చైత్ర నవరాత్రులలో దుర్గా కవచం పారాయణం చేస్తే కలిగే ఫలితాలు ఇవే..!

 

చైత్ర నవరాత్రులలో దుర్గా కవచం పారాయణం చేస్తే కలిగే ఫలితాలు ఇవే..!

 చైత్ర నవరాత్రులు చాలా పవిత్రమైనవి. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో నాలుగు నవరాత్రులు ఉంటాయి.  వాటిలో చైత్ర నవరాత్రులు ఎంతో సంతోషంగా అందరినీ పిలిచి చేసుకునేవి.  శక్తి ఆరాధనకు మంచి వేదికగా చైత్ర నవరాత్రులను చెబుతారు.  ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పారాయణాలు,  మంత్రాలను జపించడం చేస్తారు. కొందరు లలిత సహస్ర నామాలు పారాయణ చేస్తారు, మరికొందరు శ్రీచక్ర పూజ,  ఇంకొందరు అమ్మవారి పీఠం పెట్టుకుని, కలశం ఏర్పాటు చేసుకుని నిష్టగా 9రోజులు దీక్షలో గడుపుతారు. అయితే  వసంత నవరాత్రులలో  దుర్గా వజ్రకవచం పారాయణం చేయడం వల్ల అద్బుతమైన ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. దీని గురింటి మరింత వివరంగా తెలుసుకుంటే..

దుర్గాకవచం శక్తి..

మత విశ్వాసాల ప్రకారం పూర్తి భక్తితో దుర్గా కవచాన్ని పఠించే భక్తుడిని సాక్షాత్తు దుర్గామాత పది దిక్కుల నుండి రక్షిస్తుందని చెబుతారు.  దుర్గా కవచం ఎంత శక్తివంతమైనదని చెప్పడానికి  ఇదే గొప్ప నిదర్శనం.


దుర్గా కవచం ప్రాముఖ్యత..

సనాతన ధర్మంలో దేవీ కవచం  మహిమలు వివరంగా కథల రూపంలో వర్ణించబడ్డాయి. ఈ పారాయణం సాధకుడి చుట్టూ ఒక సానుకూల శక్తి కవచాన్ని సృష్టిస్తుందని, దానిని ఏ ప్రతికూల శక్తి కూడా ఛేదించలేదని చెప్పబడింది.

దుర్గా కవచ పఠనం మానసిక, ఆధ్యాత్మిక శాంతిని అందించడమే కాకుండా, నయంకాని వ్యాధులు,  అంటువ్యాధుల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి శక్తినిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ కవచంలో, శరీరం యొక్క ప్రతి భాగాన్ని రక్షించడానికి అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఆవాహన చేయబడతాయి.

దుర్గాకవచం పఠిస్తే కలిగే ప్రయోజనాలు..


తరచుగా దిష్టి తగులుతున్నా లేదా ఇంట్లో ఉద్రిక్తత ఉన్నా, దుర్గా కవచం పఠించడం వాతావరణాన్ని ప్రశాంతంగా  చేస్తుంది. చుట్టూ పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది.

దుర్గా కవచం  భయం, ఫోబియా లేదా మానసిక ఆందోళనను తగ్గించడానికి ఒక సర్వరోగ నివారిణిగా పరిగణించబడుతుంది. దీనిని చదవితే మనసులో అపారమైన ధైర్యాన్ని నిండుకుంటుంది.

 సమయం తక్కువగా ఉన్నా లేదా కష్టమైన సంస్కృత పదాలను ఉచ్చరించలేకపోయినా, ఏకాగ్రతతో వినడం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందని అంటారు.

కవచాన్ని పఠించి ఏదైనా శుభకార్యానికి పూనుకున్న వ్యక్తి ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తాడని నమ్ముతారు.

ముఖ్యంగా వసంత నవరాత్రులలో ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య దుర్గా కవచాన్ని పఠించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.


                              *రూపశ్రీ.