ చాలా చిత్రాలు హిట్ అనే పదానికి డిస్టెన్స్ ని చాలా కాన్ఫిడెన్స్ గా మెయింటెన్ చేస్తూ వస్తున్నాయి. అలాంటిది నిహారిక కొణిదెల(Niharika konidela)'డెడ్ లైన్, కమిటీ కుర్రోళ్ళు తో విభిన్నమైన మేకర్ గా గుర్తింపు పొంది నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం. నీహారిక త్రీ ఇయర్స్ బ్యాక్ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే ఆమె మాట్లాడుతు ఎవరు కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. కానీ మా మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించలేనివి. అందుకే విడిపోవాలని ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిధనిపించింది. విడాకులు నిర్ణయం తీసుకున్న వెంటనే నాన్నకి చెప్పాను. సైలెంట్ గా విన్నారు. వాళ్లు కూడా పెళ్లి తర్వాత నన్ను చూస్తూనే ఉన్నారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకరినొకరు బాగా గొడవపడి విడిపోతే అది తొందరగా మరచిపోతాం. కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ విషయంలో విడాకులు అనేవి ఇప్పుడు తీసుకుంటున్నది కాదు. ఎప్పటినుంచో ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ గా అతనితో కాంటాక్ట్ లో కూడా లేనని నీహారిక చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. Also read: Allu arjun: తిప్పండి మీసం.. అన్నిటికి సమాధానం చెప్పే రోజు వచ్చింది! తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే వచ్చే నెల ఏప్రిల్ మూడున 'రాకాసా' అనే మూవీతో నిర్మాతగా మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా చేస్తుండగా , మానస శర్మ(Manasa Sharma)దర్శకురాలు.
Mar 21, 2026మనసును తాకే సరికొత్త ప్రేమకథ ‘సాఫ్ట్ లవ్’.. ఓటీటీ ప్రియులకు పండగే
ఇటీవలికాలంలో థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆడియన్స్ అభిరుచిని గమనించి వారి మనసులకు దగ్గరగా ఉండే సినిమాలను తీసుకొస్తున్నాయి. దేశీయ చిత్రాలనే కాకుండా వివిధ దేశాల్లో సూపర్హిట్ అయిన సినిమాలను ఓటీటీ ద్వారా అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక సరికొత్త ప్రేమకథ స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణ ఆఫ్రికా, నైజీరియా సంస్కృతుల నేపథ్యంలో తెరకెక్కిన ‘సాఫ్ట్ లవ్’ ఇప్ప్పుడు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మనసును తాకే అందమైన కథతో ఈ చిత్రాన్ని అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. జెండీ జేలే అనే ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్, తన పెళ్లి రోజే తన కాబోయే భర్త చేతిలో మోసపోతుంది. ఆ అవమానంతో ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన ఆమెకు, అనుకోకుండా ఎడ్వర్డ్ అనే ఫోటోగ్రాఫర్ పరిచయమవుతాడు. జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, ఈ ఇద్దరూ మళ్ళీ ప్రేమలో ఎలా పడ్డారు? వారి ప్రయాణంలో ఎదురైన అడ్డంకులేంటి? అనే అంశాలను దర్శకుడు హోమ్స్ అవా ఎంతో మనోహరంగా చూపించారు. నైజీరియా మరియు సౌత్ ఆఫ్రికాకు చెందిన నటీనటుల కలయికలో వచ్చిన ఈ చిత్రం, ఆయా ప్రాంతాల జీవనశైలిని మరియు విభిన్న సంస్కృతులను అందంగా ఆవిష్కరించింది. కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, స్నేహం, నమ్మకం మరియు వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలను కూడా ఇందులో చర్చించారు. గతంలో వచ్చిన పలు రొమాంటిక్ చిత్రాల తరహాలోనే ఇది కూడా ఒక ‘ఫీల్ గుడ్’ మూవీగా గుర్తింపు పొందుతోంది.
Mar 21, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



