English | Telugu

పెళ్లిరోజు భార్యకి యశ్వంత్ మాస్టర్ స్పెషల్ గిఫ్ట్

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' షో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న చాలా మంది డాన్సర్లకు అవకాశాలు వచ్చాయి. ఈ షో ద్వారానే యశ్వంత్ మాస్టర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొరియోగ్రాఫర్ గా సినిమాలకు కూడా పని చేస్తున్నారు. అలానే కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. యశ్వంత్ తన చిన్ననాటి స్నేహితురాలు వర్షను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరికీ పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తన భార్యకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు యశ్వంత్. ఆ గిఫ్ట్ ఏంటంటే.. 'చౌ చౌ' అనే జాతికి చెందిన ఓ కుక్కపిల్లను యశ్వంత్ తన భార్యకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు యశ్వంత్. ఇప్పటికే వీరి దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి. ఇది మూడోదన్న మాట. దానికి చెర్రీ అని పేరు కూడా పెట్టేశారు.

ఇక సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర సెలబ్రిటీల నుండి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యశ్వంత్ భార్య వర్ష.. ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. అయితే అప్పుడప్పుడు తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది వర్ష. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పటికే 'డాన్స్ ప్లస్' షోతో పాటు 'క్యాష్' అలానే 'వావ్' లాంటి కొన్ని టీవీ షోలలో వీరిద్దరూ అతిథులుగా కనిపించారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.