ఒంటె పాలతో ఎన్ని లాభాలో!!

జూన్ లో ప్రపంచ పాల దినోత్డవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం మీకోసం .ఒంటె పాలు రోజుకి ఒక్కసారి తాగిచూడండి.రోజూ తాగితే మీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.ఆరోగ్యానికి పాలు చాలా లాభదాయకం మీరు చిన్నప్పటి నుంచి వింటూ ఉండచ్చు.పల వల్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని. రోజూమీఆహారం లో పాలు చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.మీకు,ఆవు,గేదె,మేక,గాడిద పాల గురించి మాత్రమే తెలుసు.వీటిగురించి మీరు వినే ఉంటారు.కాని మీరు ఒంటె పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నారా. మీరు విని ఉండనట్లై తే మీకు చెప్పల్సిదే.ఒంటె పాలు చాలా రకాల రోగాలను నివారించడం లో లాభదాయకం గా ఉంటుంది.శరీరం లో రోగనిరోదక శక్తి పెంచే మెదడుచురుకుగా పనిచేయాలంటే ఒంటె పాల లాభాల గురించి తెలుసుకుందాం. సంక్రమణం నుండి రక్షణ... ఒంటె పాలలో విటమిన్లు ఖనిజ లవణాలు,పుష్కలంగా ఉంటాయి.ఇందులో యాంటీ బాడీలు ఉంటాయి.వైరస్ సంక్రమించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.గ్యాస్టిక్,క్యాన్సర్,వంటి సమస్యను నిలువరించేందుకు సహాయ పడుతుంది. ఎముకలు గట్టిపడతాయి... ఒంటె పాలలో కాల్షియం అధిక సంఖ్యలో ఉండడం గమనించవచ్చు.ఎముకల ను పరిచే పని చేస్తుంది.ఒంటె పాలలో ఫ్యాక్టో ఫెలిన్ అనే గుణాలు ఉన్నట్లు గుర్తించారు.క్యాన్సర్ తో పోరాడే శక్తి మనకు లభిస్తుంది.ఒంటె పాలు రక్తం లో ఉన్న టాక్సిన్ ను బయటికి పంపిస్తుంది.లివర్ ను శుభ్రం చేస్తుంది.ఒకవేళ పొట్టకు సంబందించిన సమస్యలతో బాధ పడుతుంటే ఒంటె పాలు లాభ దాయకమని అంటున్నారు నిపుణులు. డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు వరం... డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు రామబాణం లా పనిచేస్తుందని.ఒకలీటరు ఒంటె పాలు 82 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.అది మధు మెహ రోగులకు లాభదాయకం కాగలదని నిపుణులు భావిస్తున్నారు. మెదసును చురుకుగా ఉంచుతుంది... ఎవరైతే పిల్లలు నియమిత పద్దతిలో ఒంటె పాలు సేవిస్తారో.వారి మెదడు ఇతర పిల్లల కన్నా అన్నిరకాలుగా చురుకుగా బలంగా ఉంటుంది.ఒంటె పాలు తాగిన వాళ్ళలో పోషక ఆహారం ఉన్న వారు బయట పడతారు. పచెంద్రియాలకు లాభం... ఒంటె పాలు తీయడం చాలా కష్టం.ఒంటె పాలాలో కాల్షియం ప్రోటీన్ తో పాటు, కార్బోహైడ్రేడ్స్, చక్కర,పీచుపదార్ధం,ఐరన్,మెగ్నీషియం,విటమిన్ సి,లాక్తర్,ఆమ్లం,సోడియం,పాస్ఫరస్,పొటాషియం,జింక్,కామ్ప్ర్,మాంగనీస్,లాంటి పోషక తత్వాలు.గ్రహించవచ్చు.          చర్మ సంబంధిత సమస్యల ను దూరం చేస్తుంది... ఒంటె పాలు రోగాలు తగ్గిస్తుంది.శరీరానికి లాభాలను చేకూరుస్తుంది.చర్మ సౌందర్యానికి,వాల్ఫా హైడ్రో క్విల్ ఆమ్లం గుర్తించ వచ్చు.అది చర్మానికి కాంతి నిస్తుంది.                                               
Publish Date: Jun 5, 2023 10:30AM

తలనొప్పికి, కంటికి ఉన్న లింకు ఇదే!

కంటి ఆస్పత్రికి వచ్చే రోగులను పరిశీలిస్తే ఎక్కువ మంది తలనొప్పితో వస్తారని తెలుస్తుంది.  అసలు తలనొప్పికి కారణమేమిటి ? తలనొప్పి ఉన్నప్పుడు కంటి ఆసుపత్రికి రావడం ఏంటి?? తలనొప్పికి కంటికి గల సంబంధం ఏమిటి?? చాలామందికి ఈ విషయాల గురించి తెలియదు.  వీటికి సంబంధించి విషయాలు తెలుసుకుంటే.. మనిషి శరీరంలో ఒక్కొక్క స్పర్శను తెలియ జేయడానికి ఒక్కొక్క నాడి వుంటుంది. నొప్పి, వేడి, చల్లదనం, రుచి, వాసన, దృష్టి మొదలైన వాటిని తెలిపే నాడులు మెదడులో ప్రత్యేకంగా వుంటాయి. శరీరంలో ఏ భాగంలో నొప్పి ఎక్కడ పుట్టినప్పటికీ, ఇది నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన నొప్పేకాని ఇది వ్యాధి కాదు. ఇది వ్యాధిని సూచించే ఒక లక్షణం. మెదడులో నొప్పిని తెలిపే ఒక ప్రత్యేక నాడి వుంటుంది. దాన్ని ఉత్తేజిత పరిస్తే బాధ కలుగుతుంది. అయితే దాన్ని లేకుండా చేస్తే అసలు నొప్పి అనే ప్రశ్నే రాదు. నొప్పితో మొదలైన వ్యాధులన్నీ తీవ్రమైనవి కావు. అదేవిధంగా నొప్పి లేని వ్యాధులన్నీ స్వల్పమైనవీ కావు. నొప్పి అనేది మనలను మేల్కొలుపుతుంది. శారీరకంగా మనం ఇబ్బంది పడేలా చేస్తుంది. వ్యాధి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది. ఇది అంత తొందరగా బయటపడదు. కాని వ్యాధి కంటె నొప్పే ఎక్కువ బాధిస్తుంది. కాన్సరు రోగిని పరిశీలిస్తే, కాన్సరు గడ్డ కాని, పుండుకాని నొప్పి లేకుండానే బయలు దేరుతాయి. ఇది మొదలైనప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు కనబడవు. ఇది కాస్త ముదిరిన తరువాతే శరీరాన్ని హింస పెట్టడం మొదలుపెడుతుంది.  కావున ఈవ్యాధిలో నొప్పి అనేది చాలా చివరి దశ. అదేవిధంగా కుష్టు రోగిని పరిశీలిస్తే. అతని శరీరంలోని పలుచోట్ల గాయాలు, పుండ్లు ఏర్పడటానికి కారణం నొప్పి లేకపోవడమే. స్త్రీలైతే పొయ్యి మీద నుండి పాత్రలు దించేటప్పుడు కాల్చుకుంటారు. సిగరెట్లు పీల్చే వ్యక్తితే వేళ్ళపై పుండ్లు ఏర్పడతాయి. కాలుకి రాయి తగిలి గాయం ఏర్పడుతుంది. ఇవన్నీ సహజంగా అందరికీ  ఏర్పడే ప్రమాదాలే.  ఈ సంధర్భాలలో నొప్పి వుండి వుంటే ముందుగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందడానికి అవకాశం వుంది. నొప్పి అనేది ఒక అవసరమైన స్పర్శ. తలనొప్పిని తెలియ జేయడానికి ప్రత్యేక మైన నాడులు వున్నాయి. వాటిని ఉత్తేజింప జేయడం వలన తలనొప్పి ఏర్పడుతుంది. ఆ నాడుల పేర్లు - (ప్రైజెమినల్ నాడీ, సర్వైకల్ నాడులు). తలలో గాని, కంటి లో గాని మెదడులోగాని వ్యాధి ఏర్పడ్డప్పుడు ఈ నాడులు ఉత్తేజింప బడతాయి. తద్వారా మనకు తలనొప్పి ఏర్పడుతుంది.  దూరదృష్టి, హ్రస్వ దృష్టి, అక్షలోపము, నేత్ర ద్వయ శక్తి లోపము, నేత్రద్వయ సమన్వయ లోపము, ఛత్వారము, నీటి కాసులు, రక్తపు పొర వాపు, గాజుపొర పుండు (మెల్ల), కంటిగూడు వాపు, కంటి నాడి వాపు, మొదలైనవి. తలనొప్పి కలిగించే కంటి వ్యాధులు. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదిస్తారు. కంటి వైద్యులు కంటికి సంబంధించిన నాడుల కదలిక ఆధారంగా వ్యాధిని నిర్ణయించి తగిన పరిష్కారం సూచిస్తారు.                                         ◆నిశ్శబ్ద.
Publish Date: Jun 5, 2023 10:30AM

ఈ పండు తింటున్నారా!

  రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే సాదారణంగా మనం మనకి అందుబాటులో వున్నా పండ్లనే  ఎంచుకుంటాం, కాని కొన్ని పండ్లలో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్ని పోషకాలు వుంటాయి, వాటిని తప్పక తిని తీరాలి అంటున్నారు వైద్యులు. అలాంటి పండ్లలో 'కివి' ఒకటి....   'కివి' తో మనం పొందే ఐదు లాభాలు :- * మొట్టమొదటి లాభం కొలెస్ట్రాల్ ని నియంత్రణలో వుంచడం. దాని వల్ల గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా ఉంటాం. * అలాగే 'కివి' పండులో బత్తాయి,కమలా వంటి పండ్ల లో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు. * ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుంది. * ఇక విటమిన్ 'ఎ', ' ఇ' లు కూడా కలిగి ఉండే ఈ పండుతో మరో ముఖ్యమైన లాభం ఆహారంలోని ఐరన్ ని శరీరం త్వరగా మెరుగ్గా గ్రహించే శక్తిని ఇచ్చే గుణం కలిగి వుండటం. * ఇక చెప్పుకో దగ్గ మరో లాభం 'కివి' పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్  ప్రభావాన్ని అదుపు చేస్తాయి. అలాగే ఎముకల బలహీనత, కీళ్ళ బలహీనత, క్యాన్సర్, ఆస్మా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇన్ని లాభాలు వున్నాయని తెలిసాకా 'కివి' పండుని తినకుండా వుంటామా. రోజూ ఓ 'కివి' ఆరోగ్యానికి మంచిది అంటా హాయిగా తినేద్దాం.
Publish Date: Jun 3, 2023 10:30AM

మన భావోద్వేగాలే మన అనారోగ్యానికి కారణం?

మనిషి అన్నవాడు ఉద్వేగానికి గురి అవ్వకుండా ఉండడు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించని మనిషి అంటూ ఉండడు. అయాసందార్భాను సారంగా స్పందించడం మానవనైజం. అది సహజ లక్షణం. భావోద్వేగం అంటే ఎమోషన్స్ మనము కొన్ని కొన్ని టికీ చాలా తీవ్రంగా స్పందిస్తే కొన్నిసార్లు మామూలుగా స్పందిస్తాము. మనలో వచ్చే భావోద్వేగాలే మనశరీరానికి హానిచేస్తాయని అదే అనారోగ్యానికి కారణమని మనపూర్వీకులు వెల్లడించారని  ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు విశ్లేషించారు. ఈమేరకు డాక్టర్ కృష్ణం రాజు చేసిన పరిశోదనలో ఒక్కో భావోద్వేగం ఒక్కో అవయవం పై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఉద్వేగాల లో మనకు తెలిసిన కొన్ని టి గురించి చూద్దాం. ఒత్తిడి, భయం, క్రోదం,ఆవేదన ,ఆందోళన వంటి ఉద్వేగాలు మీ శరీరంలోని అవయవాల కు హానికలిగిస్తాయి. ఏ ఏ ఎమోషన్స్ మీ మీ అవయవాల పై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. భయం, లేదా మీకు షార్ట్ టెంర్  ఉంటె మీ కిడ్నీ పై ప్రభావం చూపిస్తుంది. మీకు ఉద్వేగాలాలో గమనించిన ముఖ్య అంశం --కోపం ఉంటె లివర్ పై ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడు విచారం ఆందోళనలో ఉంటె--లేదా తీవ్ర ఒత్తిడి కి గురి అయితే ---పొట్టలో గ్యాస్ ట్రిక్ సమస్యలు అరుగుదల లేకపోవడం గమనించవచ్చు. మీరు నిత్యం ఒత్తిడిలో ఉంటె --గుండె సంబంధిత సమస్యల కు దారి తీస్తుంది. మీరు ఏమిచెయ్యాలో తెలియక టెన్ క్షణ్ లో ఉంటె --మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ గ్రీఫ్ గా ఉంటె---అది మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. జాయ్ ఆనందం గా ఉంటె బలాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ విచార వదనంతో ఉదాసీనంగా ఉంటె అది మీ ప్లీహము పై ప్రభావము చూపుతుంది. సహజంగా వచ్చే ఉద్వేగాల ను నియంత్రించడం ద్వారా కొంతమేర అవయవాల పై పడే తీవ్రతను గుర్తించవచ్చు. తద్వారా అవిపూర్తిగా నాశనం కాకుండా మర్మ కళ ద్వారా నివారణ చేయవచ్చని ముఖ్యంగా నాడీ పతిలోని 1౦7 రకాల మర్మకళ తో అక్యు పంక్చర్ ను వినియోగించి చికిత్చ చేయవచ్చని నాడిపతి వైద్యులు  డాక్టర్ కృష్ణమ రాజు స్పష్టం చేసారు. మీ అనారోగ్గ్యానికి మీభావోద్వేగాలే అని తెలుసుకోవాలి.
Publish Date: Jun 2, 2023 10:30AM

అధికవేడి చేస్తోందా?? భయం వద్దు.. ఇలా తగ్గించేయండి.

ఒళ్ళు ముట్టుకుంటే సాధారణంగానే ఉంటుంది కానీ.. ఆ వ్యక్తికి మాత్రం లోపల నిప్పులు కురిసినట్టే ఉంటుంది. గొంతంతా తడి ఆరిపోతూ ఉంటుంది.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నోరు పిడచకట్టుకుపోతుంది. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు కొడుతుంది. చర్మం అంతా కళ కోల్పోతుంది. మొత్తానికి మనిషి వాడిపోయిన పువ్వులా తయారవుతాడు. ఇదంతా అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది. ఎదుటివారు మాత్రం నీకేమి కాలేదు ఊరుకో… అని అంటుంటారు. తమను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనే ఒకానొక బాధ మనుషుల్ని పట్టి పీడిస్తుంది. ఇలా శరీర సమస్య కాస్తా మానసిక సమస్యగానూ తయారవుతుంది. వైద్యులను కలసి మందులు వాడితే… వారు ఇచ్చే ఇంగ్లీష్ మందులు కూడా శరీరానికి వేడిని పెంచేవే… మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?? అని బాధపడేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి..  వేడి తగ్గడానికి సహజమైన చిట్కాలు.. అందరికీ సులువుగా దొరికేది వేప. దీని రుచి గురించి పక్కన పెట్టి కాస్త ఓపికగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.  వేపాకుల రసం 20-50 మి.లీ.  తీసుకోవాలి. అందులోకి 5 నుండి20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. చేదు ఎక్కువ భరించలేము అన్నవారు పటికబెల్లం ఎక్కువగా అంటే 20 గ్రాముల వరకు. చేదు తీసుకోగలం అనేవారు 5గ్రాములు మోతాదు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక వారము రోజులు తాగడం వల్ల వేడి తగ్గుతుంది. మామిడి చెట్టు లోపలి బెరడు తీసుకోవాలి, తరువాత అత్తి (మేడి) చెట్టు వేరు బెరడును, ఇంకా మర్రి చిగుళ్ళను తీసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 10 నుండి 40 మి.లీ. తీసి,  అందులో 1 నుండి 2 గ్రా॥ల జీలకర్ర, 5 నుండి 20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల ఎలాంటి వేడి అయినా తగ్గిపోతుంది. సోంపు మనందరికీ తెలిసిందే. ఇప్పట్లో హోటళ్లలో తిన్న తరువాత స్వీట్ సొంపు ఇస్తారు మౌత్ ఫ్రెషనర్ గా. ఈ సొంపు, జీలకర్ర, పటిక బెల్లమును మూడింటిని రాత్రి పూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే దీన్ని వడపోసి పరగడపున త్రాగాలి. ఇలా చేస్తుంటే  శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అందరికీ అతి సులువుగా ఏ కాలంలో అయినా లభించేది నిమ్మకాయ. ఈ  నిమ్మరసంలో పఠిక బెల్లం వేసి జ్యుస్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని తాగుతుంటే కూడా అధికవేడి దెబ్బకు తగ్గిపోతుంది.  అధికవేడి సమస్య అన్ని కాలాలలో ఉన్నా వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఈ వేసవి కాలంలో అందరికీ దొరికే అద్భుతమైన ఫలం పండ్లకు రారాజు మామిడి. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని తోలు తీసి నీటిలో మరిగించాలి. తర్వాత దాని గుజ్జును చల్లని నీటిలో పిసికి రసము తీసి నచ్చినట్టుగా అందులో  ఉప్పు, జీలకర్ర, చెక్కెర మొదలయినవి కలిపి తాగాలి. దీనిని ప్రస్తుతం చాలామంది ఆమ్ పన్నా అని పిలుస్తుంటారు. పచ్చిమామిడితో చేసే ఈ జ్యుస్ అధికవేడి సమస్యకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వడదెబ్బ సమస్య రాకుండా వేసవిలో ఈ జ్యుస్ ను తీసుకుంటూ ఉంటారు.   చెరకు రసం అద్భుతమైన ఔషధం. ఒకప్పుడు చెరకును నేరుగా తినేవారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అరుదైపోయింది. అయితే అక్కడక్కడా చెరకు రసం అమ్ముతూ ఉంటారు. ఈ చెరకు రసాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే అధికవేడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.  దానిమ్మపండ్లు అన్నిచోట్లా లభ్యమవుతాయి. ఈ దానిమ్మ పండు రసం తీసినా.. లేదా నేరుగా అలాగే విత్తనాలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తలనొప్పి వచ్చినా, వడదెబ్బ తగిలినా, కళ్ళు ఎరుపెక్కినా, దానిమ్మ పండు రసం తాగితే ఫలితం ఉంటుంది.  ఇలా సహజమైన చిట్కాలు ఉపయోగించి శరీరాన్ని మండించే అధికవేడిని తరిమేయచ్చు..    ◆నిశ్శబ్ద.  
Publish Date: Jun 1, 2023 10:30AM

మీకూ ఈ లక్షణాలుంటే పొగాకు వ్యసనంగా మారినట్టే!

ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు పొగాకు ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది.. 'మనకు ఆహారం పొగాకు కాదు. పొగాకు ఉత్పత్తి చేసే రైతులను ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించడమే దీని లక్ష్యం' అనే థీమ్ ను ప్రజలముందుకు తెచ్చింది.  పొగాకు ఉత్పత్తులను గుట్కా, ఖైనీ, సిగరెట్ల రూపంలో తీసుకుంటే వెంటనే మానేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవన్నీ మన శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనే విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు.  పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు సమస్యలు  వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అయితే ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త నాళాల విస్తరణ ప్రమాదాన్ని పెంచుతుంది . పొగాకు అనేది ఒక వ్యసనం, దీని నుండి బయటపడటానికి ప్రయత్నాలు అవసరం, లేకుంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది  పొగాకు వ్యసనంగా మారిందని తెలుసుకోవడం ఎలా?? పొగాకు-సిగరెట్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతే.. దాని వ్యసనానికి బలి అయ్యారనే సంకేతం. అయితే ఈ వ్యసనం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకులో నికోటిన్ ఉంటుంది, ఈ రసాయనం వ్యసనానికి ప్రధాన కారణం. నమలడం లేదా ధూమపానం చేయడం ద్వారా పొగాకు రక్తప్రవాహంలోకి శోషించబడినప్పుడు, అది అడ్రినలిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. నికోటిన్, మరోవైపు, డోపమైన్ హార్మోన్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది మెదడును సంతోషపెట్టే హార్మోన్.  దీని కారణంగా చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. పదే పదే ఈ సంతోషం కోసమే పోగాకుకు అలవాటు పడతారు. పొగాకు వ్యసనం లక్షణాలు..  పొగాకు వ్యసనం లక్షణాలు  పైకి స్పష్టంగా కనబడతాయి.  పొగాకు మానేయడానికి ప్రయత్నించినప్పటికీ ధూమపానం లేదా పొగాకు నమలడం ఆపలేకపోవడం. ఒకరోజైనా  వదిలేయాలని ప్రయత్నించినప్పుడు, చేతి వణుకు, చెమటలు పట్టడం, అశాంతి, గుండె వేగం పెరగడం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. భోజనం తర్వాత ధూమపానం చేయాలని, పొగాకు నమలాలని అనిపించడం.  పొగాకు వ్యసనం, దాని  లక్షణాలు, పొగాకు వల్ల ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ తెలుసుకుని స్ఫూర్తి వంతంగా పోగాకుకు దూరమైతే ఆరోగ్యం బాగుంటుంది.                                        ◆నిశ్శబ్ద.
Publish Date: May 31, 2023 10:30AM

ఈ మూడు సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి చాలా ప్రమాదం కలిగిస్తుంది!

ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడటం సహజం. ఆ ఆందోళన కాలక్రమేణా నయమవుతుంది. కానీ , కారణాలు పెద్దగా లేకున్నా తరచుగా ఆందోళన చెందేవారు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆందోళన చెందేవారు ఈ ఆందోళన కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా,  శారీరక ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఒత్తిడి నియంత్రణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.   ఆందోళన చాలా కాలంగా ఉంటూ అది అదుపులోకి రాకపోతే ఈ సమస్యకు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఆందోళన-ఒత్తిడి సమస్యలు నాడీ వ్యవస్థ, మధుమేహం నుండి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్కవగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఈ కింది సమస్యలున్నవారితో ప్రమాదం పెంచుతాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది..  దేనిగురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి మధుమేహానికి కారణం కాదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కళ్ళ నుండి గుండె జబ్బులు, నరాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. నరాల మీద దుష్ప్రభావాలు..  నరాలు మెసేజింగ్ నెట్‌వర్క్‌ల లాగా పనిచేస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల  హృదయ స్పందన రేటు, శ్వాసను ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపించవచ్చు. చాలా కాలం పాటు అనియంత్రిత ఒత్తిడి స్థాయిలు రక్తంలో చక్కెర, నరాల సమస్యలకు దారితీస్తాయి.  ఒత్తిడి-డిప్రెషన్‌తో బాధపడేవారిలో స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. గుండె ఆరోగ్యంపై ప్రభావం.. ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది  రక్తపోటు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ, ఆలోచిస్తూ ఉంటే , శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్  గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా పదే పదే జరిగితే,  రక్తనాళాలు ఎర్రబడి, తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలే కాదు.  మొత్తం శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.                                         ◆నిశ్శబ్ద.
Publish Date: May 30, 2023 10:30AM

మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య లింక్ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఇది విజృంభించింది. ఇప్పుడు యువత కూడా దీని బారిన పడే పరిస్థితి నెలకొంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక-శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొకదాని పై ఉంటుంది.  డిప్రెషన్‌ను కేవలం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యగా మాత్రమే పరిగణించరాదని డిప్రెషన్‌పై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తెలిపారు. అనేక రకాల శారీరక దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది. డిప్రెషన్‌కు గురైనట్లయితే, మైగ్రేన్, గుండె జబ్బులు, రక్తపోటు,  రోగనిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య సంబంధం.. మైగ్రేన్ సాధారణ తలనొప్పి సమస్య అని అనుకుంటే పొరపాటే.. మైగ్రేన్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు. ఇవి కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు మైగ్రేన్‌  వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మైగ్రేన్‌ ఉన్నవారు ఐదు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తేలింది.  మైగ్రేన్ వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం..  మైగ్రేన్, డిప్రెషన్, స్ట్రెస్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి, మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. మైగ్రేన్ ప్రారంభమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత చాలా మందిలో డిప్రెషన్ మొదలవుతుంది. మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ జన్యుపరమైనవి కూడా కావచ్చు. డిప్రెషన్ ఉన్న రోగులలో మైగ్రేన్ రిస్క్ మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ తక్కువ స్థాయి 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ (5-HT) లేదా సెరోటోనిన్ రిసెప్టర్లకు సంబంధించినవి. సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్లు కూడా జన్యు మార్పులకు కారణం అవుతాయి. మైగ్రేన్ అనేది జీవిత నాణ్యతను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది ఇతర  మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  అదేవిధంగా, మైగ్రేన్, డిప్రెషన్ ఉన్నవారిలో కాలక్రమేణా సైకోసోమాటిక్ డిజార్డర్‌గా మార్పు చెందుతాయి.  ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వచ్చినా మరొకటి మెల్లిగా డవలప్ అవుతుంది. కాబట్టి వీటికి దూరం ఉండటం అన్ని విధాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.
Publish Date: May 30, 2023 10:30AM

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
Publish Date: May 29, 2023 10:30AM

కల్తీ...కల్తీ...కల్తీ...ఎటు చూసినా కల్తి

కల్తీ ...కల్తీ ...కల్తీ... ఎటు చూసినా కల్తి గాలి కల్తీ,నీరు కల్తీ,పాలు కల్తీ,తినే తిండి కల్త్ఘీ,నెయ్యి కల్తీ,పళ్ళ లో కల్తీ కూరాగాయలలో కల్తీ,అసలు కల్తీ కి కాదేది అనర్హం అన్న చందాన సర్వం కల్తీ చేసేస్తూ ప్రజాల ప్రణాలను  హరిన్చేస్తున్నారు కల్తీ బాబులు.అసలు ఇందులో ఏది అస్లీ ఏది నకిలీ అన్నదే పెద్ద ప్రశ్న?  అసలు ప్రకృతి ని ఎలాగో కల్తీ చేసేసారు మానవుడు. అయితే సృష్టిలో కల్తీ లేనిది ఒక్క తల్లి పాలలోనే అంటే అతిశయోక్తి కాదు.ఇది నిజం. అని నమ్మక తప్పదు. తల్లిప్రేమలో నాన్న ప్రేమలో కల్తీ ఉండదు.ప్రియుడి ప్రేమలో.ప్రియురాలి ప్రేమలో కల్తీ ఉండచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెలలో ప్రపంచ ఆహార సంరక్షణ దినోత్సవం రూపం లో జరుపుకుంటారు.దీనిలక్ష్యం ప్రజలు సురక్షిత మైన ఆహారపు అలవాట్ల పట్ల కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి ఈ సందర్భంగా ప్రజలు నకిలీ ఆహార పదార్ధాల బారిన పడకుండా కల్తీ ఆహారాపదార్ధాలను ఎలా గుర్తించాలో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. మార్కెట్ లో మనకు లభ్య మయ్యే చాలా రకాల వస్తువులలో కల్తీ కలుస్తోందన్న విషయం తెలుస్తోంది.అందులో ను అది పండ్లు కవాచ్చు పప్పు దినుసులు కావచ్చు.గోధుమలు,మసాలాలు, పాలు,కూరాగాయలలో రక రకాల రసాయనాలు వాడుతూ వాటిని రూపొందిస్తున్నారు.కల్తీ చేసిన ఆహార పదార్ధాలు తినడం వల్ల  చాలా ప్రామాదం అని దానివల్ల తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు స్పష్టం చేసారు.కల్తీ చేసిన  వాంతులు.లివర్ కిడ్నీ,ఉదర సంబంధిత రోగాలు,వస్తే తీవ్ర ప్రభావం ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి సమస్యనుండి రక్షణ పొందాలంటే అసలు నకిలీ వస్తువులను గుర్తించాలి.వాటిని గురించి తెలుసుకోవడం అత్యవసరం. కల్తీ పాలను ఎలాగుర్తించాలి? పాలలో కేవలం నీళ్ళు మాత్రమే కలవడం లేదు.పాలను చిక్కగా చేసేందుకు దీనిలో డిటర్జెంట్,లేదా సింథటిక్,పాలు గుర్తించాలంటే 1/2 కప్పులో తక్కువ నీళ్ళు కలపండి.ఇందులో నురుగు వచ్చిందంటే ఇందులో డిటర్జెంట్ కలిపి నట్లే.సింథటిక్ పాలు గుర్తించాలంటే పాలను  వెళ్ళ మధ్యలో రాయడం ద్వారా అది సబ్బు లాగా కనిపిస్తుంది.అలా పాల కల్తీని గుర్తించవచ్చు. మరీ క్రుత్రిమ పాల వ్యాపారం లో కొత్త కొత్త పద్దతులు అవలం బిస్తున్నారు. వ్యవసాయం లో వాడే ఉరియా ఎరువులు,ఫెవికాల్ కలిపి పాల కల్తీకి పాల్పడుతున్నారు.  నకిలీ పసుపు ను ఎలాగుర్తించాలి? ఒక గ్లాసు నీరు తీసుకోండి.అందులో కొంచం పసుపు పొడి కలపండి ఒక వేళనీటి రంగు పసుపు రంగులోకి మారుతుంది.పసుపు గ్లాసు కింది భాగానికి చేరుకుతుంది.కల్తీ ఉన్న పసుపు రంగు నీటిలోకి మారుతుంది.ఆనీళ్ళు పసుపు పచ్చరంగులో ఉంటుందని గుర్తించండి. కల్తీ పండ్లను గుర్తించడం ఎలా? పండ్లు,కూరగాయలలో అన్నిటికన్నా ఎక్కువ కల్తీ జరుగుతుంది.ముఖ్యంగా మనం తినే యాపిల్ పండు బాగా మెరుస్తూ ఉంటుంది.అలా మెరిసేందుకు మైనం లేదా ఇతర  వేజిలేన్ రసయనాలు రాయడం వల్ల ఇదినిజమో కాదో  తెలుసు కోడానికి మీ వద్ద ఉన్న చాకును మెల్లగా దించండి.గట్టిగా ఉంటె చాకు త్వరగా దిగదు అంతకు ముందే  అప్పటికే కొన్ని రకాల వేజిలేన్ మైనం రాయడం వల్ల మెత్తగా ఉండడం వల్ల చాకు త్వరగా దిగుతుంది. నకిలీ నల్ల మిరియాలు... మనం తీసుకునే ఆహారం లో ముఖ్యమైన దినుసులలో ముఖ్య మైనవి మిరియాలు లేదా నల్ల మిరియాలు అంటారు.దీనిని కల్తీ కోవలోకి చేర్చిన ఘనత మనవాళ్ళదే. నకిలీ నల్ల మిరియాల ను ఎలా గుర్తించాలి ముఖ్యంగా పోప్పాయి పండులోని గింజలు నల్ల మిరియాలలో కలపడం వల్ల అసలు మిరియాలు నకిలీ మిరియాలకు తేడా తేలియదు.అసలు నకిలీ మిరియాల లో ఉన్న తేడా గుర్తించాలంటే. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో నల్ల మిరియాలు వేయండి.౩,లేదా 4 నిమిషాల తరువాత పోప్పాయి గింజలు తేలిపోతాయి. నకిలీ నెయ్యిని గుర్తించడం ఎలా? కల్తీ లేని నెయ్యి సహజంగా పూస పూస గా ఉంటుంది.మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనిని కల్తి చేసేందుకు బంగాళా దుంప పేస్ట్,లేదా అరారోట్ లేదా రీ ఫైండ్ నూనె డాల్డా ను కలిపి నెయ్యిగా అమ్ముతూ ఉంటారు.ఇటీవలి కాలం లో జంతువుల కలేబరాల నుండి సైతం తీసిన నేతిని కల్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.కాగా స్వచ్చమైన అవ్వునేయ్యి లేదా కల్తీ నెయ్యి ని గుర్తించాలంటే నెయ్యిలో అయుదిన్ సొల్యుషన్ కలపండి.దీనిరంగు నీలి రంగులోకి మారుతుంది అందులో గంజి పొడి కలిపి నట్లుగా తెలుస్తుంది. ఎర్రటి ఖారం నకిలీఖారం గుర్తించడం ఎలా? అసలైన ఎర్రటి ఖారం గుర్తించాలంటే ఒక గ్లాసు నీళ్ళలో మిర్చి పొడిని కలపండి.ఎర్రటి మిర్చి పౌడర్ నీటిలో తేలితే అది నకిలీది కాదని.ఒకవేళ నీలాలో మునిగి పోతే ఆ మిర్చి పొడి కల్తీది నకిలీదిగా భావించాలి. నకిలీ ఇంగువను గుర్తించడం ఎలా? నకిలీ ఇంగువకూడా నకిలీ నెయ్యి నూనె వేడిలో వేసినప్పుడు కొంత ఎర్రగా మారుతుంది.అది నకిలీ ఇంగువగా చెప్పవచ్చు.మరో పద్దతిలో ఇంగువను కాల్చి నప్పుడు అంటుకుంటుంది.నిప్పు త్వరగా అంటుకుంటుంది.అది నకికీది కాదనిఆర్ధం. నకిలీ ఇంగువ అంటుకోదు. ఈ విధంగా నకిలీ అసిలీ ఇంగువను ఆర్ధం చేసుకోవచ్చు. అసలైన  కోవా ను గుర్తించడం ఎలా? హిందీలో దీనిని మావా అని అంటారు అంటే మనం స్వీట్స్ లో వాడే కోవా,కలాకండ్, రసగుల్లా,గులాబ్ జాం,కోవా కజ్జి కాయి  వంటి  వి తయారు చేసేందుకు వాడతారు. కోవాలో అసిలి నకిలీ కివా ఎదో గుర్తించడం కష్టం. అసలు కోవా తెల్లగా ఉంటుందని.మరోరకం కోవా కొంచం పసుపు పచ్చటి రంగులో ఉంటుందని అది కల్తీ కోవాగా పేర్కొన్నారు.దీనితో పాటు చేతిలో నలపడం ద్వారా అసలైన కోవా చేతిని విదిచిపెడుతుంది.నకిలీ కోవా అయితే చేతిని అంటి పెట్టుకుని ఉంటుంది. నకిలీ తేనె... ఈ రోజుల్లో తేనె పేరుతో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. ముఖ్యంగా పుట్టతేనే అంటూ గిరిజన ఏ జేన్సీ  ప్రాంతాలలో తేనెలో బెల్లం కలిపి ఆమీస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తేనె నకిలీధా అసలైన తేనెను గుర్తించడం అవసరం.ఒక గ్లాసు నీళ్ళలో ఒక చంచా తేనె కలపండి మీరు వేసిన తేనె నీటిలో అలాగే ఉండి పోతే అది స్వాచమైన తేనె అని అటు ఇటు కదులుతూ నీటిలో కరిగి పోయే తేనెను నకిలీ తేనెగా గుర్తించారు.ఆ రకంగా మీరు తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండకుంటే మీరు అనారోగ్యం పాలు కావడం ఖాయం. ప్రపంచా ఆహార బద్రత దినోత్సవం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు. ఆరోగ్యా ప్రాప్తి రాస్తూ.   
Publish Date: May 27, 2023 10:30AM

అలసట.. నీరసానికి గల కారణాలు ఒక అధ్యయనం...

అలిసిన కండరాలు... అదేపనిగా కండరాలను ఉపయోగించడం వల్ల శక్తి ఉడిగిపోయిందని అనిపిస్తుంది. అలసట ముఖ్యంగా క్రికెట్, ఫూట్ బాల్,లేదా వాలి బాల్ ,లాంటి ఆటలు ఆడిన తరువాత పెరటి తోటలో కలుపు తొలగించి,చెట్ల కు పాదులు చేయడం చేసేటప్పుడు పట్టే సమయం. ఇల్లుమారే సమయం లో పెద్ద పెద్ద డబ్బాలు వస్తువులు స్వయంగా మోసినప్పుడు. స్వయంగా అలసి పోతారు.అలసట కారణంగా కండరాలు ఇంతకు ముందులాగా కండరాలు సంకోచించక పోవడాన్ని గమనించ వచ్చు. మనం శ్రమిస్తున్నప్పుడు కండరాలలో లాస్టిక్ యాసిడ్ పేరుకు పోవడం తో అవి అలసటకు గురి అవుతాయి.శరీరానికి అవసరమైన శక్తి అందుబాటులో లేనప్పుడు ఆక్సిజన్ లభించనప్పుడు లాస్టిక్ యాసిడ్ పరిణామం పెరుగుతుంది. మనశరీరం అధికంగా శ్రమిస్తున్నప్పుడుకండరాలలో ఆమ్ల తత్వం పెరిగి పి హెచ్ 6.4 నుంచి 6.6 వరకు పెరుగుతుంది.సహజంగా మనం నిద్ర పోతున్నప్పుడు క్షారత్వం 7.15 గా ఉంటుంది.పోటేన్షియల్ హైడ్రోజన్ ౦--14 మధ్య సూచిక గా రెండిటికీ మధ్య 7 కంటే ఎక్కువ తతస్తంగానూ ఉంటుందని. ఆరోగ్యంగా ఉండే వ్యక్తిలో క్షారత్వం కొంచం అమ్లత్వం ఉంటుందని. దీనికన్నా ఎక్కువ తక్కువలు ఉంటె అనారోగ్యంగా ఉన్నట్లు సూచికగా గుర్తించాలి.అలిసిన కండరాలకు అందించగల ప్రాధమిక చికిత్చ నీళ్ళు తాగడమే అని నీళ్ళు తాగడానికి దాహం వేసే దాకా నీళ్ళు తాగడానికి ఎదురు చూడనవసరం లేదు.శరీరం కష్టపెట్టక శ్రమించాక నీళ్ళు తాగడం కండరాల అలసటను తీర్చడానికి నీళ్ళు తోడ్పడతాయి. నీళ్ళు తాగని పక్షం లో కండరాలు తిమ్మిరేక్కుతాయి. నీరసించే నాడీ వ్యవస్థ... మన శరీరంలో నీరస పడడాన్ని సెంట్రల్ ఫాటిగ్యు అని అంటున్నారు వైద్యులు.కేంద్ర నాడీ వ్యవస్థ మెదడులో సేరోటినిన్ ట్రిప్టో ఫన్ అనే ఎమినో యాసిడ్ పరిమాణం పెరగడం వల్లే అలిసిపోయిన భావన కలుగుతుందని పరిశోదనలో వెల్లడి అయ్యింది.అలసట కారణం గా కాస్త విశ్రాంతి కావాలని, నిద్రపోవాలన్న బలమైన కోరిక కలిగిస్తుంది. దీర్ఘాకాలం పాటు ఫాటిగ్యు సిండ్రోమ్ సి ఎఫ్ ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది సంకేతమని వైద్య నిపుణులు సూచిన్స్తున్నారు. ట్రిప్టో ఫన్ ఎక్కువగా తాయారు కావాడానికి కారణం సిరో టోనిన్ అధికఉత్పత్తికి దారి తీస్తుంది.సేరోటోనిక్ నాడీ కణాల్ మధ్య సందేశాలను మోసుకు పోయే రసాయనం గా పేర్కొన్నారు  నిపుణులు. సెరోటోనిన్ కారణంగానే ఆకలి, జీర్ణం, నిద్ర, లైంగికవాంచ ,మానసిక స్థితి శరీరంలో రోజు వారీ పనులు క్రమబద్దీకర చేస్తుంది. సెరో టోనిన్ ఆరోగ్య కరమైన శారీరక స్థితి, విశ్రాంతి, నిద్రకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ అలసిపోవడానికి కారణం శరీరంలో గ్లైకోజన్ పరిమాణం పెరగ డాన్ని నిపుణులు గుర్తించారు.పలు అధ్యనాలు ఇప్పటికే కేంద్ర నాడీ మండలపు అలసటను ప్రేపిస్తుందని ఆఅధ్యయనం లో వెల్లడించారు.గ్లైకోజన్ లోటును పూడ్చి ప్రమాదాల బారిన పడకుండా తోడ్పడుతుందని నిపుణులు విశ్లేషించారు. అలసటకు కారణాలు ఇవే... మన శరీరం లోని కండరాలు నాడీ మండల అంటే మెదడు అలసట సమస్యను ఎదుర్కోవచ్చు. మీరు మీ శరీరం అదే పనిగా అలిసి పోతూ ఉండడం తీవ్రమైన అనారోగ్య సమస్య కు సంకేతమని అది హెచ్చరిక గా గుర్తించాలి.మీరు తీవ్ర మైన అలసటకు గురి అవుతున్నారన్న విషయం గుర్తిస్తే ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.వైద్య పరమైన అత్యవసర పరిస్థితికి దారి తీయకుండా మున్డుజాగ్రత్త తో వ్యవహరించడం అవసరం. రక్తహీనత /ఎనిమియా.... రక్త హీనత మొదటి లక్షణం అలసట. రక్త హీనత అంటే కొన్ని ఎర్ర రక్తకణాలు లేకపోవడం. ఎర్ర రక్త కణాలలో సరిపడా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రవాణా చేసే ప్రోటీన్ ఉండకపోవడం గమనించవచ్చు. రక్త హీనత వల్ల శరీరంలో అవయవాలు వాటిలోని కణాలకు ఆక్సిజన్ అందదు.గ్లోకోజ్ ఉన్న ఆక్సిజన్ కొరత వల్లశారీర కణాలు దానిని వాడుకోలేవు. కొద్ది పాటి శ్రమకే అలసట ఏర్పడుతుంది.తత్ఫలితంగా ఊపిరి అందదు, చాతీ లో నొప్పి వస్తూ ఉంటుంది.అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీయవచ్చు. హార్మోన్ సమస్యలు... మనం త్వరగా అలిసిపోవడానికి కారణం హార్మోన్ లో లోటు పాట్లు కీలపాత్ర పోషిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని హార్మోన్లు విపరీతంగా పెరిగినా,తగ్గిన హైపో థైరాయిడిజం, మదుమేహం అడిసన్స్ డిసీజ్ వ్యాధులు వస్తాయని భారత్ లో పదిహేను కోట్ల మందిలో హైపో ధైరాయిడిజం  ఉన్నట్లు అంచనా ఇందులో చాలా మందికి ధైరాయిడ్ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలోవిశాఖ,చెన్నై, బెంగ ళూరు లో నివసిస్తున్న వారికంటే సముద్రానికి దూరంగా కొండ ప్రాంతాలలో హైదరాబాద్ వరంగల్ బెంగుళూరు లో నివసిస్తున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది.ముఖ్యంగా పురుషులకంటే స్త్రీలు ఈ వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తమ అధయనం లో వెల్లడించారు. జీవ ప్రక్రియను నియంత్రించేది ధైరాయిడ్ హార్మోన్లు మాత్రమే అది మనశారీరపు ఉష్ణోగ్రతను గుండె కొట్టుకోవడాన్ని ఆహారం ద్వారా శరీరానికి అందిన కాలరీలను ఎలా ఖర్చు చేయాలో నిర్ధారిస్తుంది. పోషకాహారం లేకుంటే మనశరీరం తగిన శక్తి పొందలేదు అందుకు బలహీనపడి నిస్సతువ నీరసానికి దారితీస్తుంది. మల్టి పుల్ స్క్లేరోసిస్... మల్టిపుల్ స్క్లేరోసిస్ తీవ్రమైన సమస్య ఈకారణంగానే వెన్నెముకలోని నాడీ కణాలు క్రమంగా తమ సహజ సామార్ధ్యాన్ని కోల్పోతూ ఉంటాయి.దీనిప్రభావాం వివిధ అవయవాల్ తాలూకు స్పందన చలన  శక్తి దెబ్బతిని శరీరం మోద్దుబారడం. ఈ కారణంగానే కన్దారాల్ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఈ సమస్య తీవ్రమైతే మానసికంగా కృంగి పోతారు.ఎమె ఎస్ ఇటీవలి కాలం లో యువకులపై తీవ్రప్రభావం చూపిస్తోందని అధ్యనాలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యాధి బారిన పడిన వారిలో 8౦% మంది 18 -౩5 సంవత్స రాల వయసులో వారే అని అఖిల భారాత వైద్య విజ్ఞానసంస్థ బాల బాలికలు వృద్ధులలో వ్యాధి బారిన పడినవారు ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. ఎం ఎస్ బారిన పడిన వారిలో యువతీ యువకుల కంటే మధ్య వయస్సులో ఉన్న మహిళలు ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళలు ఎక్కువగా దీనిబారిన పడుతున్నారని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.ముఖ్యంగా ఎం ఎస్ కు గురయ్యే వారు పొగతాగే అలవాటు ఉన్న పురుషులు తేలికగా గురి అవుతున్నారని అధయనం లో పేర్కొన్నారు.కొన్నికుటుంబాలలో   వంశపారం పర్యంగా దారి తీస్తున్న విషయాన్ని నిపుణులు గుర్తించారు.ఇప్పటికీ ఖచ్చితమైన కారాణాలు ఇవి అని నిర్దారించనప్పటికీ వారి వారి అలవాట్లు ఎం.ఎస్ వ్యాధికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు వెల్లడించారు. కాగా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు వాతావరణ అలవాట్లు వివిధ రకాల అంటువ్యాధులువిటమిన్ డి లోపం  ఎం.ఎస్ కు దోహదం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. మల్టి పుల్ స్కేరోసిస్వ్యాదివల్ల వచ్చే నీరసం అలసట అసాధారణ స్థాయిలో ఉంటుంది.దీనికి తోడు ఇతర లక్షణాలు   తోడైతే మీరు  మరింత తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. క్యాన్సర్... క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో నే బద్దకం అలసట వంటి లక్షణాలు ఉంటె మామూలుగా రక్తంలో కైటో కిన్స్ పరిమాణం పెరగడం వల్లే ఇలాంటి స్థితి ఉంటుందని ఆకలి మందగించడం అలసట మందగించి నంత మాత్రాన క్యాన్సర్ అన్న అభిప్రాయానికి రాకండి. క్యాన్సర్ కారణాలు మరిన్ని లక్షణాలు ఉంటె క్యాన్సర్ గా అవమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. గుండె వ్యాధులు.. గుండె వ్యాధుల పై జరిగిన అనేక అధ్యయనాలలో వాటికి శారీరక అలసట మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు వెల్లడించారు.కాగా గుంబ్దే పోటు కు మూడు నెలల ముందే మూడింట రెండు వంతుల మంది కి ముందే తీవ్రమైన అలసట ప్రత్యేకంగా వృద్ధులు మహిళల లో గుండె వ్యాధులు బయట పడ్డాయని.  పైగా గుండెపోటుకు గురి కావడం గురికవదాన్ని వైద్యులు నిపుణులు గుర్తించారు. మరో అంశం లో దీర్ఘకాలిక సి ఎం .ఎస్ ఫ్యాటిగ్యు సిండ్రోమ్ ను గురించి తెలుసుకుందాం.                 
Publish Date: May 26, 2023 10:30AM

బరువు మీద థైరాయిడ్ ప్రభావం ఎంత?

ప్రస్తుత కాలంలో సాధారణ సమస్యలలో బరువు పెరగడం ఒకటి. దీనికి జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు లేదా అనేక అంతర్లీన ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. చాలా సార్లు పెరిగిన బరువు థైరాయిడ్ సమస్యగా పరిగణించబడుతుంది. కానీ థైరాయిడ్ వల్ల నిజంగా ప్రతిసారీ బరువు పెరుగుతారా అంటే కచ్చితమైన సమాధానం ఎక్కడా లేదు. బరువు పెరగడం అనేది ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలో ఒక సాధారణ లక్షణం, అంతే కానీ బరువు పెరిగారంటే థైరాయిడ్ ఉన్నట్టు, థైరాయిడ్ వచ్చిందంటే బరువు కచ్చితంగా పెరగాలి అన్నట్టు నిబంధన ఏమీ లేదు.  ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. దీని గురించి అవగాహన, నివారణ పద్ధతుల గురించి చెప్పాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండటం, నివారణ చర్యలను పాటించడం అవసరం.  థైరాయిడ్, బరువు పెరిగే సమస్యలు.. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియలో సమస్యలు బరువుపై ప్రభావం చూపుతాయి. బలహీనమైన థైరాయిడ్ (హైపోథైరాయిడిజం) ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం. థైరాయిడ్ గ్రంధి ద్వారా విడుదలయ్యే హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంల సహాయపడతాయి, తద్వారా శరీరం శక్తి కోసం ఆహారాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. థైరాయిడ్ తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసినప్పుడు, జీవక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కేలరీలు బర్న్ చేయకపోతే బరువు పెరుగుతారు. బరువు కూడా తగ్గిస్తుంది.. థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి మాత్రమే కాదు, బరువు తగ్గడానికి కూడా కారణమవుతుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంధి చాలా హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభించే ఒక రకమైన థైరాయిడ్ రుగ్మత. వేగంగా బరువు తగ్గడం, చేతులు వణుకు, వేగవంతమైన లేదా సక్రమంగా లేని హృదయ స్పందన ఇందులో క్షణాలు . బరువు పెరగడం మరియు తగ్గడం రెండూ థైరాయిడ్ రుగ్మతలకు సంబంధించినవి అని అర్థం. బరువు పెరగడానికి థైరాయిడ్ రుగ్మత మాత్రమే కారణం కాదు.. అయితే థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి లేదా తగ్గడానికి మాత్రమే కారణం అని భావించడం కూడా తప్పు. బరువు పెరగడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి, సరైన కారణాలను తెలుసుకోవడం. వాటికి చికిత్స చేయడం అవసరం. కేలరీలను బట్టి ఆహారం తీసుకోకపోతే సహజంగానే బరువు పెరుగుతారు. కానీ థైరాయిడ్ ఉన్నవారు శారీరక శ్రమ ద్వారా కేలరీలను బర్న్ చేయలేరు. బరువు పెరగడానికి లేదా తగ్గడానికి జన్యుశాస్త్రం కూడా ఒక కారణం కావచ్చు. ఇది మాత్రమే కాకుండా.. అనారోగ్యం, మందులు తీసుకోవడం వంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                      ◆నిశ్శబ్ద.
Publish Date: May 25, 2023 10:30AM

ఫైబర్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం గురించి ప్రతి వైద్యుడు, ప్రతి పోషకాహార నిపుణుడు, ఆఖకి ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి చెబుతాడు. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చాలా విషయాలు వినే ఉంటారు.  ఫైబర్  జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అందరికీ తెలిసిందే..   అయితే  ఫైబర్ ఇలా కడుపుకు మాత్రమే కాకుండా శరీరానికి అనేక ఇతర ప్రయోజనలు కూడా చేకూరుస్తుందని  మీకు తెలుసా??   బరువు తగ్గడం నుండి డయాబెటిస్ సమస్యలను తగ్గించడం, మెదడును ఆరోగ్యంగా ఉంచడం వరకు దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  అందుకే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  ఫైబర్ శరీరంలో చక్కెర వాడకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇది ఆకలిని, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి అవసరం. పిల్లలు మరియు పెద్దలకు మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 25 నుండి 35 గ్రాముల ఫైబర్ అవసరం, కానీ చాలా మందికి రోజుకు 15 గ్రాములు మాత్రమే ఆహారం ద్వారా ఫైబర్ అందుతూ ఉంటుంది. ఫైబర్ బాగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చునంటే.. చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, తగినంత ఫైబర్ తీసుకుంటే, అది చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధకులు కనుగొన్నారు.  రోజువారీ శరీరానికి కావలసినంత  ఫైబర్ తీసుకునే వారిలో చిత్తవైకల్యం తక్కువగా ఉంటుందని తేలింది.ఆహారంలో  తక్కువ తీసుకునేవారిలో డిమెన్షియా రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజుకు సగటున 20 గ్రాముల కంటే తక్కువ ఫైబర్  తీసుకునేవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్, అరటిపండ్లు.. బెస్టు.. అవకాడో లో ఫైబర్ పుష్కలంగా ఉన్నా అవి సగటు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. అలాంటి వారు అనేక ఇతర పండ్ల నుండి ఫైబర్ పొందవచ్చు, అరటిపండ్లు, యాపిల్స్ ఇందులో ముఖ్యమైనవి. యాపిల్స్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి.. అదేవిధంగా, అరటిపండులో 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లు విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియంతో సహా అనేక ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. అరటిపండు తినడం ఫైబర్, ప్రోటీన్ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల శనగలు.. ఫైబర్, ప్రోటీన్‌లకు అద్భుతమైన మూలం నల్ల శనగలు. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది శాకాహారులకు ప్రోటీన్  లోపంతో బాధపడేవారికి బెస్ట్ ఎంపిక. ఆహారంలో నల్లశనగలను చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియను సరిగ్గా ఉంచడంతో పాటు కండరాలకు ప్రోటీన్‌ను సులభంగా అందేలా చూసుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.
Publish Date: May 25, 2023 10:30AM

అల్లం టీని రోజూ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

మనం వంటలలో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అల్లం కూడా ఒకటి. అల్లం బరువు తగ్గించడం నుండి జీవక్రియను ప్రోత్సహించడం వరకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. తాజా లేదా ఎండిన అల్లంను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ అల్లం ను టీ చేసుకుని తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు. అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే.. బరువు తగ్గిస్తుంది.. అల్లం శరీర బరువు తగ్గడంలో,  నడుము చుట్టూ ఉన్న కొవ్వు, పిరుదులు మొదలైన ప్రాంతాలలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్‌లు అల్లం టీ తీసుకున్నప్పుడు చాలా కంట్రోల్ అవుతాయి.   వాపును తగ్గిస్తుంది.. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వాపు కారణం. అల్లంలో జింజెరోల్‌లు, షోగోల్‌లు ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాపును కలిగించే అణువులైన సైటోకిన్‌ల ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వాపును తగ్గిస్తుంది. 3వికారం వాంతులు తగ్గిస్తుంది.. అల్లం మోషన్ సిక్‌నెస్, మార్నింగ్ సిక్‌నెస్, కీమోథెరపీ, సర్జరీతో సంబంధం ఉన్న వికారం, వాంతుల నుండి ఉపశమనానికి ఒక గొప్ప నివారణ. అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడానికి, మొత్తం జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.. అల్లం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది! అల్లం అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు న్యూరోప్రొటెక్టివ్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఇది వయస్సు సంబంధిత అభిజ్ఞా క్షీణతతో ముడిపడి ఉంటుంది. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది.. అల్లం టీ నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా బాధాకరమైన ఋతు తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం కండరాల సడలింపు లక్షణాలు గర్భాశయ కండరాలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయడుతుంది, తద్వారా నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. అల్లం టీ రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇవి రెండూ గుండె జబ్బులకు దోహదపడే రెండు ప్రమాద కారకాలు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి, ఈ పరిస్థితి ధమనుల పనితీరు తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.  తద్వారా శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అల్లంలోని సమ్మేళనాలు తెల్ల రక్త కణాల సంఖ్యను ప్రేరేపిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అందువల్ల అనారోగ్యం వ్యాధుల సంభావ్యతను తగ్గిస్తుంది. మొత్తంమీద, అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు, అల్లం టీ దినచర్యలో భాగం చేసుకుంటే అద్బుతమే..                                   ◆నిశ్శబ్ద.
Publish Date: May 24, 2023 10:30AM

మధుమేహం ఉన్నవారు ఈ ఒక్క కూరగాయను డైట్ లో ఉండేలా చూసుకుంటే చాలు!

ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.. వీటిలో ఎన్నోరకాల విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ఉంటాయి, ఇవి తీవ్రమైన జబ్బుల నుండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే కొన్ని కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. మధుమేహం యొక్క సమస్యలను తగ్గించడంలో  కూరగాయలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఎంతో శక్తివంతమైనది బెండకాయ. డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా బెండకాయ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కూరగాయలలో కేలరీలు, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి, ఇది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు బెండకాయ తీసుకుంటే..  రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిచడం బెండకాయ వల్ల ఎంతో సులువు. కాల్చిన బెండకాయ విత్తనాలు మధుమేహం చికిత్సకు టర్కీలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా ఇది సానుకూల ప్రభావాలను చూపుతుంది. బెండకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎందుకు మంచిదంటే.. బెండకాయలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలి బాధలను తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, బెండకాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. బెండకాయలు రక్తంలో గ్లూకోజ్-తగ్గించే శక్తివంతమైన కూరగాయ. బెండకాయను మాత్రమే కాకుండా బెండకాయ విత్తనాలను పొడిగా చేసి తీసుకోవడం వల్ల కూడా మధుమేహం తగ్గించుకోవచ్చు.  డయాబెటిస్‌లో మాత్రమే కాకుండా బెండకాయ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బెండకాయలో విటమిన్-ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచి అవి ఆరోగ్యంగా ఉండటంతో సహాయపడుతుంది. కాబట్టి బెండకాయను వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.                                          ◆నిశ్శబ్ద.
Publish Date: May 23, 2023 10:30AM